Mohali
-
కుప్పకూలిన బిల్డింగ్.. 12 గంటలుగా కొనసాగుతున్న సహాయక చర్యలు
చంఢీగడ్ : పంజాబ్ రాష్ట్రం మొహాలి జిల్లాలో మూడంతస్తుల భవనం కుప్పుకూలింది. సహాయక చర్యలు 12 గంటలకు నిర్విరామంగా కొనసాగుతున్నట్లు సహాయక బృందాలు వెల్లడించాయి. శనివారం సాయంత్రం మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో హిమాచల్ ప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల యువతి మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. మొహాలీ జిల్లాలో ఓ భవనంలో బేస్మెంట్ కోసం తవ్వకాలు జరుగుతుండగా.. పక్కనే ఉన్న మూడంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం శిథిలాల కింద పది మంది వరకు చిక్కుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న ఇండియన్ ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ (ఎన్డిఆర్ఎఫ్) బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితుల్ని సంరక్షించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాయి. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.మరోవైపు భవనం కూలిపోవడంపై సమాచారం అందుకున్న పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 కింద భవన యజమానులు, పర్వీందర్ సింగ్, గగన్దీప్ సింగ్లపై కేసు నమోదు చేశారు. భవనం కూలిపోవడంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విచారం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.-Sohana Building Collapse Update- Rescue Operation Continues;District Admin Sets Up Control Room +91 172-2219506,Civil Hospital Mohali, Fortis, Max and Sohana Hospital put on alert pic.twitter.com/UjRsI4G0Zh— DC Mohali (@dcmohali) December 21, 2024 -
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్రౌండర్ సిమ్రన్జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్కు ఆడిన సిమికాగా సిమ్రన్జిత్ సింగ్ భారత్లోని పంజాబ్లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్రౌండర్కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్కు వెళ్లిఅయితే, క్రికెట్పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్లో లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
బైక్ను ఢీకొట్టిన బీఎండబ్ల్యూ కారు.. ఒకరు మృతి
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువవతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, తాగి డ్రైవ్ చేయడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటి కారణాలు ప్రమాదాలకు మూలంగా మారాయి. రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోని పుణెలో ఓ మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృత్యువాతపడ్డారు. పోర్షే కారుతో 24 ఏళ్ల టెక్కీలపై దూసుకెళ్లిన ఈ ఘటనలో రోజుకో కుట్ర కోణం వెలుగుచూస్తోంది.తాజాగా పంజాబ్లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన బీఎండబ్ల్యూ కారు ఓ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొహాలిలో బుధవారం రాత్రి జరిగింది ప్రమాదం. బనూర్ వైపు నుంచి వస్తున్న కారు జిరాక్పూర్ పాటియాలా హైవేపై బైక్ను ఢీకొట్టింది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీకి, కారుకు మధ్య బైక్ ఇరుక్కుపోయింది.ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడగా.. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాహిబ్ అనే వ్యక్తి మరణించారడు. పభాత్ గ్రామానికి చెందిన సుమిత్, రాజ్వీర్లు సింగ్లు చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుల కుటుంబ సభ్యులు పాటియాలా హైవేను దిగ్బంధించారు.సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత కారు డ్రౌవర్ పరారయ్యాడు. కారుపై వీఐపీ నెంబర్ ఉందని పోలీసులు తెలిపారు. రవాణా మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2022లో 67,000 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయి. 30,000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. -
దంచి కొట్టిన దూబే.. అఫ్గాన్ను చిత్తు చేసిన భారత్
అఫ్గానిస్తాన్తో మూడో టీ20ల సిరీస్లో టీమిండియా శుభారంభం చేసింది. మొహాలీ వేదికగా అఫ్గాన్తో జరిగిన తొలి టీ20లో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో ఆల్రౌండర్ శివమ్ దూబే ముఖ్య భూమిక పోషించాడు. తొలుత బౌలింగ్లో కీలక వికెట్ పడగొట్టిన దూబే.. అనంతరం బ్యాటింగ్లోనూ అదరగొట్టాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 60 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దూబేతో పాటు జితేష్ శర్మ(31), తిలక్ వర్మ(26) కీలక ఇన్నింగ్స్ ఆడారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహ్మన్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో మహ్మద్ నబీ(42) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓమర్జాయ్(29), ఇబ్రహీం జద్రాన్(25) రాణించారు. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. శివమ్ దుబే ఒక్క వికెట్ సాధించాడు. కాగా దాదాపు 14 నెలల తర్వాత టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇండోర్ వేదికగా జనవరి 14న జరగనుంది. -
Ind vs Afg: రీఎంట్రీలో రోహిత్ డకౌట్! తప్పు తనదే అయినా..
Ind vs Afg 1st T20I Rohit Sharma Duck Out: అఫ్గనిస్తాన్తో తొలి టీ20లో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లలో పునరాగమనం చేసిన హిట్మ్యాన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయి పెవిలియన్ చేరాడు. పరుగుల ఖాతా తెరవకుండానే సున్నా చుట్టి నిష్క్రమించాడు. దీంతో టీమిండియా తరఫున రీఎంట్రీలో రోహిత్ బ్యాటింగ్ మెరుపులు చూడాలని ఆశపడ్డ అభిమానులకు నిరాశే ఎదురైంది. హిట్మ్యాన్ సైతం ఊహించని ఈ పరిణామంతో కంగుతిని గిల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసంతృప్తితో డగౌట్ చేరాడు. ఈ నేపథ్యంలో నెట్టింట రోహిత్ శర్మ పేరు వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో.. ‘‘అయ్యో పాపం.. రోహిత్ దురదృష్టం కారణంగానే ఇలా జరిగింది’’ అని అభిమానులు అంటుండగా.. మరికొంత మంది నెటిజన్లు మాత్రం.. ‘‘చూసుకుని ఆడాలి కదా! సీనియర్.. పైగా రీఎంట్రీ.. కెప్టెన్ ఇలా బాధ్యతారహితంగా ఆడితే మిగతా వాళ్ల పరిస్థితి ఏంటి?’’ అని ట్రోల్ చేస్తున్నారు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మొహాలీ వేదికగా తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.బ్యాటింగ్కు దిగిన అఫ్గనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో రెండో బంతికే టీమిండియా రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. Nabi power 💪🔥 The Afghan veteran is striking them hard in the 1st #INDvAFG T20I! 🙌#IDFCFirstBankT20ITrophy #JioCinemaSports #GiantsMeetGameChangers pic.twitter.com/BMMMJEnB3G — JioCinema (@JioCinema) January 11, 2024 ఫజల్హక్ ఫారూకీ బౌలింగ్లో రోహిత్ మిడాఫ్ దిశగా షాట్కి యత్నించాడు. ఈ క్రమంలో పరుగు తీసేందుకు వెళ్లగా గిల్తో సమన్వయలోపం ఏర్పడింది. అప్పటికే అద్భుతరీతిలో డైవ్ చేసిన అఫ్గన్ కెపెన్ జద్రాన్ బంతి దాటిపోకుండా ఆపేశాడు. కానీ అప్పటికే క్రీజు వీడిన రోహిత్.. గిల్ను రమ్మని పిలవగా బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన అతడు అక్కడే ఉండిపోయాడు. అయితే, తాను అవుట్ కావడంతో రోహిత్ శర్మ గిల్పై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.మరోవైపు.. జద్రాన్, వికెట్ కీపర్ రహ్మనుల్లా గుర్బాజ్ కలిసి రోహిత్ రనౌట్లో పాలుపంచుకున్నారు. బిగ్వికెట్ దక్కడంతో అఫ్గన్ సంబరాలు అంబరాన్నంటాయి. -
పంజాబ్లో దారుణం: డ్రగ్స్కు బానిపై, సోదరుడి కుటుంబాన్ని హత్య చేసి
చండీగఢ్: డ్రగ్స్కు బానిసగా మారిన 28 ఏళ్ల యువకుడు సొంత సోదరుడి కుంటుంబాన్ని కిరాతకంగా హత్య చేశాడు. అన్న, అతని భార్యతో సహా రెండేళ్ల మేనల్లుడిని చంపి మృతదేహాలను కాలువలో పడేశాడు, ఈ దారుణ ఘటన మోహాలీ జిల్లాలోని ఖరార్ గ్లోబల్ సిటీలో జరిగింది. ఈ ఉదంతం గత మంగళవారం రాత్రి చోటుచేసుకోగా.. గురువారం రాత్రి వెలుగులోకి రావడం గమనార్హం. వివారలు.. బార్నాలాకు చెందిన సత్బీర్ సింగ్కు అమన్దీప్ కౌర్ అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. ఉద్యోగరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సత్బీర్ సింగ్ తన కుటుంబంతో కలిసి గ్లోబల్ సిటీకి వచ్చి జీవిస్తున్నాడు. సత్బీర్ తన వ్యాపారాన్ని మంచిగా కొనసాగిస్తూ స్థిరపడటంతో అతని తమ్ముడు లఖ్బీర్కు ఈర్ష్యా కలిగింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి సత్బీర్ తమ్ముడు లక్బీర్ ఇంటికి వచ్చాడు. అప్పటికే డ్రగ్స్కు బానిసైన లఖ్బీర్ తన సోదరుడిపై పగతో మంగళవారం రాత్రి ముందగా వదిన అమన్దీప్ కౌర్ను గొంతుకోసి హత్య చేశాడు. సత్బీర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నింగా.. అతన్ని కూడా పదునైన ఆయుధంతో కొట్టి చంపాడు. అనంతరం పసికందు అనే జాలి లేకుండా దంపతుల రెండేళ్ల కుమారుడిని హత్య చేశాడు. ముగ్గురిని చంపిన తర్వాత.. సత్బీర్, అమన్దీప్ మృతదేహాలను రోపర్లోని సిర్హింద్ కాలువలోకి విసిరేశాడు. శిశువు మృతదేహాన్ని మొరిండా పట్టణం సమీపంలోని అదే కాలువలో పడేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రధాన నిందితుడు లఖ్బీర్ను అదుపులోకి తీసుకొని మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మోరిండా సమీపంలోని కజౌలి గ్రామంలోని కాలువలో అమన్దీప్ కౌర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సత్బీర్, కొడుకు మృతదేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ ట్రిపుల్ మర్డర్ వెనక సోదరుడిపై ద్వేషమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మాదక ద్రవ్యాలకు బానిసైన లఖ్బీర్.. జీవితం నాశనం చేసుకున్నాడు. సోదరుడు లైఫ్లో బాగా స్థిరపడటంతో అతనిపై కోపం పెంచుకొని ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతంలో హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. -
Ind vs Aus: ఆదిలోనే వికెట్.. వీడియో వైరల్! షమీ ఎందుకు వెళ్లిపోయాడంటే?
India vs Australia, 1st ODI: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. తొలి వన్డేలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. మొహాలీ వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు షమీ. బౌలింగ్ ఎటాక్ ఆరంభించిన అతడు.. నాలుగో బంతికే ఓపెనర్ మిచెల్ మార్ష్ను పెవిలియన్కు పంపాడు. గుడ్ లెంత్ డెలివరీతో మార్ష్ను బోల్తా కొట్టించాడు. బ్యాట్ ఎడ్జ్ను తాకిన బంతి ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న శుభ్మన్ గిల్ చేతిలో పడింది. ఎలాంటి పొరపాటుకు తావు లేకుండా.. బాల్ను గిల్ ఒడిసిపట్టగానే.. భారత శిబిరంలో నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది. ఆనందం కాసేపే.. ఇదిలా ఉంటే.. టీమిండియాకు ఆదిలోనే వికెట్ దక్కినప్పటికీ.. వన్డౌన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 37, ఓపెనర్ డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీతో చెలరేగడంతో 18 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ 98 పరుగులు స్కోరు చేసింది. కానీ.. మరుసటి రెండో బంతికే రవీంద్ర జడేజా వార్నర్(52)ను పెవిలియన్కు పంపడంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. షమీ ఎందుకు వెళ్లిపోయాడు? ఆసీస్ ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లు ముగిసిన తర్వాత మహ్మద్ షమీ మైదానం వీడాడు. మొహాలీలో ఎండ తీవ్రతకు తట్టుకోలేకే అతడు డ్రెస్సింగ్రూంకు వెళ్లిపోయినట్లు సమాచారం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అతడు తిరిగి ఫీల్డ్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. చదవండి: WC 2023: సంజూను మర్చిపోవాల్సిందే!.. కుండబద్దలు కొట్టిన ద్రవిడ్ Early success for #TeamIndia! A wicket for @MdShami11 as Shubman Gill takes the catch. Australia lose Mitchell Marsh. Live - https://t.co/F3rj8GI20u… #INDvAUS@IDFCFIRSTBank pic.twitter.com/cNcwJeQiXN — BCCI (@BCCI) September 22, 2023 -
యూపీఎస్సీ పరీక్ష కంటే.. రాజకీయాలు కఠినం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజకీయాల్లోకి వచ్చే యువ త క్షేత్రస్థాయి నుంచి పనిచేసి వస్తే విజయం సాధించే అవకాశం ఉంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన నాకు తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రజాక్షేత్రంలో క్షేత్ర స్థాయిలో పనిచేసేందుకు అవకాశం దొరికింది. రాజకీయాల్లో ప్రజా క్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది..’’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. పంజాబ్లో మొహాలీలోని ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)’లో శుక్రవారం జరిగిన ‘అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ’కోర్సు ప్రారంభ సమావేశంలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడిగా తన అనుభవాలను పంచుకున్నారు. వివరాలు కేటీఆర్ మాటల్లోనే.. ‘‘అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టుల కోసం దేశంలోని అన్ని ప్రభుత్వాలు నిధుల కొరత అనే అతిపెద్ద సవాల్ను ఎదుర్కొంటున్నాయి. రుణాలు తీసుకోకుండా ఉండాలన్న పాతకాలపు ఆలోచన ధోరణితో దేశం వెనుకబడుతోంది. రుణాలను భవిష్యత్తుపై పెట్టుబడిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్లో మాత్రం అనేక అపోహలు ఉన్నాయి. ఈ పరిస్థితి మారాలి. రాష్ట్రాల్లో అమలవుతున్న ఆదర్శ విధానాల నుంచి కేంద్రం స్ఫూర్తి పొందడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. అధికారులు ఆ ఆలోచన వీడాలి ప్రభుత్వ పాలనలో శాశ్వతంగా ఉంటామనే ఆలోచన విధానం నుంచి అధికారులు బయటికి రావాలి. మారుతున్న పరిస్థితులు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులతో కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకుల దూరదృష్టి గొప్పదైతే ప్రభుత్వ యంత్రాంగం కూ డా అదే స్ఫూర్తితో పనిచేస్తుందని తెలంగాణ తొ మ్మిదేళ్ల అనుభవం నిరూపించింది. నాయకత్వం అంటే ప్రతిరోజు నేర్చుకోవడమే. భవిష్యత్తు బాగుంటుందనే ఆశను ప్రజలకు కల్పించగలిగితే వారు ప్రభుత్వాలు, పార్టీలకు అండగా ఉంటారు. విజయం కోసం త్యాగాలు చేయాలనే భావనకు రాజకీయ నాయకులు మినహాయింపేమీ కాదు. విభిన్న రంగాల్లో అనుభవం కలిగిన నిపుణులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. దేశం తెలంగాణను అనుసరిస్తే..: గడిచిన దశాబ్ద కాలంలో తెలంగాణను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించి ఉంటే.. ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండేది. ప్రజాస్వా మ్య పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణను ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ధి మా ర్గంలో నడపడంలో మేం విజయం సాధించాం. స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను అతి తక్కువ సమయంలో సాధించింది తెలంగాణ మాత్రమే’’అని కేటీఆర్ పేర్కొన్నారు. శాంతిభద్రతలు సవాల్గా మారుతున్నాయి దేశంలో ఎంత వైరుధ్యమున్నా సమైక్యంగానే ఉంటుందనే నమ్మకముంది. కానీ దేశంలో విభజన రాజకీయాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సుహృద్భావ వాతావరణంలో రాజకీయ పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని భావించడం కొంత వాస్తవ దూరమే. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో శాంతిభద్రతలను కాపాడటం భవిష్యత్తులో అన్ని ప్రభుత్వాలకు పెద్ద సవాల్గా మారబోతోంది. -
ముంబై ప్రతీకారం.. పంజాబ్ కింగ్స్పై ఘన విజయం
ఐపీఎల్ 16వ సీజన్లో ముంబై ఇండియన్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఏడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఇషాన్ కిషన్ 75, సూర్యకుమార్ 66 పరుగులతో ముంబై ఇండియన్స్ను పటిష్ట స్థితిలో నిలపగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్(10 బంతుల్లో 19 నాటౌట్), తిలక్ వర్మ(10 బంతుల్లో 26 నాటౌట్) ముంబైని విజయతీరాలకు చేర్చారు. పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్దీప్, రిషి ధవన్ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో ముంబై సీజన్ ఆరంభంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. ► ఇషాన్ కిషన్ 75 పరుగులు చేసి అర్ష్దీప్ బౌలింగ్లో రిషి ధావన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 178 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. స్కై సంచలన ఇన్నింగ్స్కు తెర.. మూడో వికెట్ డౌన్ 31 బంతుల్లో 66 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఇన్నింగ్స్కు తెరపడింది. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో సూర్య అర్ష్దీప్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. కాగా మూడో వికెట్కు ఇషాన్ కిషన్, సూర్యకుమార్లు 116 పరుగులు జోడించారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 75, టిమ్ డేవిడ్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. సూర్య, ఇషాన్లు అర్థసెంచరీలు.. విజయం దిశగా ముంబై సూర్యకుమార్, ఇషాన్ కిషన్లు ధాటిగా ఆడుతుండడంతో ముంబై లక్ష్యచేధనలో దూసుకెళ్తుంది. 14 ఓవర్లు ముగిసేసరికి ముంబై రెండు వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. సూర్యకుమార్ 52, ఇషాన్ కిషన్ 57 పరుగులతో ఆడుతున్నారు. టార్గెట్ 215.. 9 ఓవర్లలో ముంబై 80/2 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 30, సూర్యకుమార్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website ముంబై బౌలర్లు విఫలం.. పంజాబ్ 20 ఓవర్లలో 214/3 ముంబై బౌలర్ల వైఫల్యంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. లయామ్ లివింగ్స్టోన్ (42 బంతుల్లో 82 పరుగులు నాటౌట్, ఏడు ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసానికి తోడు జితేశ్ శర్మ(27 బంతుల్లో 49 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ ధావన్ 30 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. Photo Credit : IPL Website దంచికొడుతున్న లివింగ్స్టోన్.. 16 ఓవర్లలో 152/3 పంజాబ్ కింగ్స్ బ్యాటర్ లివింగ్స్టోన్ తొలిసారి తన విధ్వంసం ప్రదర్శిస్తున్నాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 49, జితేశ్ శర్మ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. Photo Credit : IPL Website 13 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 120/2 13 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. లివింగ్స్టోన్ 28, జితేశ్ శర్మ 15 పరుగులతో ఆడుతున్నారు. Photo Credit : IPL Website శిఖర్ ధావన్(30) ఔట్.. రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్ ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శిఖర్ ధావన్(30 పరుగులు) పియూష్ చావ్లా బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. ప్రస్తుతం పంజాబ్ రెండు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. Photo Credit : IPL Website తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. 9 పరుగులు చేసిన ప్రబ్సిమ్రన్ సింగ్ అర్షద్ ఖాన్ బౌలింగ్ ఇషాన్ కిషన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పంజాబ్ స్కోరు 17/1గా ఉంది. Photo Credit : IPL Website టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం మొహలీ వేదికగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, ఆకాశ్ మధ్వల్, అర్షద్ ఖాన్ పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ గత మ్యాచ్లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్తో మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కిన ముంబై అదే కంటిన్యూ చేయాలని ఉవ్విళ్లూరుతుంది. మరోవైపు బలమైన సీఎస్కేను ఓడించి పంజాబ్ కింగ్స్ కూడా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. గతంలో ఇరుజట్ల మధ్య 30 సార్ల తలపడగా.. చెరో 15 మ్యాచ్లు గెలిచాయి. ఈ సీజన్లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పంజాబ్నే విజయం వరించింది. -
పంజాబ్, లక్నో మ్యాచ్కు పొంచిఉన్న ముప్పు.. ఏ క్షణమైనా!
ఐపీఎల్ 16వ సీజన్లో శుక్రవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ కు ముప్పు పొంచి ఉంది. వర్షం ముప్పు మాత్రం కాదు. కానీ ప్రస్తుతం అక్కడ ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది. అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానం కూడా ఉంది. విషయంలోకి వెళితే.. పంజాబ్, లక్నో మ్యాచ్కు నిహంగ్ సిక్కుల నుంచి ముప్పు పొంచి ఉండడమే దీనికి కారణం. పంజాబ్ కొన్ని రోజులుగా నిహంగ్ సిక్కుల ఆందోళన జరుగుతోంది. జైల్లో ఉన్న సిక్కు ఖైదీలను విడుదల చేయాలంటూ వీళ్లు నిరసన తెలుపుతున్నారు. నిహంగ్ సిక్కుల ఛీఫ్ బాపు సూరత్ సింగ్ ఖల్సా నిరాహార దీక్ష చేస్తున్నారు. కొన్ని రోజులుగా ఆయన దీక్షలోనే ఉన్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ ద్వారా వీళ్లు తమ నిరసన తీవ్రత ఎంతో తెలియజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం అందింది. తమ డిమాండ్లు పంజాబ్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఐపీఎల్ మ్యాచ్ ను అడ్డుకుంటామని కూడా ఇప్పటికే వాళ్లు అక్కడి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. దీంతో ఇప్పుడు పంజాబ్, లక్నో మ్యాచ్ కు వీళ్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు నిర్వాహకులు భావిస్తున్నారు. ఒకవేళ వీళ్ల నిరసన కారణంగా ఈ మ్యాచ్ రద్దు చేస్తే.. పంజాబ్, లక్నో జట్లకు ఒక్కో పాయింట్ ఇస్తారు. ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ ఆరోస్థానంలో ఉంది. ఏడు మ్యాచ్ లలో 4 గెలిచి, 3 ఓడిపోయింది. గత రెండు మ్యాచ్ ల నుంచి శిఖర్ ధావన్ గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. కాగా ధావన్ నేడు లక్నోతో మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ వారం రోజుల తర్వాత మరో మ్యాచ్ ఆడుతోంది.గుజరాత్ టైటాన్స్తో ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లో చివరి ఓవర్లో 4 వికెట్లు పారేసుకొని ఓటమిని కొనితెచ్చుకుంది. పాయింట్ల పట్టికలో లక్నో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. చదవండి: స్వదేశానికి కేకేఆర్ క్రికెటర్.. ఆడింది ఒక్కటే మ్యాచ్! -
IPL 2023: హార్దిక్ పాండ్యాకు షాక్! ఈ సీజన్లో..
Punjab Kings vs Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టీమిండియా ఆల్రౌండర్కు 12 లక్షల రూపాయల భారీ జరిమానా పడింది. పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయనందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్కిది తొలి తప్పిదం కావున 12 లక్షల ఫైన్తో సరిపెట్టారు. ఈ మేరకు శుక్రవారం ఐపీఎల్ నిర్వాహకులు పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ సీజన్లో బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ తర్వాత జరిమానా ఎదుర్కొన్న మూడో కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మూడో విజయం ఇదిలా ఉంటే.. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ బింద్రా స్డేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్పై గుజరాత్ విజయం సాధించింది. సొంతమైదానంలో ధావన్ సేనను 6 వికెట్ల తేడాతో ఓడించి తమ ఖాతాలో మూడో విజయం నమోదు చేసుకుంది. మోహిత్ మాయ ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పంజాబ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. రీఎంట్రీలో గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ అదరగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసి పంజాబ్ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అదరగొట్టిన గిల్ ఇక పంజాబ్ విధించిన లక్ష్యానికి బదులిచ్చేందుకు బరిలోకి దిగిన గుజరాత్ ఆఖరి బంతి వరకు విజయం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (30) రాణించగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్భుత బ్యాటింగ్(67)తో ఆకట్టుకున్నాడు. అయితే, ఆఖర్లో గెలుపు సమీకరణం ఉత్కంఠ రేపగా.. ఓ బంతి మిగిలి ఉండగానే ఫినిషర్ రాహుల్ తెవాటియా బౌండరీ బాది గుజరాత్ గెలుపును ఖరారు చేశాడు. చదవండి: ఒకప్పుడు పర్పుల్ క్యాప్ విన్నర్.. తర్వాత నెట్బౌలర్! 6.5 కోట్ల నుంచి 50 లక్షల ధరకు.. వాళ్లదే పైచేయి; డెత్ ఓవర్ల స్పెషలిస్టులు ఉన్నారు.. మాకేం భయం లేదు: మార్కరమ్ -
BGT 2023: బిగ్ న్యూస్.. భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ వేదిక మార్పు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి బిగ్ న్యూస్ లీకైంది. సిరీస్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్ మ్యాచ్ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది. ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్తో పాటు పిచ్ సైడ్ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు. అయితే టెస్ట్ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్కు బ్యాకప్గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్ జరిగేది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. -
అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకున్న మహిళా పోలీస్..
చండీగఢ్: పంజాబ్ మొహాలీలో ఓ మహిళా పోలీస్ అధికారి అత్యాచార బాధితురాలి నుంచి లంచం తీసుకుంది. నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు రూ.20వేలు వసూలు చేసింది. స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి ఏఎస్ఐ డబ్బు తీసుకున్న దృశ్యాలు ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఏఎస్ఐ పర్వీన్ కౌర్ లంచం తీసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీఎస్పీ దర్పణ్ అహ్లూవాలియా పేర్కొన్నారు. విజిలెన్స్ బ్యూరో దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు. పర్వీన్ కౌర్ పోలీస్ లైన్స్లో విధులు నిర్వహిస్తోంది. తనపై అత్యాచారం జరిగిందని ఓ బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. నిందుతుడ్ని అరెస్టు చేయాలండే డబ్బు ఇవ్వాల్సిందేనని ఏఎస్ఐ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితురాలు డబ్బు ఇచ్చింది. చదవండి: ఈ డాక్టర్ టెన్త్ ఫెయిల్.. భారీగా ఫీజులు.. రోగం ముదిరిందంటే చాలు.. -
రూ.3 కోట్ల బెంట్లీ కారు గిఫ్ట్ ఇచ్చిన పేరెంట్స్.. తుపాకీతో కొడుకు హల్చల్!
చండీగఢ్: తల్లిదండ్రులు బెంట్లీ కారు గిఫ్ట్గా ఇచ్చిన సంతోషంలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ సంఘటన పంజాబ్లోని మొహాలీలో జరిగింది. వీడియో వైరల్గా మారిన క్రమంలో యువకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.యువకుడిని మొహాలీలోని ఖరార్ ప్రాంతానికి చెందిన శుభమ్ రాజ్పుత్గా గుర్తించారు. రూ.3 కోట్లకు పైగా విలువైన లగ్జరీ కారు గిఫ్ట్గా ఇచ్చిన క్రమంలో చుట్టూ జనం ఉన్నప్పటికీ అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని గన్ లైసెన్స్ ఉందా? ఉంటే ఎవరి పేరుపై ఉంది అనే విషయాలపై దర్యాప్తు చేపట్టామన్నారు. వీడియో ప్రకారం.. బెంట్లీ కారు ముందు నిలుచున్న యువకుడు తుపాకీతో గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపాడు. అతడి చుట్టూ పలువురు ఉన్నారు. వారంతో ఫోన్లలో వీడియో తీసుకోవటంలోనే నిమగ్నమయ్యారు. ఈ వీడియోను ఫ్రీ ప్రెస్ జర్నల్ ట్విటర్లో పోస్ట్ చేసింది. ‘తల్లిదండ్రులు బెంట్లీ కారు ఇచ్చిన సంతోషంలో మొహాలీ యువకుడు గాల్లోకి కాల్పులు జరిపాడు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో పోలీసులు కేసు నమోదు చేశారు.’ అని పేర్కొంది. సమావేశాలు, మతపరమైన ప్రాంతాలు, వివాహాల వంటి సందర్భాల్లో వేడుకలో భాగంగా ఫైరింగ్ చేయటం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు. లైసెన్స్ గన్తోనూ కాల్పులు చేయకూడదు. ఎవరికి ఎలాంటి గాయం కానప్పటికీ శిక్షార్హమే. ఆయుధాల చట్ట సవరణ ప్రకారం.. ప్రజా కార్యక్రమాల్లో ఆయుధాలు ఉపయోగించకూడదు. చాలా సందర్భాల్లో ఇలాంటి కాల్పులు మరణాలకు దారి తీశాయి. #Punjab: Elated after being gifted a Bentley car from his parents, Mohali youth opens fires in the air; booked after video went viral on social media.#Viral #bentley #Car #Gift #Boy #Mohali #India #ViralVideo #fire pic.twitter.com/wjGAFkJEVo — Free Press Journal (@fpjindia) October 18, 2022 ఇదీ చదవండి: బాణసంచా కొన్నా, కాల్చినా 6 నెలల జైలు! -
INDvsAUS : తొలి టీ20లో ఆస్ట్రేలియా విజయం (ఫొటోలు)
-
Ind Vs Aus: మ్యాచ్కు ముందు కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! వీడియో వైరల్
India Vs Australia T20 Series 2022- Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘రన్మెషీన్’కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఒక్కసారి కోహ్లిని నేరుగా కలిస్తే చాలని ఆశపడుతూ ఉంటారు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో ఇలాంటి ఓ మహిళా అభిమాని ఆశ నెరవేరింది. కోహ్లికి స్పెషల్ గిఫ్ట్! టీమిండియా స్వదేశంలో ఆసీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) ఇరు జట్లు మొదటి మ్యాచ్లో తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీసు సెషన్కు వచ్చిన కోహ్లిని కలిసే అవకాశం వచ్చింది ఓ లేడీ ఫ్యాన్కు! అంతేకాదు.. కోహ్లి ముఖ చిత్రంతో ఉన్న ఫ్రేమ్ను కూడా అతడికి అందించి మురిసిపోయిందామె! ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది. కాగా గత కొంతకాలంగా నిలకడ లేమి ఫామ్తో ఇబ్బంది పడ్డ కోహ్లి ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో రాణించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ నమోదు చేసి ఫ్యాన్స్కు ట్రీట్ అందించాడు. ఇదే జోష్లో టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి సిద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు ఆసీస్తో సిరీస్ నేపథ్యంలో.. విలువైన ఇన్నింగ్స్కు ఆడేందుకు నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. చదవండి: Ind Vs Aus T20 Series: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు! Ind Vs Aus: అరుదైన ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ! రెండు భారీ షాట్లు కొడితే.. View this post on Instagram A post shared by Punjab Cricket Association (@pcacricketassociation) -
Ind Vs Aus: నెట్స్లో చెమటోడుస్తున్న కోహ్లి! బలహీనత అధిగమించేలా
India Vs Australia T20 Series- Virat Kohli- Mohali: ఆస్ట్రేలియాతో టీమిండియా టీ20 సిరీస్కు సమయం ఆసన్నమైంది. మొహాలీ వేదికగా మంగళవారం(సెప్టెంబరు 20) ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లంతా మొహాలీ చేరుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఆసీస్తో సిరీస్కు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నాడు. ఇందుకోసం నెట్స్లో చెమటోడుస్తున్నాడు. ముఖ్యంగా పుల్షాట్ల విషయంలో తన బలహీనతను అధిగమించేలా కోహ్లి ప్రాక్టీసు సాగినట్లు సమాచారం. 45 నిమిషాల పాటు.. ఇందుకు సంబంధించిన వీడియోను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ట్విటర్లో షేర్ చేసింది. కాగా కోహ్లి దాదాపు 45 నిమిషాల పాటు నెట్స్లో గడిపినట్లు తెలుస్తోంది. ఫాస్ట్బౌలర్లను ఎదుర్కొంటూ.. పుల్షాట్లు ఆడేందుకు కోహ్లి ప్రయత్నించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక గత కొన్నాళ్లుగా నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడిన కోహ్లి ఆసియాకప్-2022 టీ20 టోర్నీలో అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ కెరీర్లో 71వ సెంచరీ.. టీ20 ఫార్మాట్లో తొలి శతకం సాధించాడు. అదే విధంగా ఈ ఈవెంట్లో టీమిండియా తరఫున టాప్ స్కోరర్(276 పరుగులు)గా నిలిచాడు. ఇదే జోష్లో టీ20 వరల్డ్కప్-2022కు సన్నద్ధమవుతున్నాడు. అంతకంటే ముందు.. ఈ మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్లో ఆడనున్నాడు కోహ్లి. ఇక అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్-2022 ఈవెంట్ జరుగనుంది. చదవండి: Yuvraj Singh Six 6s: యువీ సిక్స్ సిక్సర్ల విధ్వంసానికి 15 ఏళ్లు.. కన్నార్పకుండా చూస్తూ మరీ! An absolute treat😍 Watch @imVkohli dedicatedly practicing his shots in the nets today during practice session@gulzarchahal @BCCI @CricketAus #gulzarchahal #1stT20I #pca #pcanews #punjabcricket #punjab #cricket #teamindia #indiancricketteam #punjabcricketnews #cricketnews pic.twitter.com/ZKrCldbKbg — Punjab Cricket Association (@pcacricket) September 18, 2022 -
Ind Vs Aus: యువీ, భజ్జీకి సముచిత గౌరవం.. ఆసీస్తో తొలి టీ20కి ముందు..
Ind Vs Aus 1st T20- మొహాలి: భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్లను పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) సముచిత రీతిలో గౌరవించనుంది. మొహాలి స్టేడియంలో రెండు స్టాండ్లకు ఈ ఇద్దరు ఆటగాళ్ల పేర్లు పెడుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మంగళవారం తొలి టి20 మ్యాచ్కు ముందు ఈ స్టాండ్స్ను ఆవిష్కరిస్తారు. యువరాజ్ భారత్ తరఫున 40 టెస్టుల్లో 1,900, 304 వన్డేల్లో 8,701, 58 టి20ల్లో 1,117 పరుగులు చేయడంతో పాటు 148 వికెట్లు కూడా పడగొట్టాడు. హర్భజన్ 103 టెస్టుల్లో 417... 236 వన్డేల్లో 269... 28 టి20ల్లో 25 వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు ఫార్మాట్లలో కలిపి 3,569 పరుగులు సాధించాడు. చదవండి: కోహ్లి ప్రత్యామ్నాయ ఓపెనర్: రోహిత్ శర్మ -
విద్యార్థినుల వీడియోల లీక్ దుమారం.. ఫోన్లో నాలుగు ఆమెవే!
చండీగఢ్: అభ్యంతరకర వీడియోల వ్యవహారం పంజాబ్ రాష్ట్రం మొహాలీలోని చండీగఢ్ యూనివర్సిటీలో తీవ్ర అలజడి సృష్టించింది. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఓ విద్యార్థిని.. పలువురు విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలను మొబైల్ ఫోన్లో చిత్రీకరించి, మరో యూనివర్సిటీలో చదివే తన స్నేహితుడికి పంపించిందని, అతను వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడని, మొత్తంగా 60కి పైనే వీడియోలు వైరల్ అవుతున్నాయంటూ పుకార్లు గుప్పుమన్నాయి. దీంతో ఆందోళనకు గురైన విద్యార్థినులు యూనివర్సిటీ ప్రాంగణంలో బైఠాయించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థినులు శనివారం అర్ధరాత్రి నుంచి వర్సిటీ ప్రాంగణంలోకి ఆందోళన కొనసాగించారు. వారి నినాదాలతో వర్సిటీ అట్టుడికిపోయింది. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ హాస్టల్ వార్డెన్ వీడియో లీకేజీల గురించి సదరు యువతిని నిలదీయడం.. అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతంలో.. పుకార్లను నమ్మవద్దంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు పోలీసులు. వ్యక్తిగత వీడియోలు లీకైనట్లు వార్తలు వచ్చాక కొందరు విద్యార్థినులు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఆత్మహత్యాయత్నంలో పలువురి పరిస్థితి విషమయంగా ఉందంటూ సోషల్ మీడియాలో కొందరు పెట్టిన పోస్టులను పోలీసులు ఖండించారు. అలాంటిదేమీ జరగలేదన్నారు. ఒక విద్యార్థిని మాత్రం ఆందోళనకు గురై కుప్పకూలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించామని, ఆమె పరిస్థితి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని వెల్లడించారు. ఈ ఉదంతంలో ఎవరూ చనిపోలేదని.. పుకార్లు నమ్మొద్దని విద్యార్థినులకు సూచించారు. ఈ కేసులో యువతితో పాటు షిమ్లాకు చెందిన ఆమె బాయ్ఫ్రెండ్ను, ఓ బేకరీలో పని చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాయ్ఫ్రెండ్కు వీడియో పంపిన విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న ఒక విద్యార్థిని బాత్రూంలో స్నానం చేస్తూ తన ఫోన్లో రికార్డు చేసుకొని, హిమాచల్ ప్రదేశ్కు చెందిన తన బాయ్ఫ్రెండ్కు(ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకుడు) పంపించినట్లు యూనివర్సిటీ అధికారులు చెబుతున్నారు. అయితే.. ఆమె ఫోన్లోని అభ్యంతరకర వీడియోలను చూసిన సహచర విద్యార్థినులు, ఆమె తమవి కూడా రికార్డు చేసి అలాగే పంపి ఉంటుందని ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో మొదలైన అనుమానం.. పెనుదుమారాన్నే లేపింది. నిందితురాలిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఆమె బాయ్ఫ్రెండ్ను కూడా హిమాచల్ ప్రదేశ్లో అరెస్టు చేశామని అదనపు డీజీపీ గురుప్రీత్కౌర్ దేవ్ తెలిపారు. ఇప్పటిదాకా దర్యాప్తులో నిందితురాలికి చెందిన ఫోన్లో ఆమెకు సంబంధించిన నాలుగు వీడియోను గుర్తించామన్నారు. ఇతర విద్యార్థినుల వీడియోలను రికార్డు చేయలేదన్నారు. అయితే.. సదరు యువతి తమను బాత్రూంలో ఉండగా దొంగచాటుగా ఫొటోలు తీసిందని ఆరోపిస్తున్నారు కొందరు విద్యార్థులు. అలాగే వార్డెన్ ఆమెను నిలదీస్తున్నట్లు వైరల్ అయిన వీడియోపై కూడా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు డీజీపీ తెలిపారు. పోలీసులను నమ్మాలా? అయితే ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, నిజాలను తొక్కిపెడుతున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధితుల తరపున పోరాడుతున్న తమపై పోలీసులు లాఠీచార్జి చేశారని మండిపడ్డారు. అయితే, వాళ్లను కట్టడి చేసేందుకు లాఠీచార్జ్ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు. అంతేకాదు.. వీడియోల విషయంలో ఏమాత్రం వాస్తవం లేదని, కేవలం ఒక విద్యార్థినికి చెందిన వీడియోలు మాత్రమే లీకైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మన బిడ్డలే మనకు గర్వకారణమని, ఈ మొత్తం ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. ఊహాగానాలను విశ్వసించవద్దని సూచిస్తూ ట్వీట్ చేశారు. అభ్యంతరకర వీడియోల వ్యవహారంపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని, నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టొద్దని పంజాబ్లోని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. విద్యార్థినులను మానసిక వేదనకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ‘ఆప్’ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కఠిన చర్యలు: మహిళా కమిషన్ చండీగఢ్ వర్సిటీ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) స్పష్టం చేసింది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని పంజాబ్ డీజీపీ, చండీగఢ్ వర్సిటీ వైస్ చాన్సలర్కు కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. విద్యార్థినుల ప్రైవేట్ వీడియో లీకైనట్లు వచ్చిన వార్తలపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ మనీశా గులాజీ వెల్లడించారు. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చండీగఢ్ యూనివర్సిటీ ఘటనపై ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ స్పందించారు. ఇది దురదృష్టకర సంఘటన, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. మన సోదరీమణులకు అండగా నిలవాలని ట్విట్టర్లో సూచించారు. ఇది మనందరికీ పరీక్షా సమయమని పేర్కొన్నారు. రెండు రోజులు సెలవులు క్యాంపస్లో ఉద్రిక్తతల నేపథ్యంలో యూనివర్సిటీకి సోమవారం, మంగళవారం అధికారులు సెలవులు ప్రకటించారు. దీనిపై విద్యార్థినులు మండిపడ్డారు. ఏ తప్పూ జరగకపోతే సెలవులు ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఈ ఉదంతంపై లోతైన దర్యాప్తు కోసం సీనియర్ మహిళా ఐపీఎస్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. వీడియోల అంశంపై ఐపీసీ సెక్షన్ 354–సి, ఐటీ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ కొనసాగుతోందని అన్నారు. ఇదీ చదవండి: ఫుల్గా తాగి.. స్నేహితుడిపై ఆటో ఎక్కించేశాడు! -
తొలి టీ20 కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల సాధన (ఫొటోలు)
-
Ind Vs Aus: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. పూర్తి షెడ్యూల్, జట్లు.. ఇతర వివరాలు!
Australia tour of India, 2022- India Vs Australia T20 Series: టీ20 ప్రపంచకప్-2022కు ముందు టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ల సిరీస్ కోసం కంగారూ జట్టు గురువారం భారత్కు చేరుకుంది. ఐసీసీ మెగా ఈవెంట్కు ముందు జరుగనున్న ఈ సిరీస్ ఇరు జట్లకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక డేవిడ్ వార్నర్ మినహా.. ప్రపంచకప్ జట్టులోని మిగతా ఆసీస్ ఆటగాళ్లంతా రోహిత్ సేనతో సిరీస్లో పాల్గొననున్న విషయం తెలిసిందే. అయితే, మిచెల్ మార్ష్, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. నాథన్ ఎలిస్, డేనియల్ సామ్స్, సీన్ అబాట్లు వారి స్థానాలను భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో భారత్- ఆసీస్ పోరు ఎప్పుడు ఆరంభం కానుంది? పూర్తి షెడ్యూల్, మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు, జట్ల వివరాల తాజా అప్డేట్లు, తదితర అంశాలు పరిశీలిద్దాం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా- మూడు టీ20 మ్యాచ్లు మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడున్నర గంటలకు ఆరంభం మొదటి టీ20 సెప్టెంబరు 20- మంగళవారం- పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం, మొహాలి రెండో టీ20 సెప్టెంబరు 23- శుక్రవారం, విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, నాగ్పూర్ మూడో టీ20 సెప్టెంబరు 25- ఆదివారం- రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ మ్యాచ్ ప్రసారాలు, లైవ్ స్ట్రీమింగ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం డిస్నీ+హాట్స్టార్లో లైవ్స్ట్రీమింగ్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు భారత జట్టు: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. అప్డేట్: షమీకి కరోనా పాజిటివ్గా తేలడంతో అతడి స్థానంలో ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. టీమిండియాతో సిరీస్కు ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్ ఫించ్(కెప్టెన్), సీన్ అబాట్, అష్టన్ అగర్, ప్యాట్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎలిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, డేనియల్ సామ్స్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, ఆడం జంపా. చదవండి: 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ T20 World Cup 2022: జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్.. యువ బౌలర్ ఎంట్రీ -
కొడుకు శవంతో 4 రోజులు వృద్ధుడి సహవాసం.. దుర్వాసన రావటంతో..!
చండీగఢ్: పిల్లలు లేకపోవటంతో బాలుడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నాడు ఓ 82 ఏళ్ల వృద్ధుడు. అమాయకత్వం, ఇతరులతో కలుపుగోలుగా ఉండకపోవటంతో పెద్దగా ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఇంట్లో ఇద్దరే ఉంటారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. అయితే, అనారోగ్యంతో దత్తత తీసుకున్న కుమారుడు నాలుగు రోజుల క్రితం మృతి చెందగా.. ఏం చేయాలో తెలియని వృద్ధుడు శవం వద్దే ఉండిపోయాడు. నాలుగు రోజుల తర్వాత ఇంట్లోంచి దుర్వాసన రావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అపస్మారక స్థితిలో మృతదేహం వద్ద పడిపోయి ఉన్న వృద్ధుడిని సోమవారం రక్షించి ఆసుపత్రికి తరలించారు. ‘సమాచారం అందుకోవటంతో అక్కడికి వెళ్లి ఇంటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాం. మృతదేహం వద్దే వృద్ధుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆయన ఏమీ చెప్పటం లేదు. మాట్లాడే పరిస్థితి కనిపించటం లేదు. ఆయనకు అంతగా ఏమీ తెలిసేలా కనిపించటం లేదు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.’ అని పోలీసు అధికారి పాల్ చంద్ తెలిపారు. కొడుకు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు చెప్పారు. మృతి చెందిన సుఖ్విందర్ సింగ్ అనే వ్యక్తి బల్వాంత్ సింగ్కు దత్తపుత్రుడిగా స్థానికులు తెలిపారు. ‘వారిని ఇటీవల ఎవరైనా పలకరించారా అనే విషయం తెలియదు. గత నెల రోజులకుపైగా వృద్ధుడు ఇంట్లోనే ఉంటున్నాడు. ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చింది. ఏం జరిగిందో మాకు తెలియదు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాం.’ అని వెల్లడించారు స్థానికులు. ఇదీ చదవండి: చెల్లి శవంతో 4 రోజులు సహవాసం.. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో.. -
మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్
మొహాలి: ‘నన్ను మీ సోదరుడిగా భావిస్తే, దయచేసి కిందకు దిగండి. మేము త్వరలో పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము. తర్వాత మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాము’ అంటూ పంజాబ్లోని కాంట్రాక్టు టీచర్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీయిచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మొహాలీలో ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులతో ఆయన మాట్లాడారు. కేజ్రీవాల్ వాహనంపై ఎక్కి పైకి చూస్తూ వారితో మైక్లో సంభాషించారు. కిందకు దిగి రావాలని వారిని కోరారు. ‘మీరు ఎంతకాలం నుంచి నిరసనలు చేస్తున్నారు?’ అని కేజ్రీవాల్ ప్రశ్నించగా.. దానికి వారు ‘సార్, 45 రోజులు’ అని బదులిచ్చారు. కాంట్రాక్టు టీచర్ల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. ‘విచారకరమైన విషయం ఏమిటంటే, ఢిల్లీలోని ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఇంగ్లండ్, స్వీడన్ దేశాలకు పంపుతున్నాము. పంజాబ్లోని కాంగ్రెస్ సర్కారు వారిని ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులకు పంపుతోంద’ని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో విద్యావ్యవస్థను పూర్తిగా సంస్కరించామని, ఈ ఘనత ఉపాధ్యాయులకే దక్కుతుందని అన్నారు. పర్మినెంట్ ఉద్యోగాలు, మెరుగైన జీతాల కోసం చాలా కాలంగా కాంట్రాక్టు టీచర్లు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం పంజాబ్ ఎడ్యుకేషన్ బోర్డ్ వెలుపల టీచర్లు భారీ ఎత్తున నిరసనకు దిగారు. ఎన్నికల్లో తమకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కొంతమంది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ పైకి ఎక్కారు. విషయం తెలుసుకున్న కేజ్రీవాల్ అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. పంజాబ్లో తాము అధికారంలోని వస్తే కాంట్రాక్టు టీచర్ల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. (చదవండి: ముఖ్యమంత్రి దాతృత్వం.. అతని కలను సాకారం చేశారు) ‘కెప్టెన్ అమరీందర్ సింగ్, బాదల్ సహా పలువురు ముఖ్యమంత్రులు ఉపాధ్యాయులకు గతంలో ఇవే హామీలు ఇచ్చారని విన్నాను. ఆ ట్రెండ్ని అనుసరించడానికి నేను ఇక్కడకు రాలేదు. ఢిల్లీలోని విద్యావ్యవస్థను సంస్కరించిన తీరు గురించి మీరు వినే ఉంటారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు గణనీయంగా మారిపోయాయి. ఇదంతా అది మా టీచర్ల గొప్పతనమే. నేను చేయాల్సిందల్లా వారి సమస్యలను పరిష్కరించడమే. పంజాబ్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తానని నేను హామీ ఇస్తున్నాను’ అని కేజ్రీవాల్ వాగ్దానం చేశారు. (చదవండి: మాటంటే మాటే.. ‘డ్యూటీలో ఉన్నా లేకున్నా మందు ముట్టం, ఆన’) -
భారత యువ షూటర్ అనుమానాస్పద మృతి
మొహలీ: భారత షూటర్ 28 ఏళ్ల నమన్వీర్ సింగ్ బ్రార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. మొహలీలోని సెక్టార్ 71లో తన ఇంట్లో నమన్వీర్ సింగ్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే నమన్ వీర్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా లేక ప్రమాదవశాత్తూ తుపాకీ పేలిందా అన్నది పోస్టుమార్టం రిపోర్టులో తేలుతుందని మొహలీ డీఎస్పీ గుర్షేర్ సింగ్ తెలిపారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఢిల్లీ షూటింగ్ వరల్డ్ కప్ లో కనీస అర్హత స్కోరు విభాగంలో నమన్వీర్సింగ్ నాలుగోస్థానంలో నిలిచాడు. అలాగే 2015లో దక్షిణ కొరియాలోని గ్వాంగ్జౌలో జరిగిన వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్లో నమన్వీర్ కాంస్య పతకం సాధించాడు. చదవండి: అంతా నాలుగు నెలల్లోనే... అనామక ప్లేయర్ నుంచి చాంపియన్ దాకా! PELE: ఐసీయూలో ఫుట్బాల్ దిగ్గజం.. -
ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్కే: బీజేపీకి సున్నా
చంఢీగడ్: పంజాబ్లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిన విషయం తెలిసిందే. ఏడింటిలో విజయం సాధించగా ఒక కార్పొరేషన్ ఫలితం తేలలేదు. తాజాగా గురువారం ఆ ఫలితం కూడా తేలింది. ఆ ఒక్కటి కూడా కాంగ్రెస్లో చేరింది. మొహలీలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది కార్పొరేషన్ను సొంతం చేసుకుంది. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా మొత్తం 7 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగిలిన ఒక స్థానంలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ నిలిచింది. అది కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చేదు అనుభవం ఎదురైంది. అధికార పక్షానికి గట్టి పోటీ కూడా ఇవ్వలేక బీజేపీ చతికిలపడింది. శిరోమణి అకాలీ దళ్(ఎస్ఏడీ), ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కొన్నిచోట్ల ఆ పార్టీలు తమ ఉనికిని చాటుకున్నాయి. మొహలీ కార్పొరేషన్లో 37 వార్డులను కాంగ్రెస్ సొంతం చేసుకోగా మిగిలిన 13 స్థానాలు స్వతంత్రులు భర్తీ చేశారు. ఇక మరో కార్పొరేషన్ మోగాలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీంతో ఈ కార్పొరేషన్ కూడా అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనుంది. దీనితో కలిపి జరిగిన మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా కాంగ్రెస్ వశమయ్యాయి. -
హెర్బల్ టీతో కరోనాకి చెక్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్కు చెక్పెట్టే ఏ ఔషధాన్ని కనిపెట్టలేదు. మాస్క్లు, శానిటైజర్లు వాడటం, భౌతిక దూరం పాటించడం వల్ల ఈ మహమ్మరి నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. కరోనాపై పోరాటంలో భాగంగా మొహాలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ రీసెర్చ్(ఎన్ఐపీఈఆర్) సెఫ్టీ డివైజ్లు, మాస్క్లు, శానిటైజర్లు తయారు చేస్తూ అండగా నిలుస్తోంది. (శుభపరిణామం: మరింత పెరిగిన రికవరీ) అయితే ఇప్పుడు తాజా కరోనాతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీని తయారు చేసింది. ఇంతవరకు కరోనాకు ఎటువంటి మందు లేకపోవడంతో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే మనం కరోనాతో పోరాడగలం. మనకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్లను ఎదుర్కోగలుగుతాం. ఈ హెర్బల్ టీని స్థానికంగా అందుబాటులో ఉండే ఆరు రకాల హెర్బల్స్ అశ్వగంధ, తిప్పతీగ, ములేటి, తులసి, గ్రీన్టీని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు. వీటిని తగిన పాళ్లలో కలిపి ఈ హెర్బల్ టీని తయారు చేసుకోవాలి. దీనిని రోజుకు మూడు సార్లు తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. (నాలాగా కోవిడ్ బారిన పడకండి: ఎమ్మెల్యే) -
భారత హాకీ దిగ్గజం బల్బీర్ కన్నుమూత
మొహాలీ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ సీనియర్(95) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి డైరెక్టర్ అభిజిత్ సింగ్ వెల్లడించారు. మే 8న హాస్పిటల్లో చేరిన ఆయనకు వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. గతంలో కూడా ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన మూడు నెలలకుపైగా హాస్పిటల్లోనే ఉన్నారు. 1948, 1952, 1956 ఒలింపిక్స్లలో భారత హాకీ జట్టు మూడు బంగారు పతకాలు సాధించడంలో బల్బీర్ కీలక పాత్ర పోషించారు. 1975లో ప్రపంచ కప్ సాధించిన భారత హాకీ జట్టుకు ఆయన కోచ్గా, మేనేజర్గా వ్యవహించారు. ఒలింపిక్స్లో పురుషుల హాకీ ఫైనల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఆయన పేరిట ఉన్న రికార్డును ఇప్పటివరకు ఎవరు అధిగమించలేదు. 1952 ఒలింపిక్స్లో భారత్ 6-1తేడాతో నెదర్లాండ్స్పై విజయం సాధించగా.. అందులో 5 గోల్స్ బల్బీర్ చేసినవే. బల్బీర్ తన కెరీర్లో 61 అంతర్జాతీయ క్యాప్స్తో పాటుగా.. 246 గోల్స్ సాధించాడు. భారత హాకీకి బల్బీర్ చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1957లో ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆయన సేవలకు గుర్తుగా హాకీ ఇండియా.. 2015లో మేజర్ ధ్యాన్చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. -
మాంసాహారం సర్వ్ చేసినందుకు 47 వేలు ఫైన్
చండీగఢ్: పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల ఫోరం ఎయిరిండియాకు రూ.47 వేలు జరిమానా విధించింది. శాఖాహారులైన ప్రయాణికులకు మాంసాహార భోజనం వడ్డించినందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్లు తెలిపింది. వివరాలు.. మొహాలి సెక్టార్ 121కి చెందిన చంద్రమోహన్ పఠాక్ భార్యతో కలిసి ఢిల్లీ నుంచి చికాగో వెళ్లేందుకు జూన్ 17, 2016లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అంతేకాక అదే ఏడాది నవంబర్ 14న తిరుగు ప్రయాణం నిమిత్తం రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నాడు. తాను, తన భార్య శాఖాహారులమని టికెట్లు బుక్ చేసుకునే సమయంలోనే స్పష్టం చేశాడు. చికాగో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని తెలిపాడు చంద్రమోహన్. కానీ ఢిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు మాత్రం విమాన సిబ్బంది తమకు మాంసాహారం భోజనం సర్వ్ చేశారని ఆరోపించారు. అంతేకాక ఆహార పొట్లాల మీద మాంసాహారం, శాఖాహారం అని తెలిపే గుర్తులు కూడా లేవన్నారు. దాంతో ఆగ్రహించిన చంద్రమోహన్ ఈ విషయం గురించి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుల మనోభావాలు దెబ్బతీసినందుకు గాను ఎయిరిండియా సంస్థ చంద్రమోహన్కు రూ. 10 వేలు జరిమానాతో పాటు లీగల్ ఖర్చుల నిమిత్తం మరో ఏడు వేల రూపాయలు అదనంగా చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఎయిరిండియా కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్కు వెళ్లింది. అయితే అక్కడ కూడా ఎయిరిండియాకు ఎదురు దెబ్బ తగిలింది. కమిషన్ జరిమానా మొత్తాన్ని ఏకంగా నాలుగు రెట్లు పెంచి మొత్తం రూ. 47వేలు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. దీని గురించి చంద్రమోహన్ పఠాక్ మాట్లాడుతూ.. ‘నేను ముందుగానే మేం శాఖాహారులమని స్పష్టంగా చెప్పాను. కానీ వారు నాకు మాంసాహార భోజనం అందించారు. వారు పాపం చేశారు. కోర్టు తగిన శిక్ష విధించింది’ అని తెలిపారు. -
‘క్రికెటర్లకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీదే’
ముంబై : ఈ మధ్య కాలంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో అభిమానులు, అపరిచితులు మైదానాల్లోకి దూసుకవస్తుండటంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) చీఫ్ అజిత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా మొహాలి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టీ20లో అభిమానులు రెండు సార్లు మైదానంలోకి వచ్చి ఆటకు ఆటంకం కలిగించారని గుర్తుచేశారు. అయితే తమ అభిమాన ఆటగాళ్లపై ప్రేమ ఉండటం సహజమని కానీ ఇది సరైన పద్దతి కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇక ఆటగాళ్లు హోటల్ నుంచి బయల్దేరిన మొదలు తిరిగి వారి గమ్యస్థానానికి చేరుకునేవరకు మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న ఆసోసియేషన్లే భద్రత కల్పించాలని స్పష్టం చేశాడు. ఈ మేరకు క్రికెట్ మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే అసోసియేషన్లకు అజిత్ సింగ్ లేఖ రాశాడు. ‘ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 రద్దవడంతో టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు రెండో మ్యాచ్ కోసం మొహాలికి ముందుగానే చేరుకున్నారు. అయితే స్థానిక అసోసియేషన్తో ఉన్న సమస్యల కారణంగా క్రికెటర్లకు చండీగఢ్ పోలీసులు సెక్యూరిటీ కల్పించలేదు. దీంతో తొలి రోజు హోటల్ యాజమాన్యమే ఆటగాళ్లకు ప్రయివేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. రెండో రోజుకు గాని పోలీసులు ఆటగాళ్లకు భదత్ర కల్పించలేదు. ఇది చాలా విచారకరం. క్రికెటర్లకు పూర్తి భద్రత కల్పించాల్సిన బాధ్యత అసోసియేషన్లదే. అంతేకాకుండా మొహాలి మ్యాచ్లో మైదానంలోకి ఫ్యాన్స్ చొచ్చుకొచ్చారు. లాంగాఫ్, లాంగాన్, మిడాన్, మిడాఫ్, డీప్ థర్డ్మన్ వంటి ఫీల్డింగ్ పొజిషన్ల నుంచి బయటివాళ్లు మైదానంలోకి దూసుకొస్తున్నారు. దీంతో ఈ స్థానాల వద్ద ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి. మరోసారి మొహాలి ఘటనలు జరగకుండా జాగ్రత్తగా వహించాలి’అంటూ అజిత్ సింగ్ లేఖలో పేర్కొన్నాడు. -
కోహ్లిని ఇబ్బంది పెట్టిన అభిమాని
మొహాలి : దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో టి20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఆఫ్ సెంచరీతో మ్యాచ్ను గెలిపించి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్గా నిలిచాడు. అదే సమయంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లి 2,441 పరుగులతో టాప్కు ఎగబాకాడు. ఇక్కడ మరో భారత ఆటగాడు రోహిత్ శర్మను దాటేశాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 2,434 పరుగులు సాధిస్తే, దాన్ని తాజాగా కోహ్లి బ్రేక్ చేశాడు. మరొకవైపు అంతర్జాతీయ టీ20 హాఫ్ సెంచరీల్లో సైతం రోహిత్ను అధిగమించాడు కోహ్లి. ఇప్పటివరకూ రోహిత్ శర్మ 21 అర్థ శతకాలు సాధిస్తే, కోహ్లి దాన్ని సవరించాడు. కాగా, ఈ మ్యాచ్లో కోహ్లి బ్యాటింగ్ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి దూసుకొచ్చాడు. కోహ్లితో కరచాలనం చేయాలని ప్రయత్నించాడు. అది చూసి కోహ్లి వెనక్కు తగ్గాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డులు వచ్చి అభిమానిని బయటికి తీసుకెళ్లిపోయారు. అంతకు ముందు ప్రొటీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా ఓ వ్యక్తి స్టేడియంలోకి వచ్చాడు. ఇలా రెండు సార్లు జరుగడంతో ఆటగాళ్ల భద్రతపై క్రికెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
అచ్చొచ్చిన మైదానంలో.. ఇరగదీశారు
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సారథి విరాట్ కోహ్లి (72 నాటౌట్; 52 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి తన ఫామ్ చాటడంతో భారత్ సునాయస విజయాన్ని అందుకుంది. సఫారీ జట్టు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లితో పాటు ధావన్(40; 31 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ఛేదనలో టీమిండియాకు మంచి శుభారంభం లభించింది. తొలి వికెట్కు 33 పరుగులు జోడించిన అనంతరం రోహిత్(12)ను ఫెలుక్వాయో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లి మరోఓపెనర్ ధావన్తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. వీరిద్దరూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డు పరిగెత్తించారు. కోహ్లి-ధావన్లు రెండో వికెట్కు 61 పరుగులు జోడించారు. అనంతరం షమ్సీ బౌలింగ్లో మిల్లర్ బౌండరీ వద్ద కళ్లుచెదిరే రీతిలో క్యాచ్ అందుకోవడంతో ధావన్ భారంగా క్రీజు వదిలాడు. అయితే ధావన్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఫార్చూన్ బౌలింగ్లో పంత్(4) పేలవమైన షాట్ ఆడి వెనుదిరుగుతాడు. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్(16 నాటౌట్)తో కలిసి కోహ్లి టీమిండియాకు విజయాన్ని అందించాడు. సఫారీ బౌలర్లలో ఫెలుక్వాయో, ఫార్చూన్, షమ్సీలు తలో వికెట్ దక్కించుకున్నారు. అర్దసెంచరీతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. సారథి డికాక్ (52; 37 బంతుల్లో 8ఫోర్లు) అర్దసెంచరీతో మెరవగా బవుమా(49; 43 బంతుల్లో 3ఫోర్లు, 1 సిక్సర్)తన వంతు పాత్ర పోషించాడు. అయితే రీజా హెండ్రిక్స్(6), మిల్లర్(18), డసెన్(1) పూర్తిగా విఫలమవ్వడంతో టీమిండియా ముందు సఫారీ జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయింది. టీమిండియా బౌలర్లలో దీపక్ చహర్ రెండు వికెట్లతో రాణించగా.. సైనీ, జడేజా, హార్దిక్ పాండ్యాలు తలో వికెట్ పడగొట్టారు. -
ఫ్లైయింగ్ కిస్ ఎఫెక్ట్.. మూడేళ్లు జైలులోనే
చండీగఢ్: ఆడవారిని చూడగానే కొందరు మగాళ్లకు బుద్ధి వెర్రి తలలు వేస్తుంది. వారిని ఏడిపించాలని.. అసభ్యంగా ప్రవర్తించాలనే బుద్ధి పుడుతుంది. దాంతో పనికి మాలిన వేషాలు వేస్తుంటారు. అవతలివారికి చిర్రెత్తుకొస్తే.. ఆ తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి. ఇలాంటి సంఘటనే ఒకటి పంజాబ్ రాష్ట్రం మొహాలి పట్టణంలో జరిగింది. పొరుగింటి వివాహిత మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. దాని ఫలితం ఏంటంటే.. కోర్టు అతడికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలు.. వినోద్ అనే యువకుడు మొహాలిలోని ఓ హౌసింగ్ సొసైటీలో నివసిస్తున్నాడు. అదే అపార్ట్మెంట్లో వినోద్ ప్లాట్కు ఎదురుగా ఓ మహిళ తన భర్తతో కలిసి నివసిస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది కాలం నుంచి వినోద్ సదరు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఆమెను చూడగానే ఫ్లైయింగ్ కిస్లు ఇవ్వడం.. అసభ్యకర భంగిమలు చూపడం వంటివి చేస్తున్నాడు. దీని గురించి ఆ మహిళ తన భర్తకు చెప్పడం.. అతడు వినోద్కు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగాయి. కానీ వినోద్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో విసిగిపోయిన దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు వినోద్కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు.. రూ.3వేల జరిమానా కూడా విధించింది. -
భర్త దురలవాటు; మృగాళ్ల పైశాచికత్వం
చండీగఢ్ : పంజాబ్లో అమానుష ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కూడా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 19 జరిగిన ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వివరాలు.. మొహాలికి చెందిన ఓ వివాహిత భర్త అమర్జీత్ సింగ్ మత్తుమందుకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రోజూ ఆమెను హింసించేవాడు. దీనిని అలుసుగా తీసుకున్న అతడి తండ్రి అవతార్ సింగ్, బాబాయిలు(జస్పాల్ సింగ్, గుర్మెయిల్ సింగ్) కోడలి పట్ల మృగాళ్లలా ప్రవర్తించారు. కొడుకుతో పాటు బాధితురాలికి కూడా మత్తు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం గురించి బాధితురాలు భర్తతో గొడవ పడగా తండ్రికే వత్తాసు పలికిన ఆ ప్రబుద్ధుడు.. భార్యను తీవ్రంగా గాయపరిచి, చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఎలాగోలా ఆ రాక్షసుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పుట్టింటికి చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. అయితే మొదట స్థానిక పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. బాధితురాలి ఫిర్యాదు కూడా స్వీకరించలేదు. దీంతో ఆమె ఎస్పీని కలిసి ఈ దారుణం గురించి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేకపోయారు. కాగా ఈ కేసు నమోదు విషయంలో పోలీసుల తీరు పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేడు మోహాలి వేదికగా పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్
-
సిరీస్... నేడు గెలుస్తారా? ఆఖరి దాకా రానిస్తారా?
వరుస విజయాలతో జోరుమీదున్న భారత్కు గత మ్యాచ్లో చుక్కెదురైంది. ఈ నేపథ్యంలో నేడు నాలుగో మ్యాచ్కు కోహ్లి సేన సిద్ధమైంది. ఇక్కడే సిరీస్ను గెలుపుతో ముగిస్తారా లేక ఆఖరిదాకా తీసుకొస్తారా అనేది నేటి మ్యాచ్ ఫలితంతో తేలుతుంది. కోహ్లి సూపర్ ఫామ్లో ఉండగా... అతనికి అండగా నిలిచేవారూ, బాగా ఆడేవారు కరువయ్యారు. ఆ ఒక్కడిపైనే భారం వేయకుండా బాధ్యతగా అందరూ ఆడితేనే జట్టు సమష్టితత్వంతో గెలుస్తుంది. లేదంటే ఆసీస్ సిరీస్ను సమం చేయడం గ్యారెంటీ! మొహాలి: భారత్ ఇక్కడ గెలవాలన్నా... ఈ మ్యాచ్తోనే సిరీస్ను కైవసం చేసుకోవాలన్నా... టీమిండియా ఆటగాళ్లంతా కష్టపడాలి. అప్పుడే ప్రపంచకప్ సన్నాహాన్ని విజయంతో ముగించగలం. అలా కాదని ఏ ఒక్కరి మీదో ఆధారపడితే మళ్లీ చేదు ఫలితం... ఆఖరిదాకా (ఐదో వన్డే) పోరాటం... ఈ రెండూ తప్పవు. ఈ సిరీస్లో గెలుపు రుచి చూసిన ఆస్ట్రేలియా ఇప్పుడు సమంపై కన్నేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే నాలుగో వన్డే రసవత్తర పోరుకు తెరతీస్తుందేమో చూడాలి. ఆస్ట్రేలియా గత మ్యాచ్ విజయంతో టచ్లోకి వచ్చింది. భారత్ బలగాన్ని దెబ్బ తీసింది. భారత బలం కూడా అర్థమైపోయింది. ధోని దూరమైన బృందంలో ఒకే ఒక్కడి (కోహ్లి) వికెట్తో మళ్లీ మ్యాచ్ గెలవొచ్చని పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. సూపర్ ఫామ్లో కోహ్లి... భారత సారథి కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్ను మజా చేసుకుంటున్నాడు. సెంచరీలతో పండగ చేసుకుంటున్నాడు. ప్రస్తుత సిరీస్లో మూడే మ్యాచ్లాడిన కెప్టెన్ మూడొందలకు (283 పరుగులు) చేరువయ్యాడు. ఇందులో రెండు సెంచరీలుండటం విశేషం. అతను ఐదునెలల క్రితమే (అక్టోబర్)లో 10 వేల పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆడింది 12 మ్యాచ్లే... కానీ స్కోరేమో 10, 816కు చేరింది. ఇంతగా ఎవరికీ సాధ్యంకానీ నిలకడతో, ఎవరికీ సాధ్యంకానీ ఆటను అతను ఆడుతున్నాడు. కానీ సహచరులే టీమిండియా కొంపముంచుతున్నారు. గత మ్యాచ్లో ఏ ఒక్కరైనా ఫిఫ్టీ చేసినా, లేదంటే ఏ ఇద్దరు 30 చొప్పున పరుగులు చేసినా భారతే గెలిచేది. కానీ ఎవరూ ఆ బాధ్యత తీసుకోలేదు. కనీసం పీకలమీదికి (ఐదో వన్డే దాకా) రాకముందే ఈ మ్యాచ్లోనైనా భారత ఆటగాళ్లు తమ వంతు సహకారాన్ని కెప్టెన్కు అందించాలి. కలిసికట్టుగా కంగారూ పనిపట్టాలి. ప్రపంచకప్ దగ్గరవుతున్న కొద్దీ ఓపెనర్ శిఖర్ ధావన్ ఫామ్కు దూరమవుతుండటం టీమ్ మేనేజ్మెంట్కు సమస్యగా మారింది. రోహిత్ ప్రదర్శన అతని కంటే మెరుగే కానీ గొప్పగా ఏమీ లేదు. 51 పరుగులే చేయగలిగాడు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (33 పరుగులు) ఇచ్చిన అవకాశాలన్నీ చేజార్చుకున్నాడు. ఇప్పుడైనా అతను కళ్లు తెరవాలి. బ్యాట్కు పనిచెప్పాలి. లేదంటే ప్రపంచకప్ సంగతేమో గానీ... ఐదో వన్డేకే బెర్తు గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఇప్పటికే కోహ్లి జట్టులో మార్పులుంటాయని కరాఖండీగా చెప్పేశాడు. రిషభ్, భువీ వచ్చేశారు రెగ్యులర్ వికెట్ కీపర్ ధోని విశ్రాంతి తీసుకోవడం రిషభ్ పంత్కు కలిసొచ్చింది. అతన్ని తుది జట్టులోకి తెచ్చింది. ధోని ఉండగా కేవలం బ్యాట్స్మన్గా పనికొచ్చే పంత్కు ఇప్పుడు కీపర్గానూ నైపుణ్యం చాటుకునే అవకాశాన్ని ఈ రెండు వన్డేలు ఇస్తున్నాయి. ఇది అతని ప్రపంచకప్ పయనాన్ని కచ్చితంగా నిర్ణయిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సీనియర్ సీమర్ భువనేశ్వర్ కూడా ఫైనల్ ఎలెవన్లోకి వచ్చాడు. దీంతో షమీ, బుమ్రాలలో ఒకరికే చాన్స్ దక్కొచ్చు. బహుశా భువీ–బుమ్రా కాంబినేషన్కే జట్టు యాజమాన్యం సై అనే అవకాశముంది. స్పిన్నర్ యజువేంద్ర చహల్వైపు జట్టు మేనేజ్మెంట్ మొగ్గడంతో రవీంద్ర జడేజా మ్యాచ్కు దూరమవుతున్నాడు. కుల్దీప్కు జతయిన చహల్ రాణిస్తే ఆస్ట్రేలియాను స్పిన్తో దెబ్బకొట్టొచ్చు. అప్పుడే సిరీస్కు గెలుపుతో తెరదించవచ్చు. ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా... మూడో వన్డేలో సాధించిన సాధికార విజయం ఆస్ట్రేలియాను సిరీస్ వేటలోకి తెచ్చింది. రాంచీ మ్యాచ్లో కంగారూ జట్టు బ్యాటింగ్లో, బౌలింగ్లో అదరగొట్టింది. వీళ్ల టాపార్డరేమో భారీగా పరుగులు చేసింది. ప్రత్యర్థి టాపార్డర్ను నిలువునా కూల్చేసింది. కోహ్లి గనక ఆడకపోతే భారత్కు భారీ పరాభవం ఖాయమయ్యేది. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, ఫించ్ ఫామ్లోకి వచ్చారు. మిడిలార్డర్లో స్టోయినిస్ నిలకడగా రాణిస్తుంటే గత మ్యాచ్లో మ్యాక్స్వెల్ మెరుపులు మెరిపించాడు. హ్యాండ్స్కోంబ్ గత మ్యాచ్లో డకౌటైనా... రెండో వన్డేలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. టెయిలెండర్లలో క్యారీ జట్టుకు ఉపయుక్తమైన స్కోర్లు చేస్తున్నాడు. బౌలింగ్లో ఆడమ్ జంపా తన స్పిన్ మాయాజాలంతో టీమిండియా వెన్నెముకను విరిచేస్తున్నాడు. కీలక వికెట్లను చేజిక్కించుకోవడం ద్వారా అతను భారత బ్యాట్స్మెన్కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాడు. పేసర్లలో కమిన్స్, రిచర్డ్సన్లు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో మొహాలిలో నాలుగు మ్యాచ్లు ఆడిన భారత్ కేవలం ఒక మ్యాచ్లో గెలిచి, మూడింటిలో ఓడిపోవడం గమనార్హం. 1996లో టైటాన్ కప్లో భాగంగా ఈ మైదానంలో జరిగిన మ్యాచ్లో ఆసీస్పై గెలిచిన భారత్... 2006, 2009, 2013లలో జరిగిన మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఓవరాల్గా మొహాలిలో భారత్ ఇప్పటి వరకు 15 వన్డేలు ఆడింది. 10 మ్యాచ్ల్లో గెలిచింది. ఐదింటిలో ఓడింది. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, రాయుడు, రిషభ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా/షమీ. ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాజా, షాన్ మార్‡్ష, మ్యాక్స్వెల్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, లయన్, రిచర్డ్సన్, జంపా. పిచ్, వాతావరణం ఫ్లాట్ వికెట్ ఇది. దీంతో ఇక్కడ బ్యాట్స్మెన్ పరుగుల పండగ చేసుకోవచ్చు. వర్షం ముప్పేమీ లేదు. మ్యాచ్కు అడ్డంకీ లేదు. కానీ మంచు ప్రభావం ఉంటుంది. -
ముంబై టు మొహాలీ వయా సిటీ!
సాక్షి, సిటీబ్యూరో: ముంబై నుంచి నగరం మీదుగా చండీఘడ్లోని మొహాలీకి అక్రమ రవాణా అయిన రూ.6 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు, అమెరికన్ డైమండ్స్ను ఎయిర్పోర్ట్ పోలీసులు పట్టుకున్నాడు. ఆ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో చండీఘడ్ విమానాశ్రయంలో ఇరువురు ముంబై వాసుల్ని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని అక్కడి కస్టమ్స్ అధికారులకు అప్పగించిన పోలీసులు ఇంత సొత్తుతో ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాలను వీరు ఎలా దాటి రాగలిగారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ముంబైకి చెందిన వారిగా చెప్పుకుంటున్న బంగారం వ్యాపారులు రాకేష్ మీనావాలా, ధరమ్రాజ్ మీనావాలా బుధవారం విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడ నుంచి ఇండిగో విమానంలో చండీఘడ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ వెంట ఉన్న హ్యాండ్ బ్యాగేజ్లో రూ.6 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొన్ని విలువైన అమెరికన్ డైమండ్స్ను తీసుకువచ్చారు. వీరి వ్యవహారంపై మొహాలీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ అధికారులు చండీఘడ్ విమానాశ్రయ పోలీసుల్ని అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ హసిమ్రన్సింగ్ నేతృత్వంలోని బృందం ఇద్దరినీ గుర్తించి అదుపులోకి తీసుకుంది. బ్యాగేజీని తనిఖీ చేయగా 43 చెవి రింగులు, 19 బ్రాస్లెట్స్, 43 ఉంగరాలు, 4 గాజులు, 3 పెండెంట్ సెట్స్, 14 నెక్లెస్లు, 6 వెండి ఆభరణాలు, 10 అమెరికన్ డైమండ్స్ గుర్తించారు. వీటి మార్కెట్ విలువ రూ.6 కోట్లుగా లెక్కగట్టిన అధికారులు అక్కడి కస్టమ్స్ విభాగానికి అప్పగించారు. ప్రాథమిక లెక్కల ప్రకారం వీరికి రూ.35.75 లక్షల పన్ను విధించారు. ఈ మొత్తం చెల్లించకపోతే ఆభరణాలను వేలం వేస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ ఆభరణాలు ఎక్కడ నుంచి ఎక్కడకు తీసుకువెళ్తున్నారంటూ రాకేష్, ధరమ్రాజ్లను చండీఘడ్ ఎక్సైజ్ అధికారులు ప్రశ్నించారు. అవి తమ వ్యాపారంలో భాగమని చండీఘడ్లోని ఓ స్టార్హోటల్లో జరుగుతున్న జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ప్రదర్శించేందుకు తీసుకువెళ్తున్నామంటూ వివరణ ఇచ్చారు. అయితే ముంబై నుంచి చండీఘడ్కు నేరుగా విమానాలు ఉండగా... టిక్కెట్స్ ధర ఎక్కువైనప్పటికీ హైదరాబాద్ మీదుగా ఎందుకు వచ్చారన్న కస్టమ్స్ అధికారుల ప్రశ్నకు రాకేష్, ధరమ్రాజ్ల నుంచి సమాధానం కరువైంది. మరోపక్క ఈ విషయాన్ని మొహాలీ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. ఇంత భారీ సొత్తు హ్యాండ్ బ్యాగేజీల్లో ముంబై, హైదరాబాద్ విమానాశ్రయాల్లోని తనిఖీల నుంచి ఎలా తప్పించుకున్నారు? అనే దానిపై కస్టమ్స్ అధికారులతో కలిసి ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో తనిఖీల్లో లోపాలు కారణమా? లేక ఎవరైనా సహకరించారా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ బృందం త్వరలో సిటీకి రానున్నట్లు తెలిసింది. -
మ్యాచ్కు వెళుతూ కింగ్స్ పంజాబ్ ఇలా.. వైరల్
మొహాలీ: జట్టు పేరుకు తగ్గట్టే స్థానిక సంస్కృతుల్ని ప్రదర్శించడంలో కింగ్స్ లెవెన్ పంజాబ్ యాజమాన్యం మిగతా ఫ్రాంచైజీలతో పోటీపడుతుందన్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో సొంత గడ్డపై తొలి మ్యాచ్ సందర్భంగా ఇటు ఆటగాళ్లు బసచేసిన హోటల్ వద్ద, అటు స్టేడియం వద్ద బ్యాండ్ల సందడి నెలకొంది. ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం సాయంత్రం కింగ్స్ పంజాబ్-ఢిల్లీ డేర్డెవిల్స జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ ఆడేందుకుగానూ హోటల్ నుంచి స్టేడియంకు బయలుదేరిన ఆటగాళ్లు ఇదిగో ఇలా పంజాబీ బీట్స్కు అనుగుణంగా స్టెప్స్ వేశారు. తొలుత యువరాజ్, ఆ తర్వాత మిల్లర్, ఇంకొందరు ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ఈ ‘బల్లే బల్లే’ వీడియోలను కింగ్స్ అఫీషియల్ ట్విటర్లో పోస్ట్ చేశారు. -
డ్యాన్స్ చేస్తూ సందడి చేసిన ఆటగాళ్లు
-
సాహో ధోని.. ఫీల్డ్లోకి వచ్చి వీరాభిమాని హల్చల్
సాక్షి, మొహాలీ : భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో రెండో వన్డే జరుగుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఓ క్రికెట్ యువ అభిమానం అమాంతం పిచ్లోకి దూసుకొచ్చాడు. నేరుగా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ దోని వద్దకు పరుగులు తీశాడు. వెంటనే తన చేతిలో ఉన్న అట్టాముక్కపై ఆటోగ్రఫీ ఇవ్వాల్సిందిగా కోరాడు. అతడి వ్యవహారం చూసి ధోని ఆశ్చర్యపోయాడు. భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో రెండో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత బ్యాట్స్మెన్ చేలరేగిపోయారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (208 నాటౌట్) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తర్వాత శ్రీలంక బ్యాటింగ్కు దిగగా కీపర్గా ధోనీ ఫీల్డ్లో ఉన్నారు. అదే సమయంలో ఆట జరుగుతుండగానే ఓ వీర అభిమాని ధోని వైపు దూసుకొచ్చాడు. వెంటనే ఆయన ఆటోగ్రఫీని అడిగి అనంతరం ధోని పాదాలు తాకి వందనం చేసుకున్నాడు. అతడు చేసిన పనికి ఏమాత్రం విసుక్కోని ధోని సంతోషంగానే అతడిని తిరిగి పంపించాడు. ఇది చూసిన అక్కడి కెమెరామెన్ ఆ దృశ్యాలను క్లిక్ మనిపించాడు. -
ఖాతా తెరిచిన వాషింగ్టన్ సుంధర్
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన 18 ఏళ్ల కుర్రాడు వాషింగ్టన్ సుంధర్ తన ఖాతా తెరిచాడు. సుంధర్ వేసిన 15 ఓవర్ మూడో బంతికి తిరమన్నే(21) రివర్స్ స్వీప్ షాట్ ఆడబోయి క్లీన్బౌల్ట్ అయ్యాడు. దీంతో లంక 62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక అంతకు ముందు ఓపెనర్లు గుణతిలక(16), ఉపుల్ తరంగా(7)లను బుమ్రా, పాండ్యాలు పెవిలియన్కు పంపించారు. 17 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక స్కోరు 78/3 . -
లక్మల్పై కసితీర్చుకున్న రోహిత్.!
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ శ్రీలంక బౌలర్ లక్మల్పై కసి తీర్చుకున్నాడు. తొలి వన్డేల్లో 4 వికెట్లతో భారత ఘోర పరాభావాన్ని శాసించిన లక్మల్కు ఈ మ్యాచ్లో రోహిత్ తన బ్యాట్తో బదులిచ్చాడు. ధర్మశాల మ్యాచ్లో లక్మల్ రోహిత్(2)ను పెవిలియన్కు పంపించిన విషయం తెలిసిందే. రోహిత్ ఆడిన వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాది రికార్డు నమోదు చేశాడు. రెండో వన్డేల్లో లక్మల్ వేసిన 43 ఓవర్లో రోహిత్ వరుస సిక్సులతో విరుచుకుపడ్డాడు. నాలుగు బంతుల్లో నాలుగు సిక్సులు బాది లక్మల్కు ముచ్చెమటలు పట్టించాడు. లక్మల్ వేసిన ఓ వైడ్ను కలుపుకొని ఈ ఓవర్లో భారత్కు 26 పరుగులు జమయ్యాయి. ఇక అనంతరం ప్రదీప్ బౌలింగ్లో మరో మూడు బంతులు ఎదుర్కొన్న రోహిత్ మరో రెండు సిక్సులు, పెరీరా బౌలింగ్లో మరో సిక్స్ బాదాడు. దీంతో రోహిత్ వరుస 9 బంతుల్లో 7 సిక్సులు బాదినట్లైంది. రోహిత్ ‘డబుల్’ రికార్డులు ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు సాధించిన రోహిత్.. తాజా డబుల్తో వన్డే చరిత్రలో మూడు డబుల్ సెంచరీలు బాదిన తొలి క్రికెటర్గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డే చరిత్రలో మెత్తం 7 డబుల్ సెంచరీలు నమోదు కాగా రోహిత్వే 3 డబుల్ సెంచరీలు కావడం విశేషం. రోహిత్ తొలి డబుల్(209) సెంచరీ 2013లో ఆస్ట్రేలియాపై చిన్నస్వామి స్టేడియంలో నమోదు చేశాడు. ఇక ఇదే శ్రీలంకపై రెండో డబుల్ సెంచరీ(264)ను 2014లో ఈడెన్ గార్డెన్స్లో సాధించాడు. మిగతా నాలుగు డబుల్ సెంచరీలు సచిన్ టెండూల్కర్(200) , సెహ్వాగ్(219), క్రిస్గేల్ (215) మార్టిన్గప్టిల్ (237)ల పేరిట ఉన్నాయి. ♦ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్గా రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సెహ్వాగ్(219) పేరిట ఉంది. 2011 డిసెంబర్ 8న ఇండోర్ వేదికగా వెస్టిండీస్పై సెహ్వాగ్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్కు సెహ్వాగ్ కెప్టెన్సీ వహించడంతో ఈ రికార్డు తన సొంతమైంది. ♦ శ్రీలంకపై అత్యధిక పరుగుల చేసిన తొలి కెప్టెన్గా గుర్తింపు పొందాడు. -
19 ఏళ్ల తర్వాత టీమిండియా..
భారత్-శ్రీలంక మధ్య మొహాలీలో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాట్స్మెన్ చేలరేగిపోయారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ (208 నాటౌట్) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. దీంతో శ్రీలంకకు 393 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. తొలి వన్డేలో దారుణంగా విఫలమై చెత్త రికార్డును మూటగట్టుకున్న టీం ఇండియా మొహాలీలో భారీ లక్ష్యంతో లంకకు సవాల్ విసిరింది. మరో వైపు 115 బంతుల్లో రోహిత్ శర్మ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16 వ సెంచరీ పూర్తిచేసుకోగా.. వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా టీమిండియా మొహాలీ వన్డేలో మరో రికార్డును సమం చేసింది. ఒకే క్యాలెండర్ ఇయర్లో ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన రికార్డును భారత్ సమం చేసింది.1998లో సచిన్ చేసిన సెంచరీతో క్యాలెండర్ ఇయర్లో 18 వన్డే సెంచరీలను భారత్ నమోదు చేసింది. అయితే 2017 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటి వరకు టీమిండియా 17 వన్డే సెంచరీలను చేసింది. తాజాగా మొహాలీలో జరుగుతున్న వన్డేలో రోహిత్ 115 బంతుల్లో సెంచరీ సాధించాడు. దీంతో 19 ఏళ్ల తర్వాత ఒకే క్యాలెండర్ ఇయర్లో టీమిండియా 18 వన్డే సెంచరీలు చేసి గత రికార్డును సమం చేసింది. -
రో’హిట్’ డబుల్ సెంచరీ
-
రోహిత్ డబుల్ సెంచరీ.. లంకకు భారీ లక్ష్యం
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో లంకకు 393 పరుగుల భారీ లక్ష్యం నిర్ధేశించారు. భారత్ 50 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 392 పరుగులు చేసింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ(208 నాటౌట్), ధావన్(68)లు మంచి శుభారంభాన్ని అందించారు. 10 ఓవర్లలోపు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం చెలరేగింది. ఈ దశలో ధావన్ కెరీర్లో 35వ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 115 పరుగుల వద్ద ధావన్ క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్తో రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమై కెప్టెన్గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. 110 బంతుల్లో రోహిత్ 8 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం చెలరేగిన ఈ ఇద్దరు స్కోరు బోర్డును పరుగెత్తించారు. రోహిత్ డబుల్ సెంచరీ.. అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్కు ప్రయత్నించి శతకాన్ని చేజార్చుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని(7) ఓ సిక్సు కొట్టి అవుటయ్యాడు. ఇక చివర్లో రోహిత్ 151 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ విధ్వంసానికి లంక బౌలర్లు పరుగులివ్వడంలో పొటీ పడ్డారు. తొలి మ్యాచ్లో విజృంభించిన లక్మల్(71), ప్రదీప్లు(103) పరుగులు సమర్పించుకున్నారు. చివరి బంతికి పాండ్యా(8) క్యాచ్ అవుటయ్యాడు. లంక బౌలర్లలో పెరీరాకు మూడు సచిత్ పతిరాణకు ఓ వికెట్ దక్కింది. గర్జించిన భారత బ్యాట్స్మెన్ -
లక్మల్పై కసితీర్చుకున్న రోహిత్.!
-
కొత్త కుర్రాడు కుమ్మేశాడు.!
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (88) భారీ షాట్కు ప్రయత్నించి శతకాన్ని చేజార్జుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్ అనుభవంతో తొలుత ఆచితూచి ఆడిన అయ్యర్ హాఫ్ సెంచరీ అనంతరం తన ఐపీఎల్ అనుభవాన్ని ప్రదర్శించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకపడుతూ లంక బౌలర్లను ఓ ఆట ఆడాడు. వేగంగా ఆడుతూ తన అసలైన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. మరోవైపు రోహిత్ కూడా సెంచరీ అనంతరం చెలరేగి ఆడాడు. లక్మల్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా 4 సిక్సులతో విరుచుకుపడ్డాడు. దీంతో 18 బంతుల్లోనే మరో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. మరోవైపు భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. దెబ్బతిన్న పులిలా రోహిత్ మైదానంలో గర్జిస్తున్నాడు. -
రోహిత్ 100.. శ్రేయస్ 50
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డేల్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో లంకపై కసి తీర్చుకున్నాడు. తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమై కెప్టెన్గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు. మరో వైపు యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ సాధించాడు. తొలుత శ్రేయస్ అయ్యర్ 50 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్ తొలి అర్ధ సెంచరీ సాధించాడు. అనంతరం 115 బంతుల్లో రోహిత్ 9 ఫోర్లు ఒక సిక్సుతో కెరీర్లో 16వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో భారత్ 39.3 ఓవర్లకు వికెట్ నష్టపోయి 237 పరుగులు చేయగలిగింది. ఇక రెండో వికెట్కు ఈ ఇద్దరూ భాగస్వామ్యం 100 దాటింది. లంకతో తొలి మ్యాచ్తోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అయ్యర్ ఆ మ్యాచ్లో విఫలమైన రెండో మ్యాచ్లో రాణించి సెలక్టర్ల నమ్మకాన్ని నిలబెట్టాడు. -
రోహిత్ హాఫ్ సెంచరీ.. ధావన్ అవుట్
మొహాలీ: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్లో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్లో 35వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక అంతకు ముందు టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. తిరుమన్నే వేసిన 21 ఓవర్ తొలి బంతికి ఓపెనర్ శిఖర్ ధావన్(68) క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కు నమోదైన 115 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్తో రోహిత్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు. 24 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. -
లంకతో రెండో వన్డే: ధావన్ హాఫ్ సెంచరీ
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ శిఖర్ధావన్ అర్ధ సెంచరీ సాధించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లతో కెరీర్లో 23 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక రోహిత్(23) నిలకడగా ఆడుతున్నాడు. దీంతో భారత్ 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 75 పరుగులు చేసింది. ఇక తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమైన ధావన్ ఈ మ్యాచ్లో లంక బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ప్రదీప్ వేసిన 13 ఓవర్లో మూడు ఫోర్లతో 15 పరుగులు పిండుకున్నాడు. తొలి పది ఓవర్లు నెమ్మదిగా ఆడిన ఈ జోడి అనంతరం పరుగుల వేగాన్ని పెంచింది. -
రెండో వన్డేకు మందు ధోని VS పాండ్యా .!
మొహాలీ: మొహాలీ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని.. పరుగుల చిరుత ఉసెన్ బోల్ట్ను తలపించాడు. సరదాగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాతో పెట్టుకున్న 100 మీటర్ల పరుగు పందెంలో ఈ సినీయర్ క్రికెటర్ ఏమాత్రం తగ్గకుండా పోటీనిచ్చాడు. ఇంకా చెప్పాలంటే యువ ఆటగాడైన పాండ్యా కన్నా ధోని ఒక అడుగు ముందే ఉన్నాడు. ఈ సరదా వీడియోను బీసీసీఐ ధోనిVS పాండ్యా 100 మీటర్ల పరుగు పందేం.. ఎవరు గెలిచారో చూడండి అని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక గత కొద్ది రోజులుగా ధోని రిటైర్మెంట్ ప్రకటించాలని సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలకు బ్యాట్తోనే సమాధానం చెప్పి తన అవసరం ఏమిటో తొలి వన్డేలో నిరూపించాడు ధోని. అయితే ఏ కారణాలతో ధోని రిటైర్మెంట్ చేయమంటున్నారు..? ఫిట్నెస్ విషయంలోనా అయితే ఈ వీడియోను చూడండి..? యువ ఆటగాళ్లు సైతం అతనితో గెలవలేక పోతున్నారని ధోని అభిమానులు విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మరో యువ కెరటం అరంగేట్రం..
-
మరో యువ కెరటం అరంగేట్రం..
మొహాలీ: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో మరోసారి రోహిత్కు టాస్ కలిసిరాలేదు. టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్పై మంచు ప్రభావం కారణంగా టాస్ కీలకంగా మారిన దశలో రోహిత్ టాస్ కోల్పోయాడు. ఇక జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా శ్రీలంక బరిలోకి దిగుతుండగా.. భారత్ జట్టులో ఒక్క మార్పు చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ స్థానంలో యువ ఆటగాడు వాషింగ్టన్ సుంధర్ను తీసుకున్నారు.. తొలి మ్యాచ్తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ మ్యాచుల్లో అరంగేట్రం చేయగా.. ఈ మ్యాచ్తో 18 ఏళ్ల వాషింగ్టన్ సుంధర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. అయితే రహానేను తీసుకుంటారని అందరు భావించగా మరో సారి అతనికి మొండిచేయ్యే ఎదురైంది. వాషింగ్టన్ సుంధర్ మ్యాచ్కు ముందు కోచ్ రవిశాస్త్రి చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. భారత్ తరఫున వన్డే ఫార్మాట్లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్గా సుంధర్ గుర్తింపు పొందాడు. తొలుత టీ20లకే సెలక్ట్ అయిన ఈ 18 ఏళ్ల కుర్రాడు. ఆలౌరౌండర్ కేదార్ జాదవ్ గాయంతో జట్టుకు దూరం అవ్వడంతో అనూహ్యంగా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఇక భారత్కు ఈ మ్యాచ్ చావోరేవో అన్నట్లుగా మారింది. ఇది గెలిస్తేనే సిరీస్పై ఆశలు సజీవంగా ఉంటాయి. శ్రీలంక జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తొలి మ్యాచ్ విజయంతో లంకేయులు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయాన్నందుకోవాలని ఉవ్విలూరుతున్నారు. జట్లు భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, వాషింగ్టన్ సుంధర్, బుమ్రా, చహల్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, తిరిమన్నే, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్. -
‘ధర్మశాల విజయాన్ని రిపీట్ చేస్తాం’
మొహాలి: ధర్మశాల విజయాన్ని పునరావృతం చేస్తామని శ్రీలంక కెప్టెన్ తిసారా పెరీరా ధీమా వ్యక్తం చేశాడు. మోహాలిలో ప్రాక్టీస్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సిరీస్ గెలవడానికి ఇది ఓ మంచి అవకాశమని, పెద్ద పెద్ద జట్లకు భారత్లో సిరీస్ గెలవడం సాధ్యం కాలేదన్నాడు. ధర్మశాల మ్యాచ్ వలె తమ ప్రత్యేకతను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నామన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్న పెరీరా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తామన్న విషయం ప్రతి ఒక్కరికి మెదళ్లలో నాటుకోపోయిందన్నాడు. మ్యాచ్ గెలవడానికి 200 శాతం ప్రదర్శన కనబరుస్తామన్నాడు. గత న్యూజిలాండ్ సిరీస్లో భారత్ కూడా తొలి మ్యాచ్ ఓడిపోయి తరువాతి రెండు మ్యాచ్లు గెలిచిందన్న విషయం తెలుసని, అయినా మా బాధ్యత మేం నిర్వర్తిస్తామన్నాడు. 12 ఓటముల తర్వాత గెలవడం ఆనందంగా ఉందన్న పెరీరా.. ధర్మశాల ప్రదర్శనను కనబరిస్తే సులువుగా మొహాలి మ్యాచ్ గెలువచ్చన్నాడు. ఇక జట్టు సభ్యుల్లో ధనుంజయ డిసిల్వా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని మిగతా వారంతా ఫిట్గా ఉన్నారని తెలిపాడు. ఇక ధర్మశాలలో రహానేను ఆడించకపోవడంపై స్పందిస్తూ.. నేను భారత సెలక్టర్ను కాదు. ఎందుకు ఆడలేదో నాకు తెలియదు. అతను ఓ గొప్ప బ్యాట్స్మన్. ఈ విషయంపై నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేనన్నాడు. తొలి మ్యాచ్లో రోహిత్ సేనపై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక బుధవారం జరిగే మ్యాచ్ భారత్ చావో రేవో అన్నట్లుగా ఉంది. వాతావారణ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక టీం ధర్మశాలలో ఒక రోజు ఎక్కువగా బసచేసింది. మంగళవారం ఉదయం మొహాలి చేరిన జట్టు మధ్యాహ్నం ప్రాక్టీస్లో పాల్గొంది. పెరీరాకు ఈ మైదానంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన అనుభవం ఉంది. -
మరో రికార్డు చేరువలో ధోని
సాక్షి, హైదరాబాద్ : వన్డేల్లో 300 పైగా మ్యాచ్లు.. అత్యధిక నాటౌట్లు.. స్టంప్ అవుట్లతో ఈ ఏడాది రికార్డులు సృష్టించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో మైలు రాయి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో 10 వేల పరుగుల మార్క్ దాటడానికి ధోని ఇంకా 109 పరుగుల దూరంలో ఉన్నాడు. భారత్-శ్రీలంక రేపటి మ్యాచ్లో ధోని ఈ పరుగులు చేస్తే వేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్మన్గా రికార్డులకెక్కనున్నాడు. 259 ఇన్నింగ్స్ల్లో సచిన్ 10 వేల మార్క్ను అందుకోగా సౌరవ్ గంగూలీ 263, రికీ పాంటింగ్ 266, జయసూర్య 272 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ను అందుకున్నారు. ధోని ప్రస్తుతం 267 ఇన్నింగ్స్ల్లో 9,891 పరుగులు చేశాడు. మిగిలిన 109 పరుగులను ఒక ఇన్నింగ్స్లో లేకపోతే రెండు మూడు, నాలుగు ఇన్నింగ్స్లు తీసుకున్నా జయసూర్య స్థానాన్ని అధిగమిస్తాడు. అంతేగాకుండా 10 వేల మార్క్ను అందుకున్న నాలుగో భారత బ్యాట్స్మన్గా గుర్తింపు పొందనున్నాడు. ఈ జాబితాలో సచిన్, గంగూలీ, ద్రవిడ్లు ముందున్నారు. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ప్లేయర్లలో ధోని నాలుగో స్థానంలో ఉన్నాడు. కోహ్లి(1460) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా రోహిత్ శర్మ(1078), శిఖర్ ధావన్(792), ధోని(781)లు తరువాతి వరుసలో ఉన్నారు. శ్రీలంకపై స్థిరమైన బ్యాటింగ్తో రాణిస్తున్న ధోని గత ఎనిమిది మ్యాచుల్లో 4 అర్థ సెంచరీలు సాధించాడు. ఇక రేపటి మ్యాచ్లో మరో 11 పరుగులు చేస్తే ధోని మోహాలీ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందుతాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉంది. ఇక తొలి మ్యాచ్లో క్లిష్ట పరిస్థితిల్లో అర్ధసెంచరీతో భారత పరువును కాపాడిన ధోని మంచి ఫామ్లో ఉన్నాడు. -
160 కిలోల బంగారం పట్టివేత
చండీగఢ్: ఎన్నికల ముంగిట పంజాబ్లో పోలీసులు రూ.21 కోట్ల విలువైన 160 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొహాలీ జిల్లాలోని సొహానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బకార్పూర్ చౌక్లో ఓ చెక్పోస్టు వద్ద చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో మంగళవారం రాత్రి ఓ వాహనంలో ఈ ముడి బంగారం లభించింది. ఈ బంగారాన్ని శుద్ధిచేయడానికి ఢిల్లీ నుంచి హిమాచల్ప్రదేశ్లోని హమీర్పూర్కు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన బంగారం గురించి వారు సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని, సంబంధిత పత్రాలు కూడా వారి వద్ద లేవని పోలీసులు తెలిపారు. తదుపరి ధృవీకరణ నిమిత్తం ఈ విషయాన్ని పోలీసులు ఎక్సైజ్, పన్ను శాఖ అధికారులకు తెలియజేశారు. -
మొహాలీలో నకిలీ కొత్త నోట్ల కలకలం
-
మొహాలీలో నకిలీ కొత్త నోట్ల కలకలం
-
బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
-
బాల్ ట్యాంపరింగ్ కథనాలపై కోహ్లీ మండిపాటు
మొహాలీ: తనపై వచ్చిన బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలపై టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఇండియా- ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్పై దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అర్థంలేని ఆరోపణలు తెరపైకి తెస్తున్నారని ఆరోపించాడు. ఇంగ్లాండ్తో సిరీస్లో భాగంగా మూడో టెస్టు మ్యాచ్ కోసం మొహాలీ వచ్చిన కోహ్లీ.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘నిజానికి నాకు న్యూస్ పేపర్లు చదివే అలవాటులేదు. రాజ్కోట్(మొదటి) టెస్ట్లో నేను బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డానని ఒక పేపర్లో వచ్చిన సంగతి నాకు ఐదు రోజుల కిందటే తెలిసింది. ఆ విషయం తెలిసి మొదట నవ్వుకున్నా. విచక్షణతో ఆలోచిస్తే.. హోరాహోరీగా సాగుతోన్న ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్పై దృష్టి మరల్చేందుకే ఇలాంటి కథనాల్ని పుట్టించారని అర్థం అవుతుంది’అని కోహ్లీ మీడియాతో అన్నారు. న్యూస్ పేపర్లో కథనం ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తనపై చర్యలకు ఉపక్రమించబోదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నవంబర్9 నుంచి 13 వరకు రాజ్కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని బ్రిటీష్ పత్రిక ‘ది డైలీ మెయిల్’ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యర్థి జట్టు (ఇంగ్లాండ్) ఆటగాళ్లుకానీ, మ్యాచ్ అంపైర్లుగానీ కనీసం ఫిర్యాదు చేయని విషయాన్ని హైలైట్ చేస్తూ బ్రిటీష్ పత్రిక రాసిన కథనాన్ని టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే సహా కొందరు మాజీలు ఖండించారు. ఒకవేళ నిజంగా ట్యాంపరింగ్కి పాల్పడినా.. మ్యాచ్ ముగిసిన ఐదు రోజుల్లోపే ఫిర్యాదుచేయాల్సి ఉంటుంది. కాగా, బీసీసీఐ, ఐసీసీల మధ్య నడుస్తోన్న ప్రచ్ఛన్న యుద్ధంలో కోహ్లీ బలవుతాడా? అనే అనుమానాలూ లేకపోలేదు. పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్లు ఆడని కారణంగా టీమిండియా మహిళా జట్టు పాయింట్లను ఐసీసీ కోత విధించిన సంగతి తెలిసిందే. దానికి కొనసాగింపుగా కోహ్లీ పైనా నిబంధనలకు విరుద్ధంగా ఐసీసీ చర్యలకు దిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అనుమానం. -
మూడో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులోకి బట్లర్
భారత్తో శనివారం నుంచి మొహాలీలో జరిగే మూడో టెస్టులో ఇంగ్లండ్ తుది జట్టులోకి జాస్ బట్లర్ రావడం ఖాయమైంది. రెండు టెస్టుల్లోనూ విఫలమైన డకెట్ స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్మన్గా బట్లర్ ఆడతాడు. ఇప్పటి వరకు కెరీర్లో 15 టెస్టులు ఆడిన బట్లర్, ఏడాది క్రితం జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత ఒకే ఒక ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడిన అతని రికార్డు ఏమంత బాగా లేదు. అరుుతే ప్రత్యామ్నాయాలు పెద్దగా అందుబాటులోలేకపోవడంతో బట్లర్ను ఇంగ్లండ్ ఎంపిక చేయాల్సి వచ్చింది. ఈ సారి అతను మెరుగైన ప్రదర్శన కనబరుస్తాడని కోచ్ ట్రెవర్ బెలిస్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఆఖరి మ్యాచ్ ఆడేసినట్లే(నా)!
పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే. స్వదేశానికి వెళ్లిన తర్వాత నాలుగైదు రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత వ్యాఖ్యానించాడు. ‘ఆటగాడిగా నేను పూర్తి ఫిట్గా ఉన్నాను. కానీ కెప్టెన్గా ఒత్తిడిని తట్టుకోలేకపోయాను. దేశానికి ఏది మంచిదని అనిపిస్తే అదే చేస్తాను. ప్రస్తుతం ఇంటికి వెళ్లిన తర్వాత నాలుగైదు రోజులు ఆలోచిస్తాను. ఏ విషయమైనా మా దేశంలో ప్రకటిస్తాను’ అని ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో మరోసారి రాజకీయంగా వివాదాస్పదమయ్యే వ్యాఖ్య చేశాడు. కోల్కతాలో తమకు మద్దతు ఇచ్చిన అభిమానులతో పాటు కశ్మీర్ నుంచి మొహాలీ వచ్చి తమకు మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలంటూ వ్యాఖ్యానించాడు. -
మొహాలీలో పాకిస్తాన్ జట్టుకే మద్దతు
మొహాలీ: భారత్ వేదికపై దాయాది పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు అనూహ్య మద్దతు లభిస్తోంది. టి-20 ప్రపంచ కప్లో భాగంగా శుక్రవారం మొహాలీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో అభిమానులు పాక్ టీమ్కు మద్దతు తెలిపారు. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు అభిమానులు 'పాకిస్తాన్ జీతేగా', 'అఫ్రిదీ లలా' అంటూ స్టేడియం హోరెత్తిపోయేలా నినాదాలు చేశారు. దీంతో పాక్ టీమ్కు స్వదేశంలో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న అనుభూతి కలిగింది. మొహాలీ స్టేడియంలో 27 వేల సీటింగ్ కెపాసిటీ ఉంది. పాక్-ఆసీస్ మ్యాచ్ను తిలకించేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అఫ్రిదీ ఆటను చూసేందుకు వచ్చానని అనంత్నాగ్కు చెందిన ఆమిర్ అనే యువకుడు చెప్పాడు. అతను దగ్గరలోని రాజ్పురాలో చదువుతున్నాడు. పాకిస్తాన్ జట్టు అంటే పెద్దగా ఆసక్తి లేదని, అఫ్రిదీ కోసం వచ్చామని సరబ్ ప్రీత్ అనే యువకుడు చెప్పాడు. పాటియాలాకు చెందిన సరబ్ సోదరుడితో కలసి మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. పాక్ జట్టుకు స్థానికులతో పాటు కశ్మీరీ విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు. ఇదే ఈవెంట్లో న్యూజిలాండ్, పాక్ మ్యాచ్ కూడా ఈ వేదికలోనే జరిగింది. -
మొహాలీలో భారత్ ఎదురీత
-
ఉజ్వల కెరీర్కు పునాది.. ఐఐఎస్ఈఆర్
నాణ్యమైన శాస్త్రీయ విద్యను అందించడంతోపాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులను ప్రోత్సహించడంలో అగ్రగామిగా నిలుస్తున్నాయి.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) విద్యా సంస్థలు.. సైన్స రంగంలో ఉజ్వల కెరీర్కు పునాదిగా విరాజిల్లుతున్నాయి.. భారత ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ ఇన్స్టిట్యూట్స్కు స్వయం ప్రతిపత్తి హోదా ఉంది. ఐఐఎస్ఈఆర్కు దేశ వ్యాప్తంగా పుణే, కోల్కతా, తిరువనంతపు రం, మొహాలీ, భోపాల్లో క్యాంపస్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 950 సీట్లు ఉన్నాయి. ఐఐఎస్ఈఆర్ 2014 విద్యా సంవత్సరానికి ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలు.. ప్రవేశం: - కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సహాన్ యోజన (కేవైపీవై) బేసిక్ సైన్స్ స్ట్రీమ్: ఎస్ఏ (2012)/ఎస్ఎక్స్ (2013)/ఎస్బీ (2013)లలో అర్హత సాధించి ఉండాలి. - జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్డ్) 2014: ఈ పరీక్షలో ర్యాంకు సాధించిన విద్యార్థులు. - స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్: 12వ తరగతి మార్కులాధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) అందజేసే ఇన్స్పైర్ స్కాలర్షిప్స్ పొందిన విద్యార్థులు. అయితే ఈ విద్యార్థులు ఆప్టిట్యూడ్ టెస్ట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. - ఈ మూడు విభాగాల్లో అర్హత ఉంటే ఆ మేరకు మూడు విభాగాల ద్వారా వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. షార్ట్లిస్ట్: వచ్చిన దరఖాస్తుల ఆధారంగా విద్యార్థులను షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ మేరకు సదరు విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలి. అయితే కౌన్సిలింగ్లో ఐదు క్యాంపస్లలో కోరుకున్న క్యాంపస్లో అడ్మిషన్ లభించాలని ఏమీ లేదు. కాకపోతే ఏ ఇన్స్టిట్యూట్కు ప్రాధాన్యతనిస్తున్నారో.. ఆ సమాచారాన్ని దరఖాస్తు సమయంలోనే పేర్కొనాలి. ఈ ప్రాధాన్యత ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అయితే సీట్ల కేటాయింపులో తొలుత కేవైపీవై విద్యార్థులకు ప్రాధాన్యత లభిస్తుంది, ఆ త ర్వాత వరుసగా జేఈఈ-2014 ర్యాంకర్లు, ఆప్టిట్యూడ్ టెస్ట్లో మెరిట్ సాధించిన విద్యార్థులకు ప్రాధాన్యత దక్కుతుంది. ఈ క్రమంలో మొత్తం సీట్లలో 25 శాతం సీట్లను కేవైపీవై విద్యార్థులకు, 50 శాతం సీట్లను కేవైపీవై, జేఈఈ విద్యార్థులకు కేటాయిస్తారు. మిగిలిన సీట్లను ఆప్టిట్యూడ్ టెస్ట్ విద్యార్థులతో భర్తీ చేస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్: ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. బయాలజీల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 15 చొప్పున మొత్తం 60 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున మొత్తం మార్కులు 180. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ సిలబస్, మోడల్ పేపర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేర్చుకోవడం, అనుసంధానించడం: బీఎస్-ఎంఎస్ కోర్సులో తరగతిలో బోధించిన అంశాన్ని పరిశోధనతో సమన్వయం చేసే మల్టిడిసిప్లినరీ విధానాన్ని పాటిస్తారు. నేర్చుకోవడం, అనుసంధానించడం అనే సూత్రానికి ప్రాధాన్యతనిస్తారు. కోర్సు నిర్వహణలో సెమిస్టర్ విధానాన్ని అనుసరిస్తారు. మొదటి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు) విద్యార్థులందరికీ ఉమ్మడి సబ్జెక్ట్లను బోధిస్తారు. అవి.. బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్. మూడు, నాలుగు సంవత్సరాల్లో స్పెషలైజేషన్ సబ్జెక్ట్లను బోధిస్తారు. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఏదో ఒక అంశం (వన్ మేజర్) లేదా బహుళ అంశాల (మోర్ మైనర్స్)ను ఎంచుకోవచ్చు. చివరి సంవత్సరం (ఐదో సంవత్సరం)లో పూర్తిగా ప్రాజెక్ట్వర్క్ ఉంటుంది. స్కాలర్షిప్ సౌకర్యం: బీఎస్-ఎంఎస్ కోర్సులో చేరిన విద్యార్థులకు వారి ఆలోచనలను ప్రోత్సహించడం కోసం స్కాలర్షిప్ను కూడా అందజేస్తారు. ఈ క్రమంలో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి నెలకు రూ. 5 వేల స్కాలర్షిప్ లభిస్తుంది. - దరఖాస్తు విధానం: ఆన్లైన్లో - దరఖాస్తు ఫీజు: రూ.600 (ఎస్సీ/ఎస్టీలకు-రూ.300) - కేవైపీవై/జేఈఈ (అడ్వాన్స్డ్) విద్యార్థుల దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 7, 2014. - కేవైపీవై/జేఈఈ (అడ్వాన్స్డ్) విద్యార్థులకు కౌన్సిలింగ్ తేదీ: జూలై 10, 2014. - స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ విధానం ద్వారా దరఖాస్తుకు గడువు తేదీ: జూలై 10, 2014. - ఆప్టిట్యూడ్ టెస్ట్ తేదీ: జూలై 20, 2014. - కోర్సు ప్రారంభం: ఆగస్టు, 2014. వివరాలకు: www.iiser&admissions.in -
ఆఖరి మ్యాచ్లోనూ అదుర్స్
పంజాబ్కు 11వ విజయం రాణించిన మిల్లర్, వోహ్రా పీటర్సన్ శ్రమ వృథా ఢిల్లీకి తప్పని మరో ఓటమి మొహాలీ: ఇప్పటికే ప్లే ఆఫ్కు అర్హత సాధించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్... తన ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదరగొట్టింది. ఆల్రౌండ్ నైపుణ్యంతో ఢిల్లీ డేర్డెవిల్స్ను చిత్తు చేసి విజయంతో లీగ్ దశను ముగించింది. దీంతో కీలకమైన నాకౌట్కు ముందు జట్టులో మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకుంది. ఐపీఎల్-7లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. పీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. పీటర్సన్ (41 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. దినేశ్ కార్తీక్ (13), నీషమ్ (12) మినహా మిగతా బ్యాట్స్మన్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. కార్తీక్, పీటర్సన్ రెండో వికెట్కు 31 పరుగులు జోడించడంతో పవర్ ప్లేలో ఢిల్లీ 3 వికెట్లకు 44 పరుగులు చేసింది. తర్వాతి వరుస బ్యాట్స్మన్ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఫలితంగా ఢిల్లీ 24 పరుగుల వ్యవధిలో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. అవానా, పటేల్, జాన్సన్, కరణ్వీర్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత పంజాబ్ 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 119 పరుగులు చేసి గెలిచింది. వోహ్రా (38 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మిల్లర్ (34 బంతుల్లో 47 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. సెహ్వాగ్ (9) విఫలమయ్యాడు. 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పంజాబ్ను వోహ్రా, మిల్లర్ మూడో వికెట్కు 96 పరుగులు జోడించి విజయపథంలో నిలబెట్టారు. షమీ, ఉనాద్కట్, తాహిర్ తలా ఓ వికెట్ పడగొట్టారు. వోహ్రాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ ఎల్బీడబ్ల్యు (బి) ధావన్ 58; అగర్వాల్ (సి) సెహ్వాగ్ (బి) జాన్సన్ 2; కార్తీక్ (సి) పటేల్ (బి) అవానా 13; జాదవ్ (సి) వోహ్రా (బి) అవానా 0; తివారీ రనౌట్ 8; డుమిని (సి) పటేల్ (బి) కరణ్వీర్ 8; నీషమ్ (సి) బెయిలీ (బి) కరణ్వీర్ 12; నదీమ్ నాటౌట్ 3; షమీ (బి) పటేల్ 0; తాహిర్ (సి) ధావన్ (బి) పటేల్ 4; ఉనాద్కట్ (సి) మాక్స్వెల్ (బి) జాన్సన్ 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం: (18.1 ఓవర్లలో ఆలౌట్) 115. వికెట్ల పతనం: 1-13; 2-44; 3-44; 4-67; 5-91; 6-93; 7-110; 8-111; 9-115; 10-115 బౌలింగ్: అవానా 3-1-15-2; అక్షర్ పటేల్ 4-0-28-2; జాన్సన్ 3.1-0-27-2; కరణ్వీర్ 4-0-22-2; రిషీ ధావన్ 4-0-22-1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (సి) కార్తీక్ (బి) షమీ 9; వోహ్రా (బి) తాహిర్ 47; మాక్స్వెల్ (సి) పీటర్సన్ (బి) ఉనాద్కట్ 0; మిల్లర్ నాటౌట్ 47; బెయిలీ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు 15; మొత్తం: (13.5 ఓవర్లలో 3 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-13; 2-16; 3-112 బౌలింగ్: షమీ 3-0-26-1; ఉనాద్కట్ 2-0-3-1; నీషమ్ 1-0-14-0; డుమిని 2-0-15-0; తాహిర్ 3.5-0-32-1; నదీమ్ 2-0-24-0. -
నేటి నుంచి హెచ్ఐఎల్
మొహాలీ: ఐపీఎల్ తరహాలో ప్రారంభమైన హాకీ ఇండియా లీగ్ (హెచ్ఐఎల్) తొలి సీజన్ విజయవంతం కావడంతో ఇప్పుడు అదే ఉత్సాహంతో రెండో సీజన్కు సిద్ధమవుతోంది. నేటి (శనివారం) నుంచి ఈ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్ విజేతకు రూ.2.5 కోట్ల భారీ ప్రైజ్మనీని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచ్లో పంజాబ్ వారియర్స్, ఢిల్లీ వేవ్రైడర్స్ తలపడనున్నాయి. రాంచీ రైనోస్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. ముంబై మెజీషియన్స్, ఉత్తరప్రదేశ్ విజార్డ్స్, కళింగ లాన్సర్ మిగతా జట్లు. -
రంజీ ఫైనల్లో కర్ణాటక
మొహాలీ: రంజీట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్కు చేరింది. పంజాబ్తో మొహాలీలో జరిగిన మ్యాచ్లో ఐదో రోజు ఆట కూడా వర్షం కారణంగా సాధ్యపడలేదు. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్లో పంజాబ్ 270 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 447 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్ణాటక ముందుకు వెళ్లింది. 29 నుంచి హైదరాబాద్లో జరిగే టైటిల్ పోరులో మహారాష్ట్రతో కర్ణాటక తలపడుతుంది. ఫైనల్కు జోల్ దూరం న్యూఢిల్లీ: మహారాష్ర్ట స్టార్ బ్యాట్స్మన్ విజయ్ జోల్ రంజీ ఫైనల్కు దూరమవుతున్నాడు. అండర్-19 ప్రపంచకప్ కోసం బెంగళూరులో నిర్వహిస్తున్న శిబిరంలో పాల్గొనాల్సిందిగా ఈ యువ క్రికెటర్ను బీసీసీఐ ఆదేశించింది. ఈ క్యాంప్ జాతీయ క్రికెట్ అకాడమీలో మంగళవారం ప్రారంభమైంది. తొలి రోజే జోల్ అక్కడ రిపోర్ట్ చేశాడు. బోర్డు నిర్ణయంపై మహారాష్ట్ర కోచ్ సురేంద్ర భావే అసంతృప్తి వ్యక్తం చేశారు. -
నేటి నుంచి రంజీ సెమీస్
మొహాలీ: రంజీ ట్రోఫీలో భాగంగా నేటి (శనివారం) నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్లు జరుగనున్నాయి. ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ జట్టు కర్ణాటకతో తలపడనుంది. గ్రూప్ దశలో కర్ణాటక చేతిలో పరాజయం పొందిన పంజాబ్ ఈసారి ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో ఉంది. కర్ణాటక జట్టు కెప్టెన్ వినయ్ కుమార్, ఓపెనర్ కౌల్, ఉతప్ప, మనీష్ పాండే, మిథున్లతో పటిష్టంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో మహారాష్ట్ర ఇండోర్: పటిష్ట బ్యాటింగ్ లైనప్తో కూడిన మహారాష్ట్ర, నాణ్యమైన బౌలర్లు కలిగిన బెంగాల్ జట్ల మధ్య నేటి నుంచే మరో సెమీస్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబైని క్వార్టర్స్లో మట్టికరిపించిన మహారాష్ట్ర ఆత్మవిశ్వాసంతో ఉంది. -
ఇషాంత్... బాధపడకు: ఫాల్క్నర్
మొహాలీ: ఒకే ఓవర్లో 30 పరుగులిచ్చి భారత పరాజయానికి కారకుడైన పేసర్ ఇషాంత్ శర్మను ఆసీస్ పేసర్ జేమ్స్ ఫాల్క్నర్ ఓదార్చాడు. ప్రతీ బౌలర్కు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యేదేనని అన్నాడు. శనివారం నాటి మూడో వన్డేలో ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ 48వ ఓవర్ను ఫాల్క్నర్ చీల్చి చెండాడిన విషయం తెలిసిందే. ‘చివర్లో బౌలింగ్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకుంది. ఆసీస్ తరఫున నేను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఒక్కోసారి ఎదుటి బ్యాట్స్మన్ మన బౌలింగ్ను ఓ ఆట ఆడుకోవడం జరుగుతుంది. చాలాసార్లు నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాబట్టి బాధపడాల్సిందేమీ లేదు. ఇవన్నీ క్రికెట్లో భాగమే’ అని ఇషాంత్నుద్దేశించి ఫాల్క్నర్ అన్నాడు. -
మిస్ యు సచిన్!
మొహాలీ: సచిన్ మ్యాచ్ ఆడినా...ఆడకున్నా మైదానంలో, అభిమానుల మనసుల్లో ఎక్కడో ఒక చోట తప్పకుండా ఉంటాడు. శనివారం మూడో వన్డే సందర్భంగా పీసీఏ స్టేడియంలోనూ అదే జరిగింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కొద్ది సేపు మైదానం పైన ఒక చిన్న సైజు విమానం చక్కర్లు కొట్టింది. దానికి ‘వి విల్ మిస్ యు టెండూల్కర్’ అని రాసిన ఒక బ్యానర్ కట్టి ఉండటం ప్రత్యేకాకర్షణగా కనిపించింది. ఒక ఆభరణాల బ్రాండ్కు చెందిన సంస్థ విమానాన్ని అద్దెకు తీసుకొని ఈ తరహాలో తమ అభిమానం చాటుకుంది. మరో వైపు చాలా కాలం విరామం తర్వాత సొంత గడ్డపై ఆడిన యువరాజ్ సింగ్ తొలి బంతికే వెనుదిరగడం అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది. -
శ్రమ వృథా
ఓ గొప్ప ఇన్నింగ్స్... బూడిదలో పోసిన పన్నీరయింది. చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్తో ధోని భారత్ చేతిలోకి తెచ్చిన విజయావకాశాన్ని... ఇషాంత్ శర్మ ఒకే ఒక్క ఓవర్తో దూరం చేశాడు. ఇక భారత్ విజయం లాంఛనమే అనుకున్న మ్యాచ్ను... ఫాల్క్నర్ మెరుపు ఇన్నింగ్స్తో లాక్కెళ్లిపోయాడు. ఐపీఎల్లో నేర్చుకున్న దూకుడును ఆసీస్ బౌలర్ ఫాల్క్నర్ భారత్ మీదే చూపించాడు. మొహాలీ: ఆస్ట్రేలియా విజయానికి చివరి 3 ఓవర్లలో 44 పరుగులు కావాలి... చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. వోజెస్ మినహా ప్రధాన బ్యాట్స్మెన్ అంతా పెవిలియన్లో ఉన్నారు. ఈ దశలో భారత్ విజయం లాంఛనం. కానీ అనిశ్చితికి మారుపేరైన క్రికెట్ లో ఫలితాన్ని మార్చడానికి ఒక్క ఓవర్ చాలు. మొహాలీ వన్డేలోనూ ఇదే జరిగింది. ఇషాంత్ శర్మ చెత్త బంతులతో ఒకే ఓవర్లో 30 పరుగులు సమర్పించడంతో... గెలవాల్సిన మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. శనివారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. కెప్టెన్ ధోని (121 బంతుల్లో 139 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్స్లు) అద్భుత సెంచరీ సాధించగా... కోహ్లి (73 బంతుల్లో 68; 9 ఫోర్లు) రాణించాడు. జాన్సన్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 6 వికెట్లకు 304 పరుగులు చేసింది. ఫాల్క్నర్ (29 బంతుల్లో 64 నాటౌట్; 2 ఫోర్లు, 6 సిక్స్లు) సూపర్ ఇన్నింగ్స్తో పాటు వోజెస్ (88 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు) రాణించడంతో మరో 3 బంతులు మిగిలి ఉండగానే విజయం ఆసీస్ సొంతమైంది. ఏడు వన్డేల సిరీస్లో ఆస్ట్రేలియా ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే బుధవారం రాంచీలో జరుగుతుంది. కోహ్లి నిలకడ గత మ్యాచ్లో అద్భుత విజయాన్ని అందించిన భారత ఓపెనింగ్ జోడి ఈ సారి త్వరగానే పెవిలియన్ ముఖం పట్టింది. మెక్కే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో 2 ఫోర్లు కొట్టి దూకుడు ప్రదర్శించిన ధావన్ (8) చివరి బంతికి అవుటయ్యాడు. కొద్ది సేపటికే రోహిత్ శర్మ (11) కూడా వెనుదిరిగాడు. మరో వైపు కోహ్లి మాత్రం ఆరంభం నుంచే జోరుగా ఆడాడు. జాన్సన్, వాట్సన్ ఓవర్లలో వరుసగా రెండేసి ఫోర్లు బాదాడు. అయితే షార్ట్ బంతులను ఎదుర్కోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డ రైనా (17) జాన్సన్ బౌలింగ్లో చివరకు అదే బంతికి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాతి బంతికే యువరాజ్ (0)ను అవుట్ చేసి జాన్సన్ మరో షాకిచ్చాడు. తొలి వన్డే తరహాలోనే దూరంగా వెళుతున్న బంతిని వేటాడి యువీ డకౌటయ్యాడు. ఆ తర్వాత కోహ్లి, కెప్టెన్ ధోని కలిసి జట్టును నిలబెట్టే ప్రయత్నం చేయగా...ఈ దశలో ఆసీస్ బౌలర్లు కూడా కట్టడి చేయడంతో మరో వైపు పరుగుల వేగం కూడా తగ్గింది. మరో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 54 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఐదో వికెట్కు 72 పరుగులు జోడించిన అనంతరం కోహ్లి అవుట్ కాగా, రవీంద్ర జడేజా (2) తన వైఫల్యాల పరంపరను కొనసాగించాడు. ఈ దశలో అశ్విన్ (35 బంతుల్లో 28; 3 ఫోర్లు) అండగా నిలవడంతో ధోని చెలరేగిపోయాడు. వీరిద్దరు ఏడో వికెట్కు 76 పరుగులు జత చేశారు. ధోని 105 పరుగులవద్ద ఉన్నప్పుడు ఇచ్చిన సునాయాస క్యాచ్ను బెయిలీ వదిలేయడంతో చివరి వరకు అజేయంగా నిలిచిన కెప్టెన్, జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. రాణించిన వోజెస్ భారత గడ్డపై గత పదేళ్లలో 250కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఒక్క సారిగా కూడా ఛేదించలేకపోయిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఫించ్ (44 బంతుల్లో 38; 6 ఫోర్లు), హ్యూస్ (22) మరోసారి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరు సమన్వయంతో ఆడుతూ చక్కటి షాట్లతో పరుగులు రాబట్టారు. తొలి వికెట్కు 68 పరుగులు జత చేసిన అనంతరం వినయ్కుమార్ భారత్కు బ్రేక్ ఇచ్చాడు. కట్ చేయబోయిన హ్యూస్, కీపర్ చేతికి చిక్కాడు. కొద్ది సేపటికే ఫించ్ను ఇషాంత్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా, మరో ఆరు పరుగులకే వాట్సన్ (11) కూడా జడేజా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ బెయిలీ (60 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్), వోజెస్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 83 పరుగులు జోడించారు. అయితే ఒకే ఓవర్లో బెయిలీ, మ్యాక్స్వెల్ (3) అవుట్ కావడం ఆసీస్ అవకాశాలను దెబ్బ తీసింది. అయితే వోజెస్ ఒక వైపు నిలకడగా ఆడగా...ఫాల్క్నర్ మెరుపు ఇన్నింగ్స్ ఆసీస్కు అనూహ్య విజయాన్ని అందించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) ఫించ్ (బి) వాట్సన్ 11; ధావన్ (సి) హాడిన్ (బి) మెక్కే 8; కోహ్లి (సి) హాడిన్ (బి) మ్యాక్స్వెల్ 68; రైనా (సి) వాట్సన్ (బి) జాన్సన్ 17; యువరాజ్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 0; ధోని (నాటౌట్) 139; జడేజా (సి) హాడిన్ (బి) జాన్సన్ 2; అశ్విన్ (సి) హాడిన్ (బి) జాన్సన్ 28; భువనేశ్వర్ (సి) బెయిలీ (బి) ఫాల్క్నర్ 10; వినయ్ కుమార్ (రనౌట్) 0; ఇషాంత్ శర్మ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు (లెగ్బై 13, వైడ్ 7) 20; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 303. వికెట్ల పతనం: 1-14; 2-37; 3-76; 4-76; 5-148; 6-154; 7-230; 8-267; 9-299. బౌలింగ్: జాన్సన్ 10-1-46-4; మెక్కే 10-0-49-1; వాట్సన్ 8-0-74-1; ఫాల్క్నర్ 10-0-65-1; డోహర్తి 10-0-45-0; వోజెస్ 1-0-3-0; మ్యాక్స్వెల్ 1-0-8-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హ్యూస్ (సి) ధోని (బి) వినయ్ 22; ఫించ్ (ఎల్బీ) (బి) ఇషాంత్ 38; వాట్సన్ (ఎల్బీ) (బి) జడేజా 11; బెయిలీ (ఎల్బీ) (బి) వినయ్ 43; వోజెస్ (నాటౌట్) 76; మ్యాక్స్వెల్ (రనౌట్) 3; హాడిన్ (సి) జడేజా (బి) భువనేశ్వర్ 24; ఫాల్క్నర్ (నాటౌట్) 64; ఎక్స్ట్రాలు (లెగ్బై 14, వైడ్ 9) 23; మొత్తం (49.3 ఓవర్లలో 6 వికెట్లకు) 304. వికెట్ల పతనం: 1-68; 2-82; 3-88; 4-171; 5-174; 6-213. బౌలింగ్: భువనేశ్వర్ 10-1-50-1; వినయ్ 8.3-0-50-2; ఇషాంత్ 8-1-63-1; జడేజా 10-0-31-1; యువరాజ్ 3-0-20-0; అశ్విన్ 9-0-58-0; కోహ్లి 1-0-18-0. కెప్టెన్ ‘క్లాసిక్’ ఒకటా...రెండా...ఎన్ని అద్భుత ఇన్నింగ్స్. వన్డేల్లో ఆరో స్థానంలోనో, ఏడో స్థానంలోనో బరిలోకి దిగడం, చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటం మహేంద్ర సింగ్ ధోనికి మంచినీళ్ల ప్రాయంగా మారిపోయింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా, వికెట్లు పడిపోయి వెంటిలేటర్ మీద ఉన్న ఇన్నింగ్స్కు ఊపిరి పోయాలన్నా అది ధోనికే సాధ్యం అన్నట్లుగా భారత వన్డే ముఖచిత్రం మారిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో మూడో వన్డేలోనూ అతను విశ్వరూపం చూపించాడు. దాదాపు పది నెలల క్రితం ధోని ఆఖరి సారిగా సెంచరీ (పాక్పై) చేశాడు. అందులో భారత జట్టు 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగి తన బ్యాట్ పదును చూపించాడు. భారత్ ఓడిపోయినా... శనివారం ఆసీస్పై అతను ఆడిన ఇన్నింగ్స్ ఒక క్లాసిక్గా చెప్పుకోవచ్చు. నొప్పిని అధిగమించి... భారత్ స్కోరు 76/4 పరుగులు ఉన్నప్పుడు కెప్టెన్ క్రీజ్లోకి వచ్చాడు. ఇంకా బంతిని ఎదుర్కోనే లేదు. కోహ్లి ఆడిన షాట్కు రెండో పరుగు తీయబోయి మడమ మడత పడటంతో నొప్పితో బాధపడి ఫిజియోను పిలవాల్సి వచ్చింది. ఈ స్థితినుంచి అతను వన్డేల్లో మరో మరపు రాని శతకాన్ని అందుకున్నాడు. సింగిల్స్ను చక్కగా అంచనా వేస్తూ, చెత్త బంతులను బౌండరీకి తరలించిన కెప్టెన్, చివర్లో సిక్సర్లతో హోరెత్తించాడు. సింగిల్స్ను కాదని, మరో ఎండ్లో బ్యాట్స్మన్ను కాపాడుకుంటూ స్ట్రైకింగ్ నిలుపుకున్న అతని చాతుర్యం చివర్లో బాగా పని చేసింది. ఇన్నింగ్స్ను నెమ్మదిగా ఆరంభించిన అతను తొలి 67 బంతుల్లో ఒకటే ఫోర్ కొట్టాడు. 77 బంతులకు గానీ అతని అర్ధసెంచరీ పూర్తి కాలేదు. అయితే తర్వాత 50 పరుగులు చేయడానికి ధోనికి 30 బంతులే సరిపోయాయి. చక్కటి పుల్ షాట్లతో పాటు ట్రేడ్ మార్క్ హెలికాప్టర్ షాట్లతో ధోని అలరించాడు. చివర్లో చెలరేగిపోయే తన శైలిని ఈ మ్యాచ్లోనూ ధోని రుచి చూపించాడు. ఫాల్క్నర్ వేసిన 48వ ఓవర్ రెండో బంతిని థర్డ్మ్యాన్ దిశగా తరలించి 107 బంతుల్లో కెరీర్లో 9వ సెంచరీ నమోదు చేసిన ధోని, మొహాలీ మైదానంలో శతకం సాధించిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆఖరి మూడు ఓవర్లలో 47 పరుగులు (11, 15, 21) రాగా, రెండు వైడ్లు మినహా, అతనొక్కడే 5 ఫోర్లు, 3 సిక్స్లు సహా 45 పరుగులు చేయడం విశేషం. ధోని జోరును ప్రేక్షకుల మాదిరిగా ఆస్వాదించడం మినహా ఆసీస్ బౌలర్లు ఏమీ చేయలేక చేతులెత్తేశారు. 4,6,6,2,6,6 47 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 260/6. విజయానికి ఆ జట్టు మరో 18 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది. జేమ్స్ ఫాల్క్నర్ క్రీజ్లో ఉండగా ఇషాంత్ శర్మ బౌలింగ్కు దిగాడు. అయితే ఈ ఒక్క ఓవర్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. తన చెత్త ప్రదర్శనను శిఖరానికి తీసుకెళుతూ ఇషాంత్ విసిరిన షార్ట్ బంతులపై ఫాల్క్నర్ విరుచుకు పడ్డాడు. ఇన్నింగ్స్ 48వ ఓవర్లో 4 సిక్స్లు, ఫోరు సహా ఫాల్క్నర్ 30 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో వరుసగా 4,6,6,2,6,6 పరుగులు చేసిన ఈ ఆసీస్ బ్యాట్స్మన్ జట్టును విజయానికి చేరువగా తెచ్చాడు. తర్వాతి ఓవర్లో కాస్త నెమ్మదించినా...వినయ్ వేసిన 50వ ఓవర్ మూడో బంతికి మరో సిక్స్ కొట్టి ఫాల్క్నర్ గెలుపు పూర్తి చేశాడు. భారత్ తరఫున ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (30) ఇచ్చిన బౌలర్గా ఇషాంత్. గతంలో యువరాజ్ కూడా ఒకే ఓవర్లో 30 ఇచ్పాడు. 3 కెప్టెన్గా ధోని వన్డేల్లో 5 వేలు పరుగులు పూర్తి చేసుకున్నాడు. అజహర్, గంగూలీ తర్వాత ఈ ఘనత సాధించిన సారథి ధోని . బౌలర్లకు ధోని చురక సాధారణంగా ఓడిపోయినా మామూలుగా ఉండే కెప్టెన్ కూల్ ధోని... ఈసారి మాత్రం కాస్త ఫీలయ్యాడు. గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం, ప్రతి మ్యాచ్లోనూ బౌలర్లు అదే తప్పులు చేస్తుండటం ధోనికి విసుగు తెప్పించినట్లున్నాయి. ‘అంతర్జాతీయ స్థాయిలో స్పూన్ఫీడ్ చేయాలంటే కుదరదు. ప్రతి ఒక్కరూ తమ బలం గుర్తించి, వ్యూహాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయాలి. ప్రతిసారీ అదే తరహాలో విఫలమయితే ఏం చేస్తాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. మంచు ప్రభావం కాస్త ఉన్నా... పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉందని చెప్పాడు. -
మొహాలీలోనూ మెరిసేనా!
మధ్యాహ్నం 1.30 గంటల నుంచి స్టార్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం మొహాలీ: రెండో వన్డేలో దుస్సాధ్యమైన లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన భారత జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో మరో మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్లో భాగంగా నేడు (శనివారం) పంజాబ్ క్రికెట్ స్టేడియం (పీసీఏ)లో ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరుగుతుంది. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే రెండో అత్యుత్తమ ఛేజింగ్తో రికార్డుకెక్కిన భారత ఆటగాళ్ల నుంచి నేటి వన్డేలోనూ అలాంటి ప్రదర్శనే కనబరచాలని అభిమానులు ఆశిస్తున్నారు. జైపూర్ వన్డేలో 360 పరుగులను శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసి కేవలం 44 ఓవర్లలోనే ఛేదించడంతో ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మ తిరిగింది. ఓ రకంగా తమ ముందు ఎంత లక్ష్యముంచినా ప్రత్యర్థి ప్రశాంతంగా ఉండలేడని ఈ త్రయం నిరూపించింది. తొలి మ్యాచ్లో 300కు పైగా టార్గెట్ను అందుకోలేకపోయిన భారత జట్టు రెండో వన్డేలో మాత్రం తమ చాంపియన్ ఆటతీరును ప్రదర్శించింది. కేవలం ఒక్క వికెట్ను మాత్రమే కోల్పోయి అతి భారీ స్కోరును అందుకున్న తీరు అమోఘం. అటు ఆసీస్ పటిష్ట భారత్ను ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికలు రచిస్తోంది. కచ్చితంగా ఈ వన్డేలో నెగ్గి ఆధిపత్యం సాధించాలని చూస్తోంది. మరోవైపు పీసీఏ పిచ్ కూడా బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉండడంతో మరోసారి అభిమానులకు పరుగుల విందు ఖాయం కానుంది. బ్యాటింగే బలం దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్ భారత జట్టుకు పెట్టని కోటలా ఉంది. ఓపెనర్లు ధావన్, రోహిత్ చెలరేగి శుభారంభాన్ని అందిస్తుండగా వన్డౌన్లో కోహ్లి సంచలన ఆటతీరుతో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆ తర్వాత రైనా, ఫామ్లో ఉన్న యువరాజ్, కెప్టెన్ ధోని, జడేజా తమ బ్యాట్లకు పని చెబితే ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగి పోవాల్సిందే. ఈ విషయం ఆసీస్ కెప్టెన్ బెయిలీకి కూడా బాగానే తెలుసు. అందుకే వన్డే ఫార్మాట్లో భారత్ టాప్-7 ఆటగాళ్లు అత్యద్భుతమని కితాబిచ్చాడు. ధావన్ తన తొలి టెస్టులోనే సెంచరీతో అదరగొట్టింది ఈ స్టేడియంలోనే కావడం అతడికి కలిసొచ్చే అంశం. యువరాజ్కు ఓరకంగా ఇది సొంత మైదానమే. రైనా, జడేజాలకు రెండో వన్డేలో అవకాశం రాకపోయినప్పటికీ భారీ స్కోర్లు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం జట్టును ఆందోళన పరిచే విషయం ఒక్క బౌలింగ్ విభాగంలోనే. ఇప్పటిదాకా జరిగిన రెండు వన్డేలు, ఓ టి20 కలుపుకుంటే మొత్తం 864 పరుగులను సమర్పించుకున్నారు. ఓవర్కు 7.20 చొప్పున పరుగులు ఇవ్వడం ఆందోళనపరిచే అంశం. ఒక్క భువనేశ్వర్ మినహా ఒక్కరు కూడా ఆసీస్ను ఇబ్బంది పెట్టడం లేదు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ రెండు వన్డేల్లో ఓవర్కు ఎనిమిది పరుగుల దాకా ఇచ్చాడు. స్పిన్నర్ అశ్విన్ పూర్తిగా విఫలమవుతున్నాడు. దీంతో వినయ్, ఇషాంత్లలో ఒకరికి ఉద్వాసన తప్పకపోవచ్చు. ఒత్తిడిలో ఆసీస్ తొలి మ్యాచ్లో విజయం సాధించిన ఊపులో రెండో వన్డే ఆడిన ఆసీస్కు భారత జట్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దీంతో ఆతిథ్య జట్టును ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని పరిస్థితిలో పడింది. అయితే వీరి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మంచి ఫామ్లో ఉండడం అనుకూలాంశం. ఓపెనర్లు ఫించ్, హ్యూస్ జట్టుకు శుభారంభాన్నిస్తున్నారు. బెయిలీ ఈ సిరీస్లో బాగా ఆడుతున్నాడు. అటు వాట్సన్ కూడా ఫామ్లోకొచ్చాడు. ఇక చివర్లో మ్యాక్స్వెల్ రెచ్చిపోతున్నాడు. అటు బౌలింగ్ పరంగానూ భారత్తో పోలిస్తే మెరుగనే చెప్పుకోవచ్చు. జాన్సన్, ఫాల్క్నర్, మెక్కే రూపంలో మంచి పేసర్లున్నారు. సమష్టిగా రాణించి ఈ వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని ఆసీస్ భావిస్తోంది. జట్లు: (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రోహిత్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, వినయ్, ఇషాంత్/ఉనాద్కట్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్వెల్, హాడిన్, జాన్సన్, మెక్కే, వోజెస్, డోహర్తి, ఫాల్క్నర్. వాతావరణం మ్యాచ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం లేదు. పూర్తిగా ఎండ కాయనుంది. పిచ్ జైపూర్ పిచ్ తరహాలోనే ఇక్కడ కూడా బ్యాటింగ్కు అనుకూలించనుంది. మంచు కీలకం... ‘మొహాలీతో నాకు గొప్ప అనుబంధం ఉంది. ఇక్కడే తొలి టెస్టు సెంచరీ సాధించాను. ఇక్కడ పేసర్లకు, బ్యాట్స్మెన్కు అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచు కూడా కీలకం కానుంది’ - శిఖర్ ధావన్ (భారత్ ఓపెనర్) ‘మా బౌలర్లపై నమ్మకముంది’ ‘రెండో వన్డేలో 360 పరుగుల లక్ష్యాన్ని భారత్ సులువుగా ఛేదించడం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అయితే మా బౌలర్లను తప్పుపట్టాల్సిన పనిలేదు. వారిపై నాకు నమ్మకం ఉంది. మూడో వన్డేలోనూ షేన్ వాట్సన్ను వన్డౌన్లోనే బరిలోకి దించుతాం.’ - జార్జి బెయిలీ (ఆసీస్ కెప్టెన్) 0 మొహాలీలో ఇప్పటిదాకా ఒక్క భారత బ్యాట్స్మన్ కూడా సెంచరీ చేయలేదు 99 ఈ వేదికపై 2007లో సచిన్ చేసిన 99 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు 2 భారత్తో ఇక్కడ ఆడిన మూడు వన్డేల్లో ఆసీస్ రెండు నెగ్గింది 5 ఈ మైదానంలో ఐదు సార్లు 300కు పైగా పరుగులు వచ్చాయి -
టైటాన్స్ గెలుపు
మొహాలీ: బ్రిస్బేన్ హీట్స్కు మరో పరాభవం...తక్కువ పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఈ ఆస్ట్రేలియా జట్టు మళ్లీ చతికిల పడింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 4 పరుగుల తేడాతో బ్రిస్బేన్ను ఓడించి సీఎల్టి20లో తొలి విజయాన్ని నమోదు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 18.5 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా...హీట్స్ 20 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలింది. చెలరేగిన గాలే ఓపెనర్ రుడాల్ఫ్ (1) తొందరగానే అవుటైనా, డేవిడ్స్ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), కున్ (27 బంతుల్లో 31; 6 ఫోర్లు) కలిసి టైటాన్స్ను నిలబెట్టారు. ఆ తర్వాత డివిలియర్స్ (19 బంతుల్లో 28; 4 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. అయితే డివిలియర్స్ అనూహ్యంగా రనౌట్ కావడంతో జట్టు ఇన్నింగ్స్ మలుపు తిరిగింది. 16 పరుగుల తేడాతో టైటాన్స్ చివరి 6 వికెట్లు కోల్పోయింది. మ్యాథ్యూ గాలే (4/10) చెలరేగి టైటాన్స్ను దెబ్బ తీశాడు. రాణించిన లాంజ్ స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా బ్రిస్బేన్ హీట్స్ ఛేదించలేకపోయింది. కెప్టెన్ జేమ్స్ హోప్స్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. క్రిస్టియాన్ (24 బంతుల్లో 21; 1 సిక్స్), సబర్గ్ (7 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మర్చంట్ డి లాంజ్ (3/13), రిచర్డ్స్ (2/20) చక్కటి బౌలింగ్తో బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంతో హీట్స్ తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. విజయం కోసం చివరి బంతికి 5 పరుగులు చేయాల్సి ఉండగా మెక్డెర్మట్ క్లీన్ బౌల్డ్ కావడంతో హీట్స్ ఓటమిపాలైంది. -
పెరీరా మెరుపులు
క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రధాన మ్యాచ్లకు అర్హత సాధించిన సన్రైజర్స్.... చాంపియన్స్ లీగ్ను ఘనంగా ప్రారంభించింది. ట్రినిడాడ్తో జరిగిన మ్యాచ్లో పెరీరా సంచలన బ్యాటింగ్తో ఒంటిచేత్తో హైదరాబాద్కు విజయాన్ని అందించాడు. మొహాలీ: ప్రధాన మ్యాచ్లకు ఒక్క రోజు ముందు సన్రైజర్స్ ఆటగాళ్లపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల స్థైర్యం కాస్తో కూస్తో దెబ్బతింటుంది. కానీ ఆ ప్రభావం తమపై ఏమాత్రం పడలేదని తమ ఆటతీరుతోనే నిరూపించారు సన్రైజర్స్ స్టార్స్. తిసార పెరీరా (32 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో హైదరాబాద్ జట్టు లీగ్లో పాయింట్ల బోణీ చేసింది. పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై సన్రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్... 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పార్థీవ్ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ధావన్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలి నాలుగు ఓవర్లలో 35 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు పది పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేశారు. డుమిని (16 బంతుల్లో 17; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న దశలో రనౌట్ అయ్యాడు. విహారి (13) కూడా నిరాశపరిచాడు. దీంతో సన్రైజర్స్ 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తిసార పెరీరా అద్భుతమైన హిట్టింగ్తో ట్రినిడాడ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రెండో ఎండ్లో డారెన్ స్యామీ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్కు కేవలం 4.4 ఓవర్లలోనే 47 పరుగులు జోడించి మ్యాచ్ను మలుపు తిప్పారు. అయితే నరైన్ వరుస బంతుల్లో స్యామీ, ఆశిష్లను అవుట్ చేసి ట్రినిడాడ్ ఆశలను సజీవంగా నిలిపాడు. అయితే పెరీరా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా కరణ్ శర్మ (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో నరైన్ (4/9) అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సిమ్మన్స్ (0) స్టెయిన్ బౌలింగ్లో తొలి బంతికే అవుటయ్యాడు. కానీ డారెన్ బ్రేవో (44 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్తో అర్ధసెంచరీ చేసి ట్రినిడాడ్ ఇన్నింగ్స్కు మూలస్తంభంలా నిలిచాడు. లూయిస్ (14 బంతుల్లో 22; 4 ఫోర్లు), కెప్టెన్ రామ్దిన్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. సన్రైజర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, పెరీరా, స్యామీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లెగ్స్పిన్నర్ కరణ్శర్మ తుది జట్టులో ఉన్నా... అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్థీవ్ (బి) స్టెయిన్ 0; లూయిస్ (సి) పార్థీవ్ (బి) ఇషాంత్ 22; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) ఇషాంత్ 66; జాసన్ మహమ్మద్ (బి) స్యామీ 19; రామ్దిన్ (సి) స్టెయిన్ (బి) పెరీరా 21; పూరన్ (సి) పార్థీవ్ (బి) స్యామీ 6; స్టీవార్ట్ (బి) పెరీరా 17; నరైన్ రనౌట్ 0; ఎమ్రిట్ నాటౌట్ 3; బద్రీ నాటౌట్ 1; ఎక్స్ట్రాలు (లెగ్బై 1, వైడ్లు 3, నోబాల్ 1) 5; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-0; 2-49; 3-110; 4-110; 5-124; 6-153; 7-154; 8-156. బౌలింగ్: స్టెయిన్ 4-0-41-1; ఇషాంత్ 4-0-36-2; విహారి 1-0-8-0; పెరీరా 4-0-26-2; మిశ్రా 3-0-27-0; స్యామీ 4-0-21-2. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) స్టీవార్ట్ (బి) నరైన్ 17; శిఖర్ ధావన్ (సి) అండ్ (బి) స్టీవార్ట్ 23; డుమిని రనౌట్ 17; విహారి (స్టం) రామ్దిన్ (బి) నరైన్ 13; పెరీరా నాటౌట్ 57; స్యామీ (సి) బద్రీ (బి) నరైన్ 15; ఆశిష్ రెడ్డి (సి) అండ్ (బి) నరైన్ 0; కరణ్ శర్మ నాటౌట్ 13; ఎక్స్ట్రాలు (లెగ్బైస్ 2, వైడ్లు 4, నోబాల్స్ 3) 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 164. వికెట్ల పతనం: 1-35; 2-45; 3-70; 4-95; 5-142; 6-142. బౌలింగ్: రామ్పాల్ 4-0-39-0; బద్రీ 4-0-25-0; ఎమ్రిట్ 4-0-57-0; నరైన్ 4-1-9-4; స్టీవార్ట్ 3.3-0-32-1. చాంపియన్స్ లీగ్లో నేడు ఒటాగో x పెర్త్ సా. గం. 4.00 నుంచి రాజస్థాన్ x లయన్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: జైపూర్ స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం -
వోల్వ్స్కు ఊరట
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టుకు ఊరటనిచ్చే విజయం దక్కింది. కందురతా మారూన్స్తో శుక్రవారం జరిగిన చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్లో వోల్వ్స్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ (60 బంతుల్లో 93 నాటౌట్; 6 ఫోర్లు; 5 సిక్స్లు) మరోసారి తన సూపర్ ఫామ్ చాటుకున్నాడు. కందురతాపై 10 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. ముందుగా మిస్బా సేన 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. సల్మాన్ (21 బంతుల్లో 21; 1 ఫోర్) మినహా ఎవరూ పది పరుగులు దాటలేదు. దిల్హారాకు మూడు, కులశేఖరకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కందురతా 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 136 పరుగులు చేసింది. సంగక్కర (36 బంతుల్లో 44; 4 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలిచాడు. తరంగ (27 బంతుల్లో 25; 4 ఫోర్లు), సిల్వ (24 బంతుల్లో 25; 1 ఫోర్; 1 సిక్స్) రాణించారు. ఆదిల్కు మూడు, ఇమ్రాన్కు రెండు వికెట్లు దక్కాయి. ఆదిలో తడబడినా.. ప్రారంభంలో కందురతా బౌలర్లు వోల్వ్స్ ఆటగాళ్లను ఇబ్బంది పెట్టారు. దీంతో తొలి ఐదు ఓవర్లలో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే మిస్బా జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఐదో వికెట్కు సల్మాన్తో కలిసి 74 పరుగులు జత చేశాడు. 16వ ఓవర్లో వరుసగా ఓ సిక్స్, రెండు బౌండరీలు బాది స్కోరును పరిగెత్తించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి ఒంటి చేత్తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కందురతా జట్టు ఆటగాళ్లను వోల్వ్స్ బౌలర్లు ఆటాడుకున్నారు. రెండో ఓవర్లో తరంగ వరుసగా మూడు ఫోర్లతో రెచ్చిపోయినా త్వరగానే అవుటయ్యాడు. ఉన్నంతలో సంగక్కర సమర్థవంతంగానే ఆడినా అటు వైపు నుంచి సహకారం కరువైంది. దీంతోపాటు వరుస విరామాల్లో వికెట్లు నేలకూలడంతో పరాజయం ఖాయమైంది. -
టాప్’ కోసం బరిలోకి
చాంపియన్స్ లీగ్లో నేడు కందురతా మారూన్స్ x OòœçÜ-Ìê-»ê§Šl ÐøÌŒæ-ÓSÞ సాయంత్రం 4 గంటల నుంచి సన్రైజర్స్ x JsêVø ÐøÌŒætÞ రాత్రి 8 గంటల నుంచి స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20లో ప్రధాన గ్రూప్లో చోటు కోసం జరుగుతున్న క్వాలిఫయింగ్ పోరులో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. సన్రైజర్స్ హైదరాబాద్, ఒటాగో వోల్ట్స్ (కివీస్) జట్లు తమ ప్రత్యర్థులపై వరుసగా రెండు విజయాలు సాధించి అర్హత సాధించాయి. ఈ నేపథ్యంలో స్థానిక పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో శనివారం కందురతా మారూన్స్, ఫైసలాబాద్ వోల్వ్స్ ... సన్రైజర్స్, వోల్ట్స్ మధ్య జరిగే మ్యాచ్ లు నామమాత్రంగా మారాయి. కానీ సన్రైజర్స్, వోల్ట్స్ మాత్రం ఎలాంటి అలక్ష్యం చూపకుండా తమ దూకుడును కొనసాగించి పట్టికలో అగ్రస్థానం దక్కించుకోవాలని చూస్తున్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే రెండు జట్లు ఏ గ్రూప్లో ఆడేది నిర్ణయించారు. సన్రైజర్స్ జట్టు గ్రూప్ ‘బి’లో చెన్నై, ట్రినిడాడ్, బ్రిస్బేన్, టైటాన్లతో తలపడుతుంది. వోల్ట్స్ జట్టు గ్రూప్ ‘ఎ’లో రాజస్థాన్, ముంబై, లయన్స్, పెర్త్లతో అమీతుమీ తేల్చుకుంటుంది. మరోవైపు కందురతా, ఫైసలాబాద్ వోల్స్వ్ జట్లు తమ చివరి మ్యాచ్లోనైనా నెగ్గి పట్టికలో చివరి స్థానంలో నిలవకుండా చూడాలని అనుకుంటున్నాయి. -
ఒటాగో, సన్రైజర్స్ ‘పాస్’
చాంపియన్స్ లీగ్లో హైదరాబాద్ సన్రైజర్స్, ఒటాగో వోల్ట్స్ జట్లు ప్రధాన పోటీలకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్లూ వరుసగా రెండు రోజుల పాటు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచి.... మూడో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండానే క్వాలిఫయింగ్లో ‘పాస్’ అయ్యాయి. పాకిస్థాన్కు చెందిన ఫైసలాబాద్ వోల్వ్స్, శ్రీలంకకు చెందిన కందురతా మారూన్స్కు నిరాశే మిగిలింది. శుక్రవారం జరిగే క్వాలిఫయింగ్ చివరి మ్యాచ్ల ద్వారా ఎవరు ‘టాప్’ అనేది తేలుతుంది. ఒటాగో, సన్రైజర్స్ల మ్యాచ్ విజేత క్వాలిఫయర్-1గా ప్రధాన పోటీల బరిలోకి దిగుతుంది. ఫైసలాబాద్, కందురతాల మధ్య జరిగే పోరు నామమాత్రం. ఒంటిచేత్తో.... మొహాలీ: ఇంగ్లండ్ నుంచి బుధవారం ఉదయం మొహాలీ వచ్చిన టెన్ డష్కటె... కేవలం ఆరు గంటల విశ్రాంతి తర్వాత నేరుగా మైదానంలోకి దిగాడు. సుదీర్ఘ ప్రయాణం చేసిన అలసటను అధిగమించి ఒంటిచేత్తో ఒటాగో వోల్ట్స్ను గెలిపించాడు. డష్కటె (2/9, 32 బంతుల్లో 64; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆల్రౌండ్ షో తో... పీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో ఒటాగో వోల్ట్స్ జట్టు కందురతా మారూన్స్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన ఒటాగో ఫీల్డింగ్ ఎంచుకోగా... కందురతా మారూన్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్ తరంగ (56 బంతుల్లో 76; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) నిలకడగా ఆడినా... సంగక్కర సహా మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడటం, చివర్లో ఒటాగో బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో కందురతా ఓ మాదిరి స్కోరు సాధించింది. ఒటాగో బౌలర్ బట్లర్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బ తీశాడు. టెన్ డష్కటె రెండు వికెట్లు తీసుకున్నాడు. ఒటాగో జట్టు 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి అలవోకగా గెలిచింది. డష్కటెతో పాటు నీషమ్ (19 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు కేవలం 30 బంతుల్లో 57 పరుగులు జోడించడం విశేషం. ఓపెనర్లు బ్రూమ్ (25), రూథర్ఫోర్డ్ (20) కూడా రాణించారు. కందరుతా బౌలర్ దిల్హారా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆల్రౌండ్ షో కనబరచిన టెన్ డష్కటెకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు కందురతా మారూన్స్ ఇన్నింగ్స్: తరంగ (సి) బి.మెకల్లమ్ (బి) బట్లర్ 76; షెహాన్ జయసూర్య (బి) మెక్మిలన్ 13; సంగక్కర (సి) టెన్ డష్కటె (బి) నీషమ్ 13; దిల్హారా (సి) రూథర్ఫోర్డ్ (బి) టెన్ డష్కటె 15; తిరిమన్నె (సి) బి.మెకల్లమ్ (బి) టెన్ డష్కటె 6; చమరసిల్వ ఎల్బీడబ్ల్యు (బి) బట్లర్ 6; లోకురాచి (బి) బట్లర్ 0; కులశేఖర (బి) వాగ్నర్ 14; కాందంబి రనౌట్ 5; రణ్దివ్ నాటౌట్ 1; మెండిస్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు (బై 1, లెగ్బైస్ 2, వైడ్లు 2) 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1-25; 2-52; 3-99; 4-112; 5-134; 6-134; 7-135; 8-146; 9-154. బౌలింగ్: బట్లర్ 4-0-21-3; మెక్మిలన్ 3-0-17-1; వాగ్నర్ 4-0-28-1; ఎన్.మెకల్లమ్ 2-0-30-0; నీషమ్ 4-0-39-1; టెన్ డష్కటె 2-0-9-2; బెర్డ్ 1-0-7-0. ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) కాందంబి (బి) దిల్హారా 25; రూథర్ఫోర్డ్ (సి) దిల్హారా (బి) రణ్దివ్ 20; బి. మెకల్లమ్ (స్టం) సంగక్కర (బి) దిల్హారా 8; టెన్ డష్కటె (సి) కులశేఖర (బి) దిల్హారా 64; నీషమ్ నాటౌట్ 32; ఎన్.మెకల్లమ్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు (బైస్ 3, లెగ్బైస్ 2, వైడ్లు 2, నోబాల్ 1) 8; మొత్తం (18 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-31; 2-45; 3-89; 4-146. బౌలింగ్: కులశేఖర 3-0-31-0; రణ్దివ్ 4-0-36-1; మెండిస్ 4-0-26-0; దిల్హారా 4-0-20-3; లోకురాచి 2-0-24-0; జయసూర్య 1-0-15-0. అలవోకగా... మొహాలీ: చాంపియన్స్లీగ్లో హైదరాబాద్తో ఆడాల్సిన జట్లన్నింటికీ హై అలెర్ట్. శిఖర్ ధావన్ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్ ధావన్ (50 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో అర్ధసెంచరీ సాధించడంతో... సన్రైజర్స్ అలవోకగా ఫైసలాబాద్పై నెగ్గి లీగ్ ప్రధాన పోటీలకు అర్హత సాధించింది. పీసీఏ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 7 వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్పై నెగ్గింది. టాస్ గెలిచిన సన్రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఫైసలాబాద్ వోల్వ్స్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు అమ్మర్ (31), అలీ (16) 48 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చినా... మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. కెప్టెన్ మిస్బావుల్ హక్ (40 బంతుల్లో 56 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో కనీసం ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. సన్రైజర్స్ బౌలర్లంతా సమష్టిగా రాణించారు. ఇషాంత్, మిశ్రా, కరణ్, పెరీరా, స్యామీ ఒక్కో వికెట్ తీసుకున్నారు. సన్రైజర్స్ 17.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ పార్థీవ్ పటేల్ (21 బంతుల్లో 23; 3 ఫోర్లు), ధావన్ కలిసి తొలి వికెట్కు 68 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... డుమిని (27 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్) నిలకడగా ఆడాడు. చివర్లో స్యామీ (6 బంతుల్లో 14 నాటౌట్; 3 ఫోర్లు) చకచకా పరుగులు చేసి మ్యాచ్ను త్వరగా ముగించాడు. సన్రైజర్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా (1/13)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఫైసలాబాద్ వోల్వ్స్ ఇన్నింగ్స్: అమ్మర్ మొహమ్మద్ (సి) మిశ్రా (బి) స్యామీ 31; అలీ వకాస్ (సి) ఆశిష్ (బి) మిశ్రా 16; ఆసిఫ్ అలీ ఎల్బీడబ్ల్యు (బి) కరణ్ 0; మిస్బావుల్ హక్ నాటౌట్ 56; ఇమ్రాన్ ఖాలిద్ (సి) పెరీరా (బి) ఇషాంత్ 2; ఖుర్రమ్ షెహ్జాద్ (బి) పెరీరా 4; సల్మాన్ నాటౌట్ 3; ఎక్స్ట్రాలు (బైస్ 4, లెగ్బైస్ 6, వైడ్లు 4, నోబాల్ 1) 15; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-48; 2-50; 3-69; 4-92; 5-101. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-0; ఇషాంత్ 4-0-26-1; పెరీరా 4-0-33-1; అమిత్ మిశ్రా 4-1-13-1; కరణ్ శర్మ 2-0-11-1; స్యామీ 2-0-14-1. సన్రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) ఖుర్రమ్ (బి) అదిల్ 23; శిఖర్ ధావన్ (బి) ఖాలిద్ 59; డుమిని నాటౌట్ 20; సామంత్రె ఎల్బీడబ్ల్యు (బి) ఖాలిద్ 0; స్యామీ నాటౌట్ 14; ఎక్స్ట్రాలు (లెగ్బైస్ 6, వైడ్లు 8, నోబాల్ 1) 15; మొత్తం (17.3 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి) 131. వికెట్ల పతనం: 1-68; 2-112; 3-112. బౌలింగ్: సమియుల్లా 4-0-36-0; అసద్ అలీ 3.3-0-27-0; అజ్మల్ 4-0-25-0; అదిల్ 3-0-14-1; ఖుర్రమ్ 1-0-9-0; ఖాలిద్ 2-0-14-2. -
మెకల్లమ్ మెరుపులు
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ దేశవాళీ జట్టు ఒటాగో వోల్ట్స్ శుభారంభం చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (65 బంతుల్లో 83 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్కు తోడు డి బూర్డర్ (28 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా రాణించడంతో తొలి మ్యాచ్లో ఒటాగో వోల్ట్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్ (పాకిస్థాన్)పై విజయం సాధించింది. పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో... టాస్ గెలిచిన ఫైసలాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. మిస్బా (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కుర్రమ్ షెహజాద్ (36 బంతుల్లో 27; 3 ఫోర్లు) రాణించారు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును ఈ ఇద్దరు నాలుగో వికెట్కు 61 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వోల్ట్స్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మిస్బా సేన కోలుకోలేకపోయింది. ఆసిఫ్ అలీ (14) కాసేపు పోరాడాడు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఒటాగో వోల్ట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ బ్రూమ్ (0) నిరాశపర్చినా... రూథర్ఫోర్డ్ (12 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగాడు. అయితే అంతవరకు నిలకడకు ప్రాధాన్యమిచ్చిన మెకల్లమ్ ఆ తర్వాత ఫైసలాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండో వికెట్కు రూథర్ఫోర్డ్తో కలిసి 41 పరుగులు జోడించాడు. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మెకల్లమ్ తర్వాత కూడా అదే జోరును కనబర్చాడు. స్కోరు వివరాలు ఫైసలాబాద్ వోల్వ్స్ ఇన్నింగ్స్: అమర్ మహమూద్ (సి) బ్రూమ్ (బి) మెక్మిలన్ 5; అలీ వకాస్ (సి) రూథర్ ఫోర్డ్ (బి) మెక్మిలన్ 4; కుర్రమ్ షెహజాద్ (సి) వాంగర్ (బి) బట్లర్ 27; ఆసిఫ్ అలీ (సి) బియర్డ్ (బి) నీషమ్ 14; మిస్బా (బి) బట్లర్ 46; ఇమ్రాన్ ఖాలిద్ (సి) వాంగర్ (బి) నీషమ్ 12; సల్మాన్ (సి) డి బూర్డర్ (బి) వాంగర్ 10; అజ్మల్ నాటౌట్ 9; ఎహ్సాన్ ఆదిల్ రనౌట్ 4; అసద్ అలీ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139 వికెట్లపతనం: 1-5, 2-12, 3-34, 4-95, 5-108, 6-117, 7-127, 8-136 బౌలింగ్: బట్లర్ 4-0-23-2; మెక్మిలన్ 4-0-24-2; వాంగర్ 4-0-25-1; నీషమ్ 4-0-26-2; బియార్డ్ 2-0-12-0; నాథన్ మెకల్లమ్ 2-0-26-0 ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) షెహజాద్ (బి) సయీముల్లా 0; రూథర్ఫోర్డ్ (సి) ఆసిఫ్ అలీ (బి) అజ్మల్ 25; మెకల్లమ్ నాటౌట్ 83; బూర్డర్ నాటౌట్ 30; ఎక్స్ట్రాలు 4; మొత్తం: (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 142 వికెట్లపతనం: 1-0, 2-41 బౌలింగ్: సయీముల్లా 3-0-18-1; అసద్ 2.5-0-29-0; షెహజాద్ 2-0-19-0; అజ్మల్ 4-0-23-1; ఖాలిద్ 4-0-32-0; ఆదిల్ 2-0-19-0. చాంపియన్స్ లీగ్లో నేడు క్వాలిఫయింగ్ మ్యాచ్లు కందురతా మారూన్స్ x ఫైసలాబాద్ వోల్వ్స్ సాయంత్రం గం. 4.00 నుంచి హైదరాబాద్ సన్రైజర్స్ x ఒటాగో వోల్ట్స్ రాత్రి గం. 8.00 నుంచి స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం