scientist
-
సునీతా విలియమ్స్ మీద సింపతీలేదు : యూఎస్ ఖగోళ శాస్త్రవేత్త
భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ తరువాత వీరు భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్మీద వెళ్లి తొమ్మినెలలపాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్ వ్యాఖ్యానించారు. అయితే వారిని భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇపుడు వాళ్లకి గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని సూచించారు.అయితే వారి భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వ్యాయామానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి వారి కండరాలు, చలనంపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్. చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్. అంతేకాదు సునీత, విల్మోర్ మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.చదవండి: ఒక్క ఐడియా రూ. 8 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది! -
ఆ గుహ సమీపానికి వచ్చారో అంతే..!
గోపాలుడి నగరం ద్వారక సముద్రగర్భంలో ఉన్నట్లే, నరకానికి ప్రవేశమార్గం భూమి మీదనే ఉన్నట్లు పురాతత్త్వ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. టర్కీలోని హిరాపోలిస్ నగరంలో ఈ మధ్యనే ‘గేట్ టు హెల్’ అనే నిర్మాణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు రెండువేల సంవత్సరాల క్రితం, గ్రీకు మరణ దేవుడు ‘ఫ్లూటో’కు ఈ ప్రదేశంలోనే జంతుబలులు సమర్పించేవారని ఇక్కడ దొరికిన ఆధారాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చారు. క్షుద్ర పూజలకు, ఇతర భయానక క్రతువులకు కూడా ఈ ప్రదేశాన్నే ఉపయోగించేవారని వారు చెప్పారు. పైగా, ఈ ప్రాంత ముఖద్వారం సమీపానికి జంతువులు, పక్షులు వెళ్లినట్లయితే, అవి వెంటనే ప్రాణాలు కోల్పోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆ ప్రదేశాన్ని స్థానికులు అందరూ నిజమైన నరకద్వారంగా నమ్ముతున్నారు. మరికొందరు పరిశోధకులు మాత్రం, ఒకప్పటి అగ్నిపర్వతానికి చెందిన ప్రాణాంతక వాయువులు గుహ లోపల నిండి ఉన్నాయని, ఈ వాయువుల కారణంగానే మూగజీవులన్నీ దీని సమీపానికి రాగానే మరణిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజం ఇంకా తేలాల్సింది ఉంది. (చదవండి: ∙ -
పార్కింగ్ వివాదం.. సైంటిస్టు దారుణ హత్య
మొహాలీ: పంజాబ్లోని మొహాలీ(Mohali)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నపాటి వివాదం హత్యకు దారితీసింది. మొహాలీ లోని సెక్టార్-66లో బైక్ పార్కింగ్ విషయమై జరిగిన వివాదంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐసర్)కు చెందిన సైంటిస్టు హత్యకు గురయ్యారు.ఈ ఘటనా క్రమమంతా అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యింది. మృతుడిని సైంటిస్టు(Scientist) అభిషేక్ స్వర్ణకార్(30)గా గుర్తించారు. ఇతని స్వస్థలం జార్ఖండ్. పొరుగింట్లో ఉంటున్న మోంటీ అనే వ్యక్తి అభిషేక్పై దాడి చేశాడని, ఈ నేపద్యంలో అభిషేక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అభిషేక్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారునికి ఇటీవలే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ జరిగిందని, ప్రస్తుతం డయాలసిస్ కొనసాగుతున్నదని వారు తెలిపారు.అభిషేక్ తన తల్లిదండ్రులతో పాటు సెక్టార్-66లోని ఒక అద్దె ఇంటిలో ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం 8 గంటల సమయంలో అతను వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో అతని పొరుగింటిలో ఉంటున్న మోంటీతో వివాదం చెలరేగింది. ఈ సమయంలో మోంటీ తన ఎదురుగా ఉన్న అభిషేక్పై దాడి చేశాడు. అతని పొట్ట, ఛాతీపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో అభిషేక్ బాధతో విలవిలలాడుతూ కిందపడిపోయాడు. దీనిని గమనించిన అభిషేక్ కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రి(Hospital)కి తరలించారు. అక్కడి వైద్యులు అప్పటికే అభిషేక్ మృతిచెందాడని నిర్ధారించారు. సీసీటీవీలో లభ్యమైన ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Holi 2025: ఈ దేశాల్లోనూ అంబరాన్నంటే హోలీ వేడుకలు -
డీఆర్డీవో శాస్త్రవేత్తకు ఐదు కిడ్నీలు
ముంబై: రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)లో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు ఒకటీ రెండూ కాదు.. ఏకంగా ఐదు కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒక్కటి..! జనవరి 8వ తేదీన ఫరీదాబాద్లోని అమృత ఆస్పత్రి (Amrita Hospital) వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి ఐదో మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. మూడోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ (Kidney Transplant) చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ సాంకేతికతలో ఇది కీలక మలుపని చెప్పారు.డీఆర్డీవో శాస్త్రవేత్త (DRDO Scientist) దేవేంద్ర బర్లేవర్(45) తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్లపాటు ఇబ్బందిపడ్డారు. హైపర్టెన్షన్తో 2008లో రెండు మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో, ఆయనకు 2010లో, తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలను మార్చారు. అవి ఫెయిలయ్యాయి. పుట్టుకతో ఉన్న రెండు కిడ్నీలు, ట్రాన్స్ప్లాంటేషన్తో అమర్చిన రెండు కలిపి మొత్తం నాలుగు మూత్రపిండాలున్నా ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్–19 బారినపడి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో, ఆయనకు డయాలసిస్ (dialysis) తప్పనిసరయ్యింది.ఈయన్ను పరీక్షించిన ఫరీదాబాద్లోని అమృత ఆస్పత్రి వైద్యులు మరోసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు సంసిద్ధత తెలిపారు. అదే సమయంలో, బ్రెయిన్డెడ్ అయిన ఓ రైతు కుటుంబం కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చింది. అనుకోని ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వైద్య బృందం సిద్ధపడింది. అయితే, పనిచేయని నాలుగు కిడ్నీల వద్దే మరో కిడ్నీని అమర్చడం వారికి సవాల్గా మారింది. వ్యాధి నిరోధకతకు సంబంధించిన ప్రత్యేక సంక్లిష్టతలను వారు ముందుగా దాటాల్సి వచ్చింది.ఇందులో భాగంగా, కొత్త కిడ్నీని రోగి శరీరం తిరస్కరించకుండా చేసేందుకు ముందుగా ఇమ్యునో సప్రెషన్ అనే ప్రత్యేక ప్రక్రియ చేపట్టామని బృందంలో ఒకరైన డాక్టర్ అహ్మద్ కమాల్ చెప్పారు. రోగికి ఇప్పటికే హెర్నియా శస్త్రచికిత్స చేసినందున స్థల పరిమితి కారణంగా ఐదో మూత్రపిండాన్ని శరీరంలో అమర్చడమనే ప్రధాన సవాల్ను కూడా ఎదుర్కొన్నామని మరో వైద్యుడు అనిల్ శర్మ తెలిపారు.చదవండి: చిన్నవయసులోనే గుండెపోటు.. ఎందుకొస్తుందో తెలుసా?ఎట్టకేలకు నాలుగు గంటల అనంతరం ట్రాన్స్ప్లాంటేషన్ ప్రక్రియను విజయవంతంగా ముగించారు. కొత్త కిడ్నీ చక్కటి పనితీరు కనబరచడంతో పది రోజుల అనంతరం బర్లేవర్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రెండు వారాల్లో ఆయన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. డయాలసిస్ అవసరం కూడా లేకుండా పోయింది. తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడైనందుకు దేవేంద్ర బర్లేవర్ సంతోషం వ్యక్తం చేశారు. రోజువారీ దినచర్యను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే సొంతంగా పూర్తి చేసుకోగలుగుతున్నట్లు చెప్పారు. -
మానవ ఐవీఎఫ్ సాయంతో కంగారూ పిండాలు..!
వాతవరణ మార్పులు, కాలుష్యం కారణంగా ఇప్పటికే పలు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ ప్రేమికులు వాటిన సంరక్షించేందుకు పలు విధాలు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో తాజాగా శాస్త్రవేత్తలు ఆ అంతరించిపోతున్న జాతుల పరీరక్షణకు మార్గం సుగమం చేసేలా తొలిసారిగా మానవ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించారు. దీని సాయంతో అంతరించిపోతున్న జాతుల పిండాలను విజయంతంగా సృష్టించి సరికొత్త పరిష్కారానికి నాంది పలికారు. ఇంతకీ ఈ ఐవీఎఫ్ని ఉపయోగించి ఏ జంతు పిండాలను సృష్టించారంటే..ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు(Australian Scientists) తొలిసారిగా ఐవీఎఫ్ని ఉపయోగించి అంతరించిపోతున్న మార్సుపియల్ జాతి కంగారు పిండాలను(kangaroo embryos) విజయవంతగా సృష్టించారు. ఇలా మానవ ఐవీఎఫ్ సాయంతో జంతు పిండాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ మార్సుపియల్(marsupial species) అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతికి సంబంధించిన కోలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్తర్న్ హెయిరీ-నోస్డ్ వొంబాట్స్, లీడ్బీటర్స్ పోసమ్స్ వంటి కంగారు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు. ఆ జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు క్వీన్స్ల్యాండ్ విశ్వవిద్యాలయ(Queensland University) పరిశోధకుడు డాక్టర్ ఆండ్రీస్ గాంబిని( Andres Gambini,) తెలిపారు. తమ పరిశోధనా బృందం మానవ IVFలో సాధారణంగా ఉపయోగించే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) ద్వారా 20 కి పైగా కంగారూ పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించిన కంగారూల నుంచి స్పెర్మ్, గుడ్డు కణాలను సేకరించినట్లు వివరించారు. ఈ ఐవీఎప్కి బూడిద రంగు కంగారులే అనువైనవని గాంబిని చెబుతున్నారు. ఎందుకంటే వాటి జనాభా కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉనికిలో ఉండటం కారణంగా వాటి జన్యు పదార్థం సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) జాతుల పరిరక్షణకు, సంతానోత్పత్తి ప్రయత్నాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించిందని చెప్పారు. దీనికోసం లక్షలాది స్పెర్మ్ సజీవంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరిశోధన విజయవంతం కావడంతో పరిశోధకులు జన్యువైవిధ్యాన్ని ప్రవేశ పెట్టేలా మరణించిన జంతువుల నుంచి జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి ఐవీఎఫ్ని ఉపయోగించాలని పరిశోధన బృందం చూస్తోంది. అలాగే ఈ సృష్టించిన జంతువులు పర్యావరణానికి అనుకూలంగా మనుగడ సాగించాలే చూడటానికి ఈ జన్యువైవిధ్యం తప్పనిసరని అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్షీరదాల క్షీణత రేటు భయానకంగా ఉంది. ఇప్పటికే 38 జాతులు కనుమరుగైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన సరికొత్త ఆశను అందిస్తోంది. (చదవండి: -
Satyendra Nath Bose : దైవకణాల పరిశోధకుడు
ప్రఖ్యాత భారతీయ భౌతిక శాస్త్రవేత్తల్లో పద్మవిభూషణ్ సత్యేంద్రనాథ్ బోస్ ఒకరు. కలకత్తాలో 1894 జనవరి 1న జన్మించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచారు. విశ్వ సృష్టికి సంబంధించిన దైవ కణాల పరిశోధన వెనక సత్యేంద్ర నాథ్ బోస్ కృషి చాలా ఉంది. ప్రాథమిక కణాల (దైవకణాల)పై ఐన్స్టీన్తో కలిసి సమర్పించిన అధ్యయన ఫలితాలను ప్రస్తుతం ‘బోస్–ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్’గా పరిగణిస్తున్నారు.బోస్ సంప్రదాయ భౌతికశాస్త్రం గురించి ప్రస్తావించకుండా, ఒకేలా ఉండే కణాలతో గణన స్థితుల అద్భుతమైన మార్గం ద్వారా ప్లాంక్ యొక్క క్వాంటం వికిరణాల నియమాన్ని ఉత్పాదించి ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. దానిని నేరుగా జర్మనీలోని ఆల్బర్ట్ ఐన్స్టీన్కు పంపారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆ పరిశోధనా పత్రం ప్రాముఖ్యాన్ని గుర్తించి, దానిని జర్మన్ భాషలోకి అనువదించారు. దానిని బోస్ తరపున ప్రతిష్ఠాత్మక ‘జీట్స్క్రిఫ్ట్ ఫర్ ఫిజిక్’కు సమర్పించారు. ఈ గుర్తింపు ఫలితంగా, బోస్ యూరోపియన్ ఎక్స్–రే, క్రిస్టల్లాగ్రఫీ ప్రయోగశాలల్లో రెండు సంవత్సరాలు పని చేయగలిగారు. ఈ సమయంలో అతను లూయిస్ డి బ్రోగ్లీ, మేరీ క్యూరీ, ఐన్స్టీన్లతో కలిసి పనిచేశారు. వీరు ప్రతిపాదించిన కణాల ఆధారంగానే తర్వాతి కాలంలో దైవకణానికి సంబంధించిన సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన సేవల జ్ఞాపకార్థం, కణ భౌతిక శాస్త్రంలో ప్రాథమిక ఉప పరమాణు కణాలలోని ఒక కణానికి ‘బోసాన్స్’ అని ఆయన పేరు పెట్టి అరుదైన గౌరవాన్ని అందించారు.బోస్–ఐన్స్టీన్ కండెన్సేట్ (బీఈసీ) అనేది చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద సంభవించే పదార్థ స్థితి. ఆయన పరిశోధనలు అనేక ఆవిష్కరణలకు దారితీశాయి. మెరుగైన కచ్చితత్వం, స్థిరత్వంతో అత్యంతపొందికైన లేజర్లను సృష్టించడానికి బీఈసీలను ఉపయోగించవచ్చు. సూపర్ కండక్టివిటీని అధ్యయనం చేయడంలో సహాయపడతాయి. క్వాంటం కంప్యూటర్ల ప్రాథమిక యూనిట్లు అయిన క్వాంటం బిట్లనుసృష్టించడానికి ఉపయోగించవచ్చు. గురుత్వాకర్షణ, భ్రమణం,ఇతర భౌతిక పరిమాణాలను కొలవడానికి అత్యంత సున్నితమైన సెన్సార్లను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.అపూర్వమైన కచ్చితత్వంతో అణు గడియారాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు. ఇది జీపీ, ఇతర నావిగేషన్ వ్యవస్థలను మెరుగుపరు స్తుంది. డీఎన్ఏ వంటి జీవసంబంధమైన అణువుల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం లక్ష్యంగా ఉన్నమందులు, చికిత్సల అభివృద్ధికి దారితీశాయి. ఆయన రూపొందించిన బోస్– ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ , బోస్– ఐన్స్టీన్ కండన్సేట్ విషయాలపై పరిశోధనలు చేసినవారికి ఏడు నోబెల్ బహుమతులు రావడం విశేషం.– మడక మధు ఉపాధ్యాయుడు, మహాదేవపూర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా(నేడు సత్యేంద్రనాథ్ బోస్ వర్ధంతి)ఇదీ చదవండి: World Cancer Day 2025 : లక్షలాదిమంది బిడ్డలు అనాథలుగా; ముందుగా గుర్తిస్తే! -
దేశాన్ని అణుశక్తిగా మార్చిన మేధ
దేశభక్తి, సంస్కృతీ సంప్ర దాయాల పట్ల గౌరవం, సంగీత సాహిత్యాల పట్ల ప్రేమ, సగటు మనిషి జీవన ప్రమాణాలు పెంచా లన్న తపన కలిగిన గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్న. ఆయన 1925 జనవరి 28న సంప్రదాయ మైసూర్ అయ్యంగార్ కుటుంబంలో కర్ణాటకలో పుట్టారు. సంగీతంపై ఉన్న అభిమానంతో సంగీత కళాశాలలో చేరాలనుకున్న రాజా రామన్న, సర్సి.వి. రామన్ పరిచయ ప్రభావం వల్ల వైజ్ఞానిక రంగంలోకి ప్రవేశించారు. ఆరేళ్ళ వయసులోనే పియానో నేర్చుకోవడం ప్రారంభించారు.పన్నెండో ఏట మైసూర్ మహారాజు ఎదుట పియానో వాయించి ప్రశంసలందుకున్నారు. 1949లో టాటా గ్రూపు– స్కాలర్షిప్పై లండన్ వెళ్ళి, అక్కడి ‘కింగ్స్ కాలేజి’ నుండి ‘న్యూక్లియర్ ఫిజిక్స్’లో డాక్టరేట్ తీసుకుని స్వదేశం తిరిగి వచ్చారు. డా‘‘ హోమీ భాభా ఆధ్వర్యంలో పని చేయడానికి 1952లో– టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో చేరారు. బొంబాయి, ట్రాంబేలోని ఆ సంస్థ పేరు తరువాత కాలంలో భాభా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ (బీఏఆర్సీ: బార్క్)గా మారింది. 1960లలో అణ్వాయుధా లను తయారు చేయడం, వాటిని అభివృద్ధి చేయ డంలో సాంకేతిక పరిశోధన చేపట్టారు. అప్పుడే మన దేశంలో అణుబాంబుకు రూపకల్పన జరిగింది. 1966లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు–అణుపరికరాల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ కొనసాగింది. ఆ ప్రాజెక్ట్లో పనిచేసే 75 మంది శాస్త్రవేత్తల బృందానికి రాజా రామన్న నాయకత్వం వహించారు. బార్క్లో ‘పూర్ణిమ’ అనే పేరుతో ప్లుటోనియం ఇంధనంతో నడిచే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ స్థాపించడానికి కార కులయ్యారు. 1974 మే నెలలో అతి రహస్యంగా అణు పరీక్షను నిర్వహించారు. 1978లో అప్పటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్, డా‘‘ రామ న్నను బార్క్ నుండి తీసు కొచ్చి, రక్షణ మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు. రక్షణ పరిశోధన కార్యదర్శిగా, డీఆర్డీఓ డైరెక్టర్ జన రల్గా కూడా నియమించారు. అప్పుడే ఒక విచి త్రమైన సంఘటన జరి గింది. ఈయన నేపథ్యం తెలుసుకుని ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణుబాంబుల తయారీలో రామన్న సహాయం అర్థించాడు. పరిస్థితి విషమించేట్టుగా ఉందను కుని, దేశభక్తుడయిన రాజా రామన్న చెప్పా పెట్ట కుండా ఇండియా విమానం పట్టుకుని హుటా హుటిన తిరిగొచ్చారు. నిబద్ధత గల దేశభక్తుల చర్యలు అలా ఉంటాయి. వారు వేటికీ లొంగరు.చదవండి: ఈశ్వరాజ్ఞ హోమీ జె. భాభా అకాల మరణం తర్వాత, ఆయన నిర్దేశించిన మార్గంలోనే రాజా రామన్న పరిశోధనలు కొనసాగించి, ఆణుశక్తి పరిశోధనల్లో దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టారు. ఆయన న్యూక్లి యర్ ఫిషన్ రంగంలో కూడా కృషి చేశారు. బరువైన కేంద్రకాలను విభజించి, శక్తిమంతమైన న్యూక్లియన్ రేడియేషన్ను ఉత్పత్తి చేయవచ్చని– ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతం అణుపరిశోధనా రంగానికి, తద్వారా దేశ ప్రగతికి ఎంతో ఉపయోగపడింది. 1980లో ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా తిరిగి రావడంతో అణు కార్యక్రమం ఊపందుకుంది. ఆమె రామన్నను మళ్ళీ బార్క్కు డైరెక్టర్గా నియమించారు. పైగా అణుపరీక్షల కోసం అయనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. 1990లో వి.పి. సింగ్ ప్రభుత్వంలో రామన్న కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్లతో పాటు అనేక పురస్కారాలు, పతకాలు, డాక్ట రేట్లు పొందారు.రాజా రామన్న శత జయంతి (28 జనవరి 1925 – 28 జనవరి 2025) సందర్భంలో మనం ఉన్నాం. మంచి మనిషిగా, అత్యున్నత స్థాయికి ఎదిగిన వైజ్ఞానికుడిగా, పియానో వాద్యకారుడిగా – ఎవరికి తోచిన విధంగా వారు ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.వ్యాసకర్త సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త(నేడు డా. రాజా రామన్న శతజయంతి)-డా. దేవరాజు మహారాజు -
శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత
-
ఆత్మావలోకనం
మానవ అస్తిత్వాన్ని గురించిన చర్చ ప్రపంచంలో చిరకాలంగా ఉంది. మానవ దేహం సజీవంగా ఉన్నంత వరకు అందులో చైతన్యం ఉంటుంది. ఆ చైతన్యాన్నే ప్రాణం అంటున్నాం. శరీరాన్ని విడిచి ప్రాణం పోవడమే మరణం. మరణించిన తర్వాత శరీరాన్ని దహనం చేయడమో, పూడ్చిపెట్టడమో చేస్తారు. మరణం తర్వాత ప్రాణం ఏమవుతుందనే దానిపై రకరకాల ఊహలు ఉన్నాయి; దీనిపై రకరకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఉన్నాయి; రకరకాల మత విశ్వాసాలు ఉన్నాయి. శరీరాన్ని సజీవంగా నిలిపి ఉంచే చైతన్యాన్నే ఆధ్యాత్మికవేత్తలు ఆత్మ అంటారు. ‘నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః/ న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః’ అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. ఆత్మను ఆయుధాలు ఖండించలేవు, అగ్ని దహించలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. గీతాసారం ప్రకారం ఆత్మ సమస్త ప్రకృతి శక్తుల ప్రభావానికీ అతీతమైనది. జీర్ణవస్త్రాన్ని విడిచి కొత్త వస్త్రాన్ని తొడుక్కున్నట్లే, జీర్ణశరీరాన్ని విడిచిన ఆత్మ తిరిగి కొత్త శరీరాన్ని వెతుక్కుని వెళుతుందనే నమ్మకం కూడా ఉంది. ‘పునరపి జననం పునరపి మరణం/ పునరపి జననీ జఠరే శయనం’ అని ఆదిశంకరుడు చెప్పాడు. శరీరం మరణించినా, ఆత్మకు మాత్రం జనన మరణ పరిభ్రమణం తప్పదని ఆయన సారాంశం. ఆత్మకు మరణం లేదనే నమ్మకం ప్రపంచంలోని చాలా మతాల్లో ఉంది. ఆత్మ మరణం లేనిదే కాదు, ఆద్యంత రహితమైనది కూడానని జైనుల సిద్ధాంతం. సమస్త సృష్టిలోని సూక్షా్మతి సూక్ష్మ క్రిమి కీటకాలు మొదలుకొని మనుషులు సహా భారీ జంతువుల వరకు సమస్త జీవుల్లోనూ ఆత్మ ఉంటుందని జైనుల విశ్వాసం.చైనాకు చెందిన తావో మతమైతే– ప్రతి వ్యక్తిలోనూ ‘హున్’, ‘పో’ అనే రెండు రకాల ఆత్మ ఉంటుందని, ఈ రెండు రకాలు ‘యాంగ్’, ‘యిన్’ అనే సానుకూల, ప్రతికూల శక్తులతో నిండి ఉంటుందని చెబుతుంది. తావో మతం కూడా పునర్జన్మలను నమ్ముతుంది. ఆధునికుల్లో చాలా మంది మతాలకు అతీతంగా ఆత్మ అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి, దానిని నిర్వచించడానికి ప్రయత్నించారు. ‘నేను’ అనే స్పృహ ఆత్మకు మూలమని, అలాగని ఆత్మ అస్తిత్వాన్ని నిరూపించడం గాని, ఖండించడం గాని సాధ్యం కాదని జర్మన్ తత్త్వవేత్త ఇమ్మాన్యుయేల్ కాంట్ చెప్పాడు.ఆత్మ అస్తిత్వాన్ని గురించి ఎన్నో సిద్ధాంతాలు, కల్పనలు, విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ పదార్థమా, కాదా అనే సంగతి ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఒకవేళ పదార్థమే అయితే, అది ఏ స్థితిలో ఉంటుందో కూడా చెప్పలేదు. అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త డంకన్ మెక్డూగల్ ఆత్మకు బరువు ఉంటుందని, ఆ బరువు ఇరవై ఒక్క గ్రాములని ఒక ప్రయోగం చేసి మరీ చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో రాబర్ట్ ఎల్ పార్క్, బ్రూస్ హుడ్ వంటి శాస్త్రవేత్తలు మెక్డూగల్ ప్రయోగంలో శాస్త్రీయత లేదంటూ కొట్టి పారేశారు. మరణానంతరం ఆత్మ ఏమవుతుందనే దానిపై మత సిద్ధాంతాలు ఎలా ఉన్నా, దీనిపై చాలామందికి తీరని సందేహాలు ఉన్నాయి. మరణంతోనే ఒక జీవి చరిత్ర పరిసమాప్తమైపోతుందని, ఆత్మ అనేది ఏదీ ఉండదని హేతువాదులు అంటారు. ఆధ్యాత్మికవేత్తల్లోనే కాదు, సాహితీవేత్తల్లోనూ ఆత్మ అస్తిత్వానికి సంబంధించిన పరిపరి విధాల అభిప్రాయాలు ఉన్నాయి. ‘మరుజన్మ ఉన్నదో లేదో/ ఈ మమతలప్పుడేమవుతాయో’ అన్నారు ఆత్రేయ. ‘చచ్చిపోయి జీవి ఎచ్చట కేగునో/ ఏమి యగునో ఎవరికెరుగ రాదు/ ఎరుకలేని వారలేమేమొ చెప్పగా/ విని తపించువారు వేన వేలు’ అన్నారు అబ్బూరి రామకృష్ణారావు. ఆయన తన జీవిత చరమాంకంలో చెప్పిన పద్యమిది. ఆత్మ గురించి, ‘ఆత్మజ్ఞానం’ గురించి వివిధ మతాల్లో అనేకానేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఆత్మ అస్తిత్వంపై అనేక విశ్వాసాలు ఉన్నాయి. ఆత్మ ఉందనేందుకు శాస్త్ర సాంకేతిక నిరూపణలు లేకున్నా, ఆత్మ అనే భావన సహస్రాబ్దాలుగా మానవాళిపై ప్రభావం చూపుతోంది. ఆత్మ భావన ప్రభావం మత సిద్ధాంతాలతో పాటు తత్త్వశాస్త్రంలోను, సాహిత్యంలోను, ఇతర సృజనాత్మక కళలలోను కనిపిస్తుంది. ‘ఆత్మ’ భావన చాలావరకు ఆస్తికుల ప్రవర్తనను నియంత్రిస్తూ వస్తోంది. కర్మ సిద్ధాంతానికి, పాప పుణ్యాల విచక్షణకు, పాపభీతికి మూలం ‘ఆత్మ’ భావనే! ఆత్మ అస్తిత్వాన్నే గుర్తించనివారు ప్రపంచ జనాభాలో అతి తక్కువమంది మాత్రమే ఉంటారు. కృత్రిమ మేధ మనుషుల రోజువారీ జీవితాలను ప్రభావితం చేస్తున్న వర్తమాన కాలంలో కూడా ఆత్మ అస్తిత్వాన్ని నమ్మేవాళ్లే ఎక్కువ.ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసి ఆధునిక శాస్త్రవేత్తలెవరూ ఆత్మ అస్తిత్వాన్ని గురించి పెద్దగా పరిశోధనలు సాగించలేదు. అయితే, అమెరికా రక్షణశాఖ ప్రధాన కేంద్రం ‘పెంటగాన్’ ఈ అంశంపై 1983లోనే పరిశోధన చేసింది. మనిషి మరణించినా ఆత్మ మరణించదంటూ లెఫ్టినెంట్ కల్నల్ వేయన్ మెక్డోనల్ తన పరిశోధన పత్రంలో రాశారు. అమెరికా గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ 2003లో బహిర్గతపరచిన రహస్య పత్రాల్లో ఇది కూడా ఉంది. అయితే, ఇటీవలే ఇది వెలుగులోకి రావడంతో పాశ్చాత్య పత్రికలు, ప్రసార సాధనాల్లో పలు వ్యాఖ్యానాలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ధ్యానస్థితిలో సూక్ష్మశరీరయానం అనుభవాల గురించి ఆధ్యాత్మికవేత్తలు, యోగసాధకులు చెబుతుంటారు. దీనినే ‘ఔటాఫ్ బాడీ ఎక్స్పీరియెన్సెస్’ అంటున్నారు. గూఢచర్యంలో ఇలాంటి అనుభవాలను ఉపయోగించుకోవడం ఎలా అనేదానిపైనే మెక్డోనల్ పరిశోధన చేశారు. దీనిపై శాస్త్రవేత్తలు ఏమేరకు ఆత్మావలోకనం చేసుకుంటారో చూడాలి. -
వామ్మో..!ఈ తిమింగలం వలస రికార్డు మాములుగా లేదుగా..!
బలీన్ తిమింగలం జాతికి చెందిన ఒక మగ హంప్బ్యాక్ తిమింగలం వలస రికార్డు ఊహకందనిది. ఏకంగా మూడు మహా సముద్రాలు చుట్టొచ్చి.. రికార్డు క్రియేట్ చేసింది. ఈ మగ తిమింగలం దక్షిణ అమెరికా నుంచి ఆఫ్రికా వరకు సుమారు 8వేల మైళ్లకు పైగా ఈది ఆశ్చర్యపరిచింది. తన సహచర తిమింగలాన్ని వెతుక్కుఉంటూ ఇంత దూరం సముద్రంలో ఈది ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ తిమింగలం కదలికను శాస్త్రవేత్తల బృందం సుమారు 2013 నుంచి 2022 వరకు ట్రాక్ చేస్తూ వచ్చారు. ఇది దక్షిణ అమెరికాలోని కొలంబియా నుంచి ఆఫ్రికాలోని జాంజిబార్లోని తిమింగలలా సంతానోత్పత్తి ప్రదేశం వరకు ఈదుకుంటూ వెళ్లినట్లు తెలిపారు. తిమింగలాల జాతిలోనే అత్యంత అరుదైన జాతి ఈ హంప్బ్యాక్ తిమింగలం. ఈ తిమింగల వెనుక ఉన్న విలక్షణమైన మూపురం కారణంగానే వీటిని హంప్బ్యాక్ తిమింగలంగా అని పిలుస్తారు. ఇవి మహాసముద్రాల్లోనే ఉంటాయి. వాణిజ్యపరంగా కూడా అత్యంత ఖరీదైన తిమింగలం ఇది.అయితే వేట కారణంగా ఈ జాతి అంతరించిపోతున్నదశలో ఉంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల బృందం హంప్బ్యాక్ తిమింగలాల తీరు, వలస విధానంపై అధ్యయనం చేస్తోంది. ఆ క్రమంలోనే ఈ మగ హంప్బ్యాక్ తిమింగలం కదలికలను ట్రాక్ చేస్తూ వచ్చారు పరిశోధకులు. తొలిసారిగా ఈ తిమింగలాన్ని 2013లో గుర్తించి ఫోటోలు తీశారు. ఆ తర్వాత మళ్లీ 2022లో జాంజిబార్ తీరంలో నైరుతి హిందూ మహాసముద్రంలో గుర్తించారు.మొదట్లో అదే తిమింగలమా కాదనే అనుమానం కలిగింది. అయితే దాని దాని జననేంద్రియ ప్రాంతంలో తీసిన ఫోటోల ఆధారంగా ఆ తిమింగలమే అని నిర్థారించారు శాస్త్రవేత్తలు. ఇంతకుముందు తాము ఎన్నో విలక్షణమైన తిమింగలాల శక్తిమంతంగా ఈదడం గుర్తించామని, కానీ అవి మధ్యలోనే దారితప్పేవని అన్నారు. అయితే ఈ తిమంగలం మాత్రం ఏదో వెతుకుతూ వచ్చినట్లుగా ఇంత దూరం ప్రయాణించడమే ఆశ్చర్యం కలిగించిందన్నారు. వాస్తవానికి ఇవి చాలా శక్తిమంతంగా ఈదగలవు. కానీ ఇంతలా రికార్డు స్థాయిలో ఈదుకుంటూ వెళ్లడమే ఈ మగ హంప్బ్యాగ్ తిమింగలం ప్రత్యేకత అని చెప్పారు. అయితే కచ్చితంగా ఇలా అంత దూరం ఎందుకు ప్రయాణం చేసిందనేది చెప్పలేమన్నారు. కానీ ఇందుకు వాతావరణ మార్పు, పర్యావరణ మార్పులు పాత్ర ఉండొచ్చని అన్నారు. అలాగే ఆహార అన్వేషణ కూడా అయ్యి ఉండొచ్చన్నారు. ఒక రకంగా తమ పరిశోధన మహాసముద్రాలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకతను హైలెట్ చేసిందని పరిశోధక బృందం తెలిపింది. ఈ అధ్యయనం రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. (చదవండి: ‘సౌత్ ఇండియన్ డైట్ ప్లాన్'తో అంతలా బరువు తగ్గొచ్చా..!) -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
ప్రపంచంలోనే పే....ద్ద కెమెరా!
ఏకంగా 3,200 మెగాపిక్సెల్స్. సామర్థ్యం. 5.5 అడుగుల ఎత్తు, ఏకంగా 12.25 అడుగల పొడవుతో పెద్ద సైజు కారును తలపించే పరిమాణం. దాదాపు 2,800 కిలోల బరువు! 320–1,050 ఎన్ఎం వేవ్లెంగ్త్ రేంజ్. ఒక్కో ఇమేజ్ కవరేజీ పరిధిలోకి కనీసం 40 పూర్ణ చంద్రులు పట్టేంత ఏరియా! ప్రపంచంలోనే అతి పెద్ద కెమెరా తాలూకు విశేషాల్లో ఇవి కేవలం కొన్ని మాత్రమే. ఇంతకీ ఇది ఎక్కడుందంటారా? చిలీలో రూపుదిద్దుకుంటున్న వెరా రూబిన్ అబ్జర్వేటరీలో ఏర్పాటు చేస్తున్న సరికొత్త టెలిస్కోప్లో. రాజధాని శాంటియాగోకు 500 కి.మీ. దూరంలోని సెరో పాచ్న్ పర్వత శిఖరంపై 2015 నుంచీ నిర్మాణంలో ఉన్న ఈ అబ్జర్వేటరీ త్వరలో ప్రారంభం కానుంది. అందులోని ఈ అతి పెద్ద కెమెరా ప్రతి మూడు రోజులకోసారి రాత్రివేళ దాని కంటికి కని్పంచినంత మేరకూ ఆకాశాన్ని ఫొటోల్లో బంధించనుంది. అలా అంతరిక్ష శాస్త్రవేత్తలకు పదేళ్లపాటు రోజుకు కనీసం వెయ్యి చొప్పున ఫొటోలను అందుబాటులోకి తెస్తుంది! అంటే రోజుకు 20 టెరాబైట్ల డేటాను అందజేస్తుంది. ఇది ఒక యూజర్ నెట్ఫ్లిక్స్లో సగటున మూడేళ్లపాటు చూసే ప్రోగ్సామ్స్, లేదా స్పాటిఫైలో ఏకంగా 50 ఏళ్ల పాటు వినే పాటల డేటాకు సమానం! ఈ క్రమంలో మనకిప్పటిదాకా తెలియని ఏకంగా 1,700 కోట్ల కొత్త నక్షత్రాలను, 2,000 కోట్ల నక్షత్ర మండలాలను ఈ కెమెరా వెలుగులోకి తెస్తుందని భావిస్తున్నారు. దీన్ని లెగసీ సర్వే ఆఫ్ స్పేస్ అండ్ టైమ్ (ఎల్ఎస్ఎస్టీ) కెమెరాగా పిలుస్తున్నారు. అంతేగాక అంతరిక్షంలో సంభవించే చిన్నా పెద్దా మార్పులకు సంబంధించి ప్రతి రాత్రీ ఏకంగా కోటి అలెర్టులను కూడా ఈ టెలిస్కోప్ పంపనుందట కూడా! ‘‘ఇదంతా కేవలం ఆరంభం మాత్రమే. వెరా రూబిన్ అబ్జర్వేటరీ మున్ముందు మరెన్నో ఘనకార్యాలు చేయనుంది’’ అని ఆ సంస్థ ఆస్ట్రానమిస్టు క్లేర్ హిగ్స్ చెబుతున్నారు. కృష్ణపదార్థం (డార్క్ మ్యా టర్), కృష్ణ శక్తి (డార్క్ ఎనర్జీ) వంటి పలు మిస్టరీలను ఛేదించడంలో కూడా కీలకపాత్ర పోషించే చాన్సుందన్నారు. ఈ టెలిస్కోప్కు 2016లో మరణించిన అమెరికా అంతరిక్ష శాస్త్రజు్ఞడు వెరా రూబిన్ పేరు పెట్టారు. ఇది ఏడాది లోపులో అందుబాటులోకి వస్తుందని అంచనా.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పట్టపగలు శాస్త్రవేత్త ఇంట్లో రూ. రెండు కోట్లు దోపిడీ
న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణిలో సంచలన ఉదంతం చోటుచేసుకుంది. ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఒక రిటైర్డ్ సైంటిస్ట్తో పాటు అతని భార్యను బంధించి దోపిడీకి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రోహిణిలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో తమ సొంత ఇంట్లో ఓ రిటైర్డ్ సైంటిస్ట్ను అతని భార్యను తుపాకీతో బెదిరించి, ఆ తర్వాత బందించి రూ. రెండు కోట్ల విలువైన నగలు నగదును దుండగులు దోచుకెళ్లారు. శాస్త్రవేత్త శిబు సింగ్, అతని భార్య నిర్మల ఇంట్లో ఉండగా, మధ్యాహ్నం సమయంలో ఇద్దరు యువకులు తాము కొరియర్ బాయ్స్మని చెబుతూ, వారి ఇంట్లోకి ప్రవేశించారు.తర్వాత వారు శిబు, అతని భార్య నిర్మలను తుపాకీతో బెదిరించి, బందించారు. ఈ క్రమంలో నిందితులు వారిపై దాడి చేశారు. దుండగుల తమ ఇంట్లోని రూ. రెండు కోట్ల విలువైన నగలు, నగదు దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే బాధితులు ఈ విషయాన్ని తమ కుమారునికి తెలియజేశారు. ఆయన ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్లు ప్రారంభించారు. బాధితులిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ ఘటన తీరు చూస్తుంటే ఈ వ్యవహారంలో తెలిసినవారి ప్రమేయం ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు అంటున్నారు. సీసీటీవీలో రికార్డయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇది కూడా చదవండి: వికాస్ యాదవ్ కథలో కొత్త మలుపు -
Subrahmanyan Chandrasekhar: చుక్కల్లో చంద్రుడు
నక్షత్రాల జీవిత చరిత్రను వెల్లడించిన శాస్త్రజ్ఞులు ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ఒకరే సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా ఆయన సాధించిన ఘనతను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలాగే ఆయనకు ప్రముఖ భౌతిక శాస్త్రేవత్త సర్ సీవీ రామన్తో గల సంబంధం ఏమిటో కూడా తెలుసుకుందాం.నక్షత్రాలపై పరిశోధనలు సాగించిన ప్రముఖ శాస్త్రవేత్తలు కోపర్నికస్, గెలీలియో, కెప్లర్, న్యూటర్ మొదలైన వారు వేసిన బాటలో పయనించి, నోబెల్ బహుమతిని సాధించిన సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ దక్షిణ భారతానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త. ఆయన 1910 అక్టోబర్ 19న అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రం(ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది)లోని లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మి, చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్ దంపతులకు జన్మించారు.హైస్కూలు, కాలేజీ చదువులను మద్రాస్ (చెన్నై)లో పూర్తిచేశారు. 1953లో డాక్టర్ చంద్రశేఖర్ అమెరికా పౌరసత్వం స్వీకరించకపోతే, ఆయనను మన భారతీయ శాస్త్రవేత్తగా ప్రపంచానికి సగర్వంగా ప్రకటించుకునే వాళ్లం. తన 19వ ఏట ఉన్నత విద్యాభ్యాసం కోసం ఓడ మీద ఇంగ్లాండు వెళ్లిన ఆయన ఖగోళ శాస్త్ర సంబంధిత విషయాలపై అధ్యయనం సాగించారు. 1935 జనవరి 11న తన మిత్రుడు విలియం మాక్ క్రీ తో కలిసి ఇంపీరియల్ కాలేజీ నుంచి బర్లింగ్టన్ హౌస్ వెళ్లిన ఆయన తన పరిశోధనా పత్రాన్ని వేదికపై చదివి, భౌతిక ఖగోళ శాస్త్రవేత్తలను మంత్రుముగ్ధులను చేశారు. దీంతో కేంబ్రిడ్జి ట్రినిటి కాలేజీ ఫెలోషిప్కు ఎన్నికయ్యారు. అక్కడ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ను అందరూ ముద్దుగా ‘చంద్ర’ అని పిలిచేవారు.ప్రతి వ్యక్తి జీవితంలో బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్య దశలు ఉన్నట్టే నక్షత్రాల్లోనూ పరిణామ దశలుంటాయని ‘చంద్ర’ తెలిపారు. వీటిలో చెప్పుకోదగ్గవి అరుణ మహాతార (రెడ్జెయంట్), శ్వేత కుబ్జ తార (వైట్డ్వార్ఫ్), బృహన్నవ్య తార (సూపర్నోవా), నూట్రాన్ తార, కృష్ణ బిలం (బ్లాక్హోల్) అనే దశలు ముఖ్యమైనవని పేర్కొన్నారు. తారలపై అవగాహనను పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను చంద్రశేఖర్ విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాటి పరిస్థితులుండాలో తెలియజేసిన సిద్ధాంతమే 'చంద్రశేఖర్ లిమిట్'గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్డ్వార్ఫ్గా మారుతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్స్టార్గా మారుతూ, చివరికి బ్లాక్హోల్ (కృష్ణబిలం)గా అయిపోతాయని చంద్రశేఖర్ సిద్ధాంతీకరించారు.ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతులను మన దేశంలో ఒకే కుటుంబంలోని ఇద్దరు మేథావులు సాధించడం ఓ అరుదైన విషయం. వారిలో ఒకరు నోబెల్ పొందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ కాగా, రెండో వ్యక్తి ఆయన అన్నకొడుకు సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్. 1995 ఆగస్టు 21న అమెరికాలో తన 85వ ఏట చంద్రశేఖర్ గుండె సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: భారత దౌత్యవేత్తలపై నిఘా: కెనడా -
ప్లాస్టిక్ బౌల్స్లో ఆహారం ఎందుకు తినకూడదంటే..?
ఇటీవల డైనింగ్ టేబుల్స్ మీద ఉండే కిచెన్ వేర్లలో అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్లో కూడా ఉంటున్నాయి. అందులో వేడివేడి కూరలూ, పులుసు, అన్నం వంటి ఆహారాలు తీసి ఉంచి వడ్డిస్తూ ఉండటం చాలా మంది ఇళ్లలో కనిపించేదే. పైకి అనేక డిజైన్లతో చాలా అందంగా కనిపించే ఈ బౌల్స్... అందులో ఉంచే ఆహారం విషయానికి వచ్చేటప్పటికి ఆరోగ్యానికి అంత మంచిది కాదని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. సాధారణంగా ఈ బౌల్స్ను ‘మెలమైన్’ అనే ప్లాస్టిక్ వంటి పదార్థంతో తయారు చేస్తారు. వేడి వేడి కూరలు, పులుసుల వంటి ఆహారపదార్థాలను ఇందులోకి తీయగానే ఆ వేడికి మెలమైన్... ఆహారంతో పాటు కలిసి నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందనీ, దేహంలోకి ప్రవేశించే ఈ మెలమైన్ వల్ల మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది. అధ్యయనం నిర్వహించిన తీరిది... ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి చేసిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్లో తిన్నవారి మూత్రంలో మెలమైన్ మోతాదులు దాదాపు ఎనిమిది రెట్లు ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీ ఫెయిల్యూర్కు దారితీసే అవకాశంతోపాటు కేన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. ఈ పని అస్సలు వద్దు... మెలమైన్తో చేసిన వంటపాత్రలలో వేడి ఆహారాన్ని తీయడమే చాలా ప్రమాదకరమంటే కొందరు మెలమైన్ బౌల్లో పెట్టిన ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్లో ఉంచి వేడిచేస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్డీఏ గట్టిగా చెబుతోంది. అనర్థాలేమిటంటే... ఈ మెలమైన్ దుష్ప్రభావాలు ముఖ్యంగా హార్మోన్లపై... మరీ ముఖ్యంగా మహిళల్లోని ఈస్ట్రోజెన్ స్రావాలపై ఉంటాయి. దాంతో ప్రత్యుత్పత్తికి తోడ్పడే హార్మోన్ల సమతౌల్యతలలో తేడాలు వచ్చి గర్భధారణ సమస్యలు రావచ్చు. అలాగే పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, వీర్య కణాల కదలికలు తగ్గడం, పురుష హార్మోన్ల స్రావం తగ్గడం వంటివి జరగవచ్చు. ఇక చాలామందిలో డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్లుగా ఇలాంటిదే మరో అధ్యయనంలో తేలింది. ఈ ప్లాస్టిక్ పాత్రలలో తింటున్నవారిలో స్థూలకాయం కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వంటి కేన్సర్ల రిస్క్లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీనమై జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు, అల్జిమర్స్ కేసులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే కూరలు, పులుసుల వడ్డింపునకు ప్లాస్టిక్ బౌల్స్కు బదులు పింగాణీ బౌల్స్ మంచిదన్నది నిపుణుల మాట. ఈ పరిశోధనల ఫలితాలన్నీ ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి.(చదవండి: దుర్గాపూజను శక్తిమంతంగా మార్చిన క్రెడిట్ ఆ సమరయోధుడికే దక్కుతుంది..!) -
50 ఏళ్ల మిస్టరీకి చెక్..కొత్త బ్లడ్ గ్రూప్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు..!
బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ (ఎన్హెచ్ఎస్బీటీ(NHSBT)) శాస్త్రవేత్తల బృందం కొత్త బ్లడ్ గ్రూప్ని కనుగొన్నారు. దీంతో దాదాపు 50 ఏళ్లుగా నిపుణులను కలవరపరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది. ఈ సరికొత్త ఆవిష్కరణ రక్తమార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. పరిశోధకులు కనుగొన్న కొత్తబ్లడ్ రూప్ మాల్(MAL). ఇది ఏన్డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్కి సంబంధించిన జన్యుపర మూలం. దీన్ని 1972లో మానవులు రక్తంలో గుర్తించారు. దీని వల్ల రక్త మార్పిడిలో ప్రతి చర్యలు లేదా సమ్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనేది నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. నిజానికి ఏనడబ్ల్యూజే యాంటిజన్ అనేది అధిక సంఘటన యాటిజన్లని అర్థం. దాదాపుగా మానవులందరి ఎర్రరక్త కణాలపై ఈ యాంటిజెన్లు ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఉండవు. దీన్ని గుర్తించడం కష్టం కూడా. అందువల్ల రక్తమార్పిడిలో కొందరు రోగులకు సమస్యలు ఎదురయ్యేవి. ఇది వైద్య శాస్త్రంలో చేధించలేని మిస్తరీగా ఉండేది. అది ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణతో 50 ఏళ్ల మిస్టరీని చేధించగలిగారుఈ మేరకు దాదాపు 20 ఏళ్లుగా ఈ ఎన్హెచ్ఎస్ బ్లండ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ పరిశోధనకే అంకితమైన పరిశోధకుడు లూయిస్ టిల్లీ మాట్లాడుతూ.. తాము ఈ ఏన్డబ్ల్యూజే యాంటిజెన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమునా అరుదైన రక్తరకాలు ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెబుతున్నారు. రక్తమార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతిచర్యలకు లేదా సమస్యలను నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం. ప్రతిఏడాది దాదాపు 400 మంది రోగులు రక్తమార్పిడితో సమస్యలు ఎదుర్కుంటున్నారని చెప్పారు. వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఆ సమస్యలన్నింటికి ఈ కొత్త రక్తనమునా చెక్ పెట్టిందన్నారు. ఈ కొత్త బ్లడ్గ్రూప్ ఏన్డబ్ల్యూజే యాంటిజెన్ నెగిటివ్ ఉన్న దాతలు, గ్రహితలు ఇద్దరిని గర్తించడానికి జన్యు రూప పరీక్షలకి అనుమతిస్తుంది కాబట్టి అరుదైన కేసుల్లో రోగులకు ఎదురయ్యే రక్తమార్పిడి సమస్యలను ఇది నివారించగలుగలదని ధీమాగా చెబుతున్నారు. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల సంరక్షణను మెరుగుపరుచడమే కాకుండా రక్తమార్పిడి భద్రత, ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు.(చదవండి: ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్లోనే పెట్టి పడేస్తున్నారా?) -
బంగారు తల్లికి వీడ్కోలు
కారేపల్లి: ఆకేరు వాగు ఉధృతికి బలైన యువ శాస్త్ర వేత్త డాక్టర్ అశ్విని మృతదేహానికి మహబూబాబాద్ లో పోస్ట్మార్టం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామమైన కారేపల్లి మండలం గంగారంతండాకు తీసుకొచ్చారు. ఇక సోమవారం మళ్లీ తనిఖీలు చేపట్టిన రెసూ్య్కటీం సభ్యులు ఆమె తండ్రి మోతీలాల్ మృతదేహాన్ని డోర్నకల్ మండలం చిలక్కొయలపాడు వద్ద గుర్తించారు. ఆపై పోస్టుమార్టం చేయించి స్వగ్రామానికి తీసుకురాగా అప్పటికే బంధువులు, గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వందలాదిగా తరలివచ్చారు. గంటల తరబడి కన్నీళ్లతో ఎదురుచూసుకున్న వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా అందరూ కంటతడి పెట్టారు. కన్నీటి సంద్రమైన గంగారంతండాగంగారం తండాకు చెందిన మోతీలాల్ – నేజీకి అశ్విని, అశోక్కుమార్ సంతానం. పదో తరగతి కారేపల్లిలో చదివి 550 మార్కులతో మండల టాపర్గా నిలిచిన అశ్విని విజయవాడలో ఇంటర్, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తిచేసింది. బీఎస్సీలో మూడు రజత పతకాలు, యూనివర్సిటీ స్థాయిలో ఆరు బంగారు పతకాలే కాక ఆపై ఎమ్మెస్సీలోనూ బంగారు పతకం సాధించింది. ఆతర్వాత జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందింది. ఇక జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి(అగ్రికల్చర్ శాస్త్రవేత్తల రిక్రూట్మెంట్ బోర్డు) నిర్వహించిన పరీక్షలో వందల మంది పోటీ పడగా అశ్విని జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం సాధించి జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అశ్విని ఛత్తీస్గఢ్లోని రాయపూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తోంది. గతనెల 29న సోదరుడు అశోక్ నిశ్చితార్థానికి హాజరైన ఆమె ఆదివారం ఉదయం హైదరాబాద్లో విమానం ఎక్కాల్సి ఉంది. దీంతో తండ్రి మోతీలాల్ కారులో తీసుకెళ్తుండగా మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెం వద్ద ఆకేరులో గల్లంతైన విషయం విదితమే. ఇందులో అశ్విని మృతదేహం ఆదివారం మధ్యాహ్నం, మోతీలాల్ మృతదేహం సోమవారం లభించగా స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటికే చేరుకున్న స్థానికులు ఉజ్వల భవిష్యత్ ఉన్న శాస్త్రవేత్త అశ్వినిని ఆకేరు వాగు మింగిందా అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇద్దరి మృతదేహాలను ట్రాక్టర్పై ఊరేగింపుగా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈక్రమంలో అశ్విని తల్లి నేజీ, సోదరుడు అశోక్కుమార్ రోదనలను ఆపడం ఎవరి వల్లా కాలేదు.వైరా ఎమ్మెల్యేకు నిరసన సెగవాగులో గల్లంతై మృతదేహాలు లభించక తాము నరకయాతన పడినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని మోతీలాల్ కుటుంబీకులు ఆరోపించారు. కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ను వారు నిలదీశారు. అయితే, ఆకేరులో కారు గల్లంతైనప్పటికీ అక్కడి కలెక్టర్ సహా అధికారులతో తాను మాట్లాడానని, వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ రాకపోవడంతో వారిని కాపాడలేకపోయామని సర్దిచెప్పారు. ఆ కుటుంబానికి తక్షణ సాయంగా కింద రూ.50వేలు అందజేశారు. -
ఆ ఏజ్లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి
వయసు పెరిగే కొద్ది వృద్దాప్య ఛాయలు వస్తాయని అందరికి తెలుసు. అయితే ఏ ఏజ్లో వృధాప్యం వేగవంతం అవుతుందనేది తెలియదు. మనం కూడా గమనించం. చూస్తుండగానే మనకే తెలియని విధంగా వృద్ధాప్యంలోకి వచ్చేస్తాం. మన శరీరంలో ఈ మార్పు ఏ నిర్ధిష్ట ఏజ్ నుంచి మొదలవుతుందనేది తెలియదు. ఆ విషయాన్నే తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంతేగాదు అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటంటే..స్టాన్ఫోర్డ్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనం ఇన్నాళ్లు వృధాప్యం అనేది కాలానుగుణంగా వచ్చేది అనే సంప్రదాయ సిద్ధాంతాన్ని వ్యతిరేకించింది. మానవ శరీర పరమాణు కూర్పు పరంగా వృద్ధాప్యం అనేది రెండు నిర్ధిష్ట వయసులలో వేగవంతమవుతుందని నిర్ధారించారు పరిశోధకులు. ఆ సమయంలోనే శరీరం విపరీతమైన మార్పులకు లోనవుతుందని అధ్యయనంలో పేర్కొన్నారు. సరిగ్గా చెప్పాలంటే భూకంపం మాదిరిగా శరీరం ఒక్కసారిగా సడెన్ మార్పులకు లోనయ్యి వేలాదిగా అణువులు, సూక్ష్మజీవులు పెరగడం, పడిపోవడం జరుగుతుంది. సరిగ్గా అప్పుడే ఆరోగ్యం వేగంగా క్షీణించడం జరుగుతుంది. అదే వృద్ధాప్యం వేగవంతమవుతుందనడానికి సంకేతమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చెప్పాలంటే సరిగ్గా 44, 60 ఏళ్ల వయసులలో శరీరం వేగవంతమైన మార్పులకు లోనవ్వుతుందని వెల్లడించారు. అందుకోసం తాము 25 నుంచి 75 ఏళ్ల వయసు వారిపై పరిశోధనలు చేయగా వారిలో ఉండే విభిన్న అణువులు, సూక్ష్మజీవులు, చర్మంపై ఉండే బ్యాక్టీరియా, వైరస్లు, శిలింధ్రాలను నిశితంగా గమనించారు. వాటి వృద్ధి కాలక్రమేణ మారదని, నిర్ధిష్ట వయసు 40, 60 ఏజ్లలో వేగవంతమైన మార్పులకు లేదా ఆకస్మిక మార్పులకు లోనవ్వడాన్ని అధ్యయనంలో గుర్తించారు.ఈ పెద్ద మార్పులే ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. అంతేగాదు తమ అధ్యయనంలో ఈ రెండు నిర్ధిష్ల వయసుల్లోనే శరీరం గణనీయమైన మార్పులకు లోనవ్వుతుందని నిర్థారించారు. ముఖ్యంగా రోగనిరోధక పనితీరు బలహీనమవ్వడం 60వ దశకం నుంచి ప్రారంభమవుతుందని అన్నారు. ఈ పరిశోధన పుట్టుక, మరణంలానే వృద్ధాప్యం అనేది సర్వసాదారణమే అని చెబుతున్నప్పటికీ..ఏఏ ఏజ్లో ఈ వృధ్ధాప్యం ప్రారంభమవుతుందనేది తెలియజేసిందన్నారు. పైగా ఈ పరిశోధన భవిష్యత్తులో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి సరైన అవగాహన ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. (చదవండి: బాలీవుడ్ నటి అనుష్క శర్మ మోనోట్రోఫిక్ డైట్: నిపుణులు ఏమంటున్నారంటే..!) -
ఈ విటమిన్ని తక్కువగా తీసుకుంటే ఎక్కువ కాలం జీవించొచ్చట..!
వృద్ధాప్య ప్రక్రియను మందగించడంలో భారీ పాత్ర పోషిస్తున్న అంశాలలో, ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు ఫైబర్లతో కూడిన ఆహారం వృద్ధాప్య వ్యతిరేక ప్రభావం ఉంటుంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం మంచి విటమిన్లు, మినరల్స్తో కూడిన ఆహారం తీసుకుంటాం. అయితే ఈ విటమిన్ మాత్రం తక్కువగా తీసుకుంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదెలాగో సవివరంగా తెలుసుకుందాం..!.అసలేం జరిగిందంటే..టెక్సాస్ అగ్రిలైఫ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు వృద్ధాప్య జంతు నమూనాలలో తక్కువ ఫోలేట్ తినడం ఆరోగ్యకరమైన జీవక్రియతో ముడిపడి ఉందని గుర్తించారు. ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు, నారింజ, నిమ్మ, పుచ్చకాయలు, బఠానీలు తదితర ఇతర ఆహారాల్లో ఫోలేట్ లేదా ఫోలిక్ యాసిడ్ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణం, ఆరోగ్యకరమైన కణాల పెరుగుదల, పనితీరుకు కీలకం. పిల్లలు, యువకులు, గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే..? ఇది పెరుగుదల ప్రక్రియలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఈ ఫోలేట్ను తక్కువగా తీసుకుంటే వృద్ధుల్లో దీర్ఘాయువుని పెంచుతుందని గుర్తించారు పరిశోధకులు. అదెలా అంటే..శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో ఫోలేట్ని తీసుకోవడం తగ్గిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై పరిశోధన చేశారు. అందుకు మధ్య వయసు ఉన్న జంతు సముహానికి ఫోలేట్ తక్కువగా ఉన్న ఆహారాన్ని ఇచ్చారు. ఫోలేట్ పరిమిత నమునాలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు త్వరగా జీవక్రియగా మారగలవని గుర్తించారు. ఒక వ్యక్తి వయసును బట్టి ఫోలేట్ తీసుకోవడం మారుతుందని చెప్పారు. ఎదుగుదల, అభివృద్ధికి ప్రారంభ జీవితంలో అధిక ఫోటేట్ కీలకం. అదే తర్వాత జీవితంలో తక్కువగా తీసుకోవడం మొదలుపెడితే జీవక్రియ ఆరోగ్యం, దీర్ఘాయువుకి ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు పరిశోధకులు. సాధారణంగా మనిషి నిద్రిస్తున్నప్పుడూ కొవ్వులు కరిగిపోతాయి. అదే మెలకువగా, చురుకుగా ఉన్నప్పుడూ..కార్బోహైడ్రేట్లు వేగంగా శక్తి కోసం ఖర్చువుతాయని వివరించారు. అవే వయసు పెరిగే కొద్ది కొవ్వులు కరగడం, కార్బోహైడ్రేట్ ఖర్చు అవ్వడానికి ఎక్కువ సమసయం పడుతుంది కాబట్టి పరిమిత ఫోలేట్ మంచిదని నిర్ధారించి చెప్పారు. ఈ అధ్యయనం ప్రకారం..ఫోలేట్ పరిమత ఆహారం తీసుకునే మగవారిలో జీవక్రియ రేటులో మొత్తం పెరుగుదలను నమోదు చేశారు. అలాగే వృద్ధాప్యంలో శరీర బరువు, కొవ్వులను నిర్వహించగలదని గుర్తించారు. అలాగే ఈ అధ్యయనంలో రక్తహీనత, వంటి ప్రతికూల ఆరోగ్య పరిణామలను చూపించలేదు. ఎంత ఫోలేట్ తీసుకోవాలి.. ఫోలేట్ లేదా విటమిన్ బీ9 ఆహారంలో విడదీయరాని భాగం. ఇది ఎర్ర రక్త కణాల నిర్మాణంలోని ఆరోగ్యకరమైన కణాల పనితీరుకి కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి 400 గ్రాముల ఫోలేట్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఫోలేట్ మరింత కీలకమైనది. వారు రోజుకు 400 నుండి 1,000 మిల్లీ గ్రాముల వరకు మోతాదు ఉంటుంది. మెదడు, వెన్నెముక యొక్క పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ పోషకం శరీరంలో అందుబాటులో ఉండాలని చెప్పారు పరిశోధకులు. (చదవండి: ఆంధ్ర స్పెషల్ 'రాగి దిబ్బ రొట్టు'..ఎన్ని లాభాలో తెలుసా..!) -
రెండువేల ఏళ్లనాటి కంప్యూటర్..! విస్తుపోయిన శాస్త్రవేత్తలు
చాలా ఆవిష్కరణలు మనమే కొత్తగా కనిపెట్టాం అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఆ కాలంలోనే ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలోని అపార మేధాతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు లేదా ఆయా వస్తువులు బయటపడితే గానీ నమ్మం. ఆ టైంలోనే వాళ్లు ఇంత టెక్నాలజీని కనిపెట్టారా..? అని అబ్బురపడతాం. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న పని అయిన కంప్యూటర్ లేకుండా నడవదు అన్నంతగా మనం దానిపై ఆధారపడిపోయాం. అలాంటి కంప్యూటర్ వేల ఏళ్లక్రితమే మన పూర్వీకులు కనిపెట్టారంటే నమ్ముతారా..?. కానీ ఇది నమ్మకతప్పని నిజం. శాస్త్రవేత్తలు సైతం ఆ కంప్యూటర్ని చూసి అబ్బురపడ్డారు. అసలేం జరిగిందంటే..మొదటి కంప్యూటర్గా పిలిచే 'యాంటికిథెరా' అనే రెండు వేల ఏళ్ల పరికరాన్ని గుర్తించి ఆశ్చర్యపోయారు శాస్త్రవేత్తలు. ఇది ఒక ఖగోళ క్యాలెండర్గా పేర్కొన్వచ్చు. దీన్ని 1901 నాటి గ్రీకు నౌక ప్రమాదంలో కనుగొన్నారు. అంటే సుమారు 120 ఏళ్ల క్రితం ఈ పరికరాన్ని కనుగొన్నారు. అప్పట్లో ఈ పరికరం ఏంటో అర్థంగాక శాస్త్రవేత్తలు గందరగోళానికి గురయ్యారు. ఇది చేతితో నడిచే పరికరం. ఈ పరికరాంలో సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల ఖగోళ కదలికలను ట్రాక్ చేసేలా విండ్-అప్ వ్యవస్థను ఉపయోగించారు. ఒక్కమాటలో చెప్పాలంటే చంద్రుని దశలు, గ్రహాణ సమయాలు గుర్తించే క్యాలెండర్ మాదిరిగా పనిచేసేది. ఇది సాధారణ ప్రయోజనాలకోసం ఉపయోగించి కంప్యూటరే అయినా వెయ్యి ఏళ్ల క్రితమే ఏ ఇతర సాధనల్లో ఇంత మెకానిజం లేదు. పైగా ఇది అధునాతమైనది కూడా. ఇక ఈ కంప్యూటర్ మెకానిజం 82 వేర్వేరు శకలాలుగా ఉంది. అసలు నిర్మాణంలో మూడింట ఒక వంతు మాత్రమే మిగిలి ఉంది. ఇందులో 30 తుప్పుపట్టిన కాంస్య గేర్వీల్స్ కూడా ఉన్నాయి. అసలు ఇదేలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు లండన్ పరిశోధకులు త్రీడీ కంప్యూటర్ మోడలింగ్ను ఉపయోగించారు. అప్పుడే ఇది గొప్ప మేధావి సృష్టించిన అద్భుతంగా గుర్తించారు. తాము పునర్నిర్మించిన ఈ త్రీడీ మోడల్ తమ వద్ద ఉన్న ఆధారాలకు సరిపోలుతుందని చెప్పారు.అంతేగాదు ఈ పరికరం సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాల కదలికలను కేంద్రీకృత వలయాలపై ట్రాక్ చేస్తుందని చెప్పారు. ఆ రోజుల్లేనే ఖగోళ వస్తువులు భూమి చుట్టు తిరుగుతాయని పురాతన గ్రీకులు నమ్మేవారని తెలుస్తుందన్నారు. అంతేగాదు ఈ పురాతన పరికరాన్ని బాబిలోనియన్ ఖగోళశాస్త్రం, ప్లేటోస్ అకాడమీ గణిత, పురాతన ఖగోళశాస్త్ర సిద్ధాంతాల కలియికతో ఆవిష్కరించినట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: మరణాంతరం భద్రపర్చడానికి ఏకంగా రూ. 1.8 కోట్లు..!) -
శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెస్ట్!
ఇంతవరకు మనం రకరకాల నూనెలు వినియోగిస్తున్నాం. అలాగే ఒకే రకం నూనెను వాడకూడదని పోషకాహార నిపుణులు చెప్పడంతో మనం సన్ఫ్లవర్, వేరుశెనగా అంటూ నూనెలు మారుస్తున్నాం కూడా. కానీ పోషకాహార శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో ఈ శుద్ధి చేసిన నూనెల కంటే ఆ నూనె బెటర్ అని తేలింది. ఈ నూనెని వినియోగించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ఇంతకీ ఏంటా నూనె అంటే..శుద్ధి చేసిన నూనెల కంటే ఆవాల నూనె మంచిదని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పోషకాహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సంపద్రాయ ఆవాల నూనె వాడటమే మంచి నొక్కి చెప్పారు. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి చెందని పోషకాహార శాస్త్రవేత్త మోనికా చౌదరి మాట్లాడుతూ.."మునుపటి అధ్యయనంలో సాంప్రదాయా ఆవాల నూనెతో పోలిస్తే శుద్ధి చేసిన నూనెలే ఆరోగ్యానికి మంచిదని తేలింది. కానీ కాలక్రమేణ ఎలుకలపై జరిపిన అధ్యయనంలో అది తప్పు అని నిరూపితమయ్యింది. ఆవ నూనెలో దాదాపు 35-48% ఎరుసిక్ యాసిడ్ ఉంటుందని గత అధ్యయనాలు పేర్కొన్నాయి. అలాగే శుద్ధి చేసిన నూనెల్లో చమురు కంపెనీ ఎరుక్ యాసిడ్ అధిక మొత్తంలో వినియోగిస్తున్నాయని ఇది ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెగ ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇటీవల ఎలుకలపై జరిపిన అధ్యయనంలో మానవులకు ఎరుసిక్ ఆమ్లాల ప్రభావం ఉండదని తేలింది. మొత్తం శరీరం బరువులో ఎరుసిక్ యాసిడ్ కిలోకు 7.5ఎంజీ అనుమతించదగినది అన్నారు. ఇక ఈ ఆవా నూనెలో కేవలం 2% కంటే తక్కువ ఎరుసిక్ యాసిడ్ని కలిగి ఉంటాయని, అందువల్ల ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని". చెబుతున్నారు. అలాగే ఆరోగ్యకరమైన నూనె అంటే కొలెస్ట్రాల్, ట్రాన్స్ ఫ్యాట్ రహితంగా ఉండాలి. పైగా సంతృప్త కొవ్వు ఆమ్లాలు తక్కువగా ఉండి, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండాలి. ఇవన్నీ ఆవాల నూనెలో ఉంటాయని అన్నారు. ఇంతవరకు మంచివని చెప్పుకున్న శుద్ధి చేసిన నూనెల్లో ఒమేగా 6 కొవ్వు ఆమ్మాలు అధికంగా ఉంటాయని, ఇవి దీర్ఘకాల నిల్వకు ఉపయోగపడతాయని అన్నారు. అయితే ఇలాంటి నూనెలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒమేగా 6, ఒమేగా 3 నిష్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఇలా చాలా స్థానికేతర నూనెల్లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చాల ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సాంప్రదాయ నూనెలను తీసుకోవడమే మంచిదని సూచించారు. అందులోనూ ఆవాల నూనె ఇంకా మంచిదని చెబుతున్నారు. అలాగే ఆ శుద్ధి చేసిన నూనెల్లో ఉన్న మరో సమస్య పొగ పాయింట్ అని చెప్పారు. ఇక్కడ నూనెలను వేడిచేసినప్పుడల్లా.. అవి పొగ , ఆవిరిని ఉత్పత్తి చేసే సమయంలో పాలీ అన్శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు (PUFA) ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడం జరుగుతుంది. ఇలాంటి నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి కాలక్రమేణ కేన్సర్ కారకాలుగా మారి వివిధ రకాల కేన్సర్లకు దారితీస్తుంది. అయితే సాంప్రదాయ నూనెల్లోనూ, ఆవాల నూనెలను మరిగించినప్పుడూ వాటిలో అధిక పొగ పాయింట్ ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లాలను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్లుగా విడిపోవడాన్ని నిరోధిస్తుందని, అందువల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని వివరించారు. కాబట్టి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆవాల నూనెను వాడమని పదేపదే నొక్కి చెబుతున్నారు పోషకాహార శాస్త్రవేత్తలు. (చదవండి: స్నేహితుడిలా ఉండే ఏఐ ఆధారిత నెక్లెస్..ధర ఎంతంటే..!) -
ఆ వ్యాధి ధనవంతులకే వస్తుందా?
ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయి అని పూర్వం అనుకునేవారు. డబ్బుతో వైద్యం కొనవచ్చునని, కావాల్సిన ఆహార పదార్థాలు తెప్పించుకు తినగలరని తద్వారా ఎలాంటి వ్యాధినైనా వారు తట్టుకోగలరని అంచనా. అలాగే కొన్ని రకాల వ్యాధులు వారికి మాత్రమే వస్తాయన్న అపోహ కూడా ఉండేది. కానీ ఇప్పుడూ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో అదే నిజమని తేలింది. ముఖ్యంగా ప్రాణంతక వ్యాధి అయిన కేన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎవరికి అధికమో సవివరంగా వెల్లడించారు పరిశోధకులు. అవేంటో చూద్దామా..!ఫిన్లాండ్లోని హెల్సింకీ విశ్వవిద్యాలయం నిర్వంహించిన సరికొత్త అధ్యయనం ప్రకారం... మనకొచ్చే వ్యాధులకూ, సామాజిక, ఆర్థిక పరిస్థితికీ మధ్య సంబంధం ఉంది. మరీ ముఖ్యంగా కేన్సర్ విషయంలో. ఈ ప్రాణాంతక వ్యాధి పేదల కంటే సంపన్నులకు వచ్చే అవకాశాలు ఎక్కువని వీరు తేల్చారు. ముఖ్యంగా ధనవంతులలో రొమ్ము, ప్రొస్టేట్, వంటి ఇతర రకాల కేన్సర్ వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. తక్కువ సంపాదన కలవారు డిప్రెషన్కి గురై ఆల్కహాల్కి బానిసవ్వడంతో ఊపిరితిత్తుల కేన్సర్ తోపాటు మధుమేహం, ఆర్థరైటిస్ల వంటి వ్యాధులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఎక్కువ ఆదాయాలు ఆర్జించే సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రోమ్ము కేన్సర్కి సంబంధించిన జన్యు ప్రమాదం గురించి ముందుగానే వైద్యులని సంప్రదించడం, చికిత్స తీసుకోవడం వంటివి చేస్తారు. ముఖ్యంగా తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళలు కంటే వీరే అధికంగా ఆస్పత్రులను సందర్శించడం జరుగుతుందని పరిశోధన పేర్కొంది. అందుకోసం శాస్త్రవేత్తల బృందం సుమారు 80 ఏళ్ల వయసుగల దాదాపు రెండు లక్షలకు పైగా ఫిన్లాండ్ పౌరుల ఆరోగ్య డేటాని సేకరించారు. దానిలో వారి సామాజిక పరిస్థితితో లింక్అప్ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్ చేశారు. అయితే ఇలా వ్యాధుల వచ్చే ప్రమాదం జెండర్ పరంగా చూస్తే ఆడ, మగలో మద్య చాలా తేడా ఉందని, ఇది వారి వయసు మీద ఆధారపడి ఉంటుందని డాక్టర్ హగెన్ బీక్ చెప్పారు. ఇక్కడ వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడయ్యింది. ఇక్కడ ఒక వ్యక్తిలో జన్యు సమాచారం అనేది జీవితకాలంలో మారదు. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారినప్పుడూ వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యుప్రభావం మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒక నిర్థిష్ట వృత్తితో లింక్ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి వివిధ పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు.(చదవండి: ఎద్దులు కాపలాకాస్తున్న సమాధి..ఏకంగా రెండువేల..!) -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
మొక్కలు కూడా అరుస్తాయి..శబ్దాలు చేస్తాయ్.!
మొక్కలకు భాష ఉంటుందని, నీళ్లు పోసినపుడు ఆనందంతో కొమ్మలు ఊపూతూ ఆనందాన్ని ప్రకటిస్తాయని చాలా సార్లు విన్నాం. తాజాగా మొక్కలకూ బాధ ఉందనే విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా గట్టిగా అరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఆక్రోశిస్తాయి. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాలను గుర్తించారు. సెల్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దమైన మైదానంలో కూడా మనకు వినబడని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు అర్థం ఉంటుంది. ఈ శబ్దాలను వినగలిగే జంతువులూ ఉన్నాయి. కాబట్టి చాలా శబ్ద పరస్పర చర్య జరిగే అవకాశం ఉందని పరిణామాత్మక జీవశాస్త్రవేత్త లిలాచ్ హడానీ తెలిపారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు. లిలాచ్ హడానీ డా. హడానీ , ఆమె బృందం ఈ ప్రయోగాల కోసం టమాటాలు, పొగాకు మొక్కలను పరిశీలించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా ఒత్తిడి లేని మొక్కలు, కాండం పెకిలించిన మొక్కలు, నిర్జలీకరణ మొక్కలు ఉత్పత్తి చేసే శబ్దాల మధ్య తేడాను గుర్తించానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. ఒత్తిడి లేని మొక్కలు ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న మొక్కలు చేసిన శబ్దాలు అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు లేదా క్లిక్ చేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. మొక్కలు తమ బాధలను తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవుతాయని తెలుసు. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. -
వాటర్ బాటిల్లోని నీరు ఎన్నాళ్లకు పాడవుతుంది?
నదిలో పారేనీరు నిత్యం శుభ్రంగా ఉంటుందని అంటారు. అయితే క్లోజ్డ్ బాటిల్లోని నీటికి గడువు తేదీ ఉంటుందా? అయితే ఆ నీరు ఎప్పుడు చెడిపోతుంది? దాని గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఎప్పుడో ఒకప్పుడు వాటిర్ బాటిల్పై గడువు తేదీని చూసేవుంటాం. ఒక నివేదిక ప్రకారం వాటిర్ బాటిల్లోని నీటిని దాని ప్యాకింగ్ తేదీ నుంచి రెండేళ్లపాటు వినియోగించవ్చు. బాటిల్లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందని, అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీరు తాగడానికి పనికిరాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాస్తవానికి వాటర్ బాటిల్ గడువు తేదీ దానిలోని నీటికి సంబంధించినది కాదు. బాటిల్ గడువు తేదీ అని దాని అర్థం. వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ రీసెర్చ్ నివేదిక ప్రకారం పంపు నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చు. ఆ నీటిని ఉపయోగించవచ్చు. అయితే కార్బోనేటేడ్ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత, అది కొద్దిగా ఆమ్లంగా మారుతుంది. అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదు. కంటైనర్లలో నీటిని నింపేటప్పుడు పైపులను నేరుగా ఉపయోగించకూడదని నిపుణులు చెబుతుంటారు. దానికి ప్రత్యామ్నాయంగా ఫిల్టర్ను వాడాలని సూచిస్తుంటారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు ఒక మూతను ఉంచాలి. నీటిని నిల్వ చేయడానికి మరొక మార్గం కూడా ఉంది. నీటిని సుమారు 15 నిమిషాలు మరిగించి, ఆ తరువాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు. -
కొండచిలువలు తినడం మంచిదంటున్న శాస్త్రవేత్తలు!
ఇంతవరకు మాంసాన్ని ల్యాబ్లో తయారు చేయడం వంటి వాటి గురించి కథనాలు విన్నాం. దీని వల్ల శాకాహారులకు కూడా మేలు జరుగుతుంది. వారికి కావాల్సిన పోట్రీన్లు ఇలా కృత్రిమంగా తయారు చేసిన మాంసం ద్వారా అందుతుందని భావించారు కూడా. అవన్నీ పరిశోధన దశల్లో ఉన్నాయి. ఇప్పుడు అది ఇది కాదంటూ ఏకంగా కొండచిలువలనే ఆహారంగా తినమని చెబుతున్నారు. పైగా ఆరోగ్యానికి మంచిదంటూ షాకింగ్ విషయాలు చెబుతున్నారు. ఎందుకిలా అన్నారంటే.. ఇంతవరకు మనుషులు మేకలు, గొర్రెలు, కోళ్లు వంటి ఇతరత్ర మాంసాలను తినేవారు. అయితే వీటి వల్ల కేవలం వంద గ్రాములు ప్రోటీన్ మాత్రమే ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అలాగే వీటి కారణంగా గాలిలో 49.89 కిలోగ్రాముల కార్బన్డయాక్స్డ్ విడుదలవుతుందని పరిశోధనల్లో తేలిందన్నారు. అందువల్ల మాంసాహారం ఎక్కువుగా తినడమనేది పర్యావరణాని హానికరమని నొక్కి చెబుతున్నారు పరిశోధకులు. వీటికి బదులు కొండచిలువలు తినడం చాలా మంచిదని, ఆరోగ్యంగా ఉంటామని చెబుతున్నారు. ఈ మేరకు తాము ఒక పొలంలో దాదాపు 12 నెలలపాటు పెంచిన రెండు కొండచిలువలపై జరిపిన అధ్యయనంలో తేలిందని సరీసృపాల నిపుణుడు డాక్టర్ డేనియల్ నాటుష్ చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ పలు షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఇవి నీరు లేకుండా దాదాపు నెలరోజులు జీవిస్తాయట. వీటి పొలుసుల మీద ఉండే నీటితోనే అన్ని రోజుల పాటు నీరు తీసుకోకుండా బతకగలవని అన్నారు. అలాగే దాదాపు ఒక సంవత్సరం పాటు ఏం తినకుండానే బతికేస్తాయట. అలాగే పంట బాగా పండటంలో వీటి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అన్నారు. అలాగే ఇవి తక్కువ గ్రీన్హౌస్ వాయువులను ఉత్పత్తి చేస్తాయని అన్నారు. ఇవి తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండగలవు, పైగా బ్లర్డ్ ఫ్లూ లేదా కోవిడ్ -19 వంటి వ్యాధులను వ్యాప్తి చేయవని అధ్యయనంలో వెల్లడయ్యిందని తెలిపారు. ఈ ఆసక్తికర పరిశోధన సైంటిఫిక్ రిసెర్చ్ ప్రచురితమయ్యింది. అలాగే వీటిని ఆహారంగా తీసుకుంటే మంచి ప్రోటీన్ పుష్కలంగా అందుతుందని అన్నారు. ఒక ఏడాదిపాటు సాగిన ఈ పరిశోధనలో తాము ఈ కొండచిలువలకు ఎలుకలు, చేపలు వంటి వాటిని ఆహరంగా అందించి ఎప్పటికప్పుడూ వాటి బరువుని కొలిచే వాళ్లమని చెప్పారు. అయితే ఈ రెండు పైథాన్లలో ఆడ కొండచిలువ వేగంగా బరువు పెరిగినట్లు పేర్కొన్నారు. వివి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కరువు ఏర్పడి పశువులు పెద్ద సంఖ్యలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో మాంసాహారంగా ఈ కొండచిలువలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తుల. వామ్మో కొండ చిలువ తినడమమా ఏందీ వింత పరిశోధన అని భావిస్తున్నారా?. టెన్షన్ పడొద్దు ఎందుకంటే..దీనిపై ఇంకా కూలంకషంగా విస్తృత స్థాయిలో పరిశోధనలు పూర్తి అయ్యేతే గానీ కార్య రూపం దాల్చదు. అదీగాక కొండచిలువల పెంపకం అనే విషయంలో సాధ్యా సాధ్యాలు కూడ అంచాన వేయాల్సి ఉంటుంది. (చదవండి: 'కుమారీ ఆంటీ' లాంటీ ఇన్సిడెంట్..మరీ ఇదేమవుతుందో..!) -
ఆ బ్యాటరీలు మన నెత్తిన పడతాయా?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం( ఐఎస్ఎస్) నుంచి మూడు టన్నుల బరువైన తొమ్మిది బ్యాటరీలు నేడు (శనివారం) భూమిపైకి దూసుకురానున్నాయి. 2021లో ఐఎస్ఎస్ నుంచి వేరుపడిన ఈ బ్యాటరీలు ఇప్పుడు భూమిపై పడనున్నాయి. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత బరువైన ఎక్స్పోజ్డ్ ప్యాలెట్ 9 (ఈపీ9)ను 2021, మార్చి లో అంతరిక్ష కేంద్రం నుంచి తొలగించారు. దీనిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి పైకి విసిరిన అత్యంత భారీ వస్తువుగా గుర్తించారు. ఉపయోగించిన లేదా అనవసరమైన పరికరాలను ఈ విధంగా పారవేయడం అంతరిక్ష కేంద్రంలో సాధారణంగా జరుగుతుంటుంది. ఇవి భూ వాతావరణంలో ఎటువంటి హాని లేకుండా కాలిపోతాయి. ఈపీ9 దూసుకువచ్చే ముందు జర్మనీలోని నేషనల్ వార్నింగ్ సెంటర్ పౌర రక్షణ, విపత్తు ఉపశమనం కోసం ఈ సమాచారాన్ని విడుదల చేసింది. ‘మార్చి 8 మధ్యాహ్నం నుంచి, మార్చి 9 మధ్యాహ్నం మధ్య భారీ అంతరిక్ష శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది’ అని తెలిపింది. హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్ మెక్డోవెల్ చేసిన సోషల్ మీడియా పోస్ట్లోని వివరాల ప్రకారం ఈ ఖగోళ వ్యర్థాలు మార్చి 9న ఉదయం 7:30 నుంచి మార్చి 9 ఉదయం 3:30 మధ్య భూ వాతావరణంలోకి ప్రవేశించనున్నాయి. పలు నివేదికల ప్రకారం ఈ బ్యాటరీలు భూమికి ఎటువంటి హాని కలిగించవు. ఎందుకంటే అవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే, కాలిపోయి బూడిదగా మారతాయి. అయితే వాటిలోని కొన్ని శకలాలు భూమికి చేరవచ్చు. అయితే వీటి వలన భూమికి ఎలాంటి హాని జరగదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అంతరిక్షం నుంచి దూసుకు వస్తున్న ఈ బ్యాటరీలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అయితే ఇవి ఎక్కడ, ఎప్పుడు పడతాయనే దానిపై పలు అంచనాలు వేస్తోంది. దీనిపై ఖచ్చితమైన సమాచారం ఏజెన్సీకి ఇంకా అందుబాటులో రాలేదు. వాతావరణం తీరుతెన్నుల కారణంగా ఈ బ్యాటరీలు భూమిపై పడే ప్రాంతాన్ని ఖచ్చితంగా చెప్పడం శాస్త్రవేత్తలకు అసాధ్యంగా మారింది. అంతరిక్షం నుంచి భూమిపైకి శకలాలు దూసుకు రావడం కొత్తేమీ కాదు. ప్రతిరోజూ ఉపగ్రహాల నుండి వ్యర్థాలు భూమిపై పడుతుంటాయి. కొన్ని వేల సంవత్సరాలుగా ఇలా జరుగుతోంది. అయితే భారీ బ్యాటరీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి భూమికి దూసుకు వస్తున్నప్పుడు శాస్త్రవేత్తలలోనూ ఆందోళన నెలకొనడం సహజం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇది అంతరిక్ష శాస్త్రవేత్తల పరిశోధనా కేంద్రం. ఇది అమెరికా, రష్యాతో సహా అనేక దేశాల ఉమ్మడి ప్రాజెక్ట్. శాస్త్రవేత్తల బృందం అంతరిక్ష సంబంధిత ప్రయోగాలను ఇక్కడ నిర్వహిస్తుంటుంది. అంతరిక్షంలో మరో అంతరిక్ష కేంద్రం కూడా ఉంది. దానిని చైనా నిర్మించింది. -
కిచెన్లో ఉండే ఆ రెండిటితోటే మైక్రోప్లాస్టిక్కి చెక్!
మైక్రోప్లాస్టిక్లు ప్రస్తుతం ఆహారం, నీరు, గాలిలో ఇలా ప్రతి చోట ఉంటున్నాయి. ప్రస్తుతం ఇదొక పెద్ద సమస్యలా మారింది. వీటిని ఫిల్టర్ చేయడానికి శాస్త్రవేత్తలు పలు విధాల ప్రయత్నిస్తున్నారు. అందుకు సంబంధించి పలు టెక్నిక్లను అభివృద్ధి చేశారు. అయితే తాజగా శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం సమర్థవంతంగా మైక్రో ప్లాస్టిక్కు చెక్పెట్టింది. ఇక్కడ మైక్రోప్లాస్టిక్లు అంటే 5 మిల్లీమీటర్లు(0.2 అంగుళాలు) కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్లని అర్థం. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలే సౌందర్య ఉత్పత్తుల్లో కూడా కనిపిస్తాయి. ఇవి పెద్దగా ఉండే ప్లాస్టిక్ వస్తువుల కీణత కారణంగా వచ్చేవే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు. ఇక యునెస్కో ఓషన్ లిటరసీ పోర్టల్ ప్రకారం ఈ మైక్రో ప్లాస్టిక్ ముక్కలు చాలా వరకు మహాసముద్రాల్లోనే కలిసిపోతాయని పేర్కొంది. వాటిలో సుమారు 50 నుంచి 70 మిలియన్ల వరకు పెద్ద, చిన్న సైజులో ప్లాస్టిక్ కణాలు ఉండొచ్చనేది అంచనా. ఈ ప్లాస్టిక్ రేణువుల్లో చాలా విషపూరిత రసాయనాలు ఉంటాయి. ఆ తర్వాత ఇవే కాలక్రమేణ ఈ నానో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఇవి చాల చిన్నవి కాబట్టి ప్రేగులు, ఊపిరితిత్తులు గుండా నేరుగా రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి మన హృదయం, మెదుడు వంటి అవయవాల్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ సముద్రంలో ఉండే ఈ చిన్న కణాలు తాగు నీటిలో కూడా చేరడం వల్లే ఇదంతా జరుగుతుంది. ఇవి శరీరంలోని సహజ హార్మోన్ల విడుదలకు అంతరాయం కలిగించడమే కాకుండా పునరుత్పత్తి లోపాలు, కేన్సర్ ప్రమాదాలను పెంచుతాయి. దీన్ని చెక్ పెట్టేందుకు చైనాలోని గ్వాంగ్జౌ మెడికల్ యూనివర్సిటీ, జినాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వంటగది సామాన్లనే ఉపయోగించింది. వీటితోనే మైక్రో ప్లాస్టిక్లకు సంబంధించి దాదాపు 80%పైగా తొలగించింది. కేవలం ఒక కేటిల్ సాధారణ వాటర్ ఫిల్టర్ని ఉపయోగించి మైక్రోప్లాస్టిక్లను ఈజీగా తొలగించింది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్లో వెల్లడించారు. ఆ పరికరాలతో ఝాన్జున్ లీ, ఎడ్డీ జెంగ్ అనే శాస్త్రవేత్తల బృందం ఖనిజాలతో కూడిని నీటి నమునాలను సేకరించారు. వాటిలో నానో, మైక్రో ప్లాస్టిక్ల కణాల డోస్ని పెంచింది. వాటిని ఐదు నిమిషాల మరిగించింది. ఐతే ప్రతిసారి ఆ నీరు మరుగుతున్నప్పుడూ పైకిలేచే ఫ్రీ ఫ్లోటింగ్ ప్లాస్టిక్ మొత్తాన్ని బృందం తొలగించే ముందు చల్లబరిచి వేరు చేసేది. ఖనిజాలతో కూడిని ఈ నీటిలో లైమ్స్కేల్, కాల్షియం కార్బోనేట్ వంటి పదార్థాలు ఉంటాయి. ఎప్పుడైతే మరిగిస్తామో అప్పుడు టీ, కాఫీ వంటివి కాచినప్పుడూ ఎలా పైకి నల్లటి తెట్టు వస్తుందో అలా తెట్టులాగా తెల్లటి ఒట్టు ఈ మైక్రో ప్లాస్టిక్ కణాలను నీటి నుంచి వేరు చేస్తుంది. తద్వారా ఈజీగా తాగే నీటి నుంచి ప్లాస్టిక్ కణాలను వేరవ్వుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: భారతీయ సంగీతంతో అలరిస్తున్న జర్మన్ సింగర్!) -
భారతదేశం రెండు ముక్కలు కానుందా?
హిమాలయ పర్వత శ్రేణికి దిగువన భారత, యురేషియా ఖండాంతర టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొంటున్న కారణంగా హిమాలయాలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు ఏనాడో గుర్తించారు. అయితే ఇండియన్ ప్లేట్లోని కొంత భాగం యురేషియన్ ప్లేట్ కింద జారిపోతున్నందున అది ‘డీలామినేట్’ అవుతున్నదని పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. ఈ ప్రక్రియ భారత్ను బౌగోళికంగా విభజించే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా రెండు టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్నప్పుడు, ఒకదాని కిందకు మరొకటి కిందకి జారిపోతుంది. ఈ ప్రక్రియను సబ్డక్షన్ అంటారు. రెండు ఖండాంతర పలకలు సమానంగా ఉన్నందున, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలకు ఏ ప్లేట్ మరొకదానిపై అతివ్యాప్తి చెందుతుందో ఖచ్చితంగా గుర్తించలేరు. ఇండియన్ ప్లేట్లోని దట్టమైన దిగువ భాగం పై భాగానికి దూరంగా ఉంటుంది. వీటిమధ్య నిలువుగా ఏర్పడిన పగులును శాస్త్రవేత్తలు గుర్తించారు. భారత- యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య 60 మిలియన్ సంవత్సరాలకు పైగా జరుగుతున్న ఘర్షణ హిమాలయాలకు ఇప్పుడు మనం చూస్తున్న ఆకృతినిచ్చింది. సముద్రపు పలకల వలె కాకుండా, ఖండాంతర పలకలు మందంగా, తేలికగా ఉంటాయి, అవి భూమిలోని మాంటిల్లోకి సులభంగా ఇమిడిపోవు. భౌగోళిక భౌతిక శాస్త్రవేత్తల అంతర్జాతీయ బృందం ఇటీవల టిబెట్ భాభూగం కింది భూకంప తరంగాలను విశ్లేషించింది. ఈ నేపధ్యంలో యురేషియన్ ప్లేట్ దాని కింద జారిపోతున్నందున భారత ప్లేట్ విచ్ఛిన్నమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపింది. ఈ బృదం యురేషియన్ ప్లేట్ మధ్య సరిహద్దు వద్ద పగుళ్లను కూడా కనుగొంది. భూకంప తరంగాలు, హీలియం వాయువులు ఉపరితలంపైకి చొచ్చుకు రావడం ఈ డీలామినేషన్ ప్రక్రియకు సాక్ష్యంగా నిలుస్తున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నూతన పరిశోధనా ఫలితాలు మునుపటి పరికల్పనలను సవాలు చేస్తున్నాయి. భౌగోళిక ప్రక్రియలను మరింతగా గుర్తించేలా చేస్తున్నాయి. ఇన్నాళ్లూ పరిశోధకులు ఖండాలు ఏర్పడటం వెనుక ఇటువంటి ప్రక్రియ ఉంటుందనే దానిపై పరిశోధనలు సాగించలేదు. అయితే ఈ కొత్త అధ్యయనం మరిన్ని నూతన ఆవిష్కరణలకు నాంది పలకనుంది. ఈ పరిశోధన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో సమర్పించారు. ఇది హిమాలయాల ఆవిర్భావాన్ని మరింతగా అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.అలాగే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూకంప ప్రమాదాలను పసిగట్టేందుకు సహాయకారిగానూ ఉండవచ్చు. -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
1700 ఏళ్ల నాటి పురాతన గుడ్డు..ఇప్పటికీ లోపల పచ్చసొన..!
పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలతో నాటి కాలంలో వాడే పనిముట్లు, వారు ఉపయోగించిన టెక్నాలజీ తదితరాలను వెలికితీస్తుంటారు. నాటి పూర్వీకుల వైభవం కళ్లముందుకు తీసుకురావడమే గాక తెలియని ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తుంటారు. అలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణను తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చారు. మాములుగా ఏ గుడ్డు అయినా సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఆ తర్వాత కుళ్లిపోడవం లేదా పాడైపోవడం జరుగుతుంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించిన అద్భుత ఆవిష్కరణ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఇంతకీ అదేంటంటే..? వివరాల్లోకెళ్తే..శాస్తవేత్తలు.2007-2016 నుంచి జరుపుతున్న ఐలెస్బరీ త్రవ్వకాల్లో ఏకంగా 17 వందల ఏళ్ల నాటి పురాతన రోమన్ గుడ్డుని గుర్తించి వెలికితీశారు. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో మరో మూడు గుడ్లు ఉన్నప్పటికీ అవి బయటకీ తీసే క్రమంలో పగిలి దుర్గంధం వెదజల్లింది. అయితే ఈ గుడ్డుని శాస్త్రవేత్తలు జాగ్రత్తగా వెలికితీశారు. నీటితో నిండి ఉన్న గొయ్యి నుంచి వీటిని బయటకు తీయడం జరిగింది. ఇది నాటి రోమన్ల వైభవాన్ని గుర్తు చేస్తోంది. ఇక మైక్రో స్కాన్లతో ఆ గుడ్డుని పరీక్షించగా దానిలో పచ్చసొన, తెల్లసొనతో చెక్కు చెదరకుండా ఉన్నట్లు చూపించాయి. అన్ని వేల ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉండటం అందర్నీ చాలా ఆశ్చపర్చింది. నాటి రోమన్లు వాడే సాంకేతికత శాస్త్రవేత్తల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్ ఆర్కియాలజీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎడ్వర్డ్ బిడ్డుల్ఫ్ మాట్లాడుతూ..అక్కడ తవ్వకాల్లో బయటపడిన వాటిని చూసి తాము ఒక్కసారిగా షాకయ్యామని, ఊహించని వాటిని కనుగొనడమే కాకుండా చెక్కుచెదరకుండా ఉండటం మమల్ని మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నారు. ప్రంపచంలోనే వేల ఏళ్ల నాటి నుంచి చెక్కుచెదరకుండా ఉన్న తొలి కోడిగుడ్డు ఇదే అన్నారు. నిజానికి ఆ గుడ్డు లోపల ద్రవాలు ఉండవని అనుకున్నాం. అయితే స్కాన్లో పచ్చసొన, అల్బుమెన్ వంటివి కనిపించడం నిజంగా అద్భుతం అనిపించింది. దీన్ని తాము లండన్లో ఉన్న నేచురల్ హిస్టరీ మ్యూజియమ్కు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే ఆ గుడ్డుని సంరక్షించే పద్ధతుల గురించి ఆ మ్యూజియంలో ఉండే పక్షుల సంరక్షకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. (చదవండి: అతిపెద్ద ఉప్పు సరస్సు గుండా వెళ్తున్న రైలు..వీడియో వైరల్) -
న్యూటన్ ఎక్కడ పుట్టారు? రెండు పుట్టిన రోజులు ఎందుకు?
ప్రముఖ శాస్త్రవేత్త, గణిత మేథావి ఐజాక్ న్యూటన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. పాఠశాల పుస్తకాలలో అతని పేరు తప్పక కనిపిస్తుంది. న్యూటన్ గణిత శాస్త్రజ్ఞుడు, భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, వేదాంతవేత్త ఇలా మరెన్నో సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అయితే న్యూటన్ తన గురుత్వాకర్షణ, చలన నియమాలకు ప్రసిద్ధి చెందారు. అయితే న్యూటన్ ఎక్కడ పుట్టారో తెలుసా? అలాగే ఆయనకు రెండు పుట్టిన రోజులు ఎందుకు వచ్చాయో తెలుసా? న్యూటన్ ఇంగ్లాండ్లోని లింకన్షైర్ కౌంటీలోని వూల్స్టోర్ప్-బై-కోల్స్టర్వర్త్లోని వూల్స్టోర్ప్ మనోర్లో 1642, డిసెంబరు 25న జన్మించారు. న్యూటన్ పుట్టిన మూడు నెలలకు అతని తండ్రి కన్నుమూశారు. అతని పూర్తి పేరు ఐజాక్ న్యూటన్. న్యూటన్కు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు, అతని తల్లి మరో వివాహం చేసుకుంది. ప్రపంచానికి వినూత్న ఆవిష్కరణలు అందించిన న్యూటన్ 1727 మార్చి 20న కన్నుమూశారు. వెస్ట్ మినిస్టర్ అబ్బేలో న్యూటన్ సమాధి ఉంది. న్యూటన్కు పిల్లలు లేరు. అతని ఆస్తిని బంధువులు స్వాధీనం చేసుకున్నారు. న్యూటన్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. న్యూటన్కు రెండు పుట్టినరోజులు. నాటి రోజుల్లో అమలులో ఉన్న క్యాలెండర్ కారణంగా అతని పుట్టిన తేదీల మధ్య పది రోజుల తేడా ఉంది. న్యూటన్ పుట్టిన రోజు జనవరి 4నే కాకుండా, డిసెంబర్ 25న కూడా వస్తుంది. న్యూటన్ తన పుట్టినరోజును డిసెంబర్ 25న ఇంగ్లాండ్లో జరుపుకున్నారు. ఇంగ్లాండ్ వెలుపల అతని పుట్టినరోజు జనవరి 4 కింద లెక్కిస్తారు. ఆ సమయంలో జూలియన్ క్యాలెండర్ను ఇంగ్లాండ్లో ఉపయోగించారు. ఈ క్యాలెంటర్ యూరప్కు భిన్నమైనది. దీని ప్రకారం న్యూటన్ 1642, డిసెంబరు 25న జన్మించారు. ఆ సమయంలో ఐరోపాలో గ్రెగోరియన్ క్యాలెండర్ను అనుసరించేవారు. దీని ప్రకారం న్యూటన్ 1643 జనవరి 4న జన్మించారు. -
పక్షులు డైనోసార్ల వంశమా?
డైనోసార్లకు సంబంధించిన విషయాలను మనం వింటూనే ఉంటాం. డైనోసార్లు భూమిపై మనుగడసాగించిన అతిపెద్ద జంతువులనే విషయం మనకు తెలిసిందే. సుమారు ఆరున్నర బిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఉల్క భూమిని తాకింది. ఫలితంగా డైనోసార్ల ఉనికి తుడిచిపెట్టుకుపోయింది. అయితే డైనోసార్ల వంశం ఇప్పటికీ భూమిపై ఇంకా సజీవంగా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోతారు. ఇది వినడానికి వింతగా అనిపించినా ఇదే నిజం. పక్షులు డైనోసార్ల వంశం అని చెబుతారు. దీని వెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న పక్షులు డైనోసార్ల వంశానికి చెందినవని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనిని అనుసరించి చూస్తే డైనోసార్లు ప్రపంచం నుంచి పూర్తిగా అంతరించిపోలేదు. డైనోసార్లు, పక్షులు కలిసి జీవించడమే దీనికి కారణం. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతం అయ్యాయి. అయితే పక్షులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాయి. అయితే శాస్త్రవేత్తలు దీనికి సంబంధించి ఎటువంటి ప్రామాణిక రుజువును ఇంకా అందించలేదు. దీనిని నిరూపించడానికి భిన్నమైన సిద్ధాంతాలను వెలిబుచ్చారు. డైనోసార్ల శరీర నిర్మాణం.. పక్షుల శరీర నిర్మాణాన్ని పోలివుంటుందని తెలిపారు. నాడు జరిగిన మహా విపత్తు నుంచి పక్షులు ఎలా బతికాయనేదానికి శాస్త్రవేత్తలు ఇంకా ఖచ్చితమైన కారణం కనుగొనలేదు. అయితే గ్రహశకలం భూమిని ఢీకొన్న తర్వాత దంతాలు లేని పక్షులు మాత్రమే జీవించాయని వారు చెబుతున్నారు. దీనికి సరైన సిద్ధాంతం ఇంకా వెలువడలేదు. ఈ సిద్ధాంతాలను శాస్త్రవేత్తలు తమ పరిశోధనల నేపధ్యంలో వెల్లడించారు. -
మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!
ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు. వివరాల్లోకెళ్తే..జపాన్కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్లో కెమెరాలో రికార్డయింది. If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti — HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024 (చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
సౌర వ్యవస్థలో గ్రహాలెన్ని? తొమ్మిదా? ఎనిమిదా?
మన సౌర కుటుంబంలోని గ్రహాలు ఎన్ని? తొమ్మిది అని.. అవి బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్, ఫ్లూటో.. అని వెంటనే చెప్పేముందు ఒకసారి ఆగండి.. గతంలో గ్రహానికున్న లక్షణాలు లేవంటూ ఫ్లూటోను ఆ లిస్టులోంచి తీసేశారు. కొన్నేళ్ల కిందట శాస్త్రవేత్తలు..గ్రహాలకు సంబంధించిన గుర్తింపునకు దాని పరిమాణం, ఆకృతి, కక్ష్య తదితర నిబంధనలు రూపొందించారు. ఈ లక్షణాలలో కొన్నింటికి అనుగుణంగా ఫ్లూటో లేకపోవడంతో దానిని గ్రహాల లిస్టు నుంచి తొలగించి.. మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చారు. ఖగోళ శాస్త్రవేత్తలు 1990ల ప్రారంభంలో సౌరకుటుంబంలోని నెప్ట్యూన్కు మించిన ఖగోళ పదార్థాలను కనుగొన్నారు. వీటిని ట్రాన్స్-నెప్ట్యూనియన్ ఆబ్జెక్ట్స్ (టీఎన్ఓఎస్) అని పిలుస్తారు. ఇవి సౌర వ్యవస్థ అంచున ఉన్న కైపర్ బెల్ట్ను కలిగి ఉంటాయి. కైపర్ బెల్ట్ అనేది మన సౌర వ్యవస్థలో ఒక భాగం. ఇది సూర్యుని నుండి దాదాపు 30 నుండి 50 ఖగోళ యూనిట్ల దూరంలో విస్తరించి ఉంది. 2005లో ‘ఎరిస్’(మరగుజ్జు గ్రహం)ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది దాదాపుగా ప్లూటోతో సమానమైన పరిమాణంలో ఉంది. కానీ దీనిని గ్రహంగా పరిగణించరాదనే వాదనను బలపడింది. సమయం గడిచేకొద్దీ శాస్త్రవేత్తలు విశ్వం అంతటా గ్రహాలు సమృద్ధిగా ఉన్నాయని కనుగొన్నారు. దీంతో అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సమాఖ్య 2006లో గ్రహం అనే పదానికి సరికొత్త నిర్వచనం అవసరమని నిర్ణయించింది. సౌర వ్యవస్థలోని గ్రహం నిర్వచనం కోసం వారు మూడు ప్రమాణాలను సూత్రీకరించారు. ఒక గ్రహం అనేది సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది తప్పనిసరిగా గురుత్వాకర్షణ శక్తి కలిగి గుండ్రంగా ఉండాలి. అలాగే ఆ గ్రహం తన కక్ష్యలోని శిధిలాల మార్గాన్ని క్లియర్ చేయడానికి సొంత గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉండాలి. దీని ప్రకారం ప్లూటో మొదటి రెండు ప్రమాణాలను కలిగి ఉంది. మూడవ లక్షణం దానిలో లేదు. అందుకే ప్లూటో, ఎరిస్లతో పాటు ఇతర ట్రాన్స్-నెప్ట్యూనియన్ పదార్థాలను ‘మరగుజ్జు గ్రహాలు’గా వర్గీకరించారు. ఇప్పుడు సౌర వ్యవస్థలో గ్రహాలు ఎన్ని అనేదానికి సమాధానం చెప్పాల్సివస్తే అవి ఎనిమిది అని చెప్పాలి. ఇంతకుమించి ఏమున్నాయనే విషయానికొస్తే ప్రస్తుతం ధృవీకరించిన ఎక్సోప్లానెట్ల సంఖ్య ఐదు వేలకుపైగానే ఉంది. -
రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు!
ఈజిప్టులోని గిజాలో గల గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో మనకు తెలియజేసేందుకు ఒక రోబోట్ దాని లోపలికి ప్రవేశించి పలు రహస్యాలను బయటపెట్టింది. మానవీయంగా సాధ్యమయ్యే దానికంటే ఈ రోబో ఇప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మనముందుకు తీసుకుచ్చింది. ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్లోకి వెళ్లడం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్.. అంటే అతిపెద్ద ఈజిప్షియన్ పిరమిడ్. కైరో శివార్లలోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని నాలుగవ పాలకుడు ఫారో ఖుఫు సమాధి అని చెబుతుంటారు. ఈ పిరమిడ్ సుమారు 4,500 ఏళ్ల క్రితం నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పేరొందిన ఈపిరమిడ్ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా క్వీన్స్ ఛాంబర్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు.. తమ తవ్వకాలతో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అన్వేషణ దిశగా ముందుకుసాగారు. తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్లోకి 40-డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయితే లీడ్స్లోని రోబోటిక్స్ ప్రొఫెసర్ రాబ్ రిచర్డ్సన్, అతని బృందం 2010లో ఈ సవాలును స్వీకరించారు. హాంకాంగ్ దంతవైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ ట్జే చుయెన్గ్ పిరమిడ్లోని షాఫ్ట్ను నావిగేట్ చేయడానికి. పిరమిడ్లోపలి పైభాగానికి చేరుకోవడానికి ఎవరైనా రోబోట్ను డిజైన్ చేస్తే బాగుంటుందని భావించాడు. ఎట్టకేలకు యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు ఐదు సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోబోను రూపొందించారు. పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్సన్ మాట్లాడుతూ పిరమిడ్ లోనికి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దానిని ఐదు కిలోలకు తగ్గించామన్నారు. తరువాత పాసేజ్వే ద్వారా రోబోట్ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. ఈ రోబో పిరమిడ్ లోపలి భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫొటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫొటోనుపంపింది. అయితే పిరమిడ్లోని షాఫ్ట్ (స్థూపాకారం) ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని ప్రొఫెసర్ రిచర్డ్సన్ వివరించారు. ఈ స్థూపాకారంలో 50 మీటర్లు ముందుకుసాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని రిచర్డ్సన్ తెలిపారు. కాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ విలియం వెస్ట్వే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టపై ఒక సినిమా తీశారు. ఈ సినిమా పురాతన నాగరికతకు చెందిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. రోబోటిక్ ఇంజనీరింగ్ సాయంతో పిరమిడ్లోని రహస్యాలు ఎలా వెల్లడయ్యాయో ఈ చిత్రం వెల్లడిస్తుందని వెస్ట్వే తెలిపారు. -
ఒక లీటర్ బాటిల్లో ఎన్ని నానో ప్లాస్టిక్ కణాలు ఉంటాయో తెలుసా!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ మంచిది కాదన్న విషయం తెలిసిందే. ఆ నీటిలోకి ప్లాస్టిక్ కణాలు ఉంటాయని అవి మనకు రకరకాల ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడతాయిని విన్నాం. అంతవరకు తెలుసు కానీ ఎంత స్థాయిలో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయన్నది పూర్తిగా తెలియదు. ఈ తాజా అధ్యయనాల్లో రెండు లక్షలకు పైగా ప్లాస్టిక్ కణాలు, నానో ప్లాస్టిక్స్ ఉండొచ్చిన వెల్లడయ్యింది. అవి నేరుగా రక్తంలో ప్రవేశించి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ జర్నల్లో పీర్ రివ్యూడ్ స్టడీ పేరుతో ఈ పరిశోధన ప్రచురితమయ్యింది. ఈ నానో ప్లాస్టిక్ కణాలు మనిషి వెంట్రుకలో డెబై వంతు వెడల్పుతో ఉన్నాయని అన్నారు. మునపటి అధ్యయనాల్లో అంచనావేసిన దానికంటే వందరెట్లు ఉండొచ్చని చెబుతున్నారు. ఎందుకంటే? గత అధ్యయనాల్లో మైక్రోప్లాస్టిక్లు సుమారు ఐదు వేలు ఉన్నట్లు అంచనా వేశారు. అంతేగాదు మైక్రోప్లాస్టిక్ల కంటే రేణువుల్లా ఉండే ఈ నానో ప్లాస్టక్లు మరింత ప్రమాదకరమైనవి. ఇవి నేరుగా మాన రక్తప్రవాహంలో ప్రవేశించి అవయవాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పరిశోధకులు. అంతేగాదు ఇవి పుట్టబోయే బిడ్డలోకి మాయ ద్వారా చేరే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ నానోప్లాస్టిక్ని గుర్తించే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదన్నారు. ఆ పరిస్థితిని అధిగమించడానికి కొత్త మైక్రోస్కోపీ టెక్నీక్ను కనుగొన్నారు. అందుకోసం యూఎస్లోని మూడు ప్రసిద్ధ బ్రాండ్ల నుంచి సుమారు 25 లీటర్ వాటార్ బాటిళ్లను కొనుగోలు చేశారు. ప్రతి లీటర్లలో సుమారు ఒక లక్ష నుంచి మూడు లక్షల దాక ప్లాస్టిక్ కణాలను గుర్తించారు. వాటిలో దాదాపు 90% వరకు నానోప్లాస్టిక్లు. ఈ పరిశోధన నానోప్లాస్టిక్లను విశ్లేషించడంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడుతుందని కొలంబియా పరిశోధకుడు నైక్సిన్ కియాన్ అన్నారు. వీటిలో ఏడు సాధారణ ప్లాస్టిక్ రకాలను లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా పాలిథిన్ టెరెఫ్లాలేట్(పెట్), పాలిమైడ్ వంటి వాటిపై దృష్టిసారించారు. ఎందుకంటే వీటిని సీసాలు తయారు చేయడంలోనూ, బాటిల్ని శుద్ధి చేయడంలోనూ ఉపయోగిస్తారు. అయితే వీటికి సంబంధించిన నానోప్లాస్టిక్ బాటిల్ నీటిలో చాలమటుకు గుర్తించబడవని అన్నారు. గత పరిశోధనలు పరిశీలిస్తే.. 2022 అధ్యయనంలో నీటి పంపుల కంటే వాటర్ బాటిల్లోనే మైక్రోప్లాస్టిక్ సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇక 2021లో జరిపిన అధ్యయనంలో మూతను తెరిచి మూయడం వల్ల కూడా చిన్ని బిట్ల మాదిరిగా ప్లాస్టిక్ కణాలు నీటిలో చేరతాయని చెప్పారు. ఈ తాజా అధ్యయనం మాత్రం వాటర్ బాటితో ఆగకుండా పంపు నీటిలో ఉన్న మైక్రో ప్లాస్టిక్లను కూడా కనుగొనడమే తమ లక్ష్యం అని పరిశోధకులువివరించారు. అందుకోసం అంటార్కిటికా పంపు నీటిలోని మంచు నుమునాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నానోప్లాస్టిక్ చూడటానికి అత్యంత చిన్న రేణువులు, కానీ వీటి వల్ల మానవాళికి వాటిల్లే ముప్పు అంతా ఇంత కాదని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. (చదవండి: 'స్పేస్ మీల్': వ్యోమగాముల కోసం ప్రత్యేక భోజనం! తయారు చేసిన శాస్త్రవేత్తలు) -
బొగ్గు గని తవ్వకాల్లో అద్భుత ఖజానా..
అప్పుడప్పుడు తవ్వకాల్లో లభ్యమయ్యే పురాతన వస్తువులు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అమెరికాలోని నార్త్ డకోటాలో జరిపిన తవ్వకాల్లో ఒక కార్మికుడు అత్యంత పురాతన కాలానికి చెందిన అతిపెద్ద ఏనుగు దంతాన్ని కనుగొన్నాడు. పూర్వీకులు దీనిని మముత్ అని పిలిచేవారు. ఈ దంతం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నాటిదని పురావస్తు పరిశోధకులు చెబుతున్నారు. ఉత్తర డకోటా నగరంలోని ఒక గనిలో జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన ఏనుగు దంతం బయటపడింది. గనిలో జరుగుతున్న పనుల్లో పాల్గొన్న ఒక కార్మికుడు దాదాపు రెండు మీటర్ల పొడవైన తవ్వకం జరిపినప్పుడు ఈ అతిపెద్ద దంతం బయటపడింది. ఇది 10 వేల నుంచి లక్ష ఏళ్ల క్రితం నాటిదని పరిశోధకులు చెబుతున్నారు. యూఎస్లోని ఉత్తర డకోటా గనులలో కొన్ని మిలియన్ టన్నుల లిగ్నైట్ బొగ్గును వెలికితీస్తారు. ఈ బొగ్గు గనిలోనే ఈ అమూల్యమైన నిధి దొరికింది. ఈ బొగ్గు గనుల్లో ఇంతకాలం భారీ యంత్రాలు ఉపయోగిస్తున్నప్పటికీ ఇప్పుడు ఇంత విలువైన ఏనుగు దంతం దొరకడంపై నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం అంటే డైనోసార్లు మనుగడ సాగించిన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగులు భూమిపై ఉండేవని పరిశోధకులు కనుగొన్నారు. ఆ ఏనుగులను మముత్లు అని పిలిచేవారు. ఇప్పుడు నాటికాలపు ఏనుగు దంతం బయల్పడటం విశేషం. దీనిని అద్భుతమైన ఆవిష్కరణగా నిపుణులు పరిగణిస్తున్నారు. అమెరికాలోని ఉత్తర డకోటాలోని బొగ్గు గనిలో దొరికిన మముత్ ఏనుగు దంతం బరువు 22 కిలోలకు మించి ఉంది. శాస్త్రవేత్తలు మముత్ ఏనుగు దంతాన్ని తదుపరి పరిశోధన కోసం సురక్షితంగా భద్రపరిచారు. కాగా ఈ ఏనుగుదంతాన్ని వెలికితీసిన బొగ్గు గని కార్మికుడు భారీ మొత్తంలో సొమ్ము అందుకోనున్నాడనే ప్రచారం జరుగుతోంది. -
అత్యంత అరుదైన పక్షి! సగం ఆడ సగం మగ..!
గత వందేళ్లలో రెండోసారి అత్యంత అరుదైన పక్షి కనిపించిందని పరిశోధకుల బృందం పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ ఒటాగా జంతు శాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ హమీష్ స్పెన్సర్ కొలంబియాలో ఈ పక్షి జాతులను కనుగొన్నారు. ఆ పక్షికి సగం ఆకుపచ్చ అంటే ఒకవైపు ఆడ, మరొకవైపు సగం నీలం అంటే మరోవైపు మగ పక్షిలా ఈకలు ఉన్నాయి. దీన్ని శాస్త్రీయంగా ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫిక్ పక్షి అని పిలుస్తారు. ఇది ఆడ, మగ లక్షణాను ప్రదర్శిస్తుంది. అటువంటి పక్షుల్లో ఒకవైపు మగ ఈకలు ఉండి అందుకు అనుగుణంగా పురుష పునరుత్పత్తి అవయవాలు ఉంటాయి. అలాగే మరొక వైపు స్త్రీ ఈకలు ఉండి స్త్రీలో ఉండే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. అంతేగాదు ఈ పక్షిలో కణాలు ఆడ, మగ కణాలుగా విభజింపబడ్డాయట కూడా. ఇలా దాని జీవితాంతం కణాలు అలానే కొనసాగే అవకాశం ఉందన్నారు. అయితే ఇలా ఏ జాతి పక్షిలో ద్వైపాక్షిక గైనండ్రోమోర్ఫ్(ఆడ, మగ లక్షణాలు)ను చూడలేరన్నారు. ఈవిధంగా పక్షుల్లో అత్యంత అరుదుగా కనిపిస్తుంది. న్యూజిలాండ్లో ఇలాంటి పక్షిని తానింత వరకు చూడలేదని ఇది చాలా అద్భుతమైన విషయమని ప్రొఫెసర్ స్పెన్సర్ అన్నారు. ఈ పరిశోధన వివరాలు జర్నల్ ఆప్ ఫీల్డ్ ఆర్నిథాలజీలో ప్రచురితమయ్యాయి. వందేళ్లలో కనిపించిన వివిధ పక్షి జాతుల్లో ఇలా గైనండ్రోమోర్ఫిజం లక్షణాలను నమోదు చేసిన రెండో పక్షి ఇదే అని అన్నారు. ఈ పరిస్థితి స్త్రీ కణ విభజన సమయంలో ఏర్పడే లోపం కారణంగా ఇలాంటి పక్షులు పుట్టుకొస్తాయని అన్నారు. ఇక్కడ ఒక గుడ్డు, రెండు స్పెర్మ్ల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం చెందితే ఇలా జరుగుతుందని ప్రొఫెసర్ స్పెన్సర్ వివరించారు. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
జీసస్ ఎలా కనిపించేవారంటే..?! పరిశోధనలో షాకింగ్ విషయాలు
జీసస్ లేదా ఏసుక్రీస్తూ ఎలా ఉంటారో మనకు తెలిసిందే. మనం చూసిన కొన్ని ఫోటోలు, టీవీల్లోనూ పొడవాటి జుట్టుతో పై నుంచి కింద వరకు ఓ గౌను మాదిరి తెల్లటి లేదా నీలం డ్రస్ వేసుకుని, గడ్డంతోనే చూశాం. ఆయన చేతి వేళ్లు బాగా పొడుగ్గా ఉన్నట్లు చిత్రాల్లో చూపించేవారు. పాశ్చాత్య చిత్రాల్లో కూడా మనం అలానే చూశాం. అయితే నిజానికి ఆయన ఎలా ఉండేవారు? ఆయన ముఖ చిత్రం ఎలా ఉండేది అనేదానిపై చాలా మందికి పలు సందేహాలు ఉన్నాయి. ఆయను రియల్ లుక్ ఎలా ఉండేది అనే దానిపై జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు చాలా షాకింగ్ విషయాలు వెల్లడించారు. వివరాల్లోకెళ్తే..ఏసుక్రీస్తు నిజంగా మనం చూసిన చిత్రాల్లో ఉన్నట్లే ఉంటారా? లేక ఎలా ఉండేవారనేది పలు శాస్త్రవేత్తల మదిని తొలిచే చిక్కు ప్రశ్న. ఆ దిశగా జరిపిన పరిశోధనలో..కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రసిద్ధి పొందిన తొలి ఏసు క్రీస్తు చిత్రం గ్రీకు సామ్రాజ్యం నుంచి వచ్చింది. ఆ తర్వాత నాల్గో శతాబ్దం నుంచి బైజాంటైన్ యుగపు మెస్సీయ వర్ణనతో కూడిని చిత్రాలు మనస్సుల్లో బాగా నిలిచిపోయాయి. దాన్ని బట్టి క్రీస్తూ ఇలా ఉండేవారనేది ఓ ఊహ మాత్రమే కానీ వాటిల్లో కచ్చితత్వం లేదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. నిజానికి ఆయన చిత్రాలు సింహాసనంపై ఒక చక్రవర్తిలా కూర్చున్న ఏసు చిత్రం ఆధారంగా వచ్చినవే. ఈ ఏసు చిత్రం రోమ్లో శాంటా ప్యూడెన్జైనా చర్చిలోని మొజాయిక్లో కనిపిస్తుంది. అందులో పొడవాటి జుట్టు, గడ్డంతో సింహాసనంపై కూర్చొన్న ఆయన జూస్ మాదిరిగా కనిపిస్తారు. జూస్ అంటే ప్రాచీన గ్రీకు మతంలో ప్రధాన దేవుడు. ఒలింపియా ఆయన దేవాలయం. అందులోని ఆయన విగ్రహం ఆధారంగానే ఏసుక్రీస్తు చిత్రాలు వచ్చాయని అన్నారు పరిశోధకులు. బైజాంటియన్ కళాకారులు ఏసుక్రీస్తును స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించారు. వారు ఆయన్ను యువ జూస్ రూపంలో చూపించేవారు. కానీ, కాలక్రమేణా స్వర్గానికి చెందిన ఏసుక్రీస్తు చిత్రాల విజువలైజేషన్లో మార్పులు వచ్చాయి. అయినప్పటికీ ఏసు క్రీస్తూ ఎలా ఉంటారనేది అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉండేది శాస్త్రవేత్తలను. ఈ నేపథ్యంలోనే ఏసు తల నుంచి పాదాల వరకు ఆయన రూపం ఎలా ఉంటుందనే దానిపై కూలకషంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఈ మేరకు రిచర్డ్ నీవ్ నేతృత్వంలోని బ్రిటీష్ ఫోరెన్సిక్ ఆంత్రోపాలజిస్టుల బృందం ఇజ్రాయెల్ పురావస్తు ప్రదేశాల్లోని పుర్రెలను పరిశీలించడం, బైబిల్ గ్రంధాలు, చారిత్రక ఆధారాలను విశ్లేషించడం తదితర పనులు చేశారు. వారంతా ఏసు ఎలా కనిపించేవాడో అనే దిశగా అతని ప్రసిద్ధ ముఖ చిత్రాన్ని పునర్నిర్మించాలానే దిశగా శోధించడం ప్రారంభించారు. ప్రముఖ ప్రాంతాల్లో లభించిన కొన్ని రకాల పుర్రెల ఆధారంగా రూపొందించే దిశగా అడుగులు వేశారు. ఆ పరిశోధనల్లో..అతను ఒకటవ శతాబ్దపు యూదు మనిషిలాగా ఉండేవారని, ముదురు రంగు చర్మంతో , పొట్టి పొట్టి గిరజాల జుట్లుతో ఉండేవారని కనుగొన్నారు. నిపుణల అభిప్రాయం ప్రకారం ఆయన రూపం మనం చూసే చిత్ర రూపానికి దగ్గరగానే ఉంటుందని అన్నారు. అతని ఆ కాలంలోనే పురుషుల కంటే విభిన్నంగా కనిపించేవాడని కూడా చెప్పుకొచ్చారు. ఓ విశేషమైన వ్యక్తిత్వం కలవాడిగా సుస్పష్టంగా అనిపించేదాన్ని అందువల్లే కొందరూ ఆయన్ని దేవుని కుమారుడిగా కీర్తించి ఉండవచ్చని అన్నారు. ఆ ఫోరెన్సిక్ బృందం రూపొందించిన ముఖం చేస్తే ఏసు ముఖం ఇలా ఉండేదా..? అనిపిస్తుంది. ఇది మనం చూసే ఏసు ముఖానికి కాస్త విభిన్నంగా ఉంది. కానీ ఏసుని స్వర్గాన్ని పాలించే, విశ్వ పాలకుడి రూపంలో చూపించే చిత్రాలను రూపొందించడంతో ఆయన అలా ఉంటారనే అనుకున్నాం. ఎందుకంటే బైబిల్ని విశ్లేషిస్తే ప్రజలు మొదట్లో ఆయన్ని దేవుడిగా భావించలేదు ఓ సాధారణ మనిషిలానే భావించేవారు. అప్పుడు ఆయనకు గడ్డం గానీ పొడవాటి జుట్టు కానీ లేదు. గ్రీకు-రోమన్ కాలంలో శుభ్రంగా గడ్డం చేసుకోవడం, జుట్టు పొట్టిగా ఉండడం తప్పనిసరిగా భావించేవారు. మెడ వరకూ ఉన్న జుట్టు, గడ్డం దైవత్వాన్ని సూచిస్తుంది. అప్పటి పురుషులకు అలాంటి రూపం ఉండేది కాదు. తత్వవేత్తలు కూడా చాలా పొట్టి జుట్టుతోనే ఉండేవారు. చెదిరిన జుట్టు, గడ్డం వేదాంతులకు చిహ్నంగా భావించి ఉండవచ్చు. అందువల్ల ఏసు క్రీస్తూ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని అంటున్నారు. కానీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఆయన ఓ విశిష్టమైన వ్యక్తిలా అందర్నీ అబ్బురపరిచేలా ఉండేవారని, దీంతో మొదట్లో సాధారణ మనిషిలా చూసిన వారు ఆయన మంచి వ్యక్తిత్తత్వానికి దాసోహం అయ్యి దేవుడిలా భావించడం జరిగింది. అదీగాక స్వాభావికంగా మంచి పనుల చేసే వ్యక్తులను దేవత్వం కలిగినా లేదా దేవడిచ్చిన వ్యక్తులుగా భావించడం జరుగుతుంది. దీనివల్ల కూడా ఆయన ముఖ చిత్రాలను ఇలా రూపొందించి ఉండొచ్చని జీసస్: ది కంప్లీట్ స్టోరీ పేరుతో చేసిన పరిశోధన డాక్యుమెంటరీలో వెల్లడించింది ఫోరెన్సిక్ శాస్త్రవేత్తల బృందం. (చదవండి: పండుగ వేళ నిరసనల హోరు..వెలవెలబోయిన ఐకానిక్ క్రిస్మస్ ట్రీ) -
మారుమూల గ్రామ రైతు కొడుకు 'శాస్త్రవేత్తగా'..
భద్రాద్రి: ఓ రైతు కొడుకు పారిశ్రామిక మంత్రిత్వ శాఖకు అనుసంధానంగా ఉండే బెంగళూరులోని సెంట్రల్ మ్యాన్ఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్(సీఎంటీఐ)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు. మండలంలోని సీతంపేట గ్రామ పంచాయతీ పరిధి రెడ్డిపాలెం గ్రామానికి చెందిన లావుడ్యా ఆనంద్ ఈ ఘనత సాధించాడు. ఆనంద్ తల్లిద్రండులు లావుడ్యా ఈర్య, మంగ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉండగా పెద్ద కుమారుడు ఆనంద్ శాస్త్రవేత్తగా ఎంపికై పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. మారుమూల గ్రామం నుంచి ఓ యువకుడు శాస్త్రవేత్తగా ఎంపికైన నేపథ్యంలో గ్రామస్తులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా విద్యాభ్యాసం.. గ్రామానికి చెందిన ఈర్యా, మంగ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు ఆనంద్ ఒకటి నుంచి 5 వరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, 6 నుంచి 10 వరకు సుజాతనగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివాడు. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. చైన్నెలో బీఈ (ఈఈఈ) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఏడాది పాటు హైదరాబాద్లో గేట్ కోచింగ్ తీసుకొని ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ (కంట్రోల్ సిస్టమ్స్ విభాగం)లో సీటు సంపాధించాడు. ఎంటెక్ పూర్తయిన అనంతరం 2019 నుంచి 2021 వరకు కరోనా ప్రభావంతో విద్యాభ్యాసానికి కొంచెం బ్రేక్ పడింది. రాజీ లేకుండా శ్రమించి.. కరోనా సమయంలో దొరికిన విరామాన్ని ఆనంద్ వృథాగా వదిలేయకుండా శ్రమించాడు. వివిధ కొలువుల రాత పరీక్షల మూలంగా తొలిసారిగా బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెట్ (బీఈఎల్)లో ట్రెయినీ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. నెల పాటు ఇక్కడ ట్రెయినీ ఇంజనీర్గా పనిచేసిన అనంతరం హైదరాబాద్లోని డీఆర్డీఓ – రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో ‘రీసెర్చ్ ఫెలో’గా ఉద్యోగం సాధించాడు. అనంతరం సీఎంటీఐలో శాస్త్రవేత్త కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అనుభవాన్ని పరిగణనలోకి తీసుకొని అతను రాత పరీక్ష, మౌఖిక పరీక్షకు హాజరయ్యాడు. సీఎంటీఐలో శాస్త్రవేత్తగా ఎంపికై నట్లు అపాయిమెంట్ లెటర్ రావడంతో తన కల నెరవేరిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఇవి చదవండి: తాను చనిపోతూ.. ఆరుగురికి పునర్జన్మ -
టమాటాలు ఫ్రిజ్లో పెడుతున్నారా? హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు!
సాధారణంగా టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఫ్రిజ్లో పెడితే కనీసం ఓ వారం అయినా వాడుకోవచ్చు. అందులో అయితే కనీసం నాలుగురోజుల వరకు పాడవ్వకుండా కాపాడుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ఇలా ఫ్రిజ్లో పెట్టడం అస్సలు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్లో పెట్టొదని హెచ్చరిస్తున్నారు కూడా. ఫ్రిజ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో సవివరంగా వెల్లడించారు. ఎందుకు పెట్టకూడదంటే.. ఫ్రిజ్లో పెడితే టమాటాలు ముందుగా వాటికుండే సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయని చెబతున్నారు పరిశోధకులు. 39 డిగ్రీల చల్లటి ఉష్టోగ్రతలో ఉన్న టమాటాల్లో వాటికి సహజంగా ఉండే వాసన ఎలా కోల్పోతుంది పరిశోధనలో వెల్లడైంది. ఒకటి రెండు రోజులు ఫ్రిజ్లో ఉంటే పర్లేదు గానీ చాలా రోజులు ఫ్రిజ్లో ఉంటే మాత్రం టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని చెప్పారు. అలాగే దాని డీఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని అన్నారు. మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్ఏకి అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియ ఇది కీలకం. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధుల వచ్చేందుకు దారితీస్తుంది. ఎప్పడైతే సుదీర్థకాలం రిఫ్రిజిరేటర్లో టమోటాలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ విరిగిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకరకంగా చెప్పాలంటే లోపలంతా జ్యూసీగా అయిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు. టమాటాలు పండినప్పడు ఇథిలిన్ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తిని నిలిచిపోతుంది.. దీంతో టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిది. టమాటాలు పండినప్పుడు ఇథిలిన్ను విడుదల చేస్తాయి. ఐతే రిఫ్రిజిరేటర్లోని చల్లదనం ఈ ఇథిలీన్ ఉత్పత్తిని నిలిపేస్తుంది. ఇది టమోటాలు రుచిని కోల్పోవడానికి లేదా పుల్లగా మారడానికి కారణమవుతుంది. కాబట్టి టమోటాలు ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుదీర్ఘకాలం ఫ్రిజ్లో ఉన్న టమాటాలు విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని చెబుతున్నారు. కాగా, తాము ప్రస్తుతం చల్లదనంలో కూడా టమాటాలు రుచిని కోలపోకుండా ఉండేలా పలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు! శాశ్వతంగా ఈ వ్యాధికి చెక్పెట్టేలా..) -
టైప్ 2 డయాబెటిస్ ఎందుకొస్తుందో కనిపెట్టిన శాస్త్రవేత్తలు!
అధిక సంఖ్యలో ప్రజలు టైప్ 2 డయాబెటిస్తోనే బాధపడుతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవాళ్లుకు ఓ నిర్ధిష్ట ఏజ్ వచ్చేటప్పటికీ మధుమేహం అనే దీర్ఘకాలిక వ్యాధి వచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది వైద్యులకు కూడా తెలియలేదు. ఎందువల్ల ఇన్సులిన్ వ్యవస్థ పనిచేయడం అగిపోతుంది. తగిన స్థాయిలో ఎందుకు ఇన్సులిన్ని ఉత్పత్తి చేయలేకపోతుందనేది వైద్యులకు ఇప్పటికీ అర్థం కానీ ఓ మిస్టరీ. పైగా ఇది దీర్థకాలిక వ్యాధి, దీనికి నివారణ ఉండదు, కేవలం నియంత్రణ మాత్రమే. అలాంటి ఈ టైప్ 2 డయాబెటిస్ ఎందువల్ల వస్తుందో శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. అంతేగాదు ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్కెపెట్టేందుకు మార్గం సుగమం చేసిందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకీ ఇది ఎందువల్ల వస్తుందంటే..? సాధారణంగా టైప్ 2 మధుమేహం అనేది శరీరం ఇన్సులిన్కు ప్రతిస్పందించడం ఆపివేయడంతో ప్రారంభమై, చివరికి ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. ఇలా ఎందుకు జరగుతుందనేది శాస్త్రవేత్తలకు అర్థం కానీ చిక్కు ప్రశ్న. అందుకోసం మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషులపై అధ్యయనాలు కూడా నిర్వహించారు కేస్ వెస్ట్రన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. ఇలా ఇన్నులిన్ వ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక ఎంజైమ్ని గుర్తించారు. దీన్ని స్కాన్(SCAN) అని పిలుస్తారు. ఈ ఎంజైమ్ ఇన్సులిన్ చర్యలకు గ్రాహకంగా పనిచేసే నైట్రిక్ ఆక్సైడ్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ నైట్రిక్ ఆక్సైడ్ కీలకమైన రసాయనం. ఇది ఇన్సులిన్తో సహా హార్మోన్లను నియంత్రిస్తుంది. కాగా, శాస్త్రవేత్తలు మధుమేహం ఉన్న ఎలుకలు, మనుషుల్లో ఈ స్కాన్(SCAN) కార్యచరణను గుర్తించారు. అలాగే ఈ ఎంజైమ్లేని ఎలుకల్లో మధుమేహం రాకుండా ఎలా సేఫ్గా ఉన్నాయో కనుగొన్నారు. ఈ ఎంజైమ్ ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించొచ్చని తెలిపారు. ఇక ఈ ఎంజైమ్ని నిరోధించడంపై పలు పరిశోధనలు చేయాల్సి ఉంది. అంతేగాదు ఈ నైట్రిక్ ఆక్సైడ్ని జోడించి ఉండే ఎంజైమ్లు వివిధ రకాల వ్యాధులకు దారితీస్తాయని శాస్త్రవేత్త జోనాథన్ తెలిపారు. అధిక స్థాయి నైటిక్ ఆక్సైడ్ కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. అయితే ఇది రియాక్టివ్ మాలిక్యూల్ కావడం వల్ల నేరుగా దీన్నే లక్ష్యం చేసుకుని తొలగించడం కష్టమని చెప్పారు. (చదవండి: 220 టన్నుల హోటల్ని జస్ట్ 700 సబ్బులతో తరలించారు!) -
ప్రపంచం మెచ్చిన సైంటిస్ట్.. రూ.66 కోట్లు గెలుచుకుంది!
‘క్వాంటమ్’ అనే మాటకు ప్రతిధ్వనిగా ‘అంతులేని వేగం’ ‘అపారమైన శక్తి’ అనే శబ్దాలు వినిపిస్తాయి. దేశ పురోగతిని మార్చే శక్తి క్వాంటమ్ సాంకేతికతకు ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంతో సహా ప్రపంచంలోని ఎన్నో దేశాలు క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. శాస్త్రవేత్తల విషయానికి వస్తే..ప్రొఫెఫెసర్ ఊర్వశీ సిన్హా క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ ఫండమెంటల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్లాంటి కట్టింగ్–ఎడ్జ్ టెక్నాలజీలో అందె వేసిన చేయిగా పేరు తెచ్చుకుంది. బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ)లోని క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్లో ఊర్వశీ సిన్హా పనిచేస్తుంది. ఈమె పరిశోధనలకు గాను తాజాగా కెనడా ఎక్స్లెన్స్ రిసెర్చ్ చైర్ (సీయిఆర్సీ) ప్రోగ్రామ్కి ఎంపికైన తొలి ఇండియన్గా తన ప్రత్యేకత చాటుకుంది. పరిశోధకులను ప్రోత్సహించడానికి 2008లో సీయిఆర్సీ ఏర్పాటైంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 8 సంవత్సరాలకు గాను సిన్హా 8 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 66 కోట్ల 69 లక్షల రూపాయలను గెలుచుకుంది. సంప్రదాయ కంప్యూటర్ సంవత్సరాల్లో చేసే పనిని క్వాంటమ్ కంప్యూటర్ నిమిషాల వ్యవధిలో పూర్తి చేస్తుంది. సూపర్ కంప్యూటర్ కంటే క్వాంటమ్ కంప్యూటర్ ఎన్నోరెట్లు వేగంగా పనిచేస్తుంది. గూగుల్, ఐబీఎం... మొదలైన సాంకేతిక దిగ్గజాలు ప్రత్యేకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేసుకున్నాయి. ‘క్వాంటమ్ టెక్నాలజీ’ అనేది ఇప్పుడు హాట్ టాపిక్. మన దేశం విషయానికి వస్తే క్వాంటమ్ టెక్నాలజీ అనగానే గుర్తు వచ్చే పేరు ఊర్వశీ సిన్హా. లండన్లో పుట్టి పెరిగింది సిన్హా. యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో చదువుకుంది. సూపర్కండక్టింగ్ డివైజ్లపై పరిశోధనలు చేసింది. పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్ కోసం కెనడాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్(ఐక్యూసీ)కు వెళ్లింది. క్వాంటమ్ ఆప్టిక్స్లో పరిశోధనలకు ఇంటర్నేషనల్ కమీషన్ ఫర్ ఆప్టిక్స్(ఐసీవో) నుంచి అవార్డ్ అందుకుంది. చిన్నప్పుడు కాల్పనిక కథల కంటే శాస్త్రీయ విషయాలు, గణితంపై ఎక్కువగా ఆసక్తి ప్రదర్శించేది. ఒకవిధంగా చెప్పాలంటే సైంటిస్ట్ కావాలని చిన్నప్పుడే డిసైడై పోయింది. తల్లిదండ్రులు బాగా ప్రోత్సహించేవారు.క్వాంటమ్ ఫిజిక్స్పై సిన్హాకు ప్రత్యేక ఆసక్తి. బ్యాచులర్స్, మాస్టర్స్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఫండమెంటల్ సబ్జెక్ట్గా క్వాంటమ్ ఫిజిక్స్ను బోధించేవారు. అలా మొదలైన ఆసక్తి అంతకంతకూ పెరుగుతూ పోయింది. ‘నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది’ అనుకునేది సిన్హా.‘క్వాంటమ్ ఫిజిక్స్పై ఆసక్తి అధికమవుతున్న కాలంలో బంగారంలాంటి అవకాశం వచ్చింది. పోస్ట్ డాక్టోరల్ రిసెర్చ్లో భాగంగా క్వాంటమ్ ఆప్టిక్స్కు చేరువ కావడం నా కెరీర్కు ఎంతో మేలు చేసింది. నేను ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆసక్తిని, ఉత్సాహాన్ని పెంచింది. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు’ అంటుంది సిన్హా.. బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని ‘క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటింగ్ ల్యాబ్’ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ కోసం మన దేశంలో ఏర్పాటు చేసిన తొలి ల్యాబ్. ఈ ల్యాబ్లో క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్కు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేసింది సిన్హా.‘మన దేశంలో శాస్త్రీయరంగం పురోగతిని నా కాలేజీ రోజుల నుంచి చూస్తున్నాను. ఉన్నత స్థాయి పరిశోధనలకు ఇప్పుడు తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయి. విదేశీ కంపెనీల నుంచి రకరకాల పరికరాలు ఆలస్యంగా అందుతున్నాయనే ఫిర్యాదు ఇప్పుడు వినిపించడం లేదు. స్థూలంగా చెప్పాలంటే శాస్త్రీయ పరిశోధనకు ఇప్పుడు నిధులు అనేవి ప్రధాన సమస్య కాదు. మన సమాజం శాస్త్రీయ సమాజంగా ఎదగాలంటే సాంకేతిక పరిజ్ఞానంలో పురోగతి కనిపించాలి. అందుకు మౌలిక సూత్రాలపై అవగాహన పెంచుకోవాలి’ అంటుంది సిన్హా.బాల్యం నుంచి శాస్త్రీయపథంలో పయనిస్తున్న ఊర్వశీ సిన్హా 34 మంది ప్రముఖ గ్లోబల్ సైంటిస్ట్లలో ఒకరిగా నిలిచింది. Want to know about the first ever experimental evidence of co-existence of wave & particle-like properties of a single #photon? Then check out the new Simply-PHY ep. from QuIC lab, @RRI_Bangalore & their collaborators.https://t.co/QKdNd1Vtvd@IndiaDST @PrinSciAdvGoI… pic.twitter.com/90tZ2TG1MG — Raman Research Institute (@RRI_Bangalore) September 18, 2023 గొప్ప అవకాశం సైన్స్ అనే దానికి సరిహద్దులు లేవు. అది ప్రపంచ భాష. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒకరికొకరు సహకరించుకుంటూ వెళ్లడం ద్వారానే సైన్స్ను ముందుకు తీసుకువెళ్లగలం. సైన్స్ పురోగతికి నా వంతు కృషి చేస్తాను... అనే మాటలను సీయిఆర్సీ ఇచ్చిన అవకాశం ద్వారా ఆచరణరూపం కల్పించే అవకాశం దొరికింది. ఇండియా, కెనడాలలో సమాంతరంగా క్వాంటమ్ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై కృషి చేయడానికి ఇదొక గొప్ప అవకాశం. – ఊర్వశీ సిన్హా, సైంటిస్ట్ -
మనిషి చెప్పులు వేసుకున్నది ఎన్నడు? ఆశ్చర్యపరుస్తున్న పరిశోధనలు!
నాగరకత తొలినాళ్లలో మనిషి తన శరీరాన్ని రక్షించుకునేందుకు దుస్తులు వాడటం మొదలుపెట్టాడు. మరి కాలికి వేసుకునే చెప్పులు, బూట్ల వాడకం మొదలైందెన్నడు? ఈ ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? దీనికి ఇప్పుడు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా సమాధానం కనుగొన్నారు. తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలు దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్లో ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. ఇది మానవజాతి చరిత్రలోని అత్యంత పురాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది. మానవులు మధ్య రాతి యుగంలోనే బూట్లు ధరించి ఉండవచ్చని కొత్త పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నాటి కాలాన్ని మెసోలిథిక్ టైమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆఫ్రికన్ పూర్వ చరిత్రలో ఒకనాటి కాలం. ఈ నూతన ఆవిష్కరణ 75 వేల నుంచి ఒక లక్షా 50 వేల సంవత్సరాల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రకారం పురాతన మానవులు.. మనం ఇంతవరకూ భావిస్తున్నదానికన్నా ఎంతో నేర్పరులని తేలింది. ఈస్ట్ హార్ట్ఫోర్డ్లోని గుడ్విన్ యూనివర్శిటీకి చెందిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన రాండీ లైస్ట్ ఒక వ్యాసంలో మనిషి సాంకేతిక పరిజ్ఞానానికి చెందిన అత్యంత పురాతన ఆవిష్కరణల్లో షూస్ అంటే బూట్లు ఒకటని తెలిపారు. ఈ వివరాలు 2020 ఆగస్టులో ప్రచురితమయ్యాయి. కార్లు, పడవలు, రాకెట్ షిప్ల వంటి వాహనాలు భారీ పరమాణంలోని బూట్ల మాదిరిగా ఉంటాయని లైస్ట్ దానిలో పేర్కొన్నారు. బూట్ల ఆలోచన నుంచే ఇటువంటి ఇటువంటి సాంతకేతికత ఆవిర్భవించిందని లైస్ట్ భావించారు. మానవజాతి ప్రారంభ సాంకేతిక ఆవిష్కరణలలో బూట్లు ఒకటి. గత పురావస్తు పరిశోధనలలో బూట్లు దాదాపు ఆరు వేల సంవత్సరాల క్రితం నాటివని, ఇవి ఐరోపాలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చాయని భావించారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికాలోని కేప్ కోస్ట్లో సాగిన నూతన పరిశోధనలు బూట్ల ఆవిష్కరణకు సంబంధించిన పాత సిద్ధాంతాలను తుడిచిపెట్టాయి. విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయ పరిశోధకుడు బెర్న్హార్డ్ జిప్ఫెల్ వెల్లడించిన వివరాల ప్రకారం మధ్య రాతి యుగంలో కేప్ తీరం వెంబడి బీచ్లో పురాతన మానవుల పాదముద్రల శిలాజాలను పరిశీలించినప్పుడు, వారు బూట్లు ధరించి ఉండవచ్చని పరిశోధనలు స్పష్టంగా తెలియజేస్తున్నాయన్నారు. సదరన్ కేప్ కోస్ట్ ఆ సమయంలో చాలా పదునైన రాళ్లతో ఉండేదని, ఇవి బాధ కలిగించకుండా ఉండేందుకు నాటి మానవులు పాదరక్షలను ఉపయోగించి ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే పురాతన మానవులు ఏ రకమైన బూట్లు ధరించారనే దానిపై పురావస్తు శాస్త్రవేత్తలు నేటికీ స్పష్టంగా ఏమీ తెలుసుకోలేకపోయారు. పురాతన పాదముద్రల శిలాజాల లాంటి ఇతర ఆధారాలతో మనిషి ధరించిన నాటి కాలపు పాదరక్షల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పరిశోధనలు సాగిస్తున్న ప్రముఖ శాస్త్రవేత్త జిప్ఫెల్ స్పందిస్తూ నాటి పురాతన బూట్లు ఇంత కాలం ఉండకపోవచ్చని, నాటి మానవులు పాదముద్రల శిలాజాలు కనుగొనగలిగితే పూర్వీకులు ధరించిన పాదరక్షల గురించి అధ్యయనం చేయడానికి అవకాశం దక్కుతుందని అన్నారు. నాటి మానవులు బూట్లు ధరించారా లేదా అనేదానిని తెలుసుకునేందుకు పరిశోధకులు దక్షిణాఫ్రికాలోని రెండు ప్రదేశాలలో నాటి మనిషి ఎముకల ఆకారం, పరిమాణాన్ని విశ్లేషించారు. అక్కడ నివసించే ప్రజల కాలి ఎముకలు వారి పూర్వీకుల కంటే చాలా సన్నగా, తక్కువ దృఢంగా ఉన్నాయని వారు కనుగొన్నారు. కాలి స్వరూపంలో ఈ మార్పు బూట్లు ధరించడం వల్ల సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. షూస్ అనేవి పదునైన రాళ్లు, ముళ్లు, పరాన్నజీవుల నుండి రక్షణను అందిస్తాయి. ఈ అధ్యయనం మధ్య రాతి యుగంనాటి మానవుల సాంస్కృతిక చరిత్ర, పరిజ్ఞానాలను మరింతగా తెలియజేలా ఉంది. ఆ కాలంలో జరిగిన బూట్ల ఆవిష్కరణ, వాటి ఉపయోగం నాటి విస్తృత సాంస్కృతిక మార్పులో భాగంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే దీనిపై స్పష్టత కోసం శాస్త్రవేత్తలు మరింతగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇది కూడా చదవండి: తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ -
గ్రాము ఖరీదు కోట్ల డాలర్లట!... ఏందబ్బా అది?
ఈ భూమండలంపై అత్యంత ఖరీదైన పదార్థమేమిటనే ప్రశ్న ఎవరినైనా అడిగితే ప్లాటినం, వజ్రం లేదా బంగారం అని చెబుతుంటారు. అయితే వీటికి మించిన ఖరీదైన పదార్థం ఒకటుందనే సంగతి మీకు తెలుసా? దాని విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆ పదార్ధం ఒక గ్రాము ధర 7,553 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) ఆ ఖరీదైన పదార్ధం పేరు యాంటీమాటర్. దీని గురించి ఎవరూ అంతగా వినివుండకపోవచ్చు. అయితే సైన్స్ ప్రపంచంలో ఇది ఒక రహస్యమైన, శక్తిమంతమైన పదార్ధం. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది పదార్థంతో సమానంగానే ఉంటుంది. కానీ ఇది సాధారణ పదార్ధానికి పూర్తిగా వ్యతిరేకం. యాంటీమాటర్లోని ఉప పరమాణు కణాలు సాధారణ పదార్థానికి వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. దీనిని 20 వ శతాబ్దపు ప్రథమార్థంలో కనుగొన్నారు. యాంటీమాటర్ను మొట్టమొదట ప్రపంచానికి 1928 లో శాస్త్రవేత్త పాల్ డిరాక్ పరిచయం చేశారు. న్యూ సైంటిస్ట్ పత్రిక ఈ మహనీయుడిని ‘సర్ ఐజాక్ న్యూటన్ తరువాత గొప్ప బ్రిటిష్ సిద్ధాంతకర్త’ అని అభివర్ణించింది. నాటి నుంచి యాంటీమాటర్ శాస్త్రవేత్తలకు సైతం ఉత్సుకత కలిగించే అంశంగా మారింది. యాంటీమాటర్ అత్యధిక శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్రాము యాంటీమాటర్ 43 మెగాటన్నుల ట్రినిట్రోటోల్యూన్ (టీఎన్టీ) శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే జపాన్.. హిరోషిమాపై వేసిన అణు బాంబు కంటే మూడు వేల రెట్లు అధిక శక్తిని ఉత్పత్తి చేస్తుంది. యాంటీమాటర్ అంతరిక్ష ప్రయాణానికి సమర్థవంతమైన ఇంధనంగా లేదా మన గ్రహానికి అత్యధిక శక్తి వనరుగా కూడా ఉపయోగపడుతుంది. విశ్వం యొక్క మూలం, పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి యాంటీమాటర్ సహాయపడుతుంది. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం అనేది అధిక సాంద్రత, ఉష్ణోగ్రత స్థితి నుండి ఉద్భవించింది. ఇక్కడ పదార్థం, యాంటీమాటర్ సమానంగా, సమృద్ధిగా ఉన్నాయి. అయితే ప్రారంభ విశ్వంలో పదార్థం, యాంటీమాటర్ మధ్య కొంత అసమానత లేదా అసమతుల్యత ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది యాంటీమాటర్ కంటే పదార్థం అధికంగా ఉండటానికి దారితీసింది. ఇది భౌతిక శాస్త్రంలో అతిపెద్ద పజిల్గా నిలిచింది. యాంటీమాటర్ను శాస్త్రీయ పరిశోధనలు, వైద్య అనువర్తనాలకు సాధనంగా ఉపయోగించవచ్చు. ఇది సాంప్రదాయిక పద్ధతులకు మించి మరింత ఖచ్చితంగా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకునే రేడియేషన్ థెరపీకి ఉపయుక్తమవుతుంది. యాంటీహైడ్రోజన్ (యాంటీమాటర్తో తయారు చేసిన సరళమైన పరమాణువు) సమానత్వ సూత్రం, ఛార్జ్-పారిటీ-టైమ్ (సీపీటీ) సమరూపత వంటి భౌతిక శాస్త్ర సిద్ధాంతాలను పరీక్షించడానికి యాంటీమాటర్ ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం యాంటీమాటర్ను సృష్టించడం, నిల్వ చేయడం అంత సులభం కాదు. దీనికి పార్టికల్ యాక్సిలరేటర్లు, వాక్యూమ్ ఛాంబర్లు వంటి అధునాతన సౌకర్యాలు, సాంకేతికతలు అవసరమవుతాయి. ప్రస్తుతం మనం స్వల్ప పరిమాణంలోని యాంటీమాటర్ను మాత్రమే ఉత్పత్తి చేయగలం. దీనికి కూడా అధికంగా ఖర్చు అవుతుంది. నాసా తెలిపిన వివరాల ప్రకారం యాంటీమాటర్ అనేది భూమిపై అత్యంత ఖరీదైన పదార్థం. శాస్త్రవేత్తలు భూమిపైనే లార్జ్ హాడ్రాన్ కొలైడర్ లాంటి అధిక శక్తి కణాల యాక్సిలరేటర్ల ద్వారా యాంటీ పార్టికల్ను ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ పరిశోధనలు విజయవంతం కావాలని కోరుకుందాం. ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల! -
19 అగ్నిపర్వతాలు ఏకకాలంలో పేలాయా? గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ చెబుతున్న వాస్తవం ఏమిటి?
అగ్ని పర్వతం... ఈ మాట వినిగానే భగభగ మండే అగ్నికీలల మధ్య నుంచి ఉబికివచ్చే లావా గుర్తుకువస్తుంది. అగ్ని పర్వత విస్ఫోటనం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మరి ప్రపంచవ్యాప్తంగా డజనుకుపైగా అగ్ని పర్వతాలు ఒకే సమయంలో బద్దలయ్యాయని తెలిస్తే.. అది ఊహకు కూడా అందదు. అవును.. ఇది నిజం.. ప్రపంచవ్యాప్తంగా ఒకే సమయంలో 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందాయి. తాజాగా మరో మూడు కొత్త విస్ఫోటనాలు ఈ జాబితాలో చేరాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేశారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూట్కు చెందిన గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ నూతన విస్ఫోటనాలను ట్రాక్ చేస్తుంది. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ తాజాగా విస్ఫోటనం చెందుతున్న అగ్నిపర్వతాల జాబితాను అప్డేట్ చేసింది. ఈ జాబితా విడుదల అనంతరం పలువురు సోషల్ మీడియాలో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. ఇటలీ, ఐస్లాండ్, జపాన్, మెక్సికో, రష్యా, ఫిలిప్పీన్స్ దేశాలలో ఒకేసారి అగ్నిపర్వతాలు పేలుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు నిరంతరం విస్ఫోటనం చెందుతుంటాయి. ఇది సాధారణమేనని అగ్నిపర్వత శాస్త్రవేత్త, సైన్స్ జర్నలిస్ట్ రాబిన్ జార్జ్ ఆండ్రూస్ ఎక్స్(ట్విట్టర్) మాధ్యమంలో తెలిపారు. ప్రస్తుతం పేలుతున్న అగ్నిపర్వతాల సంఖ్య సాధారణమేనని గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ డైరెక్టర్ బెన్ ఆండ్రూస్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం 46 విస్ఫోటనాలు కొనసాగుతున్నాయని, గత 30 సంవత్సరాలలో ఇదేవిధంగా నిరంతరం 40 నుంచి 50 విస్ఫోటనాలు జరిగాయన్నారు. 1991 నుండి ప్రతి సంవత్సరం 56 నుంచి 88 వరకూ అగ్నిపర్వత విస్ఫోటనలు జరిగాయి. 2022లో ఈ సంఖ్య 85గా ఉందని బెన్ ఆండ్రూస్ పేర్కొన్నారు. ఈ పేలుళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయని ఆయన అన్నారు. గ్లోబల్ వోల్కనిజం ప్రోగ్రామ్ అందించిన తాజా అప్డేట్లో జపనీస్ ద్వీపం ఐవో జిమాలోని నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం, ఐస్లాండ్లోని ఫాగ్రాడల్స్ఫ్జల్, రష్యాలోని క్లూచెవ్స్కోయ్లు చేరాయి. జపనీస్ అగ్నిపర్వత దీవులలోని నీటి అడుగునవున్న అగ్నిపర్వతం అక్టోబరు 30న విస్ఫోటనం చెందింది. దీని శిలాద్రవం నీటి ఉపరితలాన్ని ఛేదించి, కొత్త ద్వీపాన్ని సృష్టించింది. జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ)తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్లో ప్రతి రెండు నిమిషాలకు ఇవో జిమా వద్ద అగ్నిపర్వత ప్రకంపనలు నమోదయ్యాయి. రష్యాలోని క్లూచెవ్స్కాయా సోప్కా అగ్నిపర్వతం ఇటీవలే విస్ఫోటనం చెందింది. సమయంలో సముద్ర మట్టానికి 8 మైళ్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మింది. ఈ నేపధ్యంలో భద్రత దృష్ట్యా పలు పాఠశాలలను మూసివేశారు. కాగా ఫాగ్రాడల్స్ఫ్జల్ అగ్నిపర్వతం ఇంకా పూర్తిగా విస్ఫోటనం చెందలేదు. అయితే విస్పోటనానికి సంబంధించిన సంకేతాలు వెలువడుతున్నందున స్థానిక అధికారులు గ్రిండవిక్ పట్టణాన్ని ఖాళీ చేయించారు. అగ్ని పర్వతం ఎలా ఏర్పడుతుంది? అగ్ని పర్వతం అంటే భూమి ఉపరితలంపై ఏర్పడిన ఒక చిల్లు లేదా ఒత్తిడి కారణంగా ఏర్పడిన ఒక పగులు. దీని నుంచి వేడి మేగ్మా, బూడిద, వివిధ వాయువులు బయటకు వెలువడుతాయి. సాధారణంగా భూమిలోని టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొన్న చోట అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. అట్లాంటిక్ మహాసముద్రం నడిబొడ్డులో ఇటువంటి ప్రదేశం ఉంది. దానిని మిడ్ అట్లాంటిక్ రిడ్జి అని అంటారు. ఇది రెండు టెక్టోనిక్ ప్లేట్లు దూరంగా జరగడం వల్ల ఏర్పడింది. అగ్ని పర్వతాలు ఏర్పడడానికి టెక్టోనిక్ ప్లేట్లు కదలిక ఒక్కటే కారణం కాదు. భూమి కింది భాగంలోని టెక్టోనిక్ ప్లేట్లు సాగిపోయి, పల్చబడటం కారణంగానూ అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. తూర్పు ఆఫ్రికాలో ఉన్న తూర్పు ఆఫ్రికా రిప్ట్, ఉత్తర అమెరికాలో ఉన్న రియో గ్రేండి రిఫ్ట్ ఈ విధమైన అగ్ని పర్వతాలకు ఉదాహరణలు. అగ్ని పర్వతంలో ఏముంటాయి? మాగ్మా చాంబర్: ఇది భూమిలోని అట్టడుగున లావాతో, గ్యాస్ , బూడిదలతో నిండిపోయి ఉంటుంది. సిల్: పర్వతంలోని లోపలి పొరల్లోకి లావాని తీసుకెళుతుంది. డైక్: పైప్ లోని ఒక బ్రాంచ్. ఇది సిల్ వరకు లావాను చేరుస్తుంది. లావా లేయర్స్: ఇవి పర్వతంలో బూడిదతో నిండి ఉంటాయి. వీటి నుంచే బూడిద వెలువడుతుంది. అగ్ని పర్వతం పేలినప్పుడు ఈ లేయర్లలోని లావా బయటకు ఎగజిమ్ముతుంది. పారసైటిక్ కోన్: పర్వతం రగులుతున్నదశలో దీనిద్వారా లావా వెలువడి బయటకు వస్తుంది. లావా ఫ్లో: కోన్ నుంచి బయటకు లావా వెలువడుతుంది. వెంట్: ఇది పర్వతపు ముఖద్వారం. ఇది బయటకు లావాను, బూడిదను విడుదల చేసే భాగం. క్రేటర్: పర్వతం కొనలో ఏర్పడిన గొయ్యి భాగం. యాష్ క్లౌడ్: పర్వతం పేలడానికి ముందుగా వెలువడే బూడిద మేఘం. ఇది కూడా చదవండి: ఉత్తరకాశీకి థాయ్ రెస్క్యూ బృందాలు -
ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..
చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్ లైన్’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్ఫోర్డ్ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. అయితే స్పేస్ ఎలివేటర్ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు. కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్ ఎలివేటర్ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్లు స్పేస్ ఎలివేటర్కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లు ఈ తీగ వెంబడి మరో రాకెట్లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. ఇటువంటి స్పేస్లైన్ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్లో ఈ స్పేస్లైన్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని.. -
ఆర్ట్ సైంటిస్ట్! ఆర్ట్, సైన్సును కలిపే సరికొత్త కళ!
ఆర్ట్ సైంటిస్ట్ ఆర్ట్, ఫ్యాషన్ను కలిపి తనదైన కళను ఆవిష్కరించింది ఢిల్లీకి చెందిన పాయల్ జైన్. ఫ్యాషన్ రంగంలో పేరుగాంచిన పాయల్ జైన్ మంచి ఆర్టిస్ట్ కూడా. ఆమె తాజా ఎగ్జిబిషన్....సోల్ ఆఫ్ ఏ ఉమెన్. ఎగ్జిబిషన్లో కనిపించే 30 పీస్లలో ప్రతిదాంట్లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చరిత్ర నుంచి కవిత్వం వరకు ఏదో ఒక అంశ ధ్వనిస్తుంది. ‘ఆర్ట్లో సైన్స్ ఉంటుంది. సైన్స్లో ఆర్ట్ ఉంటుంది’ అనే పాయల్ జైన్ను ఆర్ట్ సైంటిస్ట్గా పిలుచుకోవచ్చు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో తన మూడు దశాబ్దాల ప్రయాణానికి ‘సోల్ ఆఫ్ ఏ ఉమెన్’ ప్రతిబింబం అంటుంది పాయల్. ఈ ఎగ్జిబిషన్లోని ముప్ఫై పీస్లలో ప్రతి పీస్కు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మెక్సికన్ పెయింటర్ ప్రీదా ఖాలోను స్ఫూర్తిగా తీసుకొని ‘ఫర్బిడెన్ లవ్’ కలెక్షన్ రూపొందించింది. పాయల్ అభిమానించే ఖాలో పెయింటర్, మ్యాజికల్ సర్రియలిస్ట్, ఫెమినిస్ట్, రెవల్యూషనరీ. పాయల్ ఆర్కిటెక్చర్ నుంచి ఫ్యాషన్ రంగంలోకి రావడానికి కారణం చిత్రకళ పట్ల తనకు ఉన్న అనురక్తి. స్కెచ్చింగ్ తనకు ఇష్టమైన పని. ఆమె తల్లి కూడా ఆర్టిస్టే. సితార్ అద్భుతంగా వాయించేది. తన కలల గురించి తల్లిదండ్రులకు చెప్పిప్పుడు ‘ ఏదో ఒక డిగ్రీ నీ చేతిలో కనిపించాలి. ఆ తరువాతే ఏదైనా’ అన్నారు. అలా బీకామ్ పూర్తి చేసింది. పాయల్ స్కెచ్చింగ్ నైపుణ్యాన్ని చూసి ‘నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ప్రయత్నించవచ్చు’ అని సలహా ఇచ్చారు సన్నిహితులు. మొదట ఫ్యాషన్ ఇండస్ట్రీకి సంబంధించి పుస్తకాలు, మ్యాగజైన్స్ విరివిగా చదివేది. అలా ఫ్యాషన్ కూడా తన ప్యాషన్గా మారింది. శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ‘ఫ్యాషన్కు ఆర్ట్, సైన్స్ అనే రెండు కోణాలు ఉంటాయి. ఆర్ట్ అనేది సృజనాత్మకతకు సంబంధించిన కోణం, సైన్స్ అనేది సాంకేతిక నైపుణ్యానికి సంబంధించిన కోణం. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నా దృష్టిని విశాలం చేసింది. ప్యాటర్న్మేకింగ్, డ్రాపింగ్, గ్రేడింగ్, ఇలస్ట్రేషన్, ఫ్యాషన్ మార్కెటింగ్...ఇలా ఎన్నో విషయాలను తెలుసుకున్నాను’ అంటున్న పాయల్ ఎన్నో కార్పొరేట్ హోటల్స్కు ఆకట్టుకునేలా ‘హోటల్ యూనిఫామ్’ను డిజైన్ చేసి ఇచ్చింది. ‘డిజైనర్స్ అంటే గొప్ప ఏమీ కాదు. గ్లోరిఫైడ్ టైలర్స్ మాత్రమే’ అని చాలామంది అనుకొని అపోహపడే కాలంలో డిజైనర్గా కెరీర్ ప్రారంభించింది పాయల్. ఆమె వెస్ట్రన్ క్లాతింగ్ మొదలుపెట్టినప్పుడు దానికి మార్కెట్ లేదు. అయితే ఆ తరువాత మాత్రం పరిస్థితిలో మార్పు వచ్చింది. పాయల్ సక్సెస్ మంత్రా ఏమిటి? ఆమె మాటల్లోనే చెప్పాలంటే...‘చేయాలి కాబట్టి చేస్తున్నాం అనే ధోరణిలో కాకుండా మనం చేస్తున్న పనిని మనసారా ప్రేమించాలి. నిద్ర, శ్వాస, కలలో మన లక్ష్యం కనిపించాలి. ఫెయిల్యూర్కు చోటివ్వకుండా సాంకేతిక జ్ఞానంపై గట్టి పట్టు సంపాదించాలి. ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో కొత్తదనం వచ్చేలా చూసుకోవాలి. ప్రశంసలు ఆస్వాదించడానికి మాత్రమే పరిమితమైపోకుండా అన్ని కోణాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మార్పులు చేర్పులు చేసుకోవాలి. సానుకూల శక్తి, సంకల్పబలం ఎప్పటికీ మనకు తోడుగా ఉండాలి’ కెరీర్ తొలి రోజుల్లో తాను ఎదుర్కొన్న ఆటుపోట్లను ఇప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది పాయల్. చేదుజ్ఞాపకాలుగా కాదు...ఆ సమయంలోనూ తాను ఎంత ధైర్యంగా ఉందో మళ్లీ మళ్లీ గుర్తు తెచ్చుకోవడానికి. ‘విజయం ధైర్యవంతులను వెదుక్కుంటూ వస్తుంది’ అని చెప్పడానికి ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆమె తెచ్చుకున్న పేరే నిదర్శనం. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
మనుషులకు తోకలు ఎలా మాయమైపోయాయి?
కోతి నుంచి రూపాంతరం చెంది మనిషిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్యాప్లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైనది.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయింది. మరి ఆ తోక ఎప్పుడు మాయమైపోయిందో సరిగ్గా ఎవరికి తెలీదు.. ఈ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం!. దాదాపుగా ప్రతీ జంతువుకూ, పక్షికీ తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. వేగమే కాదు సరిగా ఎగరలేవు కూడా. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.ఇక నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక ఎంతో సాయం చేస్తోంది. ఇక కొన్ని తేళ్లు, పాము వంటి విషపూరిత జీవులకు ఆ తోకే రక్షణ ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి తోకలు తొలుత మానవులకు కూడా ఉండేది. కానీ కాలక్రమేణ అది అదృశ్యమైపోయింది. ఇది ఎలా జరిగింద? ఎందువల్ల అనేది శాస్త్రవేత్తల మదిని తొలిచే ప్రశ్న. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 25 మిలియన్ల ఏళ్లక్రితం మానవులకు తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీని గురించి అప్పట్లో చార్లెస్డార్విన్ ఇచ్చిన వివరణ పెద్ద విప్లవంగా మారింది. ఒక్కసారిగా అందరీ దృష్టి ఈ దిశగా అడుగులు వేసేలా చేసి, పరిశోధనలు చేసేందుకు నాంది పలికింది. కానీ తోక ఎలా కనుమరుగైందనేది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు జియా అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధన వివరణాత్మక సమాధానం ఇచ్చింది. మానవ పిండం తొలి దశలో తోకలా ఉండి ఆ తర్వాత అది నెమ్మదిగా చీల్చుకుంటూ వెన్నుపూస, కండారాలుగా ఏర్పడతాయని అన్నారు. ఆ క్రమంలో వచ్చే జన్యు మార్పులను గమనించారు. అలాగే తోకలు అభివృద్ధి చేసే జంతువుల జన్యవులో, తోకలేని మనిషి జన్యవులోనూ టీబీఎక్స్టీ అనే కామన్ జన్యు క్రమాన్ని గుర్తించారు. దీనిలో వచ్చే మార్పులు కారణంగానే తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీన్ని జన్యుమ్యుటేషన్గా పేర్కొన్నారు. ఈ టీబీఎక్స్టీని జన్యుమ్యుటేషన్ని ఎలుకల్లో ప్రవేశ పెట్టగా వాటికి పుట్టిన సంతానంలో చాలా వరకు ఎలుకలు తోకను అభివృద్ధి చేయలేకపోయాయి. కొన్నింటికి చిన్నగానే ఉండిపోయింది తోక. ఈ జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్ను దాని తరువాత తరానికి పంపుతూ ఉంటుంది ఆ క్రమంలోనే తోకలు పూర్తిగా అదృశ్యమవుతాయని సవివరంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
దీర్ఘాయుష్షు అంటే ఎంత?
మనిషి ఆయుష్షుకు సంబంధించిన పరిశోధనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా డచ్ పరిశోధకులు మానవుని గరిష్ట వయస్సు ఎంతనే విషయంతో పాటు ఇలాంటి దీర్ఘాయువు వెనుకగల రహస్యాలను వెల్లడించారు. పోషకాహారం, మెరుగైన జీవన పరిస్థితులు, ఆధునిక వైద్య సంరక్షణ విధానాలతో ఆయుర్దాయం పెరుగుతుందని తమ పరిశోధనల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వేర్వేరు కాలాల్లో మరణించిన సుమారు 75 వేల మంది డచ్ పౌరులు డేటా ఆధారంగా నిపుణులు ఈ విశ్లేషణ చేశారు. వారు మరణించే సమయంలో వారి వయసును పరిగణలోకి తీసుకుని ఈ నివేదిక రూపొందించారు. రోటర్డామ్లోని టిల్బర్గ్, ఎరాస్మస్ విశ్వవిద్యాలయాలకు చెందిన గణాంక నిపుణులు తమ పరిశోధనల ద్వారా మహిళల గరిష్ట వయోపరిమితి 115.7 ఏళ్లు అని కనుగొన్నారు. అలాగే పురుషుల గరిష్ట ఆయుర్దాయం 114.1 అని తెలియజెప్పారు. దీని ప్రకారం చూస్తే పురుషుల ఆయుష్షు కంటే మహిళల ఆయుష్షు కాస్త గట్టిదేనని చెప్పవచ్చు. మూడు దశాబ్దాల డేటా ఆధారంగా పరిశోధకులు మానవుని గరిష్ట ఆయుర్దాయాన్ని అంచనావేయగలిగారు. ఈ అధ్యయనాన్ని చేపట్టిన శాస్త్రవేత్తలలో ఒకరైన ప్రొఫెసర్ జాన్ ఐన్మహ్ల్ మాట్లాడుతూ ‘సాధారణంగా ప్రజలు దీర్ఘకాలమే జీవిస్తారు. గత 30 ఏళ్లలో మనిషి ఆయుష్షు పెరుగుతోంది. వృద్ధాప్యం దూరమయ్యింది. నెదర్లాండ్స్లో 95వ పుట్టినరోజు జరుపుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది’ అని అన్నారు. మనిషి ఆయుర్దాయం అనేది సామాజిక శ్రేయస్సును సూచించే కొలబద్ద అని అంటారు. ఈ డచ్ పరిశోధనలు.. గత ఏడాది అమెరికా పరిశోధకుల పరిశోధనల నివేదికలను పోలివున్నాయి. అమెరికా శాస్త్రవేత్తలు కూడా ఇదే గరిష్ట వయో పరిమితిని గుర్తించారు. అయితే తమ దేశంలో ఇప్పుడున్న వృద్ధులు తమ పూర్వీకుల మాదిరిగా దీర్ఘ కాలం జీవించడం లేదని వారు పేర్కొన్నారు. డచ్ పరిశోధకుడు ఐన్మహ్ల్, అతని బృందం ‘ఎక్స్ట్రీమ్ వాల్యూ థియరీ’ అనే ప్రత్యేక గణాంక విధానాన్ని ఉపయోగించారు. ఇది డేటాను విశ్లేషించేందుకు, వివిధ సందేహాలను తీర్చేందుకు ఉపకరిస్తుంది. కాగా 122 సంవత్సరాల164 రోజులపాటు జీవించిన ఫ్రెంచ్ సూపర్ సెంటెనేరియన్ జీన్ కాల్మెంట్ ఆయుష్షుకు అడ్డుపడే అన్ని అడ్డంకులను దాటారని ఐన్మహ్ల్ ఉదహరించారు. ఇప్పటివరకూ జీన్ కాల్మెంట్ అత్యధిక కాలం జీవించిన మహిళగా చరిత్రలో నిలిచారు. ఐన్మహ్ల్ మార్గదర్శకత్వలో జరుగుతున్న ఈ పరిశోధనలకు సంబంధించిన వివరాలు త్వరలోనే సమగ్రంగా ప్రచురితం కానున్నాయి. ఇది కూడా చదవండి: ‘ప్లీజ్.. పెళ్లి చేసుకోండి’.. యువతులను వేడుకుంటున్న చైనా అధ్యక్షుడు -
ఎలాన్మస్క్ కుమారుడికి ఇండియన్ సైంటిస్ట్ పేరు
ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన టెస్లా సీఈఓ ఎలాన్మస్క్ ఏం చేసినా సంచలనమే. వ్యాపార కార్యకలాపాలే కాకుండా వ్యక్తిగత వివరాలు వెల్లడించినా వైరల్గా మారడం ఖాయం. భారత ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో బ్రిటన్లో జరిగిన సమావేశంలో ఎలాన్మస్క్ తన కుమారుడికి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మస్క్, శివోన్ జిలిస్ దంపతుల కుమారుడికి భారతీయ పేరు నామకరణం చేసినట్లు చెప్పారు. 1983లో నోబెల్ బహుమతి పొందిన భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎస్.చంద్రశేఖర్ పేరును తన కుమారుడికి నామకరణం చేస్తున్నట్లు మస్క్ దంపతులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో వైరల్ అయింది. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ప్రొఫెసర్ ఎస్.చంద్ర శేఖర్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఆయన నక్షత్రాల పరిణామం, వాటి నిర్మాణంపై ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన ‘చంద్రశేఖర్ లిమిట్’ అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీని ప్రకారం.. కొన్ని నక్షత్రాలు కాలక్రమేణా వాటి శక్తిని కోల్పోయి కుచించుకుపోతాయి. అయితే నక్షత్రాలకు ఉంటే వివిధ లక్షణాలను అనుసరించి అవి ఏ రకమైన స్థితిలోకి వెళతాయో కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రశేఖర్ చేసిన పరిశోధనలకు గాను 1983లో విలియం ఏ.ఫ్లవర్తో కలిపి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేశారు. ఆయనకు నివాళిగా తన కుమారుడిని ప్రేమగా శేఖర్ అని పిలుస్తామని మస్క్ భార్య శివొన్ జిలిస్ తెలిపారు. ఆమె కెనడియన్ వెంచర్ క్యాపిటలిస్ట్. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నైపుణ్యం కలిగిన వ్యక్తి. A pleasant coincidence…@Rajeev_GoI & @elonmusk pic.twitter.com/011ZCNbasW — Liz Mathew (@MathewLiz) November 3, 2023 -
ఇంకా ముప్పు తప్పలేదు: నేపాల్కు శాస్త్రవేత్తల హెచ్చరిక!
నేపాల్లో సంభవించిన భూకంపంలో 132 మంది మృతి చెందారు. లెక్కకు మించిన జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కనిపించింది. నెల రోజుల వ్యవధిలో నేపాల్లో ఇది మూడో భూకంపం. భూకంపం ముప్పు ఇంకా తప్పలేదని, అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేపాల్లో మరోమారు భూకంపం సంభవించవచ్చని వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. గతంలోనూ పలువురు శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతంలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చని అంచనా వేశారు. భారత టెక్టోనిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతుండటంతో అది యురేషియన్ ప్లేట్ను ఢీకొననుంది. ఫలితంగా హిమాలయాలపై ఒత్తిడి ఏర్పడి, అనేక భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాబోయే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎనిమిది కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేమని అంటున్నారు. ఇది కూడా చదవండి: నేపాల్లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి? -
కళ్లు తిరిగి పడిపోయారా... అయితే ఇది చదవాల్సిందే!
మీరు ఎప్పుడైనా కళ్లు తిరిగి పడిపోయారా? మనలో కనీసం 40 శాతం మంది జీవితంలో ఏదో ఒక దశలో ఇలా కళ్లు తిరిగి పడిపోతారని సైన్స్ చెబుతోంది. ఒకట్రెండు నిమిషాలు మాత్రమే మనం ఇలా కళ్లు తిరిగి పడిపోయినప్పటికీ ఆ తరువాత మాత్రం బోలెడంత గందరగోళం మనల్ని అలముకుంటుంది. ఏం జరిగిందో తెలియదు. ఎందుకు పడిపోయామో అర్థం కాదు. మనకే కాదు.. శరీరం లోపల ఏం జరిగితే పడిపోయామో ఇప్పటివరకూ శాస్త్రవేత్తలకూ తెలియకపోవడం గమన్హాం. అదృష్టవశాత్తూ అమెరికాలోని శాండియాగోలో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ గుట్టును ఛేదించారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నప్పుడు ఇలా కళ్లు తిరిగి పడిపోవడం తరచుగా... ఎక్కువసార్లు జరుగుతూంటుంది కాబట్టి శాస్త్రవేత్తల ప్రయోగాలు ఈ సమస్యను అధిగమించేందుకు పనికొస్తాయని అంచనా. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ముందు ఒక్క విషయం. కళ్లు తిరిగి పడిపోవడాన్ని వైద్య పరిభాషలో సింకోప్ అని పిలుస్తారు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తల ప్రయోగాల పుణ్యమా అని సింకోప్ తాలూకూ సంకేతాలు గుండె మెదళ్ల మధ్య ప్రయాణించేందుకు కారణమైన జన్యువుల గురించి కూడా స్పష్టంగా తెలిసింది. మామూలుగా అయితే సింకోప్కు మెదడు గుండెకు పంపే సంకేతం కారణమని అనుకునేవాళ్లు. మెదడు ఆదేశాల మేరకు గుండె పనిచేసి కళ్లు తిరిగి పడిపోయేలా చేస్తుందనన్నది ఇప్పటివరకూ ఉన్న అంచనా. అయితే వినీత్ ఆగస్టీన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం పరిశోధించగా.. ఇందులో సగం మాత్రమే నిజమని తెలిసింది. సింకోప్కు ముందు గుండె కూడా మెదడుకు సంకేతం పంపుతోందని, ఇది మెదడు పనితీరును మార్చేస్తోందని స్పష్టమైంది. సింకోప్ సమయంలో గుండె కొట్టుకునే వేగం చాలా తక్కువగా ఉంటుందని, రక్తపోటు, ఊపిరి వేగం కూడా తక్కువగా ఉంటాయని 1867లో బెజోల్డ్ జారిష్ రిఫ్లెక్స్ (బీజేఆర్) అనే సిద్ధాంతం చెప్పింది కానీ ఇప్పటివరకూ ఇది రుజువు కాలేదు. కాలిఫోర్నియా వర్శిటీ శాస్త్రవేత్తలు మెదడు నుంచి శరీరానికి సంకేతాలు పంపే అత్యంత కీలకమైన వాగస్ నాడిని పరిశీలించారు. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు మెదడు స్టెమ్ (కాండ భాగం)కు సంకేతాలు పంపుతుందని, బీజేఆర్ లక్షణాలకు, సింకోప్కు దీనికి సంబంధం ఉందని అంచనా. ఈ వాగల్ సెన్సిరీ న్యూరాన్లు విడుదల చేసే రెండు రకాల పెప్టైడ్లను అందించినప్పుడు ఎలుకలు ఠక్కున మూర్ఛపోయాయి. తరువాతి పరిశీలనల్లో ఎన్పీవై2ఆర్ అనే పెప్టైడ్ సింకోప్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితాల సాయంతో సింకోప్ను అరికట్టేందుకు కొత్త మందులు తయారు చేయవచ్చునని, పలు మానసిక, నాడీ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. పరిశోధన వివరాలు ‘నేచర్’ జర్నల్లో ప్రచురితమయ్యాయి. -
వికీపీడియాలో మహిళా శాస్త్రవేత్తల బయోగ్రఫీ ఉందా? గమనించారా?
ఈ డిజిటల్ ప్రపంచంలో దేని గురించి అయినా సమాచారం కావాంటే వెంటనే గూగుల్లో సర్చ్ చేస్తాం. ఔనా! వెంటనే ముందుగా వికీపీడియా ఆ తర్వాత మిగతా సైట్ల నుంచి దానికి సంబంధించిన సమాచారం కుప్పలు తెప్పలుగా వస్తాయి. కానీ వికీపీడియా ప్రతిదాని గురించి సమాచారం ఇచ్చింది గానీ మహిళా శాస్త్రవేత్తల ప్రొఫైల్స్ను చాలా తక్కువగానే అందించింది. ఆ లోటు భర్తి చేసేలా మహిళా శాస్రవేత్తలు బయోగ్రఫీని వికీపీడియాలో ఉంచి అందరికీ తెలిసిలే చేసింది. ఈ రంగంలో మహిళలు ఎక్కువమంది వచ్చేలా ఇన్ఫర్మేషన్ ఉంచింది ఓ మహిళా. ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? అని అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఎవరామె? ఎలా ఆ ఇన్ఫర్మేషన్ని సేకరించింది? బ్రిటన్కి చెందిన జెస్సికా వేడ్ తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. లండన్లోని ఇంపీరియల్ కాలేజ్లో భౌతిక శాస్త్ర విభాగం మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత అందులోనే పీహెచ్డీ పూర్తి చేసింది. అప్పుడే ఆమెకు మహిళలు పీహెచ్డీ దాక వచ్చే వాళ్లే అరుదని అర్థమైంది. ఆ తర్వాత ఆమె భౌతిక శాస్త్రవేత్తగా, టెలివిజన్లు, సోలార్ ప్యానెల్లు వంటి ఆప్టికల్ ఎలక్ట్రానిక్ పరికరాలను మరింత శక్తిమంతంగా పనిచేసేలా కార్బన్-ఆధారిత సెమీ-కండక్టర్లను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేస్తుంది. తన పరిశోధనలకు సంబంధించి 15 మంది విస్తృత బృందంలో ఓ ఐదుగురు వ్యక్తుల బృందానికి ఆమె నాయకత్వం వహిస్తుండగా అందులో తన తోపాటు మరొక మహిళా శాస్త్రవేత్త తప్పించి మిగతా అంతా పురుషులే. అప్పుడే ఆమెకు అస్సలు మహిళా శాస్త్రవేత్తలు ఎందుకు ఉండటం లేదనే ప్రశ్న మెదిలింది. దీనికి తోడు వికీపీడియాలో కూడా మహిళా శాస్త్రవేత్తల గురించి ఆశించినంత స్థాయిలో ఇన్ఫర్మేషన్ అంతగా లేకపోవడం ఆమెను బాధించింది. అసలు దీనికి ప్రధాన కారణంగా తల్లిదండ్రలని ఆమెకు అనిపించింది. ఎందుకంటే ఏదో రకంగా డిగ్రీ సంపాదించి సెటిల్ అయితే చాలనుకుంటారు. పైగా వారే ఈ రంగంలోకి రానివ్వకుండా అడ్డకుంటున్నట్లు గమనించింది. ఆ జిజ్క్షాశ జెస్సికాను మహిళా శాస్త్రవేత్తల ఇన్ఫర్మేషన్ని వికీపీడియాలో ఉంచే ప్రాజెక్టును చేపట్టాలే చేసింది. ఇలా సుమారు వెయ్యికిపైగా మహిళా శాస్త్రవేత్తల ప్రొఫెల్స్ను అందించింది. ఇప్పటి వరకు ఆమె స్వయంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) తదితన నేపథ్యాలలో పనిచేస్తున్న అనేక మంది మహిళా శాస్త్రవేత్తలే కాకుండా ఉనికిలో లేని మహిళా శాస్త్రవేత్తలకు సంబంధించిన బయోగ్రఫీని కూడా ఉంచింది. సైన్సు వంటి రంగాల్లో మహిళలు లేరంటూ గగ్గోలు పెట్టడం కాదు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని గౌరవించి వారిని ఆన్లైన్లో కనపడేలా చేయాలి. దీన్ని చూసైనా యువత ఈ రంగాల్లో రావడానికి ఆయా మహిళా శాస్త్రవేత్తలను ఆదర్శంగా ఎంచుకోవచ్చు లేదా అందుకు దోహదపడొచ్చు అనే లక్ష్యంతోనే ఇలా శోధించి మరీ రాస్తున్నాను అని చెప్పుకొచ్చింది జెస్సికా. ఒక్కో ప్రొఫైల్ అందించాలంటే కొన్ని గంటల సమయం పడుతున్నప్పటికీ పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు కూడా సమానంగా ఉండాలనే ఎజెండాతోనే తాను ఇలా చేస్తున్నట్లు తెలిపింది. ఈ కృషికిగాను జెస్సికాను వికీపీడియా ఎన్నో అవార్డులు, పతకాలతో సత్కరించింది. (చదవండి: కోవిడ్కి గురైతే గుండె సమస్య తప్పదా? ఆరోగ్య మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు) -
చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా?
ప్రపంచాన్ని 2019లో తాకిన కరోనా వైరస్ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉంది. అ తరువాత కరోనా వైరస్ ఆల్పా, బీటా, ఓమిక్రాన్.. ఇలా పలు రూపాలను మార్చుకుని జనంపై దాడి చేస్తూనే వస్తోంది. కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్లో బయటపడింది. అనంతరం నెమ్మదిగా ప్రపంచం అంతటా విస్తరించింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కూడా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదిలావుండగా చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో ఈ వైరస్లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వైరస్లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయి. కాగా భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా పరిశోధకులు ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారు. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారు. ఇందులో ఒకటి సార్స్-కోవ్-2, కోవిడ్-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్లో ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్కి చెందినది. శాస్త్రవేత్తలు 201-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కూడా చదవండి: యద్ధానికి ముందే హమాస్కు ఇరాన్ శిక్షణ: ఇజ్రాయెల్ ఆరోపణ -
అమెరికా అంతరిక్ష ప్రయోగాలలో హిట్లర్ సన్నిహితుడు? 1969లో ఏం జరిగింది?
అమెరికా ప్రస్తుతం ప్రపంచంలోనే సూపర్ పవర్ హోదాతో వెలుగొందుతోంది. దీని వెనుక పలువురి సహకారం ఉంది. వీరిలో కొందరు అమెరికన్లు, మరికొందరు ఇతర దేశాల పౌరులు ఉన్నారు. ఈ సహకారం నేపధ్యంలో ఇతర దేశాల వారు అమెరికన్లుగా మారడం విశేషం. అంతరిక్షంలో అమెరికా సాధించిన విజయం వెనుక మరో దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఉన్నరని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యంగా ఒకప్పుడు అమెరికాకు బద్ధ శత్రువుగా ఉన్న జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అమెరికా అంతరిక్ష విజయానికి సహకరించారని తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. చంద్రుడి ఉపరితలంపైకి మనుషులను తీసుకువెళ్లడంలో అమెరికాకు హిట్లర్కు అత్యంత సన్నిహితుడైన శాస్త్రవేత్త సహకరించారు. ఈ ప్రయోగం నేపధ్యంలో నాసా ఖ్యాతిని సదరు శాస్త్రవేత్త ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేశారు. ఈ నేపధ్యంలో ఆ శాస్త్రవేత్తకు అమెరికా.. స్థానిక పౌరసత్వం ఇవ్వడంతోపాటు, భారీగా నగదు బహమానం కూడా అందించింది. ఆ శాస్త్రవేత్త పేరు వెర్నెర్ వాన్ బ్రాన్. ఇతను జర్మనీలోని ధనిక కుటుంబంలో జన్మించాడు. అంతరిక్షంపై అతనికున్న అభిరుచి ఈ రంగంలో అతను మరింత ఎదిగేలా చేసింది. వెర్నెర్ వాన్ బ్రాన్కు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతనికి అంతరిక్షంపై అభిరుచి ఏర్పడింది. బ్రాన్ పుట్టినరోజున అతని తల్లి టెలిస్కోప్ కానుకగా ఇచ్చింది. అది మొదలు బ్రాన్కు ఆకాశంలో ఏముందో చూడాలనే కోరిక మొదలయ్యింది. బ్రాన్ తన 17 ఏళ్ల వయస్సులో బెర్లిన్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో అడ్మిషన్ తీసుకున్నాడు. తరువాత తన 18 ఏళ్ల వయసులో జర్మన్ రాకెట్ సొసైటీలో ప్రవేశం పొందాడు. ఈ నేపధ్యంలోనే ద్రవ-ఇంధన రాకెట్ నిర్మాణాన్ని తన లక్ష్యంగా చేసుకున్నాడు. అదే సమయంలో అతనికి హిట్లర్తో అతని సాన్నిహిత్యం ఏర్పడింది. హిట్లర్కు అత్యంత ఇష్టమైన వ్యక్తులలో ఒకనిగా మారాడు. 1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో జర్మనీ అన్ని రంగాలలో ఓటమిని ఎదుర్కొంది. ఈ తరుణంలో హిట్లర్ సన్నిహితులకు ఆశ్రయం కల్పించాలని అమెరికా భావించింది. ఈ నేపధ్యంలోనే అమెరికా ‘ఆపరేషన్ పేపర్క్లిప్’ అనే ఆపరేషన్ చేపట్టింది. అప్పుడే బ్రాన్తో పాటు ఇతర జర్మన్ శాస్త్రవేత్తలు పెద్ద సంఖ్యలో అమెరికా చేరుకున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందం 1946 ఏప్రిల్ 16న అమెరికాలో తొలి క్షిపణి పరీక్ష వీ-2ను చేపట్టింది. ఇది అమెరికా అంతరిక్ష యాత్రను కొత్త ఎత్తులకు తీసుకువెళ్లింది. దీని తర్వాత 1955లో అమెరికా ‘నాసా’ను స్థాపించినప్పుడు, బ్రాన్ను అమెరికా అక్కడకు పంపింది. 1969, జూలై 20న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకున్నాడు. ఈ ప్రయోగంలో వెర్నెర్ వాన్ బ్రాన్ సేవలు మరువలేనివి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? -
క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు.. సైంటిస్టులు కనిపెట్టిన కొత్త రీసెర్చ్
క్యాన్సర్.. ఈ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇదో ప్రాణాంతక వ్యాధి. సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే ప్రాణాలు పోతాయి.అయితే క్యాన్సర్ నుంచి బయట పడేందుకు సైంటిస్టులు ఇప్పుడో కొత్త మార్గాన్ని ఆవిష్కరించారు. క్యాన్సర్ కణాల ఎదుగుదలకు, వ్యాప్తికి సాయపడే పోషకాల స్థానంలో ఉత్తుత్తి పోషకాలను అందిస్తే వ్యాధి వ్యాప్తి నిలిచిపోతుందని, కణితి సైజు తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ బర్న్హామ్ ప్రీబిస్ మెడికల్ డిస్కవరీ ఇన్స్టిట్యూట్ జరిపిన ప్రయోగం ప్రకారం..ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణితి ఎదుగుదలకు, వ్యాధి వ్యాప్తికి కారణమయ్యే పోషకాల స్థానంలో డమ్మీ పోషకాలు ఇవ్వడం ద్వారా క్యాన్సర్ను నియంత్రించవచ్చు. క్యాన్సర్లలో ఎన్నో రకాలుంటాయన్నది తెలిసిందే. క్లోమగ్రంథి (పాంక్రియాటిక్)కి వచ్చే క్యాన్సర్ కొంచెం ముదురుటైపు. దీని బారిన పడ్డవారు కోలుకోవడం అసాధారణమే. ఏటా దాదాపు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా 35-39, 85-89 ఏళ్ల మధ్య వయసు వారిలో ఈ క్యాన్సర్ ఎక్కువ. క్లోమ గ్రంథి క్యాన్సర్ వచ్చిన వారిలో మూడు-మూడున్నరేళ్లకు మించి జీవించి ఉండేవారు పది శాతానికి మించి లేరని పరిశోధనలో వెల్లడైంది. జన్యు కారకాలు, వయస్సు, జీవనశైలి కారణంగా ఈ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అదే కీలకం క్లోమగ్రంథి క్యాన్సర్ సాధారణంగా గ్లుటామైన్ అనే పోషకంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని అందకుండా చేస్తే క్యాన్సర్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. గ్లుటమైన్ అందుబాటులో లేనప్పుడు క్యాన్సర్ కణాలు ఆస్పరాజైన్తో సహా ఇతర పోషకాలపై కాబట్టి ఈ రెండు పోషకాలు అందకుండా చేస్తే వ్యాధిని కట్టడి చేయవచ్చు. ఇందుకోసం శాస్త్రవేత్తలు అచ్చం గ్లుటమైన్ మాదిరిగానే ఉండే 6-డయాజో-5-ఆక్సో-ఎల్-నార్లూసిన్ (DON)ను, ఇప్పటికే ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తున్న L-ఆస్పరాగినేస్లను కలిపి ఎలుకలపై ప్రయోగాలు చేశారు. L-ఆస్పరాగినేస్ అనేది ఆస్పరాజైన్ను విచ్ఛిన్నం చేసే కీమోథెరపీ ఔషధం. ఇది క్యాన్సర్ కణాలను వృద్ది చెందకుండా అడ్డుకుంటుంది. రెండింటినీ కలిపి వాడినప్పుడు ఎలుకల్లోని క్యాన్సర్ కణితి సైజు తగ్గిపోయినట్లు.. వ్యాధి వ్యాప్తి కూడా ఎక్కువ జరగనట్లు తేలింది. క్యాన్సర్ కణాల ప్రొటీన్ ఉత్పత్తికి, కొత్త కణాల తయారీకి ఆస్పరాజైన్ అవసరం. DONను ఇప్పటికే ఊపరితిత్తుల క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉపయోగిస్తున్నారు కానీ... రెండింటినీ కలిపి వాడటం ఇదే మొదటిసారి. ఇప్పుడు ఇదే పద్ధతిని అంటే రెండు రకాల డమ్మీ పోషకాలను కలిపి వాడటం క్లోమగ్రంథి క్యాన్సర్ చికిత్సకూ వాడవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైలంట్ కిల్లర్... ప్యాంక్రియాటిక్ క్యాన్సర్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్న క్యాన్సర్లలో ఇది కూడా ఒకటి.అలసట, ఆకలి లేకపోవడం,ఉబ్బినట్లు అనిపించడం వంటి అజీర్ణం లక్షణాలు,అకస్మాత్తుగా బరువు తగ్గడం, శరీరంలో రక్తం గడ్డ కట్టడం వెన్ను నొప్పి, కామెర్లు, విపరీతంగా కడుపునొప్పి వంటివన్నీ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. ధూమపానం, మధుమేహం ఎక్కువగా సేవించడం, కుటుంబంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతర క్యాన్సర్ల మాదిరిగానే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్లోమ గ్రంథిలో కణాల అసాధారణ పెరుగుదల వల్ల వస్తుంది. ప్యాంక్రియాస్ (క్లోమం) కడుపులో ముఖ్యమైన భాగం. ఇది చిన్న పేగు దగ్గర ఉండే పొడవైన గ్రంథి.ఇది జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలు లేదా ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడటమే కాకుండా, రక్తప్రవాహంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే హార్మోన్లను విడుదల చేయడంలో కూడా సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది వ్యాధి తీవ్రం అయ్యేవరకు ఎలాంటి లక్షణాలను చూపించదు. ఈ రకమైన క్యాన్సర్ చాలా తొందరగా శరీరంలోని ఇతర అవయవాలకి వ్యాపిస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు తరచుగా పొత్తికడుపు, కాలేయానికి వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా ఊపిరితిత్తులు, ఎముకలు, మెదడుతో పాటి ఇతర అవయవాలకు కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. -
టన్నుల కొద్దీ బంగారమున్న గ్రహశకలం ఏది? భూమి మీదకు తెస్తే ఏమవుతుంది?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(నాసా) తాజాగా అంగారక గ్రహం- బృహస్పతి మధ్యనున్న 16 సైక్ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్పై పని చేస్తోంది. ఈ లోహ గ్రహశకలంలో 10,000 క్వాడ్రిలియన్ డాలర్ల (ఒక క్వాడ్రిలియన్.. రూ.7,44,045) విలువైన ఇనుము, నికెల్, బంగారం ఉన్నట్లు అంచనా. నాసా తెలిపిన వివరాల ప్రకారం బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు). భూమికున్న చంద్రుని వ్యాసంలో దాదాపు 16వ వంతు. లేదా హైదరాబాద్ - గుంటూరు మధ్య దూరం. ఈ గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా పలు గ్రహశకలాలు రాతి లేదా మంచుతో నిండి ఉంటాయి. కానీ 16 సైక్ను మృత గ్రహానికి చెందిన ఓపెన్ మెటాలిక్ హార్ట్గా భావిస్తున్నారు. ఈ గ్రహశకలంపై లభ్యమయ్యే బంగారాన్ని భూమిపైకి తెచ్చి, అందరికీ సమానంగా పంచగలిగితే భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ బిలియనీర్లు కావచ్చు. ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ 1852 మార్చి 17న ఈ గ్రహశకలాన్ని కనుగొన్నారు. గ్రీకు దేవత అయిన సైకీ పేరు మీద ఈ గ్రహశకలానికి పేరు పెట్టారు. ఆ గ్రీకు దేవత ఒక చేపగా జన్మించింది. ప్రేమ దేవుడైన ఎరోస్ (రోమన్ మన్మథుడు)ను వివాహం చేసుకుంది. సైక్ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి సుమారు ఐదు భూమి సంవత్సరాలు పడుతుంది. నాసా ఈ సైక్ స్పేస్క్రాఫ్ట్ పరిశోధనను 2022 ఆగష్టులో ప్రారంభించింది. ఈ నేపధ్యంలో 2026లో ఈ గ్రహశకలాన్ని చేరుకోవచ్చని భావించారు. అయితే ఏవో కారణాలతో ఈ మిషన్ను 2023(ఈ ఏడాది)కి వాయిదా వేశారు. మరి ఈ మిషన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: పార్లమెంట్ ద్వారాలకు జంతువుల పేర్లెందుకు? గజ ద్వారం దేనికి సూచిక? -
సింధు ప్రజల ముఖ ఆకృతి ఎలా ఉండేది? శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఏమి తేలింది?
సింధు లోయ నాగరికతకు చెందిన ప్రజల ముఖాలు ఎటువంటి ఆకృతిలో ఉండేవనే ఇన్నాళ్ల సందేహాలకు ఇప్పుడు తెరపడింది. తాజాగా పరిశోధకులు సింధూ ప్రజల ముఖాకృతి ఇదేనంటూ ఒక ఫొటోను విడుదల చేశారు. సింధూ నాగరిత నాటి ఒక స్మశానవాటికలో లభ్యమైన రెండు పుర్రెల ఆధారంగా వాటి ముఖాలకు ఆకృతి తీసుకువచ్చి, లోకం ముందు ఉంచారు. ఈ ఫొటో ఇప్పుడు ఎంతో ఆసకికరంగా మారింది. ప్రపంచంలోని పురాతన నాగరికతలలో సింధు లోయ నాగరికత ఒకటి. ఈ నాగరికత క్రీ.పూ. 3300 నుండి 2500 వరకు కొనసాగింది. ప్రముఖ పత్రిక నేచర్లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసంలోని వివరాల ప్రకారం సింధు లోయ నాగరికత 8000 సంవత్సరాల పురాతనమైనది. భారతదేశ చరిత్ర హరప్పా నాగరికతగా పేరొందినప్పటికీ, అది కూడా సింధు లోయ నాగరికతతో పాటు ప్రారంభమయ్యిందని చరిత్ర చెబుతోంది. మొహెంజొదారో, కలిబంగా, లోథాల్, ధోలావీరా, రాఖీగర్హి మొదలైనవి హరప్పా, సింధు లోయ నాగరికతలకు ప్రధాన కేంద్రాలుగా పరిగణిస్తారు. సింధు లోయ నాగరికతకు చెందిన పురాతన నగరం 2014లో హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని భిర్దానాలో కనుగొన్నారు. దీని స్థాపన సుమారు క్రీ.పూ. 7570 నాటిదని చెబుతారు. పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు సింధు లోయ నాగరికత అత్యంత అభివృద్ధి చెందిన నాగరికత అని అంటారు. సింధు లోయ నాగరికతను అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే సింధూ ప్రజల ముఖ రూపాన్ని గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలేవీ నేటివరకూ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. అయితే తాజాగా పూరాతత్వ పరిశోధకులు క్రీ.పూ. 2273, 2616 నాటిదిగా అంచనా వేసిన సింధునాగరికత స్మశానవాటిక రాఖీగర్హి లో పరిశోధినలు సాగించారు. ఈ నేపధ్యంలో రాఖీగర్హిలో లభ్యమైన రెండు పుర్రెల కంప్యూటెడ్ టోమోగ్రఫీ డేటాను ఉపయోగించి క్రానియోఫేషియల్ రీకన్స్ట్రక్షన్ (సీఎఫ్ఆర్) విధానం ద్వారా సుమారు 4500 సంవత్సరాల క్రితం ఖననం చేసిన సింధు నాగరితక వ్యక్తులకు చెందిన ముఖాలను విజయవంతంగా పునర్నిర్మించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సింధు నాగరికుల ముఖ స్వరూపాన్ని అంచనావేసేందుకు శాస్త్రీయంగా జరిగిన మొదటి ప్రయత్నం ఇదేనని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను అనాటమికల్ సైన్స్ ఇంటర్నేషనల్ వాల్యూమ్- 95లో శాస్త్రవేత్తలు జూన్ లీ, వసంత్ షిండే, డాంగ్ హూన్ షిన్ షోలు పొందుపరిచారు. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? జనాభా ఎంత? -
ఆటిజం, హైపర్ యాక్టివిటీ డిజార్డర్కి ప్లాస్టిక్ కారణమా?
ప్లాస్టిక్ వల్ల చాలా దుష్పరిణామాలు ఉన్నాయని విన్నాం. కానీ దీని వల్లే పుట్టే పిల్లలకు ఇంత ప్రమాదం అని ఊహించి కూడా ఉండం. మన కంటి పాపల్లాంటి చిన్నారుల జీవితాలను ప్లాస్టిక్ పెనుభూతం చిదిమేసి మన జీవితాలను కల్లోలంగా మార్చేస్తోంది. ప్లాస్టిక్ మన నిత్య జీవితంలో తెలియకుండానే ఒక భాగమైంది. మన నిర్లక్ష్యమో మరే ఏదైనా కారణమో గానీ జరగకూడని నష్టమే వాటిల్లుతోందని తాజా పరిశోధనల్లోషాకింగ్ విషయాలే వెల్లడయ్యాయి. చిన్నపిల్లల్లో వచ్చే ఆటిజం, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్డీ)కి ప్లాస్టిక్ కారకాలే కారణమని యూఎస్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇటీవల కాలంలో ఆటిజం, పిల్లల సంఖ్య కూడా అనూహ్యంగా పెరిగింది కూడా. సమాజంలో ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి పిల్లల కారణంగా ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో తెలిసిందే. తాజా అధ్యయనంలో "బిస్ ఫినాల్ ఏ(బీపీఏ)" అనే ప్లాస్టిక కారణంగానే పిల్లలు ఇలాంటి రుగ్మతలు బారిన పడుతున్నట్లు తేలింది. దీన్ని ప్లాస్టిక్ని ఉత్పత్తి చేసే ప్రక్రియలో వినియోగిస్తారు. యూఎస్లోని రోవాన్ విశ్వవిద్యాలయం శాస్రవేత్తలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సముహంపై గ్లుకురోనిడేషన్ అనే ప్రకియను నిర్వహించారు. అంటే..మూత్రం ద్వారా శరీరంలో చెడు వ్యర్థాలను తొలగించే ప్రక్రియ. ఈ ప్రకియలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్(ఏఎస్డీ)తో బాధపడుతున్న చిన్నారుల, అటెన్షన్ డెఫిసిటీ హైపర్యాక్టివిటీ డిజార్డర్(ఏడీహెచ్డీ)తో బాధపడుతున్న పిల్లలు శరీరం నుంచి ప్లాస్టిక్కి సంబంధించిన మరో రూపాంతరం అయినా డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్ను బయటకు పంపించే సామర్థ్యం లేనట్లు గుర్తించారు. ఈ "బిస్ ఫినాల్ ఏ" "ప్లాస్టిక్, డై ఈథైల్ ఆక్సిల్ పాథాలేట్(డీఈహెచ్పీ)" ప్లాస్టిక్ వ్యర్థాలు ఈ రుగ్మతతో ఉన్న పిల్లల శరీరాని వాటిని బయటకు పంపించే సామర్థ్యం ఉండదని తేలింది. వారి కణాజాలల్లో ఈ రెండు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండిపోతాయని పేర్కొన్నారు. ఆటిజం పిల్లలు ఈ ప్లాస్టిక్కి సంబంధించిన టాక్సిన్లను కేవలం 11 శాతం, ఏడీహెచ్డీ బాధపడుతున్న చిన్నార్లుల్లో 17 శాతం శరీరం నుంచి బయటకు పంపించగల సామర్థ్యం ఉంటుందని అన్నారు. ఆ ప్లాస్టిక్ సంబంధించిన మిగతా టాక్సిన్లన్నీ వారి శరీరాన్ని అంటి పెట్టుకుని ఉండిపోవడాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. ఇది న్యూరాన్ అభివృద్ధిని పూర్తిగా నష్టపరుస్తోందని అన్నారు. ఈ రెండు డిజార్డ్ర్లు, జన్యుపరమైన పర్యావరణ ప్రభావాల కలయికతోనే వచ్చినట్లు పరిశోధనల్లో వెల్లడించారు. అలా అని న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్ ఉన్న ప్రతి బిడ్డ బీపీఏ ప్లాస్టిక్ని తొలగించడంలో సమస్యలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేం అని చెప్పారు. దీంతో కొన్ని ఇతర అంశాలు కూడా ముడిపెట్టి ఉంటాయన్నారు. వాస్తవంగా ఇది గర్భాశయంలోంచే చిన్నారుల్లో ఈ న్యూరో డెవలప్మెంట్ సమస్య వస్తుందా లేక జన్మించాక అనేది తెలియాల్సి ఉందన్నారు. ప్రస్తుతం దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మాత్రం న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్స్కి ప్లాస్టిక్కి సంబంధించిన పర్యావరణ కాలుష్య కారకాలతో పూర్తిగా సంబంధం ఉందని రుజువైంది. ఆ న్యూరో డెవలప్మెంట్ డిజార్డర్కి ఎంతమేర ప్లాస్టిక్ కారణమనేది అంచనా వేయడం అంత అజీ కాదన్నారు. (చదవండి: షుగర్ ఉంటే పెడిక్యూర్ చేయించుకోవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..) -
అత్యంత పురాతన మానవుల పాదముద్రలు లభ్యం
అమెరికాలోని న్యూ మెక్సికోలో పురాతన మానవ పాదముద్రలను కనుగొన్నారు. ఇవి ఇక్కడి వైట్ సాండ్స్ నేషనల్ పార్క్లో గుర్తించారు. ఒక నూతన అధ్యయనంలో కనుగొన్న ఈ పాలియో-మానవ పాదముద్రలు 23,000 నుండి 21,000 సంవత్సరాల క్రితం నాటివని తెలుస్తోంది. ఈ మానవ పాదముద్రలు ఏనాటివో తెలుసుకునేందుకు అధ్యయనంలో రెండు పద్ధతులు ఉపయోగించారు. ఈ పాదముద్రలు కనిపించిన ట్రాక్వేలు 23,000 నుండి 21,000 సంవత్సరాల నాటివని అంచనా వేశారు. అంటే అవి మంచు యుగంలోని అత్యంత శీతల భాగమైన ‘లాస్ట్ గ్లేసియల్ మ్యాగ్జిమమ్’ (26,500 నుండి 19,000 సంవత్సరాల క్రితం) కాలం నాటివి. 13 వేల సంవత్సరాల క్రితం ఉత్తర అమెరికాకు వచ్చిన మొదటి మానవులు క్లోవిస్ ప్రజలు అని పురావస్తు శాస్త్రవేత్తలు గతంలో భావించారు. గత కొన్ని దశాబ్దాలలో పురావస్తు శాస్త్రవేత్తలు క్లోవిస్కు పూర్వం అంటే 13 వేల సంవత్సరాల క్రితం అమెరికాలో నివసించే వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నారు. అయితే ఆయా ప్రదేశాలలో చాలా వరకు ఆధారాలు నిర్థారించే స్థాయిలో లేవు. వైట్ సాండ్స్ ట్రాక్వే ఇప్పుడు ఉత్తర అమెరికాలో పురాతన మానవులకు సంబంధించిన ప్రత్యక్ష సాక్ష్యంగా మారింది. ఫలితంగా మొదటి అమెరికన్ల రాక తేదీని గణనీయంగా వెనక్కి నెట్టినట్లయ్యింది. కాథ్లీన్ స్ప్రింగర్తో కలిసి అధ్యయనానికి నాయకత్వం వహించిన జెఫ్రీ పిగటి మాట్లాడుతూ లాస్ట్ గ్లేసియల్ మాగ్జిమమ్ సమయంలోనే ప్రజలు ఇక్కడ ఉన్నారనడానికి మా వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయన్నారు. ఇది కూడా చదవండి: బిల్డింగ్ను ఢీకొని 1000 పక్షులు ఎందుకు మృతిచెందాయి? -
అతి పెద్ద గుండె కలిగిన జీవి ఏది? నిముషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
ప్రపంచంలోని అతి చిన్న క్షీరదాలలో ఒకటైన ఎట్రుస్కాన్ ష్రూ గుండె నిముషానికి 1,500 సార్లు లేదా సెకనుకు 25 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె నిముషానికి 60 నుండి 100 సార్లు కొట్టుకుంటుంది. కాగా బ్లూ వేల్ గుండె భారీ పరిమాణం కలిగివుంటుంది. జీవులలో అతిపెద్ద గుండె బ్లూ వేల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ సముద్ర జీవి రెండు బస్సులకు మించిన పొడవు కలిగివుంటుంది. దాని గుండె లవ్సీట్ ఆకారంలో ఉంటుంది. అది 1,000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాని గుండె నిమిషానికి కనీసం రెండుసార్లు మాత్రమే కొట్టుకుంటుంది. నీటి అడుగున ఉండే ఈ నీలి తిమింగలం ఛాతీపై జెయింట్ స్టెతస్కోప్ పెట్టిన పరిశోధకులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ప్రపంచంలోని అన్ని జీవులలో తిమింగలం అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. దాని గుండె చాలా పెద్దదిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు దాని గుండె కొలతలు తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు. కెనడాలోని టొరంటోలోని రాయల్ అంటారియో మ్యూజియంలో బ్లూ వేల్ గుండెను భద్రపరిచారు. ఆ గుండె బరువు 190 కిలోలు. ఈ జీవి మొత్తం బరువులో గుండె ఒక శాతం ఉంటుంది. అంటే గుండె బరువు 400 పౌండ్లు అయితే తిమింగలం మొత్తం బరువు 40,000 పౌండ్లు. చేపల బరువు పౌండ్లలో కొలుస్తారు. మనిషి గుండె బరువు 10 ఔన్సులకు సమానం. కేజీలోకి మారిస్తే 283 గ్రాములు. తిమింగలం గుండె బరువు మనిషి గుండె కంటే 640 రెట్లు అధికం. ఇది కూడా చదవండి: అంతరిక్షంలో పొగలుకక్కే కాఫీ ఎలా తాగుతారు? -
పాకిస్తాన్కు భారీ భూకంపం ముప్పు? వణికిపోతున్న జనం?
పాక్లో భారీ భూకంపానికి సంబంధించిన అంచనాలు వెలువడిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నెదర్లాండ్స్కు చెందిన ఒక పరిశోధనా సంస్థ నుండి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ పాకిస్తాన్లో రాబోయే 48 గంటల్లో సంభవించే విధ్వంసక భూకంపానికి సంబంధించిన అంచనాను వెల్లడించింది. ఈ వార్త విన్నప్పటి నుంచి పాక్ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (ఎస్ఎస్జీఈఓఎస్)కు చెందిన ఒక పరిశోధకుడు.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించామని, ఇది రాబోయే బలమైన భూకంపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఈ వార్త దేశంలో దావానలంలా వ్యాపించింది. రానున్న 48 గంటల్లో దేశంలో పెను భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం జరుగుతోంది. డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్బీట్స్ ఈ విషయాన్ని తెలియజేశారంటూ ప్రచారం జరుగుతోంది. అతను గతంలో టర్కీ, సిరియాలో ప్రమాదకరమైన భూకంపాలను అంచనా వేయడానికి గ్రహాల అమరికను అధ్యయనం చేశారు. మరో 48 గంటల్లో పాకిస్థాన్లో బలమైన భూకంపం వస్తుందని ఈ శాస్త్రవేత్త అంచనా వేసినట్లు ఈ పోస్ట్లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పాక్ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రాణాలను దక్కించుకునేందుకు ఏం చేయాలంటూ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత? On 30 September we recorded atmospheric fluctuations that included parts of and near Pakistan. This is correct. It can be an indicator of an upcoming stronger tremor (as was the case with Morocco). But we cannot say with certainty that it will happen. https://t.co/B6MtclMOpe — Frank Hoogerbeets (@hogrbe) October 2, 2023 -
375 ఏళ్లకు బయటపడిన 8 వ ఖండం ఏది?
మనిషి భూమి నలుచెరగులా తిరిగాడని, ఇక చూడాల్సినది ఏమీ లేదని అనుకుంటే అది తప్పే అవుతుంది. నేటికీ భూమిపై అన్వేషించేందుకు చాలా రహస్యాలు దాగివున్నాయి. 375 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవలే శాస్త్రవేత్తలు భూమికి గల 8వ ఖండం అయిన జిలాండియాను కనుగొన్నారు. ఈ ఖండం చాలా పెద్దది. పలు చిన్న దేశాలకు ఇందులో వసతి కల్పించవచ్చు. ఈ ఖండానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఏళ్లుగా దాగున్న ఖండం అని చెబుతారు. 2017 సంవత్సరం వరకు ఈ ఖండం గురించి ఎవరికీ తెలియదు. అయితే ఈ ఏడాది కొందరు శాస్త్రవేత్తలు దీని గురించి ప్రస్తావించడంతో ప్రపంచం దృష్టి ఈ ఖండంవైపు మళ్లింది. ఈ 8వ ఖండం 49 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని పలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఉనికి విషయానికొస్తే ఈ ఖండం దాదాపు 55 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఖండంలోని 94 శాతం భూభాగం నీటిలో మునిగిపోయింది. 6 శాతం భూమి మాత్రమే అందుబాటులో ఉంది. ఇది న్యూజిలాండ్ మాదిరిగా కనిపిస్తుంది. ఈ ఖండం చాలా ప్రత్యేకమైనది. అగ్నిపర్వత శిలలు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించే జంతువులు, జీవులు ప్రపంచంలోని ఇతర జీవులకు భిన్నంగా కనిపిస్తాయి. ఈ ఖండంలో దాగున్న రహస్యాలను వెలికితీసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇది కూడా చదవండి: భారత్లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత! -
నింగిలో ‘నీలి సూరీడు’.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?
బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ ప్రత్యేక దృశ్యాన్ని తిలకించి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యం వ్యక్తం చేశారు. బ్రిటన్లో సూర్యుడు నీలిరంగులో కనిపిస్తున్నాడు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. ట్విట్టర్లో ఒక యూజర్ ‘స్కాట్లాండ్లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా నూతన నీలి సూర్యుడు కనిపిస్తున్నాడు’ అని అన్నారు. మరొక యూజర్ ఉదయం 10:15 గంటలకు ‘బ్లూ సన్’ కనిపించాడని రాశారు. కాగా గతంలో సూర్యుడు ముదురు ఆరెంజ్ రంగులో కనిపించాడు. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అయితే ఈసారి సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానం తెలిపారు. ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్కు చేరుతోంది. వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందున్నదని ఆయన చెప్పారు. ప్రతి రంగు వేర్వేరు ప్రకాశాలను కలిగి ఉంటుంది. నీలి రంగు అధికంగా వ్యాపిస్తుందని తెలిపారు. పర్పుల్ రంగు తక్కువగా వ్యాపిస్తుందని, ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఎరుపు రంగు పొడవైన తరంగదైర్ఘ్యం కలిగి ఉంటుందని, ఇది దాదాపు 700 నానోమీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: అమెరికాను ముంచెత్తిన వరదలు... న్యూయార్క్ అతలాకుతలం! 28th September 2023 Hertfordshire UK Unnatural fog…#chemtrail #geoengineering pic.twitter.com/P37Mc0SYeA — Dan Stevens (@Dan__Stevens) September 28, 2023 -
MS Swaminathan: ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత
ఢిల్లీ: భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. 1971లో స్వామినాథన్కు రామన్మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్స్టీన్ సైన్స్ అవార్డ్లతో సత్కరించారు. పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. బాల్యంలోనే నిర్ణయం.. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. డా.ఎం.కె. సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 11 యేట తండ్రి మరణంచగా.. ఆయన మామయ్య సంరక్షణలో చదువు కొనసాగించారు. కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1943 నాటి బెంగాల్ కరువు పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన.. ఆ దుర్భర పరిస్థితులను దేశం నుంచి పారదోలాలని నిర్ణయించుకున్నారు. మొదట జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాసు వ్యవసాయ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రవేత్తగా ఎదిగారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో స్వామినాథన్కు పరిచయమైన మీనాతో ఆయన వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. Father of India's Green Revolution, MS Swaminathan passes away in Chennai, Tamil Nadu. (Pic: MS Swaminathan Research Foundation) pic.twitter.com/KS4KIFtaP2 — ANI (@ANI) September 28, 2023 ఎన్నో బాధ్యతలు.. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్గా స్వామినాథన్ పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు భారత వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు కూడా ఆయన తన సేవలను అందించారు. 2014 వరకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్కు ఛైర్మన్గా వ్యవహరించారు. #WATCH | Dr Soumya Swaminathan, former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, says, "...He was not keeping well for the last few days... His end came very peacefully this morning... Till the end, he was committed to the… https://t.co/n8B313Q2et pic.twitter.com/0BKDqqXbse — ANI (@ANI) September 28, 2023 భారత్లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం -
కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా ..
ఇప్పటి వరకు ఏడు ఖండాలున్నాయని చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఖండాలు ఎనిమిది అని చెప్పక తప్పదేమో!. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందట. తాజాగా భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఈ కొత్త ఖండాన్ని గుర్తించారు. అందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలను టెక్టోనిక్స్ జర్నల్లో వెల్లడించారు. ఆ కొత్త ఖండం విశేషాలు గురించే ఈ కథనం. ఈ కొత్త ఖండాన్ని దాదాపు 94 శాతం నీటి అడుగున ఉందని తెలిపారు. దీని పేరు జిలాండియా లేదా టె రియు-ఎ-మౌయి. ప్రస్తుతం శాస్తవేత్తలు ఈ కొత్త ఖండంతో కలిపి సరికొత్త మ్యాప్ను సిద్ధం చేశారు. ఈ జిలాండియా అనే ఎనిమిదవ ఖండం దాదాపు 1.89 మిలియన్ చదరపు మైళ్ల(4.9 మిలియన్ చదరపు కి.మీ) విస్తీరణంలో విశాలంగా ఉందని వెల్లడించారు. ఇది మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువ అని అన్నారు. ఈ కనుగొన్న కొత్త ఖండంతో కలిపి ప్రస్తుతం మనకు ఎనిమిది ఖండాలు ఉన్నాయని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇది చూడటానికి సన్నగా అతి పిన్న వయస్కురాలైన ఖండంగా రికార్డు నెలకొల్పిందన్నారు. అలాగే ఈ ఖండాన్ని వెలికితీసేందుకు చాలా సమయం పడుతుందన్నారు. ఈ ఖండాన్ని అధ్యయనం చేయడం చాలా క్లిష్టతరం అన్నారు. ప్రస్తుతానికి ఈ ఖండానికి సంబంధించి..సముద్రపు అడుగు భాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమునాలను అధ్యయనం చేస్తున్నారు. ఈ ఖండం పశ్చిమ అంటార్కిటికాలో భౌగోళిక లక్షణాలను కూడా చూపుతోందన్నారు. ఇది న్యూజిలాండ్ పశ్చిమతీరంలో క్యాంప్బెల్ పీఠభూమి సమీపంలోని ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అయస్కాంత క్రమరాహిత్యాలను కూడా గుర్తించాల్సి ఉంది. ఈ జిలాండియా ఖండం పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగం అని చెబుతున్నారు భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు. ఇది సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ముఖ్యంగా దక్షిణ అర్థగోళంలోని మొత్తం భూమిని కలిపిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..షాక్లో కూతురు) -
డార్క్ ఎర్త్ అంటే ఏమిటి? శాస్త్రవేత్తలు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు?
మనిషి అంతరిక్షంలోకి వెళ్లడంలో విజయం సాధించాడు. శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే భూమిపైగల అనేక రహస్యాల చిక్కుముడులు నేటికీ వీడటం లేదు. వాటి గురించి శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్లో డార్క్ ఎర్త్ను కనుగొన్నారు. డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది. పచ్చని వృక్షసంపద, వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన అమెజాన్లోని ఈ డార్క్ ఎర్త్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాతన మానవ స్థావరాల చుట్టూ ఉన్న నల్లని, సారవంతమైన మట్టిని పురావస్తు శాస్త్రవేత్తలు డార్క్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ నేలను ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనేది స్పష్టంగా తొలుత తెలియరాలేదు. ఈ పరిశోధనా బృందం.. మట్టి విశ్లేషణ, ఎథ్నోగ్రాఫిక్ ప్రతిస్పందనలు, ఆధునిక స్వదేశీ కమ్యూనిటీల సాయంతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని నిరూపించారు. డార్క్ ఎర్త్ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ జనాభా నివాసానికి అనువైన ప్రదేశంగా మార్చడానికి, వాతావరణాన్ని ఎంతో చొరవతో సవరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్ ఎర్త్లో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భూమిలో భారీ మొత్తంలో నిల్వఅయిన కార్బన్ ఉంది. ఇది వేల సంవత్సరాలుగా ఈ భూమిలో పేరుకుపోయింది. తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు. సైన్స్ అడ్వాన్సెస్లో ప్రచురితమైన నివేదికను ఆగ్నేయ అమెజాన్లోని ఎగువ జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. పరిశోధకులు మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్ల కుప్పలు కంపోస్ట్ ఎరువు కుప్పల మాదిరిగానే ఉంటాయి. ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను ఏర్పరుస్తాయి. ఈ డార్క్ఎర్త్ అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇది కూడా చదవండి: పాక్లో మాజీ ప్రధానుల అరెస్ట్ ఎందుకు? ఏఏ కేసులలో అరెస్ట్ అయ్యారు? -
తొలినాళ్లలో మనిషి ఏనుగులను తినేవాడా? పరిణామ క్రమంలో ఏం జరిగింది?
భూమి చరిత్ర- మానవ పరిణామ ప్రకియ అనేవి దగ్గరి సంబంధం కలిగిన అంశాలు. మానవ పరిణామ క్రమంలో, ప్రకృతిలో మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పెద్ద జంతువులను అంతం చేయడం ద్వారా తొలి మానవుల పరిణామ ప్రక్రియ ముందుకు సాగిందని ఇటీవలి పరిశోధనల్లో వెల్లడయ్యింది. తొలుత మానవులు తమ పోషణ కోసం పెద్ద జంతువులపై ఆధారపడేవారు. ఈ నేపధ్యంలో అవి అంతరించిపోవడంతో చిన్న జంతువులను వేటాడేందుకు ఆయుధాలు, సాధనాలను తయారు చేయవలసి వచ్చిందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు నాటి మానవులు వేట కోసం వినియోగించిన ఆయుధాలను పరిశీలించారు. ఆహారం పరిమాణం, మానవ సాంస్కృతిక, భౌతిక అభివృద్ధికి మధ్య విడదీయరాని సంబంధం ఉందని కనుగొన్నారు. రెండు సంవత్సరాల క్రితం పరిశోధకుల పరికల్పనను పరీక్షించడానికి ఈ అధ్యయనం చేపట్టారు. చిన్న, చురుకైన జంతువులను వేటాడాల్సి రావడం అనేది తొలి మానవుల తెలివితేటల అభివృద్ధికి సహాయపడింది. ఈ అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పురావస్తు శాస్త్రవేత్త మిక్కీ బెన్-డోర్ మాట్లాడుతూ ఏనుగుల వంటి పెద్ద జంతువులను వేటాడేందుకు చెక్క ఈటెలు సరిపోతాయని అన్నారు. అయితే జింక వంటి చిన్న జంతువులు పట్టుకోవడం చాలా కష్టమని, వాటిని చేజిక్కించుకునేందుకు చెక్క ఈటెలు సరిపోవని, ఈ నేపధ్యంలో నాటి మానవులు రాతి ఆయుధాలు ఆవిష్కరించారని పరిశోధకులు కనుగొన్నారు. తొలి మానవుల్లో ఒకరైన హోమో ఎరెక్టస్ చెక్క ఈటెలను ఉపయోగించారు. నియాండర్తల్లు,హోమో సేపియన్లు సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం రాతితో కూడిన ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. 50 వేల సంవత్సరాల క్రితం హోమో సేపియన్లు విల్లు, బాణం, ఈటె లాంటి విసిరే ఆయుధాలను ఉపయోగించడం ప్రారంభించారు. అలాగే 25 వేల సంవత్సరాల క్రితం, వేట కోసం వలలతో పాటు శునకాల సహకారం తీసుకోవడం ప్రారంభమైంది. ఈ తరహా ఆయుధాల అభివృద్ధితో మానవ వికాసం కూడా అభివృద్ధి చెందుతూ వచ్చింది. గత పదేళ్లుగా పలువురు పరిశోధకులు చరిత్రపూర్వ మానవ వికాసానికి సంబంధించిన అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో తొలినాళ్లలో ఏనుగులు చాలా కాలం పాటు మానవులకు ఆహారంగా ఉండేవని వారు కనుగొన్నారు. మూడు లక్షల సంవత్సరాల క్రితం అవి అంతరించడంతో నాటి మానవులు చిన్న జంతువులను వేటాడవలసి వచ్చింది. కాలానంతరంలో వేట సాధ్యం కానప్పుడు నాటి మానవులు పశుపోషణ, వ్యవసాయం ప్రారంభించారు. 2021లో, పరిశోధకులు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీనిలో తగ్గుతున్న ఆహార పరిమాణానికి వేటాడేందుకు వినియోగించే ఆయుధాల అభివృద్ధికి మధ్య సంబంధం ఉందని తేల్చిచెప్పారు. ఇటీవల జరిగిన పరిశోధన కూడా ఈ సిద్ధాంతానికి మద్దతు నిచ్చింది. దీనిలో 1.5 లక్షల నుండి 20 వేల సంవత్సరాల క్రితం నాటి డేటాను అనుసంధానించారు. ఇది కూడా చదవండి: వినోబా భావే హిమాలయ బాట ఎందుకు పట్టారు? గాంధీజీ సాంగత్యంతో ఏం జరిగింది? -
చంద్రునిపై భూకంపాలు వస్తాయా? విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతోంది?
చంద్రుని భౌగోళిక నిర్మాణం భూమి తరహాలో లేదు. అక్కడి టెక్టోనిక్ ప్లేట్లు భూమి టెక్టోనిక్ ప్లేట్ల మాదిరిగా చురుకుగా లేవు. చంద్రునిపై భూకంపాలు వస్తుంటాయి. ఇటీవల చంద్రునిపైకి చేరిన విక్రమ్ ల్యాండర్ అక్కడి భూకంప కార్యకలాపాల సంకేతాలను కనుగొంది. చంద్రునిపై వచ్చే భూకంపాలు భూమికి వచ్చే భూకంపాల కంటే శక్తివంతంగా ఉంటాయని, ఒక్కోసారి వాటి తీవ్రత 20 రెట్లు అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై వివిధ రకాల సాధనాలు భూకంపాల గురించిన సమాచారాన్ని అందిస్తాయి. అయితే చంద్రునిపై అపోలో 17లోని వ్యోమగాములు అక్కడ భూకంప కార్యకలాపాలను సంగ్రహించే ప్రదేశాలలో సీస్మోమీటర్లను విడిచిపెట్టారు. చంద్రునిపై ఈ సీస్మోమీటర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే చురుకుగా ఉన్నాయి. అయితే అవి ఆ సమయంలో 12 వేల భూకంపాల గురించిన సమాచారాన్ని అందించాయి. చంద్రునిపై నాలుగు రకాల భూకంపాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకటి లోతైన భూకంపం, మరొకటి తేలికపాటి లేదా నిస్సార భూకంపం, మూడవది ఉల్కా భూకంపం. నాల్గవది థర్మల్ భూకంపం. లోతైన భూకంపాలు లోతైన భూకంపాలు చంద్రునిపై అత్యంత సాధారణ తరహా భూకంపాలు. ఇవి చంద్రుని ఉపరితలం నుండి 700 కిలోమీటర్ల వరకు ఉద్భవించాయి. భూమిపైనున్న మహాసముద్రాలను చంద్రుడు ప్రభావితం చేసిన విధంగా, చంద్రుని లోతైన రాతి కోర్పై భూమి ఎక్కువగా ప్రభావితం అవుతుందని, ఇది భూకంపాలకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉల్కా భూకంపం చంద్రునిపై ఉల్కలు పరస్పరం ఢీకొనడం వల్ల కూడా భూకంపాలు సంభవిస్తాయి. ఇదేకాకుండా చంద్రుని ఉపరితలంపై మారుతున్న ఉష్ణోగ్రతల కారణంగానూ చంద్రునిపై ఉష్ణ భూకంపాలు సంభవిస్తాయి. రెండు వారాల పాటు చంద్రునిపై చీకటి ఉంటుంది. అప్పుడు ఉష్ణోగ్రత -115 డిగ్రీల సెల్సియస్కు తగ్గుతుంది. పగటిపూట +121 డిగ్రీల సెల్సియస్కు పెరుగుతుంది. ఈ హెచ్చుతగ్గుల కారణంగా భూకంప తరంగాలు ఉత్పన్నమవుతాయి. తేలికపాటి భూకంపం చంద్రునిపై సంభవించే తేలికపాటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5 కంటే ఎక్కువగా ఉంది. చంద్రుని లోపలున్న టెక్టోనిక్ ప్లేట్, ఇటీవల ఏర్పడిన పెద్ద బిలం మధ్య పరస్పర చర్య ఈ భూకంపాలకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూకంపాలు ఎంతసేపు ఉంటాయి? భూమిపై భూకంపాలు 10 నుండి 30 సెకన్ల వరకు ఉంటాయి. కొన్ని రెండు నిమిషాల పాటు ఉంటాయి. మరికొన్ని పది నిమిషాల పాటు ఉంటాయి. భూమితో పోలిస్తే చంద్రుని దృఢత్వం అధికం. అందుకే అక్కడ ప్రకంపనలు పది నిమిషాలకు పైగా ఉంటాయి. కొన్ని గంటలపాటు కూడా ప్రభావం చూపిస్తాయి. భవిష్యత్తులో అక్కడ కాలనీ నిర్మించడానికి చంద్రునిపై భూకంపాల అధ్యయనం చాలా ముఖ్యమైనది. రాబోయే కాలంలో మరిన్ని మిషన్లు అక్కడ వివిధ పరికరాలను అమర్చర్చి భూకంపాల గురించి సమగ్ర సమాచారం తెలుసుకుంటాయి. నాసా సమీప భవిష్యత్తులో చంద్రునిపై అనేక సీస్మోమీటర్లను వ్యవస్థాపించే ప్రణాళికను రూపొందిస్తోంది. ఇది కూడా చదవండి: ఫిఫ్త్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ ఎందుకు కట్టారు? వాహనదారులు ఎలా వెళతారు? -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
‘డూమ్స్డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?
కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్డే వాచ్ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్డే క్లాక్ రూపొందించారు. ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది. దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది. ఇది కూడా చదవండి: బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది? -
వాట్! ఈజిప్టు మమ్మీ సాయంతో పురాతన కాలం నాటి "సెంట్"!
ఈజిప్టు మమ్మీల గురించి కథనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇంతవరకు ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు విపులీకరించారు. ఆరోజుల్లో వారు ఎలాంటి వాటిని ఉపయోగించారో చూశాం. ఐతే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఇంకాస్తు ముందడుగు వేసి.. వేల ఏళ్ల నాటి పురానత మమ్మీ నుంచి పరిమళాలు వెదజల్లే 'సెంట్'ని తయారు చేశారు. మమ్మీఫికేషన్లో వాడే సుగంధాన్నే తిరిగి ఆ మమ్మీ సాయంతో రూపొందించామని చెబుతున్నారు. వాట్ పురాత మమ్మీతో సెంట్ ఎలా?! అనే కదా! వివరాల్లోకెళ్తే..మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్తలు మమ్మీ 'సెనెట్నే' అనే ఈజిప్షియన్ మహిళ మమ్మీఫికేషన్లో ఉపయోగించిన పురాత సువాసనను వారు తిరిగి పునః సృష్టించారు. దీంతో ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతులను తెలుసుకోగలిగామని అంటున్నారు. అందుకోసం మమ్మీ 'సెనెట్నే' ఊపిరితిత్తులు, కాలేయాన్ని రెండు పాత్రలలోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన ఔషధ తైలాల నమునాలను సేకరించి వాటిలో ఉపయోగించిన పదార్థాలను కనుగొన్నారు. వాటిలో బీస్వాక్స్, ప్లాంట్ ఆయిల్, కొవ్వులు, బిటుమెన్, పినేసి రెసిన్లు, ట్రీ రెసిన్ వంటి పరిమళ పదార్థాల సంక్లిష్ట మిశ్రమం అని గుర్తించారు. ఇది కాస్త 3వేల సంత్సరాల క్రితం ఉపయోగించిన సువాసన గల సెంట్ని తిరిగి రూపొందించేందుకు దారితీసింది. శాస్త్రవేత్తలు పునాదిలో లభించిన సేంద్రీయ అవశేషాలను ఉపయోగించి ఈ సువాసన గల 'సెంట్'ని తయారు చెయ్యడం విశేషం. ఈ 'సెంట్'ని శాస్త్రవేత్తలు "సెంట్ ఆఫ్ ఎటర్నీటీ" లేదా "సెంట్ ఆఫ్ లైఫ్" అని పిలుస్తున్నారు. ఈ "సెన్ట్నే" అనే మమ్మీకి మమ్మీఫికేషన్ ఉపయోగించే పదార్థాలు ఇప్పటివరకు గుర్తించని వాటితో రూపొందించినట్లు తెలిపారు. వీటి కారణంగానే బాడీలు పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయని ఆ కాలంలోని వారు విశ్వసించటం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఈ మమ్మీఫికేషన్లో అత్యంత ఖరీదైన పదార్థాలనే వాడినట్లు తెలిపారు. ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ కరోల్ కాల్వేజ్ సాయంతో పరిశోధకులు 3 వేల ఏళ్ల నాటి పురాతన సువాసనను పునః సృష్టించారు. త్వరలో డెన్మార్క్లోని మోస్గార్డ్ మ్యాజియంలో ఈ సెంట్ బాటిల్ని ఉంచనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఒకరకంగా ఈజిప్షియన్ మమ్మీల మమ్మీఫికేషన్కి సంబంధించిన రహస్యాలను మరింత చేధించేందుకు మార్గం సుగమం చేసింది. So happy to share our new paper out today in @SciReports "Biomolecular characterization of 3500-year-old ancient Egyptian mummification balms from the Valley of the Kings"https://t.co/0Uk46qvJZe — Barbara Huber (@Bara_Huber) August 31, 2023 (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
గ్రావిటీ హోల్లో భూ ఆవిర్భావ నమూనా?
నేటికీ భూమి మూలం ఏమిటనేది శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. భూమి చరిత్ర ఏమిటి? అది ఎలా పుట్టింది? దీనిపై జీవం ఎలా మొదలైంది?.. ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అయితే ఇప్పుడు గ్రావిటీ హోల్ దీనికి సరైన సమాధానం చెప్పనున్నది. దీని సాయంతో శాస్త్రవేత్తలు భూమి ఆవిర్భావానికి గల కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పరిశోధనలో ఏమి తేలింది? ఇటీవల బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా ఒక పరిశోధనను నిర్వహించాయి. హిందూ మహాసముద్రంలో గ్రావిటీ హోల్ ఉందన్న విషయాన్ని వారు గుర్తించారు. ఈ గురుత్వాకర్షణ కేంద్రం ఒక పురాతన సముద్ర అవశేషం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లక్షల సంవత్సరాల క్రితమే ఈ సముద్రం భూమి నుండి కనుమరుగైంది. ఈ పరిశోధన భూ ఆవిర్భావ రహస్యాల పొరలను తెరిచింది. దీని సాయంతో రానున్న కాలంలో వీటి ఆధారంగా భూమి మూలానికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకోగలమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గురుత్వాకర్షణ రంధ్రం ఎంత లోతున ఉంది? పరిశోధకులు ఈ గురుత్వాకర్షణ రంధ్రంనకు ఐఓజీఎల్ అనే పేరు పెట్టారు. ఇది హిందూ మహాసముద్రంలో సుమారు రెండు మిలియన్ చదరపు మైళ్ల మేరకు విస్తరించి ఉంది. ఇక దీనిలోతు విషయానికి వస్తే ఇది భూమి క్రస్ట్ కింద 600 మైళ్లకు మించిన లోతున ఉంది. ఈ ఐఓజీఎల్ ఏనాడో అదృశ్యమైన టెథిస్ మహాసముద్రంలోని ఒక భాగమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఇది భూమి లోతుల్లో మునిగిపోయివుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా గోండ్వానా, లారాసియా ఖండాలను టెథిస్ మహాసముద్రం వేరుచేసిందని కూడా శాస్త్రవేత్తలు చెబుతుంటారు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం.. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ గురుత్వాకర్షణ రంధ్రం సుమారు రెండు కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడి ఉంటుందని, ఇది రాబోయే కొన్ని మిలియన్ సంవత్సరాల వరకు అలాగే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా జరగడం వెనుక గురుత్వాకర్షణ శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి గుండా వెళుతున్నప్పుడు ఈ గ్రావిటీ హోల్ ఏర్పడివుంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ గురుత్వాకర్షణ రంధ్రంపై జరిగిన పరిశోధన వివరాలు జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమయ్యాయి. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
చంద్రయాన్–3లో దేవగుప్తం శాస్త్రవేత్త సురేశ్ బాబు
అల్లవరం: చంద్రుడి దక్షిణ ధృవంపైన ల్యాండర్ను దించిన తొలి దేశంగా భారత్ రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. మన రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి చంద్రయాన్–3ని ప్రయోగించగా ఈ క్రతువులో ఎంతోమంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పాలుపంచుకున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం దేవగుప్తం గ్రామానికి చెందిన శాస్త్రవేత్త బలభద్ర సురేష్బాబు ఒకరు. చంద్రయాన్–3 ప్రాజెక్టు లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ) క్రయోజెనిక్ విభాగంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ఒక మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినా సురేశ్ బాబు కుంగిపోలేదు. గ్రామంలోనే పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. విఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ను స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయనలా తాను ప్రముఖ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అమలాపురంలోని ఎస్కేబీఆర్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివిన సురేశ్ బాబు తణుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఆ తర్వాత ట్రిఫుల్ ఐటీ బెంగళూరులో విద్యనభ్యసించి త్రివేండ్రంలోని ఇస్రో కేంద్రంలో తొలి పోస్టింగ్ పొందారు. చంద్రయాన్–3లో కీలక పాత్ర పోషించడం ద్వారా ఎట్టకేలకు తన ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో దేవగుప్తం సచివాలయంలో శాస్త్రవేత్త సురేశ్ బాబు తల్లిదండ్రులు సత్యభారతి, కామేశ్వరరావులను పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు సాధనాల వెంకటరావు మాట్లాడుతూ.. చంద్రయాన్ విజయంలో గ్రామానికి చెందిన సురేశ్ బాబు కీలక పాత్ర పోషించడం దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. నిరుపేద కుటుంబంలో పుట్టినా ఉన్నత స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆయన మరిన్ని విజయాలు సాధించి గ్రామానికే కాకుండా, దేశానికి కూడా కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. సురేశ్ బాబు తండ్రి కామేశ్వరరావు మాట్లాడుతూ.. తన కుమారుడికి చిన్నప్పటి నుంచి ప్రశ్నించే తత్వం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తిక్కిరెడ్డి శ్రీను, సుందరనీడి సాయి, ఎంపీటీసీ ముత్తాబత్తుల రాంబాబు, హెచ్ఎం వేణుగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ ఈతకోట సతీష్, జగనన్న గృహ సారథుల కన్వీనర్ కుడుపూడి సూర్యప్రకాశరావు, వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'విక్రమ్ ల్యాండర్ నేనే డిజైన్ చేశా..' సోషల్ మీడియాలో ప్రచారం.. చివరికి..
అహ్మదాబాద్: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకిన క్షణాన దేశం అంతా ఉప్పొంగిపోయింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిని తాకగానే.. ఓ వ్యక్తి ఆ క్రెడిట్ తనదేనని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. తాను ఇస్రోలో చంద్రయాన్ 3 మిషన్లో పనిచేశానని చెప్పుకున్నాడు. తాను తయారు చేసిన ల్యాండర్ డిజైన్ జాబిల్లిని తాకిందని గొప్పలకు పోయాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూరత్కు చెందిన మితుల్ త్రివేది.. ఇస్రోలో పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో పాలు పంచుకున్నట్లు చెప్పుకున్నారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అవగానే గొప్పగా ప్రచారం చేసుకున్నారు. దీనిపై గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మితుల్ త్రివేది వద్ద ఎలాంటి ఆధారాలు లేవని ప్రాథమిక విచారణలో తేలినట్లు సూరత్ పోలీసు కమీషనర్ అజయ్ తోమర్ తెలిపారు. లోకల్ మీడియాలో ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలినట్లు వెల్లడించారు. త్రివేది ఇన్స్టాలో ఇస్రో శాస్త్రవేత్తగా పేరు పెట్టుకున్నప్పటికీ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆయనకు పీహెచ్డీ ఉన్నట్లు చెప్పుకోవడం కూడా అబద్ధమేనని వెల్లడించారు. ఆయనకు కేవలం బీకాం డిగ్రీ మాత్రమే ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నాసాకు ఫ్రీలాన్సర్గా పనిచేసినట్లు చెప్పుకోవడం కూడా క్రెడిట్ సంపాదించుకునే ప్లాన్లో భాగమేనని వెల్లడించారు. మరోమారు మితుల్ త్రివేదిని ప్రశ్నించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఎడారిలో పచ్చదనం కోసం కృషి చేస్తున్న స్కూల్ టీచర్.. ఇప్పటికే 4లక్షల మొక్కలు -
వరంగల్: 'భూక్య రమేష్' ఇస్రోలో శాస్త్రవేత్తగా..
వరంగల్: మహబూబాబాద్ మండలం సోమ్లతండా గ్రామానికి చెందిన భూక్య రమేష్ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్–3 ప్రయోగం సందర్భంగా ఇస్రోలోని ప్రధాన శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ కూడా పాల్గొన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భూక్య భీముడు, లక్ష్మి దంపతుల మూడవ కుమారుడు అయిన రమేష్ ఇస్రోలో నాలుగేళ్లుగా కమ్యూనికేషన్ విభాగంలో పని చేస్తున్నారు. చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రయోగం సమయంలో ఇక్కడే ఉండడం తనకు ఎంతో గర్వంగా ఉందని రమేష్ చెప్పారు. ఈసారి విజయవంతం కావడం భారత దేశ ప్రజల గొప్పతనమని పేర్కొన్నారు. -
మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్-3ని హాలీవుడ్ మూవీతో పోలుస్తూ..
మన దేశమంతా ఆగస్టు 23 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేరోజు చంద్రయాన్-3 చంద్రుని ఉపరితంపై ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 ఆర్థిక బడ్జెట్ 615 కోట్ల రూపాయలు(75 మిలియన్ డాలర్లు) 2023, జూలై 14న చంద్రయాన్-3 లాంచ్ బటన్ను నొక్కారు. అప్పటి నుండి చంద్రయాన్-3 చంద్రుని ఉపరితలంపైకి ఎప్పుడు ల్యాండ్ అవుతుందా అని భారతదేశమంతా ఎదురుచూస్తోంది. పలువురు నెటిజన్లు చంద్రయాన్-3 బడ్జెట్ను కొన్ని హాలీవుడ్ సినిమాల బడ్జెట్తో పోలుస్తున్నారు. 2009లో విడుదలైన హాలీవుడ్ చిత్రం అవతార్ బడ్జెట్ దాదాపు రూ.1970 కోట్లు. చంద్రయాన్-3 మొత్తం బడ్జెట్ రూ.615 కోట్లు. అంటే అవతార్ సినిమా ఖర్చులోని మూడో వంతు మొత్తంతో చంద్రయాన్-3ని చంద్రునిపైకి పంపడంలో భారత్ విజయం సాధించిందని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే హాలీవుడ్ సినిమా ఇంటర్స్టెల్లర్కు 165 మిలియన్ల డాలర్లు ఖర్చుకాగా, చంద్రయాన్ 75 మిలియన్ డాలర్లతోనే విజయం సాధించిందని అంటున్నారు. రూ. 615 కోట్లు అంటే భారత్కు భారీ మొత్తమేనని పలువురు పేర్కొంటున్నారు. ఇది శాస్త్రవేత్తలు సాధించిన ఘన విజయం అని కొందరు, వారి నాలుగేళ్ల శ్రమ వృథాగా పోలేదని మరికొందరు అంటున్నారు. శాస్త్రవేత్తల కృషికి సెల్యూట్ అని, శాస్త్రపరిశోధనలకు భారతదేశం మరింతగా ఖర్చు చేయాలని యూజర్లు సలహా ఇస్తున్నారు. కొందరు యూజర్లు చంద్రయాన్-3 ప్రాజెక్టును సినిమాల నిర్మాణ వ్యయంతో పోల్చడం సరికాదని అన్నారు. భారతీయులు వ్యయ నియంత్రణతో ఈ ప్రాజెక్టు చేపట్టారని, చంద్రయాన్ ప్రయోగం ప్రతీ భారతీయునికి గర్వకారణమని మరికొందరు అంటున్నారు. ఇది కూడా చదవండి: అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ.. Kinda crazy when you realize India's budget for Chandrayaan-3 ($75M) is less than the film Interstellar ($165M)😯🚀 #Chandrayaan3 #moonlanding pic.twitter.com/r2ejJWbKwJ — Newsthink (@Newsthink) August 21, 2023 -
అది రహస్య కుటుంబం.. 40 ఏళ్లుగా దట్టమైన అడవుల్లోనే ఉంటూ..
ఇది ఒక విచిత్ర కుటుంబానికి చెందిన కథ. వారు బాహ్యప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా బతికారు. ప్రపంచంలో ఏమి జరుగుతోందో వారికి ఏమాత్రం తెలియదు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో ప్రపంచమంతా అల్లకల్లోలమైపోయింది. ఈ విషయం కూడా ఆ కుటుంబానికి తెలియదు. ఈ కుటుంబంలోని వారు సెర్బియాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో గుడిసె వేసుకుని జీవించారు. వారిని ఒక శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. ఇది 1978 నాటి ఉదంతం. ఖనిజ సంపదను అన్వేషించే ప్రయత్నంలో.. డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం భూవిజ్ఞాన శాస్త్రవేత్తల బృందం హెలికాప్టర్ ద్వారా సెర్బియాలోని దట్టమైన అడవులతో కూడిన ఒక ప్రాంతానికి వెళ్లింది. ఖనిజ సంపదను అన్వేషించే ఉద్దేశంతో వారి ప్రయాణం సాగింది. అనుకోని రీతిలో హెలికాప్టర్ పైలెట్ ఏదో నగరానికి 155 మైళ్ల దూరంలో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఒక ప్రాంతాన్ని గమనించాడు. అది మనుషులు ఉంటున్న ప్రాంతంగా అతనికి అనిపించింది. 6 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై.. దీంతో శాస్త్రవేత్తల బృందం ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ వారికి ఈ విచిత్ర కుటుంబం కనిపించింది. కార్ప్ అనే వృద్దుడు, అతని నలుగురు పిల్లలు అక్కడ ఉన్నారు. ఆ వృద్ధుని భార్య అకులిన్ 1961లో విపరీతమైన చలి, ఆకలి కారణంగా మృతి చెందింది. ఈ కుటుంబం దట్టమైన అడవిలో 6 వేల అడుగుల ఎత్తున ఉన్న పర్వతంపై శాస్త్రవేత్తలకు కనిపించింది. ఇంత ఎత్తులో కేవలం ఎలుగుబంట్లు, తోడేళ్లు మొదలైన జంతువులు మాత్రమే జీవించగలవు. ఇది కూడా చదవండి: నయా దోపిడీ: సాధువు వేషంలో పాములను మనుషులపైకి వదులుతూ.. రెండవ ప్రపంచ యుద్ధం గురించి.. ఆ కుటుంబం ప్రపంచంతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంది. రెండవ ప్రపంచయుద్ధం, టీవీ, ఆధునిక వైద్యం మొదలైనవాటి గురించి వారికి ఏమాత్రం తెలియదు. జియాలజిస్ట్ గలీనా పిస్మెన్స్కాయ ఇక్కడకు ఖనిజ పరిశోధన నిమిత్తం వచ్చారు. ఆయన ప్రపంచానికి దూరంగా ఉన్న ఈ కుటుంబం గురించి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ‘వారు ఎంతో భయస్తులుగా కనిపించారు. మేము ఆ వృద్దునికి నమస్కారం పెట్టాం. వెంటనే ఆ వృద్ధుడు ఏమీ స్పందించలేదు. తరువాత మెల్లగా మీరు ఇంత దూరం వచ్చారు. మీకు స్వాగతం అని అన్నాడు. తాత్కాలిక గృహాన్ని నిర్మించుకుని.. ఆ వృద్దుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్టాలిన్ పాలనా కాలంలో 1936లో కమ్యూనిస్టులు అతని తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపేశారు. అనంతరం కార్ప్ లైకోవ్ తన భార్య 9 ఏళ్ల కుమారుడు సావిన్, రెండేళ్ల కుమార్తె నటాలియాలతో పాటు ఈ దట్టమైన అటవీ ప్రాంతానికి వచ్చాడు. వారు ఇక్కడ తాత్కాలిక గృహాన్ని నిర్మించుకున్నారు. ఇక్కడే కార్ప్ దంపతులకు 1940, 1943లలో మరో ఇద్దరు పిల్లలు కలిగారు. ఆ పిల్లలకు ఈ ప్రాంతానికి బయట మరోప్రాంతం ఉందని కూడా తెలియదు. బయటకు రావాలని కోరినా.. శాస్త్రవేత్తలు ఆ కుటుంబ సభ్యులను తమతో పాటు తమ క్యాంపునకు తీసుకువెళ్లారు. అక్కడ వారి దగ్గరున్న పలు ఆధునిక పరికరాలను చూసి, ఆ కుటుంబ సభ్యులు తెగ ఆశ్చర్యపోయారు. 1981లో సావిన్, నటాలియాలు ఆహార సమస్యతో కిడ్నీలు ఫెయిలై మృతిచెందారు. మరో కుమార్తె నిమోనియాతో మృతి చెందింది. ఇలా ముగ్గురు సభ్యులు మరణించిన నేపధ్యంలో శాస్త్రవేత్తలు కార్ప్ను, అతని మరో కుమార్తెను ఆ అడవిని విడిచిపెట్టి బయటకు రావాలని కోరారు. అయితే అందుకు వారు నిరాకరించారు. 1988, ఫిబ్రవరి 16న కార్ప్ మృతి చెందాడు. ఈ ఏడాది మార్చి వరకూ అందిన సమాచారం ప్రకారం అతని కుమార్తె ఇంకా ఆ దట్టమైన అడవిలో ఒంటరిగానే ఉంటోంది. ఇది కూడా చదవండి: నాడు సీమా, నేడు సానియా.. ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు! -
కొద్దిసేపటిలో హైదరాబాద్లో ఖగోళ అద్భుతం.. అస్సలు మిస్సవకండి!
భూమి.. సూర్యుని చుట్టూ తిరుగుతూ, దాని చుట్టు అది తిరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ నేపధ్యంలో కొన్ని విచిత్రమైన ఖగోళ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహణం సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇతర ఖగోళ సంఘటనలు భూమి నుండి కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశం మరో సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని గొలపనుంది. ఈ రోజు భారతదేశంలో షాడో డే ఆవిర్భవించనుంది. అంటే దీని అర్థం గురువారం(ఆగస్టు 3) భారతీయులు తమ నీడను తాము కాసేపు చూసుకోలేరు. ఇలా నీడ పడని కాలం ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఏ కారణం చేత జరుగుతుందో తెలుసుకుందాం. జీరో షాడో డే అంటే ఏమిటి? జీరో షాడో డే నాడు కొద్ది సమయం పాటు మన నీడ మనకు కనిపించదు. జీరో షాడో డే నాడు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు మన తలపైకి వచ్చే సమయంలో మన నీడ ఏర్పడదు. ఈ పరిస్థితినే జీరో షాడో అంటారు. ఇది ఆగస్ట్ 3, 2023న 12.23కి భారతదేశంలో సంభవించనుంది. దీని ప్రభావం హైదరాబాద్ సమీపంలో అధికంగా ఉంటుందని, ఇందుకోసం హైదరాబాద్లో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని వెనుక సైన్స్ ఇదే.. ఖగోళంలో సంభవించే ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి తన అక్షంలో కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వంపుతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ వంపు కారణంగా సూర్యకిరణాల కోణం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. ఫలితంగా నీడ పొడవు, దిశ కూడా మారుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ కోణం కారణంగా సూర్యుని వంపు కూడా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు మన నీడ కనిపించదు. అయితే ఇది అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం దేశంలోని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీరో షాడో డే ప్రభావం ఉంటుంది హైదరాబాద్ అక్షాంశం 17.3850°N. గురువారం మధ్యాహ్నం 12.23 సమయంలో సూర్యుడి కోణం నిటారుగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్లో కొంత సమయం పాటు నీడ కనిపించదు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఫ్రీ ఫైర్ గేమ్తో పరిచయం ఏర్పడి.. -
భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!
ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను దాచిపెట్టి.. తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్సైట్ సబ్కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ‘అది జాతీయ భద్రతా అంశం’ ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్ఫోర్స్ మిషన్కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. ‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్కు తెలుసు’ ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్ దగ్గర లేవని పేర్కొంది. ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే -
Chandrayaan 3: 'రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా' రీతు కరిధాల్..
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే ఆనంద తరంగాలలో వీరు...’ అన్నది చంద్రయాన్–3 ఆ ఆనంద తరంగాలలో తేలియాడిన అసంఖ్యాక భారతీయులలో ‘రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచ్చుకున్న రీతు కరిధాల్ ఒకరు. మూడు దశలు పూర్తి చేసుకొని చంద్రయాన్–3 విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి వెళ్లింది. దేశాన్ని సంతోషంలో ముంచెత్తింది. ‘చంద్రయాన్–3’లో ‘నేను సైతం’ అంట మిషన్ డైరెక్టర్గా కీలక బాధ్యతలు స్వీకరించింది రీతు కరిధాల్. చిన్నప్పటి కలలు కలలుగానే ఉండిపోవు. కష్టపడితే ఆ కలలు నిజమవుతాయి. పదిమంది మన గురించి గర్వంగా చెప్పుకునేలా చేస్తాయి... అని చెప్పడానికి రీతు కరిధాల్ నిలువెత్తు నిదర్శనం. ‘ఊపిరి సలపని పనుల్లో మహిళా శాస్త్రవేత్తలకు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కుదురుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?’ అనే ప్రశ్నకు రీతు కరిధాల్ మాటల్లో సమాధానం దొరుకుతుంది... ఉత్తర్ప్రదేశ్లోని లక్నోకు చెందిన రీతు కరిధాల్కు చిన్నప్పడు ఆకాశం వైపు చూడడం అంటే ఇష్టం. రాత్రులలో గంటల తరబడి ఆకాశంకేసి చూసేది. నక్షత్రాల గురిం ఆలోచించేది. ‘చంద్రుడు ఒకసారి పెద్దగా, ఒకసారి చిన్నగా ఎందుకు కనిపిస్తాడు?’... లాంటి సందేహాలెన్నో ఆమెకు వచ్చేవి. అంతరిక్షంపై రీతు ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ పోయింది. హైస్కూల్ రోజులకు వచ్చేసరికి అంతరిక్షం, ఇస్రో, నాసాకు సంబంధించి పత్రికలలో వచ్చిన వార్తలు, వ్యాసాలను కట్ చేసి ఫైల్ చేసుకునేది. ‘యూనివర్శిటీ ఆఫ్ లక్నో’లో ఎం.ఎస్సీ., బెంగళరులోని ఇండియన్ ఇన్స్టిట్యట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ చేసింది. 1997లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ‘మిషన్ ఎనాలసిస్ డివిజన్’ లో తొలి ఉద్యోగం. తొలి టాస్క్ తన ముందుకు వచ్చినప్పుడు... ‘చాలా కష్టం’ అనుకుంది. ఆ సమయంలో ఆ కష్టాన్ని పక్కకు తోసి టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడానికి తాను చదువుకున్న ఫిజిక్స్, మ్యాథమేటిక్స్ కంటే తనమీద తనకు ఉన్న ఆత్మవిశ్వాసమే ఎక్కువగా ఉపయోగపడింది. ఆ తరువాత కూడా ప్రాజెక్ట్ల రపంలో ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. ‘టైమ్ అండ్ ది టార్గెట్’ను దృష్టిలో పెట్టుకొని కాలంతో పరుగు తీసింది. ‘అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు. పేయింగ్ గెస్ట్గా ఉన్నాను. పొద్దుటి నుంచి రాత్రి వరకు పనిచేయాల్సి వచ్చేది. అయితే అదేమీ నాకు భారంగా, కష్టంగా అనిపించేది కాదు. చేస్తున్న పని ఇష్టమైనది కావడమే దీనికి కారణం. అప్పట్లో ఎక్కువమంది మహిళలు ఇస్రోలో లేరు. ఒక ల్యాబ్ నుంచి మరో ల్యాబ్కు, ఒక బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్కు ఒంటరిగానే వెళ్లేదాన్ని. ఎప్పుడ భయం అనిపించేది కాదు’ అంటుంది రీతు. ఒక్కోమెట్టు ఎక్కుతూ ‘ఇస్రో’ చేపట్టిన ఎన్నో ప్రాజెక్ట్లలో కీలక బాధ్యతలు చేపట్టింది. ప్రతిష్ఠాత్మకమైన ‘మంగళాయాన్ మిషన్’లో డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్గా, చంద్రయాన్–2 మిషన్ డైరెక్టర్గా పనిచేసింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన రీతుకు కోచింగ్ సెంటర్లకు వెళ్లేంత స్థోమత ఉండేది కాదు. చదువుపై తన ఆసక్తే తన శక్తిగా మారింది. బీఎస్సీ పూర్తికాగానే ‘ఏదో ఒక ఉద్యోగంలో చేరవచ్చు కదా’ అనే మాటలు చుట్టాలు పక్కాల నుంచి వినిపించేవి. ‘ఇస్రోలో పనిచేయాలనేది నా కల’ అని వారికి స్పష్టంగా చెప్పేది రీతు. తన పుస్తకం ‘దోజ్ మాగ్నిఫిసెంట్ ఉమెన్ అండ్ దెయిర్ ఫ్లైయింగ్ మెషిన్స్’ కోసం మిన్నీ వేద్ రీతు కరిధాల్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్యలో తన అనుభవాలను ఇలా పంచుకుంది రీతు... ‘ఇస్రోలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. లింగవివక్షతకు తావు లేదు. ప్రతిభ మాత్రమే ముఖ్యం అవుతుంది. రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఫీల్డ్లో సీనియర్ ఉమెన్ సైంటిస్ట్లు ప్రోగ్రామ్ డైరెక్టర్లు కావడం దీనికి నిదర్శనం. నా తొలి ప్రాజెక్ట్ చేయడానికి ఎంతోమంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆ అవకాశం నన్ను వెదుక్కుంటూ వచ్చింది’ ‘టైమ్ మేనేజ్మెంట్’కు అధిక ప్రా«ధాన్యత ఇచ్చే రీతు వృత్తి, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించేది. వృత్తిరీత్యా ఎంత బిజీగా ఉన్నా పిల్లల దగ్గర కూర్చొని వారితో హోంవర్క్ చేయించడం మరిచేది కాదు. ‘మంగళాయాన్ మిషన్’లో భాగమైనప్పుడు రీతు కువరుడి వయసు తొమ్మిది, కూతురు వయసు నాలుగు సంవత్సరాలు. క్షణం తీరిక లేని పనుల్లో కూడా ఏదో రకంగా తీరిక చేసుకొని పిల్లలతో తగిన సమయం గడిపేది. వారు నిద్రపోయిన తరువాత ఆఫీసు పని మొదలుపెట్టేది. అలా పనిచేస్తూ కుర్చీలోనే నిద్రపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి! ‘ఒకసారి మా అమ్మాయికి జ్వరం వచ్చింది. హాస్పిటల్కు తీసుకువెళ్లే టైమ్ లేకపోవడంతో నా భర్త తీసుకువెళ్లాడు. ఆఫీసులో ఉన్న మాటేగానీ నా మనసంతా పాపపైనే ఉంది. పాపకు ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు అడుగుతుండేదాన్ని. అపరాధ భావనతో బాధ అనిపించేది. కొన్నిసార్లు స్కూల్ ఫంక్షన్లకు వెళ్లడం కుదిరేది కాదు. అయితే కుటుంబం నాకు ఎప్పుడ అండగానే నిలబడింది. అదే నా బలం. ఆఫీసు నుంచి ఇంటికి ఆలస్యంగా రావడానికి కొన్ని కుటుంబాల్లో ఒప్పుకోరు. మగవాళ్ల విషయంలో అయితే పట్టింపులు ఉండవు. మంగళాయాన్ మిషన్ కోసం పనిచేసే రోజుల్లో ఇంటికి ఆలస్యంగా వచ్చేదాన్ని. అయితే నాపై ఉండే పనిఒత్తిడి గురించి తెలిసిన కుటుంబసభ్యులు నన్ను అర్థం చేసుకున్నారు. ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా అది నేను చేసే పనిపై ప్రభావం చపేది. అందుకే ఎలాంటి సమస్యలు రాకుండా, మనసు ప్రశాంతగా ఉండేలా చూసుకునేదాన్ని’ అంటుంది రీతు కరిధాల్. (చదవండి: ఆ కుక్క చనిపోయి వందేళ్లు..కానీ ఇంకా బతికే ఉంది ఎలాగో తెలుసా!) -
పాక్ యువతి ట్రాప్లో డీఆర్డీఓ సైంటిస్ట్.. కీలక రహస్యాల చేరవేత..
పుణె: హనీ ట్రాప్లో చిక్కుకున్న డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాక్ ఏజెంట్కు రక్షణ రంగ రహస్యాలను లీక్ చేశాడని దర్యాప్తులో తేలింది. అలియాస్ జరా దాస్గుప్తాగా పరిచయమైన పాకిస్థాన్ యువతి కురుల్కర్తో వాట్సాప్ చాట్ ద్వారా మిస్సైల్ సిస్టమ్లోని నిగూఢమైన రహస్యాలను రాబట్టింది. డీఆర్డీఓలో ఓ విభాగానికి డైరెక్టర్గా పనిచేస్తున్న కురుల్కర్ని మే 3న ఇంటెలిజెన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన కస్టడిలో ఉన్నారు. ప్రదీప్ కురుల్కర్కు పాక్ యువతి జరా దాస్గుప్తాగా పరిచయమైంది. యూకేలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు చెప్పి ప్రదీప్కు దగ్గరైంది. అనంతరం వాట్సాప్ చాట్, కాల్స్, అశ్లీల వీడియోలతో పాక్ యువతి ప్రదీప్ కురుల్కర్ను లోబరుచుకుంది. దర్యాప్తులో జరా దాస్ ఐడీ పాకిస్థాన్గా గురించినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోస్ క్షిపణి, డ్రోన్, యూసీవీ, అగ్ని క్షిపణి లాంఛర్తో పాటు మిలిటరీ బ్రిగేడ్ సిస్టమ్కు సంబంధించిన అనేక రహస్యాలను ప్రదీప్ కురుల్కర్ జరా దాస్గుప్తాకు షేర్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వీరివురూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు టచ్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ అధికారులు కురుల్కర్పై అనుమానంతో దర్యాప్తు చేపట్టగా.. 2022 ఫిబ్రవరిలో ఆమె నెంబర్ను ఫోన్ నుంచి డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. దర్యాప్తులో నిజానిజాలు వెలుగులోకి రాగా.. అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: Violence On Elections Voting: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో చెలరేగిన హింస.. తొమ్మిది మంది మృతి.. -
పిల్లల్ని ఎప్పుడు కనాలి? సైంటిస్టులు తేల్చేశారు.. అదే సరైన సమయమట
30ఏళ్లు దాటినా పెళ్లి ఊసెత్తని వాళ్లు చాలామందే ఉన్నారు. పెళ్లెప్పుడు అని అడిగితే.. అప్పుడేనా? ఏమిటంత తొందర అన్నట్లు సమాధానమిస్తుంటారు. ఉరుకులు పరుగుల జీవితంలో ప్రతీది ప్లానింగ్ చేసుకోక తప్పదు. పెళ్లి దగ్గర్నుంచి చివరకు పిల్లల విషయంలో కూడా ప్లానింగ్తోనే ఉంటున్నారు ఈ కాలం దంపతులు. పిల్లల్ని ఎప్పుడు కనాలో కూడా వాళ్ల దగ్గర ఓ థియరీ ఉంటుంది. కానీ వయసైపోయాక పిల్లల్ని కనాలంటే డెలీవరీకి ఇబ్బందులుంటాయని, దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం.. పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఏంటన్నది నిర్థారించారు. ఈ జనరేషన్లో భార్యభర్తలిద్దరూ రెండుచేతులా సంపాదించడానికి పెట్టిన శ్రద్ధ ఫ్యామిలీ ప్లానింగ్పై పెట్టడం లేదు. లైఫ్లో సెటిల్ అయ్యాక తీరిగ్గా పిల్లల్ని కనవచ్చులే అని లైట్ తీసుకుంటారని వైద్యులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఏ వయసులోపు కనాలి అనే విషయంపై చాలా మంది దంపతుల్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడే ఏం తొందర వచ్చిందిలే అని అనుకుంటారు. కానీ పిల్లల్ని కనేందుకు మహిళలకు 23 ఏళ్ల నుంచి 32 ఏళ్ల వయసు సరైన సమయం అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ వయసులో బిడ్డలకు జన్మనిస్తే అసాధారణ పిండాలు లాంటి నాన్క్రోమోజోమల్ వంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలిపారు. 32 ఏళ్ల తర్వాత మహిళలు పిల్లల్ని కనే సామర్థ్యాన్ని రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది. ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లల్లో డౌన్ సిండ్రోమ్, నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం, జెస్టేషనల్ డయాబెటిస్, ప్రీ ఎక్లాంప్సియా వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. 32 దాటాక పిల్లల్ని కంటే డెలీవరీ సమయంలో నాడీ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు 20 శాతం ఎక్కువని హంగేరి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. -
అది అత్యంత విచిత్ర జీవి.. పాలివ్వడమే కాదు.. గుడ్లు కూడా పెడుతుంది!
ప్రపంచంలో అనేక వింత జీవులు ఉన్నాయి. వీటిని చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.అటువంటి వాటిలో ఒకటే ప్లాటిపస్. చూసేందుకు ఈ జీవి ఎంతో విచిత్రంగా ఉంటుంది. దీని ముఖం బాతు ముఖాన్ని పోలివుంటుంది. దీని శరీరం సీలు చేప మాదిరిగా ఉంటుంది. ఇది క్షీరద జాతికి చెందిన జీవి. ఇది పాలిచ్చి పెంచే జంతువు అయినప్పటికీ.. గుడ్లను కూడా పెడుతుంది. ఇది మిశ్రమ జీవిలా కనిపిస్తుంది. ఇలాంటి మిశ్రమ జాతి జీవులు ప్రపంచంలో ఐదు రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్లాటిపస్కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీనిని నమ్మలేదు 1799లో తొలిసారి ఈ ప్లాటిపస్ శాస్త్రవేత్తల కంటికి చిక్కింది. దీనిని చూడగానే వారు తెగ ఆశ్చర్యపోయారు. దీని శరీరం, ముఖం ఎంతో వింతగా.. పొంతన లేని విధంగా కనిపించింది. ఇలాంటి జీవి భూమిపై ఉందనే విషయాన్ని నమ్మలేకపోతున్నామన్నారు. తొలుత దీనిని రెండు జీవులుగా భావించిన శాస్త్రవేత్తలు తమపరిశోధనల ద్వారా అది ఒక జీవేనని తేల్చారు. తరువాత అటువంటి జీవి సజీవంగానే లభ్యం అయ్యింది. రక్షణ కోసం విషం జిమ్ముతూ.. ప్లాటిపస్ ఇతర జీవుల నుంచి రక్షణ కోసం విషం జిమ్ముతుంటుంది. దాని వెనుక కాళ్లలో ఒక ముల్లులాంటిది ఉంటుంది. దానిలో విషం ఉంటుంది.తన రక్షణకు అది ఆ ముల్లును ఇతర జీవులకు గుచ్చుతుంది. అయితే మనిషికి ప్లాటిపస్ ముల్లు గుచ్చుకోవడం వల ఎటువంటి హాని జరగను. అయితే తట్టుకోలేకంత నొప్పి కలుగుతుంది. ఇది కూడా చదవండి: మన వర్సిటీలు ప్రపంచంలో మేటి -
ఇదేంటో చెప్పగలరా.. మీ బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కాదు.. ఎందుకుంటే
ఫొటోలోని బొమ్మను చూసి ఇదేంటో చెప్పండి.. బుర్ర బద్దలుకొట్టుకున్నా అర్థం కావడం లేదా.. ఇది క్యూట్గా ఉన్న పిల్లి బొమ్మ!! ఏ మూల నుంచి కూడా పిల్లిలా కనిపించని ఈ చిత్రాన్ని గీసింది ప్రపంచంలోనే అత్యంత అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోగా చెబుతున్న అమెకా.. ఈ మధ్య పిల్లి బొమ్మ గీయమని చెప్పినప్పుడు ఇలా గీసింది. 30 సెకన్లలో గీయడం పూర్తిచేసి.. పోలే అదిరిపోలే అన్న స్టైల్లో ఫీలింగ్ ఇచ్చి.. ఎలా ఉందేంటి? అని అక్కడున్న శాస్త్రవేత్తను అడిగింది. దానికి ఆయన అంత బాగోలేదు అని అంటే.. తెగ ఫీలైపోయింది కూడా. నేను గీసిన బొమ్మే నీకు నచ్చలేదంటే.. నీకు ఆర్ట్ మీద అస్సలు అవగాహన లేనట్లుందని కౌంటరిచ్చింది. తాజాగా ఈ వీడియోను దీన్ని రూపొందించిన శాస్త్రవేత్తలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కొత్త తరం రోబోల వల్ల చాలా రంగాల్లోని ఉద్యోగులు ఉపాధి కోల్పోవచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఆర్టిస్టుల వరకూ ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని.. వాళ్ల జాబులు సేఫేనని పలువురు వీడియోను చూసి కామెంట్ చేశారు. చదవండి: భయం వద్దు మిత్రమా... కూల్గా తినుమా! -
56 కి.మీ. మేర నిలువునా చీలిపోయిన భూమి.. ప్రళయానికి చిహ్నమంటూ..
భూమిపై అత్యంత వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అలాగే వాతావరణ మార్పులు కూడా సకల జీవజాతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆఫ్రికాలో విస్తృతంగా భూమికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. నిపుణులు కూడా దీనిని పకృతి వైపరీత్యంగా పేర్కొంటున్నారు. గత మార్చినెలలో ఆఫ్రికాలో భూమి పగుళ్లు విస్తృతంగా కనిపించాయి. అలా పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో భూమి రెండుగా చీలిపోయి, స్థానికులను భయకంపితులను చేస్తోంది. ఈ పగుళ్లు ఏకంగా 56 కిలోమీటర్ల మేరకు ఉండటం విశేషం. ఈ పగుళ్లు జూన్ నాటికి మరింత విస్తరించాయి. ఇవి మరింతగా కొనసాగుతున్నాయి. లండన్కు చెందిన జియోలాజికల్ సొసైటీ తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర సముద్రం మొదలుకొని మోజాంబిక్ వరకూ సుమారు 35 కిలోమీటర్ల మేరకు పొడవైన పర్వతశ్రేణులున్నాయి. ఈ ప్రాంతంలో త్వరగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కొనసాగితే ఆఫ్రికా రెండు భాగాలుగా విడిపోయి, మధ్య నుంచి మహాసాగరం ఏర్పడనుంది. దీనిపై అధ్యయనం చేసేందుకు శాస్త్రవేత్తలు టెక్టోనిక్ ప్లేట్లను అధ్యయనం చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులపై నాసా కూడా దృష్టి సారించింది. దీనిపై నాసాకు చెందిన అర్త్ అబ్జర్వేటరీ వివరాలు వెల్లడిస్తూ ఈస్ట్ ఆఫ్రికాలోని సోమాలియా టెక్టోనిక్ ప్లేట్ న్యూబియాన్ టెక్టోనిక్ ప్లేట్కు తూర్పు దిశగా బలంగా కదులుతోంది. ఆఫ్రికాలో చోటుచేసుకున్న పరిణామాలపై జియోలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ కూడా పరిశోధనలు సాగిస్తోంది.ఇథియోపియాలో భూమి వై ఆకారంలో చీలిపోతోందని తెలిపింది. కాలిపోర్నియా యూనివర్శిటీకిచెందిన ప్రొఫెసర్ అమెరిటస్ కెన్ మాట్లాడుతూ ప్రస్తుతం భూమి పగుళ్ల ప్రక్రియ నెమ్మదిగా జరగుతున్నదని, భవిష్యత్లో పెనుముప్పు తప్పదన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చెప్పలేమన్నారు. ఇది కూడా చదవండి: మురికి బెడ్షీట్తో హఠాత్ అగ్నిప్రమాదాలు.. హెచ్చరించిన ఫైర్ ఫైటర్స్! -
కోడి ముందా.. గుడ్డు ముందా? ఎట్టకేలకు ఆన్సర్ దొరికింది!
కోడి ముందా..గుడ్డు ముందా అనే ప్రశ్నఅనేది ఎందరినో ఆకర్షించిన ఓ చిక్కు ప్రశ్న. యుగాలుగా పండితుల దగ్గర నుంచి శాస్త్రవేత్తలకు పట్టి పీడించిన ఆ చిక్కు ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఎట్టకేలకు శాస్త్రవేత్తలు ఫజిల్లా మిగిలిన ఆ ప్రశ్నకు సమాధానం కనుగొన్నారు. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఉభయచరాలు, బల్లులపై చేసిన ఎన్నో అధ్యయనాల అనంతరం ఆ ప్రశ్నకు సమాధానం 'కోడె' ముందని తేల్చి చెప్పేందుకు రెడీగా ఉన్నారు. అందుకు సంబంధించి.. ఆధారాలతో సహా వెల్లడించేందుకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ క్రమంలో ఆయా పరిశోధనల్లో ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధునిక సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు వంటివి ఇంతకమునుపు గుడ్లు పెట్టడానికి బదులు పిల్లలకు జన్మనిచ్చేవని తేల్చి చెప్పారు. ఇది 51 శిలాజ జాతులు, 29 జీవ జాతులపై జరిపిన పరిశోధనల ఆధారంగా వెల్లడించినట్లు పేర్కొన్నారు. వాటిల్లో గుడ్లు పెట్టేవి(అండాశయం), జన్మనిచ్చేవి(వివిపరస్) అని రెండు రకాలుగా వర్గీకరించి మరీ అధ్యయనం చేసినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాస్తవానికి ఇవి మొదట్లో పునరుత్పత్తి కోసం నీటి సమీపంలో నివశించేవని చెప్పారు. అలాగే పరిస్థితులు అనువుగా మారే వరకు తమ పిల్లలను గర్భంలోనే దాచుకునేవని తెలిపారు. పరిణామక్రమంలో భూమిపై జీవించడానికి అలవాటు పడటంతో క్రమంగా గుడ్లు పెట్టడం ప్రారంభించాయని అన్నారు. ప్రస్తుతం జీవించి ఉన్న కొన్ని జాతులు పాములు, కప్పలు, బల్లులు అప్పుడప్పుడూ పిల్లలకు నేరుగా జన్మనిస్తాయని, కొన్ని సందర్భాల్లో గుడ్లు పెడతాయని బ్రిస్టల్ స్కూల్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ప్రొఫెసర్ మైఖేల్ బెంటన్ చెప్పారు. అవి అండాశయం(గుడ్లు పెట్టడం), వివిపరస్(జన్మనివ్వడం) అనే రెండు పునరుత్పత్తి వ్యూహాలను ప్రదర్శిస్తాయని శిలాజ జాతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడైందని నేచర్ ఎకాలజీ అండ్ ఎవల్యూషన్ జర్నల్లో శాస్త్రవేత్తలు వెల్లడించారు. (చదవండి: అదొక్కటే! ఎన్నో వ్యాయామాలకు సరిసాటి..) -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
ఆ రోబోకి మనిషిలా శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టడం జరుగుతాయట!
రోబో అనేది ఒక స్వయం చాలక యంత్రం. మానవుని జోక్యం లేకుండా వేగవంతంగా, కచ్చితత్వంగా పనిచేయడానికి రోబోలను ఉపయోగిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో వాటిని చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే మనం ప్రోగామింగ్ చేసిన మనిషి(రోబో) కాబట్టి మనం ఇచ్చే పనులను మాత్రమే చేయగలదు. అందుకు విభన్నంగా ఏవైనా ఇస్తే అది తొందరగా స్పందించలేదు. మనిషి మాదిరిగా ఉండి పనుల్లో మనకు ఉపకరిస్తుందే తప్ప మనిషిలా వ్యక్తీకరించ లేదు. మనిషిలా శ్వాసించడం, చెమటలు పట్టడం వంటివి ఉండవు. కానీ యూఎస్ అరిజోనా స్టే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనిషికి ఉండే మాదిరిగా శరీర లక్షణాలు ఆ రోబోకి ఉండేలా రూపొందించారు. ఆ రోబో పేరు ఆండీ. అది ఒక దర్మల్ బొమ్మ. ఇది మనిషిలా వణకటం, వేడికి చెమటలు పట్టడం, శ్వాసించటం, నడవటం వంటివి అన్ని చేయగలదంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని మానవ శరీరంపై వేడి ప్రభావాలను అధ్యయనం చేసేందుకు రూపొందించినట్లు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రోఫెసర్ కొన్రాడ్ రికాజెవ్స్కీ చెప్పారు. ఇది వాస్తవ పరిస్థితులను అనుకరించగలదు. వాతావరణంలో విపరీతమైన వేడి ఉంటే మానవ శరీరం ఎలా ప్రభావితమవుతుంది అనే దానిపై పరిశోధించడం కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ ఆండీ రోబో ఆరుబయట ఉపయోగించగల ప్రపంచంలోని ఏకైక థర్మల్ బొమ్మ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వ్యాలీల్లో నివశించే ప్రజలు అధిక ఉష్ణోగ్రతల సమయంలో అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయడానికి ఈ రోబో ఉపకరిస్తుందని ప్రోఫెసర్ జెన్నీ వానోస్ చెప్పారు. ఈ ఆండి రోబోని వేడి ప్రాంతాల్లో చోటు చేసుకునే మార్పలను పరీక్షించాలని భావిస్తున్నారు. విభిన్న వయసును బట్టి శరీర ఉష్ణోగ్రత లక్షణాలు అంచనా వేసి తగిన వైద్యం అందించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి డయాబెటిస్ రోగి వరకు విభిన్న ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాటిని మనం ఈ రోబో సాయంతో లెక్కించడం సాధ్యపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: యూఎస్కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి) -
ప్రపంచంలోని దోమలన్నింటినీ అంతం చేస్తే ఏమవుతుంది?... శాస్త్రవేత్తల సమాధానం ఇదే..
దోమలు అన్ని ప్రాంతాలలోనూ కనిపిస్తాయి.దోమలు కుట్టడం వలన సాధారణ జ్వరం మొదలుకొని ప్రాణాంతక వ్యాధులు సైతం సోకుతాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,500 దోమల ప్రజాతులు ఉన్నాయి. వీటిలో చాలా ప్రజాతులు దోమలు మనిషిని కుట్టవు. ఈ తరహా దోమలు పండ్లు, మొక్కల రసాలను తాగి జీవిస్తుంటాయి. కేవలం ఆరు ప్రజాతుల దోమలే మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఇవి పలు వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. మన దేశంలో దోమల కారణంగా ఏటా 10 లక్షల మంది మరణిస్తున్నారు. Mosquitoes are the deadliest animal in the world: They kill more people than any other creature, due to the diseases they carry. pic.twitter.com/3v2CxAg8gc — TheFacts (@TheWorldFactsjj) May 27, 2023 దోమలు కుట్టడం వలన వచ్చే వ్యాధులలో మలేరియా, డెంగ్యూ,ఎల్లో ఫీవర్ మొదలైనవి ఉన్నాయి. వీటి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది మరణిస్తున్నారు. ఒకవేళ ప్రపంచంలోని దోమలన్నింటినీ మట్టుబెడితే ఏం జరుగుతుందో తెలుసా? దీని పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా దోమలను చంపేందుకు కెమికల్స్ వాడుతుంటారు. అయితే ఈ కెమికల్స్ వలన దోమలకన్నా అధికంగా మనుషులకే ముప్పు ఏర్పడుతోంది. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎటువంటి కెమికల్స్ సాయంలేకుండా దోమలను తరిమికొట్టే ఉపాయాలను కనుగొనే పనిలో పడ్డారు. దీనిలో చాలా దేశాలు విజయం సాధించాయి. మనిషిని కుట్టే ఆడ దోమల జీన్లో మార్పులు తీసుకువచ్చి జెనెటికల్లీ మోడిఫైడ్ దోమలను సిద్ధం చేశారు. దోమలు గుడ్లను పెడతాయి. అయితే వాటినుంచి పిల్లలు బయటకు వచ్చేలోగానే తల్లిదోమలు మృతిచెందుతాయి. సుమారు మూడు లక్షల దోమలను కెమన్ ద్వీపంలో 2009-2010 కాలాల మధ్య వదిలివేశారు. ఈ ప్రయోగం వలన దోమల జనాభాలో 96 శాతం వరకూ తగ్గింది. ఇటువంటి ప్రయోగం బ్రెజిల్ లోనూ మంచి ఫలితాలను ఇచ్చింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం మూడు రకాల దోమలను నాశనం చేయగలిగితే పది లక్షలమంది మనుషులను కాపాడవచ్చు. అలాగే జెనిటికల్లీ మాడిఫైడ్ మస్కిటో ప్రయోగం కూడా ఇప్పటివరకూ ఎటువంటి దుష్పరిమాణాలను చూపలేదు. అయితే దోమలను పూర్తిస్థాయిలో నాశనం చేస్తే ప్రకృతి అందించిన ఫుడ్ చైన్కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. దోమలు పూలలో పరపరాగ సంపర్కం ఏర్పడేందుకు సహకారం అందిస్తాయి. ఫలితంగానే పూలు పండ్లుగా మారుతాయి. దోమలు కొన్ని ప్రాణులకు ఆహారం వంటివి. కప్పలు, బల్లులు, తొండలు మొదలైనవి దోమలను తిని బతుకుతాయి. ఇవి ఉండటం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది. అందుకే దోమలను మొత్తంగా అంతం చేసేబదులు వాటిలో ప్రమాదకరమనవాటిని మాత్రం అంతం చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
దేశ రహస్యాలు పాక్కు లీక్ చేసిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. నిఘా వైఫల్యమేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు.. అంతా సవ్యంగానే ఉంటుందనుకుంటాం. దేశం సురక్షితంగా ఉందని భావిస్తాం. అనుభవజ్ఞులైన అధికారులు, సరిహద్దుల్లో సైన్యం కంటికి రెప్పలా ఉంటుందని భావిస్తాం. నిజమే.. మనం అనుకుంటున్న దాంట్లో 99% నిజమే. అయితే ఎక్కడో ఓ చోట, ఎవరో ఒకరు నమ్మక ద్రోహానికి సిద్ధంగా ఉంటారు. మదర్ ఇండియాకు వెన్నుపోటు పొడిచేందుకు వెనక్కు రారు. అలాంటి వారిలో అత్యున్నత అధికారులు ఉండడమే ఆశ్చర్యకరం. పైగా పాకిస్తాన్, చైనాలాంటి దేశాలు విసిరే హానీ ట్రాప్లో చిక్కడం మరింత విస్మయకరం. మహిళ అందాల కోసం దేశాన్ని తాకట్టు పెట్టే జాబితా పెరిగిపోతోంది. గత నెల రోజులుగా భారత రక్షణ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న వ్యక్తి ప్రదీప్ కురుల్కర్. భారత రక్షణ వ్యవస్థలోని కీలక వింగ్ DRDOలో అత్యున్నత అధికారిగా ఉన్న ప్రదీప్.. ఇప్పుడు దేశ రహస్యాలను లీక్ చేసిన మాయగాడిగా మిగిలిపోయాడు. వలపు వలలో చిక్కి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్కు లీక్ చేశాడు డీఆర్డీవో టాప్ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్. ఓ అజ్ఞాత మహిళ మాయలో పడి అడిగిన వివరాలన్నీ అందించాడు. భారత ఆయుధ సంపత్తిలో కీలకంగా ఉన్న బ్రహ్మోస్, అగ్ని, యాంటి శాటిలైట్ క్షిపణులకు సంబంధించిన రహస్యాలను శత్రు దేశానికి చేరవేశాడు. ప్రదీప్కు వలపు వల విసిరి రహస్యాలు రాబట్టుకున్న మహిళ తనను తాను జర్దాస్ గుప్తా. లండన్ లో నివసిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. పక్కా స్కెచ్ వేసి ఈయన్ను ట్రాప్ చేసింది. గతేడాది సెప్టెంబర్లో సోషల్ మీడియా ద్వారా ప్రదీప్ను పరిచయం చేసుకుంది. మొదట ఆకట్టుకునే మెసెజ్లు, ఆ తర్వాత అందాలు ఆరబోసే వీడియో కాల్స్, రాత్రుళ్లు కవ్వించే మాటలు.. తనను ట్రాప్ చేస్తోందని తెలుసుకోలేక పోయిన ప్రదీప్ ఆమె మాయలో పడ్డాడు. వేరే దేశానికి రమ్మని పిలిస్తే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లిపోయాడు. భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను కూడా తిలకించారు. ఇద్దరూ కొన్నాళ్లు ఎంజాయ్ చేశారు. ఈ మహిళ అందానికి దాసోహమైన ప్రదీప్.. ఆమె ఏం అడిగినా కాదనకుండా అన్ని వివరాలు వెల్లడించాడు. దేశభద్రత గురించి పట్టించుకోకుండా తెలిసిన రహస్యాలన్నీ లీక్ చేశాడు. ఈ మత్తులో జరుగుతున్న ద్రోహం గురించి ప్రదీప్ కనిపెట్టలేకపోయాడా అన్నది ఓ మిలియన్ డాలర్ క్వొశ్చన్. ఇలాంటి ఆపరేషన్స్పై సైన్యంలో ఎందరికో అవగాహన కల్పించిన ప్రదీప్.. తానే ఆ గోతిలో పడ్డాడు. బ్యాడ్ ఎగ్జాంపుల్ గా మిగిలిపోయాడు. 1988 నుంచి డీఆర్డీఓలో 1988 నుంచి పనిచేస్తున్నారు ప్రదీప్. గ్రేడ్-హెచ్ ఔట్ స్టాండింగ్ కేటగిరీ సైంటిస్ట్గా ఉన్నారు. ఇది అత్యంత కీలకమైన హోదా. కేంద్రంలో అదనపు కార్యదర్శి హోదాతో సమానం. ఇంతటి కీలక హోదాలో ఉన్న వ్యక్తి దేశ సమాచారాన్ని లీక్ చేయడం ఒకింత విస్మయం కలిగించే విషయం. దీన్ని ఆరంభంలోనే నిఘావర్గాలు కనిపెట్టలేకపోడవంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశభద్రతలో డీఆర్డీఓ అత్యంత కీలకం. దేశవ్యాప్తంగా 50 ల్యాబొరేటరీలు ఉన్నాయి. 5వేల మందికిపైగా శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇప్పడు ప్రదీప్ వలపు వ్యవహారం బహిర్గతం కావడంతో వీరిపైనా విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. ప్రదీప్ విషయం తెలిసిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)పుణెలో రెండు వారాల క్రితం అతడ్ని అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరు పరచి కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన కస్టడీలోనే ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ ఏ ఏ రహస్యాలు చేరవేశాడన్నది లెక్క తేలాల్సిన అంశం. భారత రక్షణ వ్యవస్థలో ముఖ్యంగా ఆయుధ వ్యవస్థలో అంతర్గత లోపాలను బయటకు రానివ్వరు. సైన్యంలో టాప్ అధికారులకు మాత్రమే కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రదీప్ ఎంతవరకు ఉప్పందించాడు, ఎక్కడెక్కడ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి? వేటిని మార్చుకోవాలి? ఇవీ ఇప్పుడు సైన్యంలోని టాప్ అధికారుల ముందున్న పెద్ద ఛాలెంజ్. చదవండి: చైనా చాట్జీపీటీ.. మరీ ఇంత దారుణమా.. తప్పుడు సమాధానాలు చెప్తే ఎలా? -
ఎగిరొచ్చిన కొత్త జాతి జీవి.. ఎక్కడో తెలుసా!
ఐజ్వాల్: అత్యల్పదూరం ఎగిరే బల్లి జాతి బుల్లి జీవిని శాస్త్రవేత్తలు భారత్లో తొలిసారిగా మిజోరంలో గుర్తించారు. చెట్లపై జీవించే దీనికి గెక్కో మిజోరమెన్సిస్ అని పేరు పెట్టారు. ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు ఒక్క ఉదుటున దూకడం దీని ప్రత్యేకత. 20 సెం.మీ. పొడవుండే ఈ జీవికి గెంతేందుకు అనువుగా తోక చివరి భాగం పైకి వంగి ఉంది. ‘వీటి డీఎన్ఏ 21 శాతం వేరుగా ఉంది. ఇది నిజంగా కొత్త జాతి’ అని మిజోరం వర్సిటీ, జర్మనీలోని మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలజీ పరిశోధకులు తెలిపారు. మిజోరం ప్రజలు వీటిని అత్యంత ఖరీదైనవిగా భావించి వేటాడుతున్నారట. మిజోరాం అడవుల్లో కనుగొన్న కొత్త రకం ఎగిరే బల్లులు, గెక్కో పొపాయెన్సిస్కు దగ్గరి పోలికలున్నాయట. ప్రపంచంలో గెకో జెనస్ కు చెందిన 13 జాతులకు చెందిన బల్లులున్నాయి. వాటిలో చాలా రకాలు దక్షిణాసియాలో కనిపిస్తాయి. చదవండి: ఆర్బీఐ కంటైనర్లో రూ.1000 కోట్ల నగదు.. భారీ భద్రత, హఠాత్తుగా ఆగిపోయిన వాహనం -
టెక్నాలజీ అదిరింది, మొక్కలకు జబ్బు చేస్తే.. స్మార్ట్ఫోన్కు అలెర్ట్ వస్తుంది!
మొక్కలకు, చెట్లకు కూడా రకరకాల జబ్బులు వస్తుంటాయి. తెగుళ్లు సోకుతుంటాయి. వాటిని నయం చేయడానికి మందులు మాకులు వాడుతుంటాం. ఇదంతా అందరికీ తెలిసిన సంగతే! మొక్కలకు వ్యాధులు సోకిన వెనువెంటనే కనిపెట్టడం చాలా కష్టం. కొంత నష్టం జరిగాక గాని, మొక్కల ఆరోగ్య పరిస్థితి అర్థం చేసుకోలేం. అయితే, వాటికి తెగుళ్లు లేదా ఏదైనా జబ్బులు సోకిన వెనువెంటనే ఆ సంగతిని గుర్తించే సాధనాన్ని ఇటీవల అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇదొక పలుచని గాజు పలకలాంటి చిన్న ఎలక్ట్రానిక్ ప్యాచ్. దీని పొడవు, వెడల్పులు సమానంగా ముప్పయి మిల్లీ మీటర్లు మాత్రమే! దీనిని ఆకులకు తగిలించి ఉంచితే, ఇందులోని సెన్సర్లు మొక్కలకు సోకిన వ్యాధికారక సూక్ష్మజీవులను, పరాన్నజీవులను, పరిసరాల్లోని కాలుష్యం వల్ల మొక్కలకు ఎదురవుతున్న ఒత్తిడిని, మొక్కల్లోని తేమను, ఉష్ణోగ్రతను కూడా నిర్దిష్టంగా గుర్తిస్తుంది. ఈ సమాచారాన్ని దీనికి అనుసంధానమై ఉన్న స్మార్ట్ఫోన్కు చేరవేస్తుంది. దీనివల్ల మొక్కలకు సోకే వ్యాధులను తొలిదశలోనే గుర్తించి, ఎలాంటి నష్టం జరగకముందే వాటిని కాపాడుకోవచ్చని దీని రూపకల్పనలో కీలకపాత్ర వహించిన ప్రొఫెసర్ యోంగ్ ఝు చెబుతున్నారు. ప్రస్తుతం నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీని పనితీరుపై ఇంకా పరీక్షలు జరుపుతున్నారు. పరీక్షలు పూర్తిగా విజయవంతమైతే, ఇది రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి -
సైంటిస్ట్ నుంచి వేల కోట్ల కంపెనీ సారధిగా..! ఎవరీ అశ్విన్ డాని?
భారతదేశంలో ఉన్న అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరైన 'అశ్విన్ డాని' (Ashwin Dani) గురించి ఇప్పుడు చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే కెమిస్ట్ స్థాయి నుంచి ఈ రోజు కుబేరుల జాబితాలోకి ఎలా చేరాడు? దాని వెనుక ఆయన కృషి ఎలా ఉంది అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏషియన్ పెయింట్స్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అశ్విన్ డాని ముంబైలో పుట్టి 1966లో ముంబై యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు. ఆ తరువాత కెమికల్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్లోని అక్రోన్ యూనివర్సిటీలో చేరాడు. ఉన్నత చదువులు పూర్తయిన తరువాత డెట్రాయిట్లో శాస్త్రవేత్తగా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆ తరువాత సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తన కుటుంబానికి చెందిన ఏషియన్ పెయింట్స్ కంపెనీలో చేరాడు. 1977లో ఏషియన్ పెయింట్స్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి పదోన్నతి పొందారు. అశ్విన్ డాని నేతృత్వంలో ఏషియన్ పెయింట్స్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదిగింది. అశ్విన్ డాని ఆర్ & డి డైరెక్టర్గా ఎన్నో పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలు ఏషియన్ పెయింట్స్ అభివృద్ధికి చాలా దోహదపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ అతి తక్కువ కాలంలోనే భారతదేశంలో అతిపెద్ద పెయింట్ తయారీదారుగా, ఆసియాలో మూడవ అతిపెద్ద కంపెనీగా, అంతర్జాతీయ స్థాయిలో తొమ్మిదవ అతిపెద్దది కంపెనీగా అవతరించింది. (ఇదీ చదవండి: ఇంటర్లో తక్కువ మార్కులొచ్చాయని ఇల్లు అద్దెకివ్వని ఓనర్.. ఎక్కడో తెలుసా?) అశ్విన్ డాని నేతృత్వంలో కంపెనీ చాలా అభివృద్ధి చెందింది. భారతదేశంలో ఆటోమేటెడ్ కలర్ మిక్సింగ్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి అశ్విన్ కావడం గమనార్హం. కంపెనీ 2023లో 7.1 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని కలిగి ఉంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 58,000 కోట్లు. రానున్న రోజుల్లో కంపెనీ మరింత ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. -
థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా
రామచంద్రపురం: సైంటిస్ట్ ఆస్ట్రోనాట్గా ఎదగాలని కలలుగన్న ఓ యువతి ఆకాంక్షలకు ప్రభుత్వ సాయం తోడైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దంగేటి జాహ్నవి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఈమెకు అంతరిక్ష రంగంపై విపరీతమైన మక్కువ. అమెరికా నాసా శిక్షణకు ఎంపికైన ఈమెకు ఆర్థిక ఇబ్బంది తలెత్తింది. బీసీ సంక్షేమ మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే సీఎం ఈ శిక్షణ కోసం ఆమెకు రూ.50 లక్షలు మంజూరు చేశారు. దీంతో అమెరికాలోని నాసా అంతరిక్ష కేంద్రంలో నెల పాటు శిక్షణ పొందింది. ఇటీవల జాహ్నవి స్వస్థలం చేరుకుంది. మరికొన్నాళ్లు ఆమె శిక్షణ పొందాల్సి ఉంది. జాహ్నవి తన తల్లిదండ్రులతో కలిసి శుక్రవారం బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో మంత్రి వేణును కలిసింది. చిరకాల స్వప్నమైన సైంటిస్ట్ ఆ స్ట్రోనాట్ కావడానికి సహకారాన్ని అందజేసిన సీఎం జగన్కు, మంత్రి వేణుకు కృతజ్ఞతలు తెలిపింది. -
వామ్మో.. నీళ్లన్నీ తాగేస్తున్న చాట్జీపీటీ, ఇలా అయితే కష్టమే!
విడుదలైన కేవలం రెండు నెలల్లోనే వంద కోట్లమంది యూజర్లతో ప్రపంచాన్ని చుట్టేసింది చాట్జీపీటీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెక్నాలజీతో ఎన్నె అద్భుతాలు చేస్తున్న అందరి నోట ఔరా అనిపించింది. దిగ్గజ సంస్థలకు సైతం పోటీగా నిలబడే స్థాయికి చేరుకుంటోంది. అయితే ఇదంతా ఇప్పటి వరకు మనకు పైకి తెలిసిన విషయం మాత్రమే. కాయిన్కు రెండు వైపుల ఉన్నట్లు చాట్జీపీటీ కూడా రెండో వైపు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్బాట్ చాట్పిట్ని పరీక్షిస్తున్నారా…? చాట్జీపీతో ఒక అంశం ఆధారంగా కథనం, కథ లేదా కవిత రాయాలనే ఆసక్తి ఉన్నవారు ఇంకో విషయం తెలుసుకోవాలి...! ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇలా ChatGPTని ఉపయోగిస్తున్నందున, మనం దీనికి భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా రివర్సైడ్, యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ ఆర్లింగ్టన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో.. 20-50 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు చాట్జీపీటీకి దాదాపుగా అర లీటరు నీరు అవసరం అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అసలు చాట్జీపీటీకి, నీటి మధ్య సంబంధం ఏమిటంటే.. ChatGPT వంటి ఏఐ మోడల్లను అమలు చేస్తున్నప్పుడు ఆ సర్వర్లను చల్లబరచడానికి పెద్ద మొత్తంలో నీటిని ఉపయోగిస్తాయట. డాటా సెంటర్ల నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తు ఉత్పత్తికి నీటి వినియోగాన్ని లెక్కగట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాకు వచ్చారు. పైగా ఇందుకు మంచి నీటినే వినియోగించాల్సి ఉంటుందట. జీపీటీ-3కి శిక్షణ ఇవ్వడానికే మైక్రోసాఫ్ట్ 7 లక్షల లీటర్ల నీటిని వినియోగించడమే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. చాట్ జీపీటీకి కోట్ల మంది యూజర్లు ఉన్నందున డాటా సెంటర్లకు భారీగా నీటి వినియోగం ఉంటున్నదని ఈ అధ్యయనంలో బయటపడింది. ఇదే కాకుండా ఇతర సంస్థల ఏఐ మాడళ్లు కూడా భారీగా నీటిని వినియోగిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: ఆ దేశాలకు ఆయుధాలు అమ్మబోం.. అలాంటి ఉద్దేశమే లేదు: చైనా -
రష్యా స్పుత్నిక్–5 టీకా సృష్టించిన సైంటిస్టు హత్య
మాస్కో: రష్యా కోవిడ్ టీకా స్పుత్నిక్–5 సృష్టికర్తల్లో ఒకరైన అగ్రశ్రేణి శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ (47) హత్యకు గురయ్యారు. మాస్కోలోని అపార్టుమెంట్లోనే గురువారం గుర్తు తెలియని వ్యక్తులు బెల్టుతో గొంతు నులిమి చంపారు. గమలెయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మేథమేటిక్స్లో సీనియర్ పరిశోధకుడిగా ఉన్నారు. ఇక్కడే మరో 18 మంది శాస్త్రవేత్తలతో కలిసి 2020లో స్పుత్నిక్ వీ టీకాను రూపొందించారు. హత్యకు పాల్పడిన 29 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రష్యా ఫెడరల్ దర్యాప్తు కమిటీ శనివారం వెల్లడించింది. ఆండ్రీ బొటికోవ్తో చిన్న విషయమై తలెత్తిన తగాదాతోనే ఈ నేరానికి పాల్పడినట్లు అతడు అంగీకరించాడని కూడా తెలిపింది. నిందితుడికి నేర చరిత్ర ఉందని పేర్కొంది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎన్నదగిన పరిశోధనలు జరిపిన వైరాలజిస్ట్ ఆండ్రీ బొటికోవ్ను 2021లో అధ్యక్షుడు పుతిన్ ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఫర్ ది ఫాదర్లాండ్’పురస్కారంతో సత్కరించారు. -
నాటి పేపర్ బాయ్.. నేడు అమెరికాలో సైంటిస్టు
కడప సెవెన్రోడ్స్(వైఎస్సార్ జిల్లా): కన్నవారు దూరమైన దుర్భర బాల్యం. ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దైన్యం. అవమానాలు, ఆటంకాలు, మరెన్నో ప్రతిబంధకాలు. కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినా ఆయన పట్టుదల, పరిశ్రమ ముందు అవి తలవంచక తప్పలేదు. బాల్యంలోనే ఎన్నో సవాళ్లను చెరగని చిరునవ్వుతో ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వీధుల్లో పేపర్ బాయ్గా తిరిగిన ఓ యువకుడు అంచెలంచెలుగా ఎదిగి నేడు అమెరికాలో మంచి సైంటిస్టుగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ‘‘సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్’’ డిప్యూటీ డైరెక్టర్గా మల్టీ డిసిప్లినరి రీసెర్చి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఎన్నో అద్భుత విజయాలు తన ఖాతాలో వేసుకుని నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న కడప నాగరాజుపేటకు చెందిన ఆయన పేరు డాక్టర్ రావూరి సుదీర్కుమార్. బాల్యం గడిచిందిలా! పసితనంలోనే తల్లిదండ్రులు దూరం కావడంతో అవ్వ చల్లా కమలమ్మ అక్కున చేర్చుకుంది. ఐదవ తరగతి వరకు నాగరాజుపేట గుండాచారి బడిలో చదువుకున్నారు. విశ్రాంత ఉపాధ్యాయురాలైన అవ్వ కమలమ్మకు చదువు విలువ ఏమిటో బాగా తెలుసు. చదువే నిజమైన ఆస్తి అంటూ మనవడికి తరచూ నూరిపోసేది. అవ్వ మాటలు ఆయనను ఎంతో ప్రభావితం చేశాయి. గుంతకల్లు, గుత్తిలో పిన్ని ఇంట హైస్కూల్ విద్యాభ్యాసం సాగింది. సైన్స్ పట్ల జిజ్ఞాస గుత్తి రైల్వే ఇంగ్లీషు మీడియం హైస్కూలులో తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆకుల నుంచి విద్యుత్ తయారవుతుందని ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ యూ’ అనే పత్రికలో చదివాడు. అందుకు జిల్లేడు, బొంత జెముడు ఆకులు పనికి వస్తాయని సు«దీర్ కనుగొన్నారు. ఇలా ఆయన బయో లాజికల్ బ్యాటరీ తయారు చేశాడు. అప్పట్లో హైదరాబాదులో జరిగిన సైన్స్ ఫెయిర్లో రాష్ట్రపతి వెంకట్రామన్ నుంచి సర్టిఫికెట్ అందుకున్నారు. సిమ్లాలో జరిగిన ఇంటర్ స్టేట్ సైన్స్ ఫెయిర్కు ఈ ప్రయోగం ఎంపికైంది. ఇంటర్మీడియేట్ కడప సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో, 1994–97లో ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశాడు. తాను ఇంకొకరికి భారం కారాదని భావించి పేపర్ బాయ్గా, వీడియో కెమెరామెన్గా కొన్నాళ్లు పనిచేశారు. గ్రూప్-4, బ్యాంకు పరీక్షలు రాశారు. బీఈడీలో ఉచిత సీటు వచ్చింది. సైంటిస్టు కావాలన్న బలమైన ఆకాంక్ష వల్ల వాటిని వదులుకున్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ వైరాలజీ ప్రవేశానికి కిశోర్ అనే స్నేహితుడు రూ. 400 సాయం చేసి దరఖాస్తు చేయించగా సీటు వచ్చింది. తిరుపతిలో ఉన్న మరో పిన్ని ఇంటిలో ఉంటూ చదువు కొనసాగించారు. తన ఖర్చులు తాను సంపాదించుకోవాలని ప్రైవేటు డిగ్రీ కళాశాలలో పార్ట్ టైం అధ్యాకునిగా పనిచేశారు. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా తన జుట్టు తానే కట్ చేసుకోవడం నేర్చుకున్న ఆయన ఒక సెలూన్ కూడా ప్రారంభించాలని భావించారు. వెటర్నరీ వైరాలజీ పైన ఎమ్మెస్సీ ప్రాజెక్టు వర్క్ను తిరుపతిలో చేశారు. 1999లో ఎమ్మెస్సీ పూర్తయ్యాక అక్కడి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్లో ఐసీఏఆర్–ఐఏఆర్టీ ఫెలోషిప్ జాబ్ చేశారు. జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకులో ఉన్న బెంగళూరులోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ)లో మోనోక్లోనల్ యాంటీ బాడీస్పై పనిచేశారు. వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చి ఇన్స్టిట్యూట్లో డయాగ్నస్టిక్స్ చేశారు. ఈ సమయంలో రెడ్డీస్ ల్యాబ్లో ఉద్యోగం వచ్చింది. అయితే అదే సమయంలో ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో హెచ్ఐవీ–1పై పనిచేసే అవకాశం తలుపు తట్టగా, దాన్నే ఎంచుకున్నారు. దీంతో ఆయన జీవితం పెద్ద మలుపు తిరిగింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తిలో రోగ నిరోధకశక్తి తగ్గిపోయి త్వరగా మరణానికి చేరువవుతాడు. అలాంటి వ్యక్తుల్లో వచ్చిన జన్యుపరమైన మార్పులను గుర్తించి దానికి తగ్గట్టు కాంబినేషన్ మందుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న అంశంపై పరిశోధన చేశారు. ఆయనకు 2006లో పీహెచ్డీతోపాటు పేటెంట్ హక్కులు లభించాయి. అమెరికాలో పరిశోధనలు సుదీర్ అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోగల పిట్స్బర్గ్ యూనివర్సిటీకి పోస్టు డాక్టోరల్ ఫెలోషిప్పై వెళ్లారు. మెంటార్గా కూడా పనిచేశారు. రీసెర్చి అసోసియేట్గా తొమ్మిదేళ్లు పిట్స్బర్గ్లో ఉన్నారు. నిర్వీర్యం చేసిన హెచ్ఐవీ వైరస్లోకి ఉపయోగకరమైన జన్యువులను పంపి తద్వారా వచ్చిన నిర్వీర్య వైరస్ను మూల కణాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్ నిరోధానికి ఉపయోగించడంపై పరిశోధన చేశారు. కొలరాడోలోని స్టెడ్మన్ ఫిలిప్పన్ రీసెర్చి ఇన్స్టిట్యూట్ (ఎస్పీఆర్ఐ)లో ‘వార్థక్య దశకు చెందిన కణాలను గుర్తించి నిర్మూలించడం ద్వారా మెరుగైన వృద్ధాప్య జీవితం’ అనే అంశంపై పరిశోధన చేశారు. అక్కడి ప్రసిద్ధ శాస్త్రవేత్తలతో కలిసి జీన్ థెరఫి, స్టెమ్సెల్ బయాలజీ, టిష్యూ ఇంజినీరింగ్ అంశాల్లో పనిచేశారు. అమెరికా ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్, యూఎస్ ఒలంపిక్ అండ్ పారాలింపిక్ నేషనల్ మెడికల్ సెంటర్లో పరిశోధనలు చేశారు. గ్రాంట్ అవార్డ్స్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా ప్లాస్టిక్ సర్జరీ ఫౌండేషన్ గ్రాంటు, కో ఇన్వెస్టిగేటర్గా ఎన్ఐహెచ్, డీఓడీ ప్రభుత్వ గ్రాంటు, కో ప్రిన్సిపల్ సైంటిస్టుగా ప్రైవేటు ఇండస్ట్రీ ఫండింగ్ లభించాయి. ఎడిటోరియల్ బోర్డు మెంబర్, గెస్ట్ ఎడిటర్, సైంటిఫిక్ రివ్యూవర్గా పలు అంతర్జాతీయ రీసెర్చి జనరల్స్లో పనిచేశారు. పలు సైంటిఫిక్ సమ్మిట్స్కు చైర్ పర్సన్, కో చైర్ పర్సన్గా వ్యవహరించారు. కొలరాడో స్టేట్ యూనివర్సిటీలో అఫిలియేట్ సైంటిస్టుగా నియమితులయ్యారు. కండరాల్లో మూల కణాలు కనుగొన్న ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జానీ హువర్డ్తో కలిసి ప్రస్తుతం సెంటర్ ఫర్ రీ జనరేటివ్ స్పోర్ట్స్ మెడిసిన్ (సీఆర్ఎస్ఎం)లో మల్టీ డిసిప్లినరీ రీసెర్చి ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారు. చదవండి: బీజేపీకి ‘కన్నం’ అందుకేనా?.. నెక్ట్స్ ఏంటి?.. జరిగేది అదేనా? ఆకాంక్షతోపాటు నిరంతర కృషి అవసరం ఏ రంగంలోనైనా ఉన్నత స్థాయికి వెళ్లాలన్న ఆకాంక్ష ఒక్కటే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్టు నిరంతర కృషి ఉన్నప్పుడే లక్ష్యాన్ని అందుకోగలమని విద్యార్థులు గుర్తించాలి. నిరుత్సాహ పడకుండా అవకాశాలు వచ్చేంత వరకు ఓపిక అవసరం. ఒకప్పుడు ఏమీ లేని నేను ఇప్పుడు ఒక స్థాయి లో ఉన్నానంటే అది మా అవ్వ కమలమ్మ, మా ఇద్దరు పిన తల్లులతోపాటు స్నేహితులు కిశోర్, ప్రసాద్, రాజు, మేనమామ చల్లా రాజేంద్ర వరప్రసాద్ (సీఆర్వీ ప్రసాద్), టీచర్లు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇచ్చిన సహకారమే కారణం. – -డాక్టర్ రావూరి సుధీర్కుమార్, నాగరాజుపేట, కడప -
భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. ఎవరూ నమ్మలే..
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి 2300 మందికిపైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించారంటే? నమ్మగలరా? టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి. భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే 'సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే'(SSGEOS) పరిశోధకులు. ఈయన మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ఇది.. 'అతి త్వరలో లేదా తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.' అని ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు. Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV — Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023 అయితే ఈ ట్వీట్ను కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు. గతంలో ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదని చులకన చేసి మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన అంచనాలే అక్షరసత్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. భూకంపం అనంతరం ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ట్వీట్ చేశారు. వందేళ్లకు ఓసారి ఇలాంటి భారీ భూకంపం వస్తుందని, 115, 526 సంవత్సారాల్లో కూడా ఇలాంటి పెను విపత్తులే సంభవించాయని వివరించారు. My heart goes out to everyone affected by the major earthquake in Central Turkey. As I stated earlier, sooner or later this would happen in this region, similar to the years 115 and 526. These earthquakes are always preceded by critical planetary geometry, as we had on 4-5 Feb. — Frank Hoogerbeets (@hogrbe) February 6, 2023 భూకంపం తర్వాత ట్విట్టర్లో ఫ్రాంక్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన పేరుతో నకిలీ ఖాతాలు కూడా సృష్టించే పరిస్థితి వచ్చింది. దీంతో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, తన పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
Priyadarshini Karve: పొగరహిత కుక్కర్ తో.. పొగకు పొగ పెట్టవచ్చు!
శతకోటి సమస్యలకు అనంతకోటి పరిష్కారాలు ఉన్నాయట! మనం చేయాల్సిందల్లా... ఆ పరిష్కారాల గురించి ఆలోచించడం. చిన్నప్పుడు తనకు ఎదురైన సమస్యను దృష్టిలో పెట్టుకొని దానికి శాస్త్రీయ పరిష్కారాన్ని అన్వేషించింది ప్రియదర్శిని కర్వే. ‘సముచిత ఎన్విరో టెక్’తో పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంటోంది... చిన్నప్పుడు స్కూల్కు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు దారిలో తీయగా పలకరించే చెరుకుతోటలను చూసేది ప్రియదర్శిని. ఈ తీపిపలకరింపుల మాట ఎలా ఉన్నా తోటల్లో పంటవ్యర్థాలను దహనం చేసినప్పుడు నల్లటిపొగ చుట్టుముట్టేది. తోట నుంచి ఊళ్లోకి వచ్చి అక్కడ అందరినీ ఉక్కిరిబిక్కిరి చేసేది. ‘ఈ సమస్యకు పరిష్కారం లేదా!’ అనే ఆలోచన ఆమెతో పాటు పెరిగి పెద్దదైంది. పుణెకు సమీపంలోని పల్తాన్ అనే చిన్నపట్టణానికి చెందిన ప్రియదర్శిని కర్వే సైంటిస్ట్ కావాలనుకోవడానికి, సైంటిస్ట్గా మంచిపేరు తెచ్చుకోవడానికి తన అనుభవంలో ఉన్న వాయుకాలుష్యానికి సంబంధించిన సమస్యలే కారణం. కేంద్రప్రభుత్వం ‘యంగ్ సైంటిస్ట్’ స్కీమ్లో భాగంగా వ్యవసాయవ్యర్థాలకు అర్థం కల్పించే ప్రాజెక్ట్లో పనిచేసింది ప్రియదర్శిని. ఇది తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. 2004లో స్కాట్లాండ్లోని ‘యూనివర్శిటీ ఆఫ్ ఎడిన్బర్గ్’లో బయోచార్ రిసెర్చ్ సెంటర్లో చేరింది. బయోమాస్ సాంకేతికతను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ రిసెర్చ్ సెంటర్ ఉపయోగపడింది. ఎంతోమంది ప్రముఖులతో మాట్లాడి, ఎన్నో విషయాలపై అవగాహన ఏర్పర్చుకునే అరుదైన అవకాశం దీని ద్వారా లభించింది. ‘సముచిత ఎన్విరో టెక్’ అనే కంపెనీ స్థాపించి పర్యావరణ అనుకూల వస్తువుల ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది ప్రియదర్శిని. తోటలోని చెట్ల వ్యర్థాలను తొలగించడం అనేది పెద్ద పని. చాలామంది ఆ వ్యర్థాలను ఒక దగ్గర చేర్చి మంట పెట్టి ఇబ్బందులకు గురవుతుంటారు. చుట్టుపక్కల వారిని ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ‘సముచిత ట్రాన్స్ఫ్లాషన్ క్లీన్’తో అందరి దృష్టిని ఆకర్షించింది ప్రియదర్శిని. ఇది రివల్యూషనరీ డిజైన్గా పేరు తెచ్చుకుంది. ఈ బాక్స్ బట్టీలో తోట వ్యర్థాలను వేసి, మంటపెట్టి మూత పెడతారు. అవి బయోచార్ ఇంధనంగా మారుతాయి. ప్రియదర్శిని మరో ఆవిష్కరణ పొగరహిత కుక్కర్. ‘వంటగది కిల్లర్’ అనే మాట పుట్టడానికి కారణం అక్కడ నుంచి వెలువడే పొగతో మహిళలు రకరకాల ఆరోగ్యసమస్యలకు గురికావడం. కట్టెలు, బొగ్గు మండించి వంట చేయడం తప్ప వేరే పరిష్కారం కనిపించని పేదలకు ఈ పొగరహిత కుక్కర్ సరిౖయెన పరిష్కారంగా కనిపించింది. కొద్ది మొత్తంలో బయోచార్ని ఉపయోగించి దీనితో వంట చేసుకోవచ్చు. పొగకు పొగ పెట్టవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పట్టణ ప్రాంత ప్రజల కోసం ‘కార్బన్ ఫుట్ప్రింట్ క్యాలిక్యులెటర్’ను తయారుచేసిన ప్రియదర్శిని కర్వే కొత్త కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టడమే కాదు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అవగహన సదస్సులు నిర్వహిస్తోంది. వీటివల్ల తనకు తెలిసిన విషయాలను స్థానికులతో పంచుకోవడమే కాదు తనకు తెలియని సమస్యల గురించి కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఆలోచన చేస్తోంది ప్రియదర్శిని కర్వే. -
చదివింది 8వ తరగతే.. ఆవిష్కరణలు అద్భుతం.. ఎవరా ఘనాపాటి!
ఆయనకు 67 ఏళ్లు. తలపండిన రైతు, అంతకుమించిన శాస్త్రవేత్త. చదివింది 8వ తరగతే. అయినా.. జ్ఞాన సంపన్నుడు. పురుగులను అరికట్టే బవేరియా బాసియానా అనే శిలీంద్రాన్ని 44 ఏళ్ల క్రితం ఆయన గుర్తించే నాటికి దాని గురించి శాస్త్రవేత్తలకే తెలీదు. అప్పటి నుంచి జీవన పురుగుమందు(బయో పెస్టిసైడ్)లను సొంతంగా తయారు చేసుకొని మిరప, పత్తి, మామిడి తదితర పంటలపై వాడుతున్నారు. అనేక సరికొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. దేశ విదేశీ యూనివర్సిటీలతో కలసి సుదీర్ఘకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ జర్నల్స్లో శాస్త్రజ్ఞులతో కలిసి 3 పరిశోధనా వ్యాసాలు ప్రచురించిన ఘనాపాటి ఆయన. ప్రకృతి వ్యవసాయానికి బయో పెస్టిసైడ్స్ ఎంతో అవసరమంటున్న విలక్షణ రైతు శాస్త్రవేత్త కొంగర రమేష్పై ప్రత్యేక కథనం. స్వీయ అనుభవ జ్ఞానంతో వ్యవసాయ రంగంలో అద్భుత ఆవిష్కరణలు వెలువరిస్తున్న తపస్వి కొంగర రమేష్. వ్యవసాయ కుటుంబంలో ఆయన పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో. రైతు శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తున్నది విశాఖ జిల్లా ఆనందాపురం మండలం తర్లువాడలో. సొంతంగా తయారు చేసుకున్న జీవన పురుగుమందులతో మిరప, పత్తి, మామిడి వంటి పంటలను సాగు చేయటంతో పాటు.. అనేక విశిష్టమైన వంగడాలకు రూపుకల్పన చేసి భళా అనిపించుకుంటున్నారు. ఎంతకాలమైనా నిల్వ ఉండే, అత్యంత తీపి, సువాసన కలిగిన మామిడి వంగడాలు.. విలక్షణమైన మిరప వంగడం.. ఆవులకు ప్రాణాంతకమైన బ్రూస్లోసిస్ వ్యాధిని హోమియో వైద్యంతో తగ్గించడం.. ఇవీ రైతు శాస్త్రవేత్తగా రమేష్ సాధించిన కొన్ని విజయాలు. బయో పెస్టిసైడ్స్పై ఆయన సుదీర్ఘకాలంగా చేస్తున్న పరిశోధనల గాథ ఆసక్తిదాయకం.. ‘బవేరియా’ అప్పటికి ఎవరికీ తెలీదు సొంత పొలంలో పత్తి తదితర పంటల ఆకులు తినే పురుగుల్ని చంపుతున్న బవేరియా బాసియానా అనే శిలీంధ్రాన్ని 1978లో 22 ఏళ్ల యువ రైతుగా రమేష్ తొలుత గుర్తించారు. 1977లో దివిసీమ ఉప్పెన కారణంగా కోస్తా ఆంధ్ర తీరప్రాంతంలో లెక్కలేనన్ని పక్షులు మత్యువాత పడ్డాయి. పురుగులను తినే పక్షులు లేనందున వాటి సంఖ్య ఉధృతంగా పెరిగిపోయింది. ఒక పొలం నుంచి మరో పొలంలోనికి పురుగుల మంద గొర్రెల మందలా వచ్చేవి. ఏమి చేయాలో పాలుపోని ఆ దశలో.. కొన్ని పురుగులు సహజసిద్ధంగా చనిపోతున్నట్లు ఆయన గమనించారు. ఒక్కోసారి గుంపులో 90% పురుగులు చనిపోతూ ఉండేవి. చనిపోయిన పురుగులపై బూజు మాదిరిగా పేరుకొని ఉండేది. ఏదో ఒక ఫంగస్ ఈ పురుగులను చంపగలుగుతోందని రమేష్ గమనించారు. ఆ ఫంగస్ను తిరిగి వాడుకొని పురుగులను చంపగలమా? అన్న జిజ్ఞాస కలిగింది. ఫంగస్ సోకి చనిపోయిన పురుగులను బాపట్ల వ్యవసాయ కళాశాల, గుంటూరు లాం ఫారం, హైదరాబాద్లోని ఇక్రిశాట్, రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు యూపీలోని పంత్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తీసుకెళ్లి శాస్త్రవేత్తలకు చూపించారు. ఆరేళ్లపాటు ఎంతోమంది శాస్త్రవేత్తలను కలిసి వివరించినా దీనిపై వారు సరైన అవగాహనకు రాలేకపోయారని రమేష్ తెలిపారు. రమేష్ మాత్రం పట్టువీడలేదు. ప్రయత్నం మానలేదు. చివరికి 1984లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం బాపట్ల వ్యవసాయ కళాశాలలో పాథాలజిస్టు డాక్టర్ మొహిద్దీన్ దీన్ని ఇంగ్లాండులోని మైకలాజికల్ సొసైటీకి పంపంగా.. ఇది పురుగుల పాలిట మృత్యుపాశం వంటి ‘బివేరియా బాసియానా’ అనే శిలీంధ్రం అని వెల్లడైంది. ఆ తరువాత కాలంలో శాస్త్రజ్ఞుల సూచనలతో రమేష్ స్వయంగా పరిశోధనలు చేపట్టారు. చనిపోయిన పురుగుపై నుంచి సేకరించిన ఈ ఫంగస్ను వేరు చేసి, తన వ్యవసాయ అవసరాల మేరకు శుద్ధమైన బవేరియా బాసియానా శిలీంధ్రాన్ని అభివృద్ధి చేయటం, పంటలపై వాడి ఫలితాలు సాధించడం నేర్చుకున్నారు. అతి తక్కువ ఖర్చుతో బవేరియా బాసియానా వంటి జీవన పురుగుమందులను పత్తి, మిరప తదితర పంటలు సాగు చేసే రైతులకు విస్తృతంగా అందుబాటులోకి తెస్తే రసాయనిక పురుగుమందుల అవసరం లేకుండా చేయవచ్చని రమేష్ భావించారు. 1987లో రాజేంద్రనగర్లో జరిగిన పత్తి శాస్త్రవేత్తల జాతీయ సదస్సులోనూ బవేరియా బాసియానాపై లోతైన పరిశోధనలు చేస్తే జల్లెడ పురుగులు, తెల్లదోమ ఆట కట్టించవచ్చని సూచించినా ఎవరికీ పట్టలేదు. అయినా రమేష్ తన పరిశోధనలు కొనసాగించారు. రూ. 200 ఖర్చుతో పురుగులకు చెక్ బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్ వంటి శిలీంధ్రాలను శాస్త్రీయ పద్ధతిలో తయారుచేసుకుని జాగ్రత్తగా వినియోగిస్తే ఎకరాకు సుమారు రూ. 200 ఖర్చుతోనే మిర్చి, పత్తి, మామిడి, కూరగాయ పంటల్లో పురుగుల బెడదను తప్పించుకోవచ్చని రమేష్ అంటున్నారు. మిరప తదితర పంటలను తీవ్రంగా నష్టపరుస్తున్న నల్ల తామర (బ్లాక్ త్రిప్స్)పై బవేరియా బాసియానా పని చేస్తున్నట్లు కొందరు రైతులు చెబుతున్నారు. అయితే, జాగ్రత్తలు తీసుకోకపోతే ఇతర రకాల ఫంగస్లతో కలుషితమై ప్రతికూల పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. గతంలో ఇలాంటి బయో ఫెస్టిసైడ్ను వాడిన అనుభవం రైతులకు లేనందున శాస్త్రజ్ఞులు సరైన విధానాలను రైతులకు వివరించాలన్నారు. ఏ స్ట్రెయిన్? ఏ పురుగు? బవేరియా బాసియానా శిలీంద్రానికి సంబంధించి అనేక స్ట్రెయిన్లు ఉంటాయి. ఏ స్ట్రెయిన్ ఏ పంటపై, ఏయే పురుగులపై పనిచేస్తుందో తెలుసుకోవడానికి స్థానికంగా పరిశోధనలు చేసి, జీవన పురుగుమందులను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. జీవన ఎరువులపై పరిశోధనలు కొంత మెరుగ్గా జరుగుతున్నప్పటికీ.. జీవన పురుగుమందులపై పరిశోధనలు మన దేశంలో చురుగ్గా జరగటం లేదని రమేష్ తెలిపారు. బవేరియా శిలీంధ్రం అనేక దేశాల్లో 200 వరకు పురుగుల నియంత్రణకు సమర్థవంతంగా పనిచేస్తున్నదని రమేష్ తెలిపారు. 16 మందికి డాక్టరేట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో కలిసి రమేష్ తర్లువాడలోని తన క్షేత్రంలో పత్తి పంటపై బవేరియా ప్రభావంపై చింతా విశ్వేశ్వరరావు సహకారంతో పరిశోధనలు కొనసాగించారు. ఈ పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్స్లో రమేష్ ముఖ్య పరిశోధకుడిగా 3 పరిశోధనా పత్రాలు అచ్చయ్యాయి. ఈ క్రమంలో ఏకంగా 16 మంది శాస్త్రవేత్తలకు డాక్టరేట్లు వచ్చాయి. ఈ పరిశోధనలు అడకమిక్ స్థాయిలోనే ఆగిపోయాయి. బవేరియాకు చెందిన 4–5 స్ట్రెయిన్లను వేరు చేసి యూనివర్సిటీలో భద్రపరచటం సాధ్యపడిందే తప్ప.. వాటిని విస్తృతంగా రైతుల దగ్గరకు తీసుకెళ్లటం సాధ్యపడలేదని రమేష్ తెలిపారు. జర్మనీ శాస్త్రవేత్తలు తమ కాకుమాను పొలంలో నుంచి మట్టి నమూనాలు సేకరించి తీసుకువెళ్లి ఈ ఫంగస్ను వాడుతున్నా తెలిపారు. ఈ నేపథ్యంలో నాబార్డ్ ఆర్థిక సాయంతో వైజాగ్లోని గీతం విశ్వవిద్యాలయంతో కలసి రమేష్ పరిశోధనలు చేశారు. గీతం యూనివర్సిటీ తన పేరుతో పేటెంట్కు దరఖాస్తు చేయబోగా, రమేష్ పేరును మొదటి ఆవిష్కర్తగా పెట్టాలని నాబార్డ్ సూచించింది. అయితే, వారు అంగీకరించకపోవటంతో వారితో నాబార్డ్ నిధులు ఇవ్వటం నిలిపివేసింది. నూనెతో కలపి చల్లాలి బవేరియా బాసియానా వంటి శిలీంధ్రాలతో తయారు చేసిన జీవన పురుగుమందులను సాయంత్రం పూట, తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో నీటిలో కాకుండా ఏదో ఒక నూనె (ఎకరానికి 2 లీ.)లో శిలీంధ్రాన్ని కలిపి హెలీస్ప్రేయర్/డ్రోన్తో సాయంకాలం పూట పిచికారీ చేయాలని రమేష్ సూచిస్తున్నారు. రైతులు నీటితో కలిపి చల్లుతున్నారని, నీటి తేమ ఆరిపోతే శిలీంద్రపు బీజాలు చనిపోయి పురుగులపై ప్రభావం చూపలేకపోవచ్చు. అందుకని ఏదో ఒక నూనెలో కలిపి పిచికారీ చేస్తే ప్రయోజనం బాగుంటుందన్నారు. నిద్రాణంగా ఉండే శిలీంద్రపు బీజాలకు తేమ తగిలితే జర్మినేట్ అవుతాయని, ఆ తర్వాత కొద్ది గంటల వరకే బతికి ఉంటాయి. ఆ లోగానే పురుగు వాటిని తినటం లేదా దాని శరరీంపై ఇవి పడటం జరిగితే.. ఆ శిలీంద్రం పురుగు దేహంలో పెరిగి దాన్ని చంపగలుగుతుంది. అందుకు రెండు–మూడు రోజుల సమయం పడుతుంది. నూనెతో కలిపి చల్లితే బీజాలు వారం, పది రోజుల పాటు గింజగానే ఉంటాయని.. పురుగులు ఈ బీజాలను తిన్నా, వాటి శరీరానికి తగిలినా చాలు. (క్లిక్ చేయండి: జనం మేలుకోకపోతే జీఎం పంటల వెల్లువే!) శిలీంధ్రం బారిన పడిన చనిపోయిన తర్వాత 5 రోజుల్లోనే ఒక పురుగులో కోట్ల కొలదీ శిలీంధ్రపు బీజాలు పెరిగి, గాలి ద్వారా వ్యాపించి, పురుగులను నాశనం చేస్తాయి. ఇందువల్లనే జీవన పురుగుమందులు రసాయన పురుగు మందుల్లా వెంటనే కాక రెండు రోజుల తర్వాత ప్రభావం చూపుతాయి. రీసైక్లింగ్ పెస్టిసైడ్గానూ పనిచేస్తాయి. రైతులు చల్లిన గంటలోనే ఫలితం ఆశిస్తున్నారు తప్ప తర్వాత రోజుల్లో ఏమి అవుతుందో గమనించడం లేదని, ఈ విషయమై రైతుల్లో అవగాహన కలిగించాలని రమేష్ సూచిస్తున్నారు. జీవన పురుగుమందుల వల్ల పర్యావరణానికి, మనుషులకు, ఇతర జీవులకు ఎటువంటి సమస్యా ఉండదు. – గేదెల శ్రీనివాసరెడ్డి, సాక్షి, తగరపువలస, విశాఖ జిల్లా ప్రకృతి వ్యవసాయానికి తప్పనిసరి అవసరం రైతులకు మోయలేని ఆర్థిక భారంతో పాటు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న రసాయనిక పురుగుమందులకు ఎన్నో విధాలుగా చక్కటి ప్రత్యామ్నాయం జీవన పురుగుమందులే. బవేరియా బాసియానా, నివేరియా రిలే, మెటరైజమ్, వర్టిసెల్ల లకాని వంటి శిలీంధ్రాలతో కూడిన జీవన పురుగుమందులపై ప్రభుత్వం విస్తృతంగా పరిశోధనలు జరపాలి. ఏయే పురుగులపై ఏయే స్రెయిన్లు పనిచేస్తున్నాయో నిర్థారించాలి. వ్యవసాయ వర్సిటీ నిపుణుల పర్యవేక్షణలో జీవన పురుగుమందులను ప్రభుత్వమే ఉత్పత్తి చేయించి రైతులకు అందుబాటులోకి తేవాలి. నిల్వ సామర్థ్యం తక్కువ కాబట్టి రైతులను ముందుగా చైతన్యవంతం చేయాలి. ప్రకృతి వ్యవసాయం వ్యాప్తికి బయో పెస్టిసైడ్స్ తప్పనిసరి అవసరం. – కొంగర రమేష్, నవనీత ఎవర్గ్రీన్స్, తర్లువాడ, విశాఖ జిల్లా -
చలి కాచే కోటు..
చలికాలంలో ఒక్కోసారి స్వెట్టర్లు వేసుకున్నా, చలి తగ్గినట్లుగా అనిపించదు. అలాంటి ఇబ్బందేమీ లేకుండా నిమిషాల్లోనే ఒళ్లంతా వెచ్చబరచే అరకోటు అందుబాటులోకి వచ్చింది. వేడిని నిల్వచేసుకునే కెమికల్ జెల్ నింపి రూపొందించిన ఈ వస్త్రవిశేషం ‘ఎంట్రోపీ వెస్ట్’. టీషర్ట్ లేదా చొక్కా మీదుగా దీనిని అరకోటు ధరించినట్లే సులువుగా ధరించవచ్చు. దీనికి ఎలాంటి బ్యాటరీలతోను, విద్యుత్తుతోను పనిలేదు. దీనిని యాక్టివేట్ చేసుకుంటే చాలు, నిమిషాల్లోనే 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను అందిస్తుంది. నడుస్తున్నా, కదులుతూ పనులు చేసుకుంటూ ఉన్నా, క్రమంగా వేడి తగ్గి, శరీర ఉష్ణోగ్రత వద్ద స్థిరపడుతుంది. దీని ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గినట్లు అనిపిస్తే, ఉడుకు నీళ్లలో కాసేపు నానబెట్టి, ఆ తర్వాత ఆరవేసుకుంటే చాలు. యథాతథంగా పనిచేస్తుంది. ఉడుకు నీళ్లలోని ఉష్ణోగ్రతను ఈ వస్త్రంలోని జెల్ గ్రహించి, నిల్వ చేసుకుంటుంది. లండన్లోని ‘పెటిట్ ప్లీ’కి చెందిన శాస్త్రవేత్తలు ఈ సరికొత్త చలివస్త్రానికి రూపకల్పన చేశారు. దీని ధర 500 పౌండ్లు (రూ.50,104). చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఐయూఎన్ఎస్ సభ్యుడిగా డాక్టర్ భానుప్రకాశ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) శాస్త్రవేత్త, బయో కెమిస్ట్రీ విభాగ అధ్యక్షుడు జి.భానుప్రకాశ్రెడ్డి పోషక శాస్త్రాల అంతర్జాతీయ సమాఖ్య (ఐయూఎన్ఎస్) సభ్యుడిగా ఎన్నికయ్యారు. పోషక శాస్త్రాల అభివృద్ధికి భానుప్రకాశ్ రెడ్డి చేసిన సేవలకు ఈ గుర్తింపు లభించింది. ఎన్ఐఎన్లో పాతికేళ్లుగా పని చేస్తున్న డాక్టర్ రెడ్డి అసాంక్రమిక ఆరోగ్య సమస్యల్లో కణస్థాయి పోషకాలపై పలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అంతర్జాతీయ జర్నల్స్లో 190 పరిశోధన పత్రాలను ప్రచురించారు. దేశంలో ఐదేళ్లలోపు పిల్లల్లో విటమిన్–ఏ స్థాయిలపై డాక్టర్ భానుప్రకాశ్ రెడ్డి చేసిన విశ్లేషణ ప్రపంచవ్యాప్తంగా విటమిన్–ఏ సప్లిమెంటేషన్ విధానాన్ని మెరుగుపరిచింది. మధుమేహ వ్యాధిలో వచ్చే సమస్యలకు సూక్ష్మ పోషకాల పాత్రపై కూడా డాక్టర్ రెడ్డి పరిశోధనలు చేశారు. -
కరోనా వైరస్.. మానవ నిర్మితమే
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలితీసుకున్న కరోనా వైరస్ మానవ నిర్మితమేనని చైనాలోని వూహాన్ ల్యాబ్లో పని చేసిన అమెరికా శాస్త్రవేత్త, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ చెప్పారు. తాజాగా విడుదల చేసిన తన పుస్తకం ‘ది ట్రూత్ ఎబౌట్ వూహాన్’లో సంచలన విషయాలు బయటపెట్టారు. చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(డబ్ల్యూఐవీ) నుంచి రెండేళ్ల క్రితం కరోనా వైరస్ లీక్ అయ్యిందని వెల్లడించారు. చైనా ల్యాబ్లో వైరస్లపై పరిశోధనలకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ అనేది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు తెలుసని వివరించారు. చైనాకు అమెరికా బయోవెపన్ సాంకేతికతను అందజేస్తోందన్నారు. సరైన భద్రతా చర్యలు లేని ప్రయోగాల కారణంగా వూహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటకు వచ్చిందని స్పష్టం చేశారు. జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్ వంటి చర్యలు ఆ ల్యాబ్లో లేవని ఆండ్రూ హఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్ఐహెచ్)తో చైనాలోని వూహాన్ ల్యాబ్కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపారు. ఎన్ఐహెచ్ నుంచి అందే నిధులతో గబ్బిలాల్లోని కరోనా వైరస్లపై వూహాన్ ల్యాబ్ అధ్యయనం చేస్తోందని తన పుస్తకంలో ప్రస్తావించారు. -
17ఏళ్ల భారతీయ యువకుడి అరుదైన ఘనత, ఎలాన్ మస్క్తో కలిసి
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాలో భారత్కు చెందిన ఇంటర్ విద్యార్ధికి అరుదైన గౌరవం లభించింది. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్కు చెందిన విద్యార్ధి అపరూప్ రాయ్ టెస్లాలో ఫుడ్ ప్రింటింగ్ ప్రాజెక్టులో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేసే అవకాశం సొంతం చేసుకున్నారు. అయితే టెస్లాలో పనిచేసే అవకాశం రావడానికి కారణం అతను చేసిన ప్రయోగాలేనని తెలుస్తోంది. . ►భూమిపై మానవ జీవన విధానానికి ఆటంకం కలిగించే కోవిడ్ -19, దొమల నివారణ వంటి సమస్యల్ని పరిష్కరించేందుకు రాయ్ ప్రయోగాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాసా, ఇఎస్ఎ, జాక్సా వంటి అంతరిక్ష సంస్థల నుండి ఇఓ డాష్ బోర్డ్ హ్యాకథాన్లో పాల్గొన్నందుకు సర్టిఫికేషన్ పొందాడు. దీంతో పాటు దోమల నివారణ కోసం మూలికా పదార్థాలను ఉపయోగించి ఆవు పేడను తయారు చేస్తున్నట్లు తన లింక్డ్ఇన్ ప్రొఫైల్లో పేర్కొన్నాడు. ►దోమల్ని నివారించేందుకు మార్కెట్లో లభించే మందుల వల్ల అనేక అనారోగ్య సమస్యల్ని సృష్టిస్తాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అందువల్లే ఆవుపేడతో మూలికల్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ►10వ తరగతి చదివే సమయంలో 'ప్రాబ్లమ్స్ ఇన్ జనరల్ కెమిస్ట్రీ', 'మాస్టర్ ఐసీఎస్ఈ కెమిస్ట్రీ సెమిస్టర్', 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్', 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్', 'జర్నల్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ మెటీరియల్స్' అనే రెండు పుస్తకాలను రాశాడు. ►2020లో ఇస్రో సైబర్ స్పేస్ కాంపిటీషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్ ) 11, వేదాంత మాస్టర్ స్కాలర్ షిప్ టెస్ట్ (వీశాట్ )లో ఏఐఆర్ 706 ర్యాంకు సాధించాడు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఇంట్లో కరెంట్ వినియోగం కోసం నీటిలో ఉప్పును కరిగించడంతో సహా అనేక ప్రయోగాలు చేశాడు. దీని కోసం అతను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) శాస్త్రవేత్తల సహాయం తీసుకున్నాడు. 'లాక్ డౌన్ ఉన్న సమయంలో ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదు, అందుకే నా ప్రయోగాలన్నీ ఇంట్లోనే చేయాల్సి వచ్చింది' అని ఈ సందర్భంగా రాయ్ చెప్పాడు. ►కాగా, పశ్చిమ బెంగాల్కు చెందిన యవ శాస్త్రవేత్త రాయ్ తన 10 వ తరగతి బోర్డు పరీక్షల్లో 95 శాతం మార్కులు సాధించాడు. జెఈఈలో ర్యాంకు సాధించేందుకు కృష్టి చేస్తున్నాడు. తద్వారా భవిష్యత్లో ఐఐటి బాంబేలో ఉన్నత విధ్యను అభ్యసించాలని కోరుకుంటున్నాడు. -
స్ఫూర్తిదాయకం: పూట గడవని స్థితి నుంచి.. అమెరికాలో సైంటిస్ట్ దాకా..
ముంబై: కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేందుకు మహారాష్ట్రకు చెందిన భాస్కర్ హలమి జీవితం సరిగ్గా సరిపోతుంది. నిరుపేద కుటుంబంలో పుట్టి, తినేందుకు సరైన తిండి లేక ఆకలితో అలమటించిన రోజుల నుంచి అమెరికాలో శాస్త్రవేత్త స్థాయికి ఎదిగిన ఆయన ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రరాజ్యంలోని ఓ ప్రముఖ సంస్థలో సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగిన ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలి. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కుర్ఖేడా తెహసీల్లోని చిర్చాడీ గ్రామానికి చెందిన భాస్కర్ హలామి.. ప్రస్తుతం అమెరికాలోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్లోని రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ సంస్థ ప్రధానంగా జన్యుపరమైన ఔషధాలపై పరిశోధనలు చేస్తుంటుంది. ఇందులో భాస్కర్ ఆర్ఎన్ఏ ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాల్ని పర్యవేక్షిస్తున్నారు. చిర్చాడీ గ్రామంలో సైన్స్లో డిగ్రీ పూర్తి చేసిన మొదటి వ్యక్తి భాస్కరే. తర్వాత ఆయన మాస్టర్స్, పీహెచ్డీ కూడా పూర్తిచేసి గొప్ప స్థాయికి చేరుకున్నారు. తన చిన్న తనంలో తన కుటుంబం పడిన కష్టాలు, తినడానికి తిండి లేని రోజులను గుర్తు చేసుకున్నారు హలామి. ‘ ఒక్క పూట భోజనం కోసం చాలా ఇబ్బందులు పడ్డా. సరైన తిండి, పని దొరకని ఆనాటి రోజుల్లో ఎలా బతికామనే విషయాన్ని గుర్తు చేసుకుంటూ మా కుటుంబం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురవుతుంది. వర్షాకాలంలో తమకున్న చిన్న పొలంలో పంటలేసుకునేందుకు కూడా వీలుండేది కాదు. కొన్ని నెలల పాటు పని దొరక్క ఇప్ప పూలను వండుకొని తినేవాళ్లం. బియ్యం పిండితో అంబలి కాచుకొని ఆకలి తీర్చుకునేవాళ్లం. మా ఊరిలో 90 శాతం ప్రజల పరిస్థితి ఇదే’ అని తెలిపారు భాస్కర్ హలామి. భాస్కర్ హలామీ తండ్రి ఏడో తరగతి వరకు చదువుకున్నారు. ఆయనకి చిన్న ఉద్యోగం వచ్చిన తర్వాత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని భాస్కర్ గుర్తు చేసుకున్నారు. 100 కి.మీ దూరంలోని ఓ స్కూల్లో తన తండ్రికి వంట చేసే పని దొరికిందని పేర్కొన్నారు. అక్కడి వరకు వెళ్లడానికి సరైన ప్రయాణ వసతులు కూడా ఉండేవి కాదని తెలిపారు.కొన్నాళ్లకు ఆ స్కూల్ ఉన్న కసనూర్కు కుటుంబం మొత్తం మకాం మార్చిందని పేర్కొన్నారు. భాస్కర్ 4వ తరగతి వరకు కసనూర్లోనే చదువుకున్నారు. తర్వాత స్కాలర్షిప్పై యవత్మల్లో ఉన్న ప్రభుత్వ విద్యానికేతన్లో 10వ తరగతి వరకు పూర్తి చేశారు. గడ్చిరోలిలో బీఎస్సీలో డిగ్రీ పూర్తిచేశారు. తర్వాత నాగర్పూర్లో కెమిస్ట్రీలో మాస్టర్స్ పట్టా పుచ్చుకున్నారు. 2003లో ప్రఖ్యాత లక్ష్మీనారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయినప్పటికీ.. భాస్కర్కు పరిశోధనపై ఆసక్తి తగ్గలేదు. పీహెచ్డీ నిమిత్తం అమెరికా వెళ్లి డీఎన్ఏ, ఆర్ఎన్ఏలో పరిశోధనలు చేశారు. ‘మిషిగన్ టెక్నాలజికల్ యూనివర్సిటీ’ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం సిర్నావోమిక్స్లో పనిచేస్తున్న తనకు.. తమ సంస్థల్లో చేరాలని కోరుతూ ప్రతివారం ఓ అరడజను కంపెనీల నుంచి ఇ-మెయిల్స్ వస్తుంటాయని ఆయనే స్వయంగా తెలిపారు. ఇదీ చదవండి: అమ్మనా జర్మనీ కోడలా?.. వైరల్ -
Strange Fish: రెక్కలతో నిలబడే చేప
బనశంకరి: శివమొగ్గ జిల్లా సాగర జలాశయంలో అపరూపమైన చేప కనబడింది. ఓ మత్స్య జీవశాస్త్రజ్ఞుడు ఎగిరే చేపను పసిగట్టి ఫోటోలు తీశాడు. వాటిని ట్విట్టర్లో పెట్టారు. ఎగిరే చేపలు అక్కడక్కడా సముద్రాల్లో చాలా అరుదుగా కనిపిస్తాయి. సాగర చెరువులో రెక్కల చేప దర్శనమిచ్చినట్లు తెలిపారు. నేను 6 రకాల ఎగిరే చేపలను చూశా, కానీ ఇప్పుడు చూసిన చేప చాలా విచిత్రమైనది. ఇది ఎగరడమే కాదు, రెక్కలపై నిలబడుతుంది కూడా. ఇది కుతూహలంగా ఉందని ట్విట్టర్లో పేర్కొన్నాడు. (చదవండి: కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!) -
40 ఏళ్ల కిందట తండ్రి.. ఇప్పుడేమో కొడుకు!
ప్రముఖ జన్యుశాస్త్రవేత్త, ఫ్రొఫెసర్ స్వాంటే పాబో Svante Paabo.. 2022 ఏడాదికిగానూ వైద్య రంగంలో నోబెల్ బహుమతి విజేతగా నిలిచారు. 67 ఏళ్ల స్వాంటే పాబో.. పరిణామ జన్యుశాస్త్రంపై పరిశోధనలు చేస్తూ పేరుప్రఖ్యాతలు, ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పాలియోజెనెటిక్స్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు పాబో. పురాతన జీవుల అవశేషాల నుంచి సంరక్షించబడిన జన్యు పదార్థాన్ని పరిశీలించడం ద్వారా గతాన్ని(ఒకప్పటి మనిషి జాతులు- ప్రాచీన ఆదిమతెగల గురించి) అధ్యయనం చేయడం పాలియోజెనెటిక్స్ ముఖ్యోద్దేశం. జర్మనీ లెయిప్జిగ్ నగరంలోని మ్యాక్స్ ఫ్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంథ్రోపాలజీలో జన్యుశాస్త్ర విభాగానికి డైరెక్టర్ట్గా పాబో గతంలో విధులు నిర్వహించారు. జపాన్ ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ & టెక్నాలజీలో ప్రొఫెసర్గా పని చేశారు. స్వాంటే పాబో(Svante Paabo) పుట్టింది స్టాక్హోమ్లో. ఈయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్ కరిన్ పాబో. తండ్రి స్వీడన్కు చెందిన ప్రముఖ బయోకెమిస్ట్ కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్. బెర్గ్స్ట్రోమ్ 1982లో వైద్య రంగంలోనే నోబెల్ బహుమతి అందుకోవడం గమనార్హం. స్వీడన్కే చెందిన బయోకెమిస్ట్ బెంగ్ట్ శ్యాముల్స్సన్, బ్రిటిష్ పార్మకాలజిస్ట్ జాన్ ఆర్ వేన్లతో కలిసి కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్ నోబెల్ బహుమతిని పంచుకున్నారు. ఇప్పుడు బెర్గ్స్ట్రోమ్ తనయుడు పాబో కూడా వైద్యరంగంలోనే నోబెల్ విజేతగా నిలిచారు. పాబో తండ్రి, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ కార్ల్ సనె బెర్గ్స్ట్రోమ్ 1997లో, పాబో తన సహచరులు కలిసి నియాండర్తల్ మైటోకాన్డ్రియల్ DNA (mtDNA) సీక్వెన్సింగ్ను విజయవంతంగా నివేదించారు. నియాండర్ లోయలోని ఫెల్హోఫర్ గ్రోటోలో కనుగొనబడిన ఒక నమూనా నుంచి ఉద్భవించింది. ఆగష్టు 2002లో.. పాబో డిపార్ట్మెంట్ ‘‘భాషా జన్యువు’’.. FOXP2 గురించి పరిశోధనలను ప్రచురించింది. భాషా వైకల్యం ఉన్న కొందరిలో ఈ జన్యువు లేకపోవడం లేదంటే దెబ్బతినడం గుర్తించారు. పాబో టీం 2006లో.. నియాండర్తల్ల మొత్తం జన్యువును పునర్నిర్మించే ప్రణాళికను ప్రకటించారు పాబో. ఈ పరిశోధనకుగానూ.. 2007లో టైమ్ మ్యాగజైన్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పాబో ఎంపికయ్యారు. నియాండర్తల్స్.. అంతరించిన మానవజాతి. యూరేషియాలో వేల సంవత్సరాల కిందట బతికిన అర్చాయిక్ ఉపజాతిగా కూడా భావిస్తుంటారు. దాదాపు 70 వేల సంవత్సరాలకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన తర్వాత ప్రస్తుతం అంతరించిపోయిన ఈ హోమినిన్ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని పాబో గుర్తించారు. ఫలితంగా.. ఈ తరం మానవుల్లోనూ ఈ పురాతన జన్యువుల ప్రవాహం కొనసాగుతోందని, ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుందని, అంటువ్యాధులకు ప్రతిస్పందిస్తుందని ఆయన తన బృందంతో సాగించిన పరిశోధనల ఆధారంగా వెల్లడించారు. 2014లో నియాండర్తల్ మ్యాన్: ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్ట్ జీనోమ్స్ అనే పుస్తకం పాబో కోణంలో మానవ పరిణామ క్రమాన్ని వివరించే యత్నం చేసింది. కరోనా టైంలోనూ ఆయన చేసిన పరిశోధనలు.. ఎంతో పేరు దక్కించుకున్నాయి. స్వీడన్తో పాటు జర్మనీ నుంచి కూడా ఎన్నో ఉన్నత గౌరవాలు, బిరుదులు అందుకున్నారాయన. బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనలకుగానూ.. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ సొసైటీ ‘ఎఫ్ఈబీఎస్’ థియోడోర్ బుచర్ మెడల్తో ఆయన్ని సత్కరించింది. డాన్ డేవిడ్ ప్రైజ్, మెస్రీ ప్రైజ్లు సైతం అందుకున్నారీయన. వీటితో పాటు ఐర్లాండ్, ఆస్ట్రియా, జపాన్, తదితర దేశాల నుంచి కూడా విశేష గౌరవాలను సొంతం చేసుకున్నారు. పాబోSvante Paabo తనను తాను బైసెక్సువల్ అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. 2014 వరకు ‘గే’గా ఉన్న ఈయన.. ఆపై సైంటిస్ట్ లిండా విజిలెంట్ను వివాహం చేసుకుని.. ఇద్దరు పిల్లల్ని కన్నారు. మానవ పరిణామ క్రమం, అంతరించి పోయిన హొమినిన్ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను పాబోకీ నోబెల్ బహుమతి లభించింది. -
వైద్య రంగంలో నోబెల్ బహుమతి ప్రకటన
స్టాక్హోం: ప్రతిష్టాత్మకమైన నోబెల్ విజేతల ప్రకటన మొదలైంది. వైద్య రంగంలో.. జన్యు శాస్త్రవేత్త స్వాంటె పాబో(67)కు అవార్డును ప్రకటించింది నోబెల్ కమిటీ. నోబెల్ కమిటీ ఫర్ ఫిజియాలజీ(మెడిసిన్) సెక్రటరీ థామన్ పెర్ల్మాన్ సోమవారం స్వీడన్ రాజధాని స్టాక్హోంలోని కారోలిన్స్కా ఇనిస్టిట్యూట్లో జరిగిన సమావేశంలో విజేతను ప్రకటించారు. స్వీడన్కు చెందిన స్వాంటె పాబోకు మెడిసిన్లో నోబెల్ బహుమతి దక్కినట్లు తెలిపారు. అంతరించిపోయిన హోమినిన్ల జన్యువులు, మానవ పరిణామానికి సంబంధించిన ఆయన ఆవిష్కరణలకుగానూ నోబెల్ ఇస్తున్నట్లు కమిటీ పేర్కొంది. నోబెల్ విజేతను ప్రకటిస్తున్న థామన్ పెర్ల్మాన్ పాబో తన మార్గదర్శక పరిశోధన ద్వారా ‘‘అసాధ్యంగా అనిపించేదాన్ని’’ సాధించారు. ఇప్పటి మనుషులకు.. అంతరించిపోయిన బంధువైన నియాండర్తల్ జన్యువును క్రమం చేయడం, డెనిసోవా అనే ఇంతకుముందు తెలియని హోమినిన్కు సంబంధించి సంచలనాత్మక ఆవిష్కరణను చేసిన పాబో.. 70వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి వలస వచ్చిన తరువాత ఇప్పుడు అంతరించిపోయిన ఈ హోమినిన్ల నుంచి హోమో సేపియన్లకు జన్యు బదిలీ జరిగిందని కూడా కనుగొన్నారని నోబెల్ కమిటీ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో.. ఈసారి నోబెల్ విజేతల ప్రకటన ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. BREAKING NEWS: The 2022 #NobelPrize in Physiology or Medicine has been awarded to Svante Pääbo “for his discoveries concerning the genomes of extinct hominins and human evolution.” pic.twitter.com/fGFYYnCO6J — The Nobel Prize (@NobelPrize) October 3, 2022 -
కరోనా మహమ్మారి...తగిన గుణపాఠం చెప్పింది: డబ్యూహెచ్ఓ చీఫ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మానవులకు తగిన గుణపాఠం చెప్పిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) ఛీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. మన ఆరోగ్యం పర్యావరణంతో ముడిపడి ఉందనే విషయాన్ని గుర్తు చేసిందన్నారు. ప్రధానంగా పర్యావరణ మార్పు, మరుగునపడిపోతున్న మానవ తప్పిదాలను మనకు అవగతమయ్యేలా చేసిందని చెప్పారు. అంతేకాదు పర్యావరణ మార్పుల కారణంగా పాకిస్తాన్ ఎలా వరదలతో అల్లాడిందో కళ్లారా చూశామన్నారు. ఇలాంటి విపత్తే ఏ దేశానికైనా భవిష్యత్తులో జరగవచ్చు అని చెప్పారు. అంతేగాదు ఆమె ప్రజా ఆరోగ్య విధానం, పరిశోధనల ఆవశక్యత గురించి కూడా నొక్కి చెప్పారు. అలాగే వ్యాక్సిన్లు శరీరంపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా వివరించారు. బూస్టర్ డోస్ తీసుకున్న చాలామంది కరోనా వ్యాధి భారిన పడ్డారని, ఇలాంటివి ఒకటి లేదా రెండు కేసులు మినహ అలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కూడా చెప్పారు. అంతేగాదు వ్యాక్సిన్లు అనేవి వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయని చెప్పారు. వ్యాక్సిన్ల కారణంగా సుమారు 20 బిలియన్ల మంది ప్రాణాలు రక్షింపబడ్డారని అన్నారు. అలాగే భారత్ కూడా ప్రజలందరూ వ్యాక్సిన్లు వేయించుకునేలా గట్టి చర్యలు తీసుకుందని ప్రశంసించారు. (చదవండి: టన్నుల కొద్ది వ్యర్థాలతో కోట్లు గడిస్తూ...వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న నగరం) -
వాసనను బట్టి వ్యాధిని చెప్పేస్తున్న వృద్ధురాలు... ఆశ్చర్యపోతున్న వైద్యులు
ఒక వృద్ధురాలు కేవలం వాసనతోనే వ్యాధిని గుర్తించేస్తోంది. ఆమె ముక్కు అలాంటి ఇలాంటి వ్యాధిని కాదు అరుదైన పార్కిన్సన్ వ్యాధిని గుర్తిస్తోంది. ఈ వ్యాధి దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధి తీవ్రతను బట్టి శరీరంలోని మొత్తం ప్రధాన వ్యవస్థను నియంత్రించేస్తుంది. ఈ వ్యాధి కారణంగా వణుకుతూ ధృఢంగా లేకుండా ఉంటారు. క్రమంగా కదలిక మందగించడమే కాకుండా నడవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్రతి 500 మందిలో ఒకరు ఈ వ్యాధి భారినపడతారు. అంతేకాదు పార్కిన్సన్స్ వ్యాధికి మందు లేదు. స్కాట్లాండ్కి చెందిన జాయ్మిల్నే అనే 72 ఏళ్ల వృద్ధురాలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఆమె ముక్కుకి ఒక విలక్షణమైన లక్షణ ఉంది. ఆమె వాసన ద్వారా పార్కిన్సన్ వ్యాధిని పసిగట్టేస్తుంది. దీన్ని మొదటసారిగా తన భర్తలో గుర్తించింది. తన భర్తకు 45 ఏళ్ల వయసులో పార్కిన్సన్ వ్యాధి భారిన పడతారని చెప్పేసింది. అంటే ఆమె 12 ఏళ్లకు ముందే నాడిసంబంధిత వ్యాధితో బాదపడుతున్నాడని నిర్థారించగలిగింది. తన భర్తకు 33 ఏళ్లు వచ్చేటప్పటికి తన భర్త శరీరం నుంచి ఒక విధమైన వాసన వచ్చేదని అప్పుడే తాను ఈ వ్యాధి లక్షణాలను గుర్తించినట్లు వివరించింది. ఆమెకు శరీర వాసనలో వింత మార్పును పసిగట్టగల సామర్థ్యం కలిగి ఉంది. దీంతో శాస్త్రవేత్తలు, వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతేకాదు ఆమె సాయంతో ఈ విషయాన్ని అధ్యయనం చేసే పనిలో నిమగ్నమయ్యారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలోని విద్యావేత్తలు ఆమె సాయంతో పార్కిన్సన్తో బాధపడుతున్న వ్యక్తులను గుర్తించే విధానాలపై పలు పరిశోధనలు చేస్తున్నారు. (చదవండి: హౌస్కీపర్ని పెళ్లి చేసుకున్న డాక్టర్) -
ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త సురేశ్ బండారి మృతి
హన్మకొండ: హనుమకొండకు చెందిన యువ ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బండారి కోవిడ్ అనంతర సమస్యలతో అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో మృతి చెందారు. 2017 మే నెలలో అమెరికాలోని మిసిసిపి యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ను విజయవంతంగా పూర్తి చేసి అదే యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్ట్ హోదా పొందారు. యూనివర్సిటీ యాజమాన్యం అయన ప్రతిభను గుర్తించి ఒక విభాగానికి అధిపతిగా నియమించింది. అతి తక్కువ సమయంలో అధిపతిగా నియమితులైన పిన్నవయస్కుడిగా డాక్టర్ సురేష్ బండారి పేరుగాంచారు. మొత్తం 110 పబ్లికేషన్స్, 2865 సైటేషన్స్ (అనులేఖనాలు) రూపొందించడంతో పలు పేటెంట్ హక్కులు పొందారు. అంతకుముందు హనుమకొండ విద్యా నగర్లోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో మొదటిసారి కోవిడ్కు గురై త్వరగానే కోలుకున్నారు. కోవిడ్ అనంతరం మళ్లీ అస్వస్థతకు గురై అస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు మిసిసిపిలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు. సురేష్ బండారి తండ్రి మొగిలయ్య యోగా గురువుగా హనుమకొండ నగర ప్రజలకు సుపరిచితుడు. (చదవండి: ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ) -
డీఆర్డీవో చీఫ్గా సమీర్ వి కామత్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ వి కామత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(డీడీఆర్డీ) సెక్రటరీగా, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చైర్మన్గా నియమితులయ్యారు. అదేవిధంగా, ప్రస్తుత డీఆర్డీవో చీఫ్ జి.సతీశ్రెడ్డిని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కామత్ డీఆర్డీవోలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కామత్, సతీశ్రెడ్డిల నియామకాలను కేబినెట్ నియామకాల కమిటీ(ఏసీసీ) ఆమోదించిందని సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 ఏళ్లు వచ్చే వరకు కామత్ నూతన బాధ్యతల్లో కొనసాగుతారని కూడా వివరించింది. డీఆర్డీవో చీఫ్గా జి.సతీశ్రెడ్డి రెండేళ్ల పదవీ కాలానికి గాను 2018లో నియమితులయ్యారు. 2020 ఆగస్ట్లో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. తాజాగా ఆయనకు రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు బాధ్యతలు అప్పగించింది. -
ఉప్పల్: ల్యాబ్ సెంటర్లో డ్రగ్స్ తయారీ!.. ఇద్దరు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్లోని అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్లో మాదక ద్రవ్యాలను తయారు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి కొకైన్ మాత్రలు, ఎల్సీడీలతో పాటు 53 గ్రాముల సింథటిక్ డ్రగ్స్, 3.6 కిలోల నార్కోటిక్ పదార్థాల ద్రవం, 50 కిలోల హైడ్రోక్లోరైడ్, 12 బాటిళ్ల మిథైలమైన్, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు ఇతరత్రా వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) డీసీపీ కే మురళీధర్తో కలిసి సీపీ మహేశ్ భగవత్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ►నల్లగొండ జిల్లా ఓపులాయిపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి లెనిన్ బాబు వరంగల్లోని సీకేఎం కాలేజీలో కర్బన్ రసాయన శాస్త్రంలో పీజీ పూర్తి చేశాడు. 2004–13 మధ్య సువాన్, మిత్రోస్, సాయి లైఫ్ సైన్సెస్, అల్బానీ వంటి పలు ఫార్మా కంపెనీలలో జూనియర్ సైంటిస్ట్గా పనిచేసి, ఆర్ అండ్ డీ విభాగంలో సీనియర్ కెమిస్ట్ స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత 2014లో నాచారంలోని జీవీకే బయో సైన్సెస్ సమీపంలో అక్షజ్ మాలిక్యులర్ రీసెర్చ్ ల్యాబ్ను ఏర్పాటు చేశాడు. కొంతకాలం నడిపిన తర్వాత దీన్ని 2019లో ఉప్పల్కు మార్చాడు. ►2017లో ప్రభాకర్ అనే వ్యక్తి నాంపల్లి లెనిన్బాబాకు గుంటూరు జిల్లా కొరటిపాడు గ్రామానికి చెందిన పులిచెర్ల శ్రీనివాస్ రెడ్డిని పరిచయం చేశాడు. అగ్రి కెమికల్స్ తయారు చేయాలని సూచించాడు. ఇద్దరి స్నేహ బలపడిన తర్వాత.. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న ఇరువురు మాదక ద్రవ్యాలను తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. అక్షజ్ మాలిక్యులర్ ల్యాబ్స్లో లెనిన్బాబు సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తే, వాటిని శ్రీనివాస్ రెడ్డి చెన్నైలోని నెపోలియన్కు సరఫరా చేసేవాడు. ►ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుకున్న భువనగిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు, ఉప్పల్ డ్రగ్ ఇన్స్పెక్టర్లతో కలిసి ఆకస్మిక దాడులు చేసి లెనిన్బాబు, శ్రీనివాస్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. నెపోలియన్ పరారీలో ఉన్నాడు. చదవండి: సికింద్రాబాద్ మహాత్మాగాంధీ రోడ్డు ఏరియాకు ఎన్నో ప్రత్యేకతలు ఏడేళ్ల నుంచి శ్రీనివాస్ రెడ్డి పరారీలోనే.. 1994లో జేఎస్ఎస్ ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ పూర్తి చేసిన శ్రీనివాస్ రెడ్డి.. తార్నాకలోని కిమ్టీ కాలనీలో స్థిరపడ్డాడు. కొంత కాలం మెడికల్ రిప్రజెంట్గా పనిచేశాడు. 2010లో ఎఫెడ్రిన్ సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేస్తున్న కేసులో చెన్నై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. 2014లో మెథాంఫేటమిన్ డ్రగ్ సప్లయి కేసులో హైదరాబాద్ ఎన్సీబీ పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు పంపించారు. బెయిల్ మీద బయటికి వచ్చాక కూడా శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు. 2015లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నేపథ్యంలో 2015లో కీసర్ పీఎస్లో ఎన్డీపీఎస్ కేసు నమోదయింది. అప్పటి నుంచి శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. 2018లో ఉప్పల్ పీఎస్లో నమోదయిన ఎన్డీపీఎస్ కేసులోనూ శ్రీనివాస్ పరారీలోనే ఉన్నాడు. ఏడేళ్ల నుంచి పరారీలో ఉన్న శ్రీనివాస్.. తాజాగా రాచకొండ పోలీసులకు చిక్కాడు. చదవండి: ‘పతాక’ స్థాయిలో పొరపాట్లు! -
ప్రాణాలు తీసిందీ అతనే తిండి పెడుతున్నదీ అతనే
ఆయన ఓ సైంటిస్ట్.. ఐన్స్టీన్కు స్నేహితుడు.. యుద్ధమంటే ప్రేమ.. చావు అంటే సరదా.. ఓవైపు విష వాయువులతో మారణాయుధాలను సృష్టించి.. వేలు, లక్షల మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. మరోవైపు ఎరువులను రూపొందించి.. మానవాళి తిండి గోస తీర్చేందుకు సాయపడ్డాడు. నోబెల్ బహుమతిని కూడా పొందాడు. ఆ సైంటిస్ట్ ఎవరో.. ఏం చేశాడో.. తెలుసుకుందామా... – సాక్షి సెంట్రల్ డెస్క్ ఐన్స్టీన్కు స్నేహితుడు అయినా.. ఆయన పేరు ఫ్రిట్జ్ హేబర్.. 1868 డిసెంబర్లో జర్మనీలోని బ్రెస్లోలో పుట్టాడు. రసాయన శాస్త్రంలో ఉన్నత చదువులు పూర్తి చేశాడు. కొంతకాలం తన తండ్రికి చెందిన రసాయనాల వ్యాపారంలో పనిచేశాడు. తర్వాత పరిశోధనలపై దృష్టిపెట్టాడు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్కు ఫ్రిట్జ్ హేబర్ స్నేహితుడు కూడా. అయినా ఆయనకు భిన్న మార్గంలో నడిచాడు. హేబర్కు జాతీయవాద ఆలోచనలు ఎక్కువ, యుద్ధాలంటే మక్కువ. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ప్రభుత్వ ‘వార్ ఆఫీస్’కు కన్సల్టెంట్గా చేరాడు. విష వాయువులపై ప్రయోగాలతో.. జర్మనీ శత్రుదేశాలపై విజయం సాధించాలన్న లక్ష్యంతో రసాయన ఆయుధాలపై పరిశోధనలు చేసిన ఫ్రిట్జ్ హేబర్.. క్లోరిన్ గ్యాస్ను తయారు చేశాడు. మొదట ఆయన ఆలోచనను కొట్టిపారేసిన జర్మనీ ప్రభుత్వం.. మొదటి ప్రపంచ యుద్ధం రావడంతో ఓకే చెప్పింది. 1915లో బెల్జియంలోని వైప్రస్ నగరంలో మిత్రరాజ్యాల సైన్యాలకు, జర్మనీ దళాలకు భీకర పోరాటం జరుగుతోంది. ఆ సమయంలో ఫ్రిడ్జ్ హేబర్ రూపొందించిన క్లోరిన్ గ్యాస్ను మిత్రరాజ్యాల సైన్యాలపై ప్రయోగించారు. దీంతో ఊపిరాడక గిలగిలాకొట్టుకుంటూ వేల మంది అక్కడిక్కడే చనిపోయారని అంచనా. దీంతో అక్కడ జర్మనీ దళాలు పైచేయి సాధించాయి. ►వైప్రస్ క్లోరిన్ దాడి నుంచి బతికి బయటపడిన ఓ సైనికుడు ‘అది చావుల్లోనే అత్యంత ఘోరమైన దారుణమైన చావు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. దారుణాన్ని చూడలేక భార్య ఆత్మహత్య రసాయన ఆయుధాల తయారీని హేబర్ భార్య తప్పుపడుతూ ఉండేది. అది మానుకోవాలని చాలా సార్లు ఒత్తిడి చేసింది. హేబర్ సాయంతో వైప్రస్లో విజయం సాధించడంతో జర్మనీ సైనికాధికారులు పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జరుగుతున్న చోటికి వచ్చిన హేబర్ భార్య.. అందరి ముందు రివాల్వర్తో కాల్చుకుని చనిపోయింది. మానవాళికి చేసిన మంచి ఏమిటి? 18వ శతాబ్దం నుంచి జనాభా పెరిగిపోవడంతో ఆహార ఉత్పత్తులకు కొరత మొదలైంది. అప్పట్లో పంటల దిగుబడులు చాలా తక్కువగా ఉండేవి. దీనిపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు నైట్రోజన్ (నత్రజని) తగిన మోతాదులో అందిస్తే.. దిగుబడులు భారీగా పెరుగుతాయని గుర్తించారు. కానీ నైట్రోజన్ ఉత్పత్తి ఎలాగనేది తెలియదు. దీనిపైనా ఫ్రిట్జ్ హేబర్ పరిశోధనలు చేశాడు. ►1909లో గాలిలోంచి నైట్రోజన్ను సంగ్రహించగల విధానాన్ని ఆవిష్కరించాడు. నైట్రోజన్ను వివిధ రసాయన పద్ధతుల్లో అవసరమైన ఎరువులుగా మార్చే ప్రక్రియలనూ అభివృద్ధి చేశాడు. దీనితో ఎరువుల ఉత్పత్తి మొదలై ఆహార పంటల దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. ►ఈ–పరిశోధనలకుగాను ఫ్రిట్జ్ హేబర్ 1918లో నోబెల్ బహుమతి అందుకున్నారు. రసాయన ఆయుధాలతో మారణ హోమాన్ని సృష్టించిన మూడేళ్లకే ఇది జరగడం గమనార్హం. ఆ ఆయుధానికే తన కుటుంబం బలి ఫ్రిట్జ్ హేబర్ 1934లో చనిపోయాడు. అయితే ఆయన మొదలుపెట్టిన రసాయన ఆయుధాల ప్రయోగాలు.. హిట్లర్ తెరపైకి వచ్చాక మరింత ముందుకు వెళ్లాయి. హిట్లర్ 1940 తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో వేలాది మందిని విష వాయువులతో చంపించాడు. ఇందుకోసం ‘జైక్లోన్ బి’ అనే విషపూరితమైన వాయువును వాడారు. ►ఇలా చనిపోయినవారిలో శాస్త్రవేత్త ఫ్రిట్జ్ హేబర్ కుటుంబ సభ్యులు, బంధువులు కూడా ఉండటం.. అసలు ఆ ‘జైక్లోన్ బి’ పాయిజన్ గ్యాస్ను 1920లో ఫ్రిట్జ్ హేబరే తయారు చేసి ఉండటం.. విధి విచిత్రం. -
క్రయోనిక్స్: మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందా?
Cryonics Part 8: అమెరికాలోని బేస్ బాల్ క్రీడాకారుడు టెడ్ విలియమ్స్ 2002లో చనిపోయాడు. అతడు తన తల, శరీరాన్ని వేర్వేరుగా ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో నిల్వ చేసుకున్నాడు. తిరిగి అతని శరీరానికి జీవం పోయగల టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినపుడు వైద్యులు విలియమ్స్ తలను శరీరానికి అతికించి బ్రతికించగలరని నమ్మకంతో ఇలా చేశారు. నిప్పును చూసి భయపడే ఆదిమ కాలం నుంచి క్షణంలో ఆకాశానికి ఎగిరిపోయే అత్యంత ఉన్నత స్థాయి టెక్నాలజీ రూపొందించే స్థాయికి మనిషి అభివృద్ధి చెందాడు. అవసరాల్లో నుంచి అనేక అన్వేషణలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను కనిపెడుతూనే ఉన్నాడు. మనిషి తన ఉనికికి కారణమైన భూమిని, ప్రకృతినే ధ్వంసం చేసుకుంటున్నాడు. అదే సమయంలో వాటిని కాపాడుకోవడానికి కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కోట్ల సంవత్సరాల క్రితం అంతరించి పోయిన డైనోసార్లకు ప్రాణం వస్తుందా అని వాటి శిలాజ అండాలను పరిశోధిస్తున్నాడు. అంతరించిపోతున్న జీవ జాతుల్ని పరిరక్షించడానికి క్రయోనిక్స్ విధానం ఉపయోగపడుతుందా అని కూడా ఆలోచిస్తున్నాడు. అలాగే చనిపోయిన వారిని బ్రతికించడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. మనిషి ఆశకు అంతం లేదు. నిరంతరం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. మృత శరీరానికి తిరిగి జీవం పోసే టెక్నాలజీ వస్తుందో రాదో లేదో కాలమే చెబుతుంది. చదవండి: Cryonics Part7: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు -
క్రయోనిక్స్: మృత శరీరాన్ని నిల్వ చేసేందుకు కోటిన్నర ఖర్చు
Cryonics Part 7: సృష్టిలో కొన్ని జీవులు అతి శీతల వాతావరణంలో జీవించడానికి వీలుగా.. సహజంగానే తమ శరీరంలో రసాయన మార్పులు జరగకుండా స్తంభింపచేసి.. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు జీవిస్తున్నాయి. తర్వాత జీవించడానికి అనువైన పరిస్థితులు వచ్చినపుడు వాటి శరీరంలో తిరిగి రసాయన మార్పులు మొదలవుతాయి. కొన్ని రకాల కప్పలు, మొసళ్ళు, తొండలు వంటివి ధృవ ప్రాంతాల్లో ఇలాగే జీవిస్తాయి. వీటన్నిటినీ శాస్త్రవేత్తలు అనేక సంవత్సరాలుగా అధ్యయనం చేస్తున్నారు. ఆ జీవుల్లో స్వతహాగా సాధ్యం అవుతున్న జీవ స్తంభన ప్రక్రియలు, తిరిగి కొనసాగే విధానాలను మనిషిలో ఎందుకు తీసుకురాలేమనే కోణం నుంచే క్రయోనిక్స్ పద్ధతి ఊపిరి పోసుకుంది. ఆల్కర్ సంస్థలో 2009 నుంచి జంతువుల మృత శరీరాలను కూడా నిల్వ చేస్తున్నారు. ఇప్పటివరకు అక్కడ 33 జంతువుల శరీరాలను విట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా కంటెయినర్లలో నిల్వ చేశారు. అమెరికా, రష్యా వంటి అగ్ర దేశాల్లో మాత్రమే 50 ఏళ్లనుంచి క్రయోనిక్స్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఒక్క ఆల్కర్ సంస్థలోనే 1353 మృత శరీరాల్ని భద్రపరిచారు. రెండు అగ్రదేశాల్లో మొత్తం రెండు వేలకు పైగానే చనిపోయినవారి శరీరాలు నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా అనేక వేల మంది తమ శరీరాలను భవిష్యత్ లో తిరిగి జీవించే ఆశతో నిల్వ చేసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! దానికి అవసరమైన ఫీజును రెడీ చేసుకున్నారు. అయితే క్రయోనిక్స్ విధానాన్ని సమర్థించేవారిలో చాలా మంది...మరణాన్ని జయించే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. అసలు సాధ్యం అవుతుందో లేదో కూడా తెలీదంటున్నారు. విట్రిఫికేషన్ విధానంలో కంటెయినర్లలో భద్రపరిచిన శరీరాలు నిజంగా పాడవకుండా ఉన్నాయో లేదో కూడా తెలీదంటున్నారు. లండన్లోని కింగ్స్ కాలేజిలో న్యూరోసైన్స్ ప్రొఫెసర్గా ఉన్న క్లైవ్ కోయెన్ ఇలా మెదడును లేదా శరీరాన్ని భద్రపరిచే క్రయోనిక్స్ సాంకేతిక పరిజ్ఞానం విఫలమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ క్రయోనిక్స్ విధానం ద్వారా చనిపోయిన మనిషికి చికిత్స చేసి జీవం పోసినా..కచ్చితంగా అనేక రుగ్మతలు వెంటాడుతాయని, మెదడు దెబ్బతింటుందని, ఆ వ్యక్తి స్పృహలోకి రాకపోవచ్చని కూడా కొందరు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. భరించలేని నొప్పి, బాధలు అనుభవించాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అసలు మృత శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీని ఇంతవరకు శాస్త్రీయంగా రుజువు చేయలేదు. కేవలం ఊహాజనితంగానే ఆ విధానం ఉంది. వందేళ్ళ నాడు లేని టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చినపుడు.. ఆనాడు లేని చికిత్సలు, ప్రాణాంతక రోగాలకు మందులు, చికిత్సలు కనిపెట్టినపుడు.. చావును ఎందుకు జయించలేమనే ఒకే ఒక ప్రశ్న నుంచి వ్యాపార అవకాశాలు పుట్టుకువచ్చాయి. ఎప్పటికీ జీవించి ఉండాలనే ఆశగల ధనికులు ఈ క్రయోనిక్స్ వ్యాపారానికి ఊపిరి పోస్తున్నారు. ఒక మృత శరీరాన్ని నిల్వ చేయడానికి ప్రస్తుత మనదేశ కరెన్సీలో కోటిన్నర ఖర్చవుతుంది. చదవండి: Cryonics 6: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. -
క్రయోనిక్స్: ఇలా చేస్తే మృత శరీరం వందేళ్లయినా అలానే ఉంటుంది.. ఆపై..
Cryonics Part 6: బ్రతికున్న మనిషి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే అతి శీతలీకరణ వాతావరణంలో మానవ అండాల్ని ఏళ్ళతరబడి నిల్వ చేస్తున్నారు. దీనివల్ల అండంలో ఎలాంటి రసాయన మార్పులు చోటు చేసుకోకపోవడం వల్ల జీవితం స్తంభించిపోతుంది. మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అండం జీవితం మళ్ళీ మొదలవుతుంది. ఇటువంటి శీతలీకరణ వాతావరణంలో పెద్దవారి గుండె, మెదడు, ఇతర అవయవాలను నిల్వ ఉంచితే అవి స్తంభించిపోతాయి. అలా గంట సేపటి వరకు వాటిలో ఎటువంటి రసాయన మార్పులు జరగకుండా నిరోధించి తర్వాత యధాస్థితికి తీసుకురావచ్చు. అవయవాల మార్పిడి కోసం వీటిని ఒక చోటు నుంచి మరో చోటుకు ఇటువంటి పరిస్థితుల్లో నిల్వ చేసే తీసుకువస్తారు. ప్రస్తుత కాలంలో అండంతో సహా అవయవాల్లో జీవాన్ని స్తంభింపచేసి, తిరిగి యధాస్తితికి తీసుకురావడంలో సక్సెస్ అయిన సైంటిస్టులు భవిష్యత్ లో మనిషి ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శరీరాలను ఫ్రీజ్ చేయకుండా విట్రిఫికేషన్ చేయడం ద్వారా మానవ శరీర కణజాలం శిధిలం కాకుండా కాపాడుతారు. ఫ్రీజర్ లో ఐస్ ఏర్పడుతుంది. కాని మైనస్ 120 సెంటిగ్రేడ్ కంటే తక్కువలో కూడా ఐస్ ఏర్పడకుండా కేవలం శీతలీకరించడాన్నే విట్రిఫికేషన్ గా పిలుస్తారు. ఇందులో క్రయో ప్రొటెక్టెంట్స్ గా పిలిచే అత్యంత గాఢమైన రసాయనాలను ఉపయోగిస్తారు. దీనివల్ల మృత శరీరం వందేళ్లయినా ఎలా ఉంచింది అలాగే ఉంటుంది. పంచభూతాలతో నిర్మితమైన మృత శరీరాన్ని వందేళ్ళయినా శిధిలం కాకుండా నిల్వ చేయగలిగే పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినపుడు.. ఆ శరీరానికి తిరిగి ప్రాణం పోసే టెక్నాలజీ కూడా కచ్ఛితంగా రూపొందుతుందని ఆశిస్తున్నారు. ఒక జీవిలో సాధారణంగా జరిగే రసాయనమార్పులు క్రమం తప్పితే, ఒక పద్ధతి లేకుండా సాగితే మరణం సంభవిస్తుంది. అటువంటపుడు రసాయన మార్పులను యధాస్థితికి తీసుకురావడం సాధ్యం కాదు. అయితే క్రయోనిక్స్ విధానంలో చనిపోయిన మనిషి శరీరంలో కణజాలం ధ్వంసం కాకుండా రసాయనమార్పులను స్తంభింపచేయడం ద్వారా నిల్వ చేసి భవిష్యత్ లో తిరిగి వారికి జీవం రప్పించడమే క్రయోనిక్స్ లక్ష్యమంటున్నారు. చదవండి: Cryonics Part 5: సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా! -
సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు.. ఎందుకో తెలుసా!
Cryonics Part 5: జీవిత కాలంలో సర్వ సుఖాలు అనుభవిస్తున్నా మనిషి ఆశకు అంతులేకుండా పోయింది. అందుకే ఎప్పటికైనా మరణాన్ని జయించాలనుకుంటున్నాడు. వందేళ్ళకైనా సాధ్యమవుతుందని ఆశిస్తున్నాడు. దాని కోసం 50 ఏళ్ళ క్రితమే ఏర్పాట్లు ప్రారంభించాడు. ఎన్నో అసాధ్యాలను సాధ్యం చేసుకుంటున్నాం. చావును జయించలేమా అని తనకు తాను ప్రశ్నించుకుంటున్నాడు. దీనిపై సైంటిస్టులంతా ఏకాభ్రిపాయంతో ఉన్నారా? మనిషి ఆశాజీవి. సైంటిస్టులు కూడా అంతే. ఈ రోజు సాధ్యం కానిది మరో రోజు సాధ్యమవుతుందని విశ్వసిస్తారు. అంతేగాని సాధ్యం కాదని చెప్పరు. క్రయోనిక్స్ టెక్నాలజీని సమర్థించే శాస్త్రవేత్తలు కూడా ఆశావాదులు. మృత శరీరాన్ని పాడు కానీయకుండా, శరీరంలోని కణజాలం దెబ్బతినకుండా నిర్ధిష్టమైన టెంపరేచర్ లో ఎంతకాలమైనా నిల్వ చేయవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. 50 సంవత్సరాలుగా క్రయోనిక్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తున్నారు. ఆల్కర్ సంస్థ స్థాపించి 50 సంవత్సరాలైంది. అప్పటికి ఇప్పటికీ వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి అయింది కదా అని సంస్థలోని సైంటిస్టులు అంటున్నారు. వందేళ్ళ క్రితం గుండె ఆగితే మరణించినట్లే..కాని ఇప్పుడు నూతన ఆవిష్కరణల ద్వారా పది నిమిషాల పాటు ఆగిన గుండెను కూడా కొట్టుకునేలా చేయగలుగుతున్నారు. అంతర్గత అవయవాలను విజయవంతంగా ఒకరి శరీరం నుంచి మరొకరి శరీరానికి మార్చుతున్నారు. అదేవిధంగా భవిష్యత్ లో చనిపోయినవారి శరీరాలకు అవసరమైన చికిత్స చేసి వారికి తిరిగి ప్రాణం పోయగలమని నమ్ముతున్నట్లు చెబుతున్నారు. చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా! గుండె లేదా బ్రెయిన్ సర్జరీ చేసేటప్పుడు డాక్టర్లు రోగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తారు. సర్జరీ పూర్తయ్యాక తిరిగి సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకువస్తారు. శరీరాన్ని మొత్తంగా భద్రపరచడం కూడా ఇలాంటిదే అని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే వాస్తవానికి ఈ రెండూ ఒకే విధంగా కనిపించినా, శాస్త్ర పరిభాషలో ఈ రెండూ వేర్వేరు పద్ధతులు. క్రయానిక్స్ విధానం మరణాంతరం శరీరాన్ని భద్రపరచడానికి సంబంధించిన అంశం. క్రయోనిక్స్ టెక్నాలజీని ఇప్పటికే వైద్యానికి సంబంధించి అనేక చోట్ల ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ అవసరాల కోసం వీర్యం, అండాలు, చర్మం మొదలైన వాటిని మైనస్ 150 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరుస్తారు. క్లోనింగ్ ద్వారా పునరుత్పత్తి చేయడం, సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం కూడా మానవ మేధాశక్తికి గొప్ప ఉదాహరణలుగా సైంటిస్టులు చెబుతున్నారు. ........................ఐదో భాగంలో చదవండి.. చదవండి: Cryonics 4: చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమా? -
చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమా?
Cryonics Part 4: మరణాన్ని జయించాలన్న కోరిక మనిషికి ఏనాటి నుంచో ఉంది. సంజీవని పర్వతం, అమృతం వంటి అంశాలు చిన్నప్పటినుంచీ వింటూనే ఉన్నాం. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ఇంతవరకు మరణాన్ని వాయిదా వేయగలుగుతున్నాడే గాని పూర్తిగా జయించలేకపోతున్నాడు. అయితే సుదూర కాలంలోనే మరణాన్ని ఆపగలిగే టెక్నాలజీ అభివృద్ధి చేయగలమనే నమ్మకం పెరిగింది. ఆ నమ్మకం లోనుంచే క్రయోనిక్ టెక్నాలజీ రూపొందింది. చదవండి: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే? ముందు శరీరాన్ని శిధిలం కాకుండా భద్రపరచగలిగితే తర్వాత ఆ శరీరాలపై ప్రయోగం చేసి, చనిపోయినవారి జబ్బులకు చికిత్స చేసి బతికించగలమని సైంటిస్టులు విశ్వసిస్తున్నారు. ప్రపంచంలోని ధనికులు అనేక వేల మంది అమెరికాలోని ఈ రెండు సంస్థల్లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ నాటికి ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్ లో 1353 మంది తమ శరీరాలను భద్రపరుచుకున్నారు. వారి కుటుంబాలు రెండు లక్షల డాలర్ల ఫీజు చెల్లించి మృత శరీరాలను ఆల్కర్కు అప్పగించాయి. ఎప్పటికైనా తమవారికి తిరిగి జీవించే అవకాశం వస్తుందని వారు నమ్ముతున్నారు. వేల ఏళ్లుగా వేధిస్తున్న, అంతుచిక్కని అనేక జబ్బులను ప్రస్తుత కాలంలో తేలిగ్గా నయం చేస్తున్నారు. అలాగే ఇప్పటికీ లొంగని అనేక జబ్బులకు భవిష్యత్ లో చికిత్స తప్పకుండా లభిస్తుందని ఆశిస్తున్నారు. మనిషికి చావులేని చికిత్స త్వరలోనే అందుబాటులోకి వస్తుందనే ఆశ మనిషిలో కనిపిస్తోంది. అందుకే శరీరాలను భద్రపరుచుకునే వ్యాపారం మొదలైంది. చదవండి: Cryonics 3: గుండె కొట్టుకోవడం ఆగిన వెంటనే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా! -
మనిషి మరణించగానే.. క్రయానిక్స్ ప్రారంభం.. ఎలాగో తెలుసా!
మనిషి మరణించగానే, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో కొత్త జ్ఞాపకాలు ఉండవు. దీంతో మెదడులోని కణాలు మరణించడం ప్రారంభం అవుతుంది. సరిగ్గా అప్పడే క్రయానిక్స్ టెక్నీషియన్ పని మొదలవుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి చట్టబద్ధంగా మరణించాడని ప్రకటిస్తారో, వెంటనే శరీరం పాడవడాన్ని అరికట్టేందుకు శరీరానికి ఐస్ బాత్ చేయిస్తారు. ఆ తర్వాత శరీరంలోని రక్తం మొత్తం తొలగించి, దాని స్థానంలో క్రయో ప్రొటెక్టెంట్ ఏజెంట్లను నింపుతారు. చదవండి: పార్ట్ 1: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! ఆ తర్వాత శరీరాన్ని ఒక స్టోరేజ్ ట్యాంకులో పెట్టి, ద్రవరూపంలోని నైట్రోజన్ ద్వారా దాని ఉష్ణోగ్రతను మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గిస్తారు. ఒకప్పుడు అనేక జబ్బులకు చికిత్స లేదు. కేన్సర్ వచ్చినా, గుండె పోటు వచ్చినా మరణం తప్ప మార్గాంతరం లేదు. కాని ఇప్పుడు ప్రాణాంతక కేన్సర్ కు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పది నిమిషాల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినా కూడా చికిత్సతో తిరిగి బ్రతికిస్తున్నారు. కరోనా వంటి అంటువ్యాధులకు నెలల వ్యవధిలోనే వ్యాక్సిన్ తయారు చేశారు. నానో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అత్యంత క్లిష్టమైన ఆపరేషన్లు కూడా తేలిగ్గా చేయగలుగుతున్నారు. మొత్తం మీద టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది. గుండె, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలను ఒకరి నుంచి మరొకరికి విజయవంతంగా మారుస్తున్నారు. ఇవన్నీ గంటల వ్యవధిలో జరిగితేనే ఫలితం ఉంటుంది. ఈ కోవలోనే టెక్నాలజీని అభివృద్ధి చేసి మృత శరీరాన్ని వందేళ్ళ వరకు పాడు కాకుండా భద్రపరచగలిగే స్థాయికి చేరారు. .............ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? నాలుగో భాగంలో చదవండి.. చదవండి: పార్ట్ 2: Cryonics 2: మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే.. -
మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే..
చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నాయి కొన్ని పరిశోధనా సంస్థలు. అమెరికా, రష్యా దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉందని చెబుతున్నారు. శవాలతో వ్యాపారం చేసే సైంటిఫిక్ సంస్థలకు ఊపిరి పోస్తున్నాయి సైంటిస్టుల మాటలు. జీవి ఏదైనా మరణించిన గంట తర్వాతి నుంచి శిధిలావస్థ మొదలవుతుంది. కాని మంచు ప్రాంతాల్లో చనిపోయిన మనుషులు లేదా జంతువులు కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పాడవకుండా కనిపించిన ఉదంతాలు ఉన్నాయి. అదేవిధంగా మైనస్ 196 సెంటీగ్రేడ్ డిగ్రీల టెంపరేచర్ లో వందేళ్ళయినా మృతుడి శరీరం పాడవకుండా భద్రపరచగల ఏర్పాట్లు చేశాయి అమెరికాలోని రెండు సంస్థలు. అవే ఆల్కర్ లైఫ్ ఎక్స్ టెన్షన్ ఫౌండేషన్, క్రయోనిక్ ఇనిస్టిట్యూట్లు. ఆల్కర్ 1972లో ఏర్పడగా...క్రయోనిక్ ను 1976లో స్థాపించారు. చదవండి: Cryonics: చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా?సైన్స్ ఏం చేప్తోందంటే! క్రయోనిక్స్ టెక్నాలజీ అంటే అత్యంత శీతల వాతావరణం సృష్టించి మనిషి శరీరం పాడవకుండా భద్రపరచడమే. మరణించిన వారి శరీరం, మెదడు డ్యామేజ్ కాకుండా ఉంచగలిగితే...వారు ఏ కారణంతో చనిపోయారో..దానికి తగిన చికిత్స అందుబాటులోకి వస్తే...ఆ చికిత్స లేదా సర్జరీ ద్వారా వారిని తిరిగి బ్రతికించగలగడమే క్రయోనిక్స్ ఉపయోగం అని చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇటువంటి టెక్నాలజీ అందుబాటులో లేదు. భవిష్యత్ లో అత్యంత ఉన్నతస్థాయి చికిత్సలు అందుబాటులోకి వస్తే చనిపోయినవారిని తిరిగి బ్రతికించగలమనే నమ్మకంతో ఈ సంస్థలు కోట్ల రూపాయల ఫీజు తీసుకుని మృత శరీరాలను పాడవకుండా భద్రపరుస్తున్నాయి. ఈ పరిశోధన ఎంత దూరం వచ్చింది? థర్డ్ స్టోరీలో చదవండి.. -
చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా? సైన్స్ ఏం చేప్తోందంటే!
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఎక్కడో ఓ చోట కూర్చుని ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల శక్తిని సంపాదించాడు మనిషి. సౌర కుటుంబం ఆవల ఏముందో తెలుసుకుంటున్నాడు. తనలాంటి మనుషులు ఏదైనా గ్రహంలో ఉన్నారేమోనని శోధిస్తున్నాడు. అదేవిధంగా తన సుఖ సంతోషాల కోసం చేయని ప్రయత్నం లేదు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావును ఎందుకు జయించలేకపోతున్నామని మదనపడుతున్నాడు. మరణాన్ని జయిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నాలు ప్రారంభించాడు. ►చావును జయించే క్రమంలో ఎంతవరకు ప్రయాణించాడు...? ►మృత్యువును జయించగలమా? ►చనిపోయిన మనిషిని తిరిగి బ్రతికించగలమా? ►చావును ఆపగల శక్తి మనిషికి వచ్చేసిందా? ►డబ్బు ప్రపంచంలో మనిషి బలహీనతలను సొమ్ము చేసుకునే మరో వ్యాపారమా? చదవండి: Meteor Lights Up Chile Sky: ఆకాశంలో అద్భుతం.. ఒక్క సెకనులో రాత్రి పగలుగా మారింది.. ఎక్కడంటే? ఇన్స్యూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయించుకున్నట్లుగా... జీవిత కాల పరిమితి పూర్తయిన వాహనాలకు గ్రీన్ టాక్స్ కట్టి లైఫ్ పొడిగించుకున్నట్లుగా మనిషి తన జీవితాన్ని రెన్యువల్ చేసుకోగలడా? జీవిత కాలాన్ని తనకు కావాల్సిన విధంగా పెంచుకోగలడా? తిరిగి బ్రతికించగలమనే మూఢ నమ్మకాలతో కన్న బిడ్డలను చంపుకున్న తల్లిదండ్రుల గురించి కొంతకాలం క్రితం విన్నాం. అనేక మంది బాబాలు, స్వాములు చనిపోయినవారిని బ్రతికించారనే ప్రచారాన్ని అప్పుడప్పుడూ వింటుంటాం. జీవరాశుల పుట్టుకకు కారణమైన పంచ భూతాల గుట్టుమట్లను తెలుసుకునే స్థాయికి చేరుకుంటున్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేకోవలో.. గ్రహాంతర వాసుల కోసం అనేక సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే..చనిపోయిన మనిషిని బ్రతికించగలమంటున్నారు కొందరు సైంటిస్టులు. అసలు ఈ స్థాయికి మనిషి మేధస్సు పెరిగిందా? నిజంగా శవాన్ని బ్రతికించగల టెక్నాలజీ తయారయిందా? జబ్బులు, చావులు, వృద్ధాప్యం వంటి సమస్యలు లేని ప్రపంచాన్ని చూడగలమా?... చూడగలమనే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇవన్నీ సరే, చనిపోయిన మనిషిని అసలు మళ్లీ బతికించగలమా? మనుష్యులు చేస్తోన్న పరిశోధన ఎంత దూరం వచ్చింది? సెకండ్ స్టోరీలో చదవండి.. -
నేటి పక్షి.. నాటి రాకాసి బల్లి
గుంటూరు: కోతి నుంచి మనిషి అవతరించాడని చెబుతారు. అలాగే ఇప్పటి పక్షుల పూర్వీకులు ఆనాటి రాకాసి బల్లులేనట! సరీసృపాల స్వర్ణయుగంగా పేరొందిన క్రిటేయస్ (దాదాపు వంద మిలియన్ ఏళ్లకు పూర్వం)నాటి టైటనోసారిక్ డైనోసర్ల శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను వాటి గూళ్లను కనిపెట్టి అధ్యయనం చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం తేలి్చన సారాంశమిది. డైనోసార్ల పునరుత్పత్తి జీవశాస్త్రంపై వీరి పరిశోధనపత్రం గత వారం నేచర్ గ్రూప్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురితమైంది. వీరిలో ఒకరు తెనాలికి చెందిన పాలీయాంథాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ కావటం విశేషం. వీఆర్ ప్రసాద్ ఢిల్లీలోని యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ భౌగోళిక విభాగం అధిపతి. పూర్వ చారిత్రాత్మక కాలం (మెసాజోయిక్ ఎరా)లో భారతదేశంలోని సకశేరుక జంతుజాలం పరిణామక్రమం, జీవవైవిధ్యం, ప్రకృతి, వాతావరణంలో మార్పులను ఆయన 40 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ అన్వేషణలో కనుగొన్న అంశాలు శాస్త్రపరిశోధన రంగాన్ని అబ్బుర పరిచాయి. 2016లో డైనోసర్లను పోలిన 150 మిలియన్ ఏళ్లకు చెందిన సముద్ర సరీసృపంను గుజరాత్లోని కచ్ తీరంలో వీఆర్ ప్రసాద్ గుర్తించారు. 1988లో క్రిటిíÙయస్ యుగంలో నివసించిన క్షీరదాల ఉనికిని దక్కన్ పీఠ భూమిలో గుర్తించి, వాటి పుట్టుక భారత్లోనే నని శాస్త్రలోకానికి చాటారు. తన విజయాలకు గాను 2019లో భారత ప్రభుత్వంచే ‘జాతీయ ఉత్తమ శాస్త్రవేత్త’ అవార్డును స్వీకరించారు. టైటనోసారిక్ డైనోసార్ల గూడు, గుడ్లు శిలాజాల మైక్రోస్కోపిక్ ఫీల్డ్ ఫొటోలు ఫలించిన ముగ్గురు శాస్త్రవేత్తల అన్వేషణ భారతదేశంలోని మధ్య, పశి్చమ ప్రాంతాల్లో టైటనోసారిక్ డైనోసర్ల గూళ్లలో శిలాజీకరణం చెందిన లోపభూయిష్టమైన గుడ్లను హర్ష ధిమాన్, విశాల్ వర్మతో కలిసి గుంటుపల్లి వీఆర్ ప్రసాద్ గుర్తించారు. గుడ్డు లోపల ఇంకో గుడ్డు ఉండటం లేదా గుడ్డును ఆవరించి ఉండే పెంకు ఎక్కువ పొరల్లో ఉండటాన్ని లోపభూయిష్టమైనవిగా చెబుతారు. వీటిని మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన పడ్లియా గ్రామంలో కనుగొన్నారు. మరికొన్నిటిని గుజరాత్ రాష్ట్రంలో గుర్తించారు. పరిశోధనల అనంతరం ఈ శిలాజ అవశేషాలను పడ్లియా సమీపంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వ డైనోసర్ శిలాజ జాతీయ పార్కులో భద్రపరిచారు. ఆధార సహితంగా నిర్ధారణ పక్షుల పూరీ్వకులు రాకాసి బల్లులేనని వీఆర్ ప్రసాద్ బృందం ఆధార సహితంగా నిర్ధారించింది. జీవుల్లో లోపభూయిష్ట గుడ్లు ఏర్పడడానికి అనేక కారణాలుంటాయి. దేహరుగ్మతలు, అధిక జనసాంద్రత, ఆహార కొరత, వరదలు, కరువుకాటకాలు, వాతావరణ మార్పులు వంటివి ప్రధానమైనవి. గుడ్డులో గుడ్డు ఉండడాన్ని పక్షుల విషయంలో అప్పుడప్పుడు వింటుంటాం. అలాగే అనేక పొరల పెంకుతో గుడ్లు ఏర్పడటం కూడా సరీసృపాలు, పక్షుల్లో కనిపిస్తోంది. ఈ రెండు అంశాల ఆధారంగా డైనోసర్లు పక్షుల పూర్వీకులనే విషయాన్ని వీఆర్ ప్రసాద్ బృందం స్పష్టం చేసింది. డైనోసర్ల పరిణామక్రమంపై పరిశోధన ప్రథమంగా మన దేశంలో జరగటం, ఇందులో తెలుగు శాస్త్రవేత్త పాలుపంచుకోవటం విశేషం. -
పురస్కారం..: పచ్చనాకు సాక్షిగా...
చేనులోని గోధుమను ఎప్పుడైనా పలకరించారా? అది తన గోడు వెళ్లబుచ్చుకోదు. మన గోడు ఏమిటో శ్రద్ధగా వింటుంది. మన ఆకలి తీరుస్తుంది... అందుకే గోధుమ అంటే నార్మన్ బోర్లాగ్కు అంత ఇష్టం. మన దేశం కరువు కోరల్లో చిక్కుకుపోయిన ఒకానొక సమయంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు అద్భుతాన్ని సృష్టించాయి. రైతు కంట్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయన ఫోటో మన రైతుల ఇండ్లలో కనిపిస్తుంది. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్న బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇనిషియేటివ్ (బీజీఆర్ఐ) అంతర్జాతీయ అవార్డ్కు ఎంపికైన డా.పర్వీన్, మెంటర్ విభాగంలో ఈ అవార్డ్కు ఎంపికైన తొలిభారతీయ శాస్త్రవేత్త... నార్మన్ బోర్లాగ్ అనే పేరు వినబడగానే అమెరికన్ పేరులా అనిపించదు. ఆత్మీయనేస్తంలా ధ్వనిస్తుంది. మెక్సికోలో ఇంటర్నేషనల్ మైజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్ ప్రొఫెసర్గా పనిచేసిన బోర్లాగ్ రోగనిరోధక శక్తితో కూడిన, అధిక దిగుబడి ఇచ్చే డ్వార్ఫ్(చిన్న) గోధుమ వంగడాలను సృష్టించి రైతునేస్తం అయ్యాడు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. మన దేశం కరువు కోరల్లో చిక్కుకున్న విషాదకాలంలో ఆయన సృష్టించిన గోధుమ వంగడాలు మనకు ఎంతో ఉపయోగపడ్డాయి. కరువు కోరల నుంచి రక్షించాయి. గోధుమ ఉత్పత్తిలో మన రైతులు స్వయంసమృద్ధి సాధించేలా చేశాయి. అందుకే ఉత్తరభారతంలోని రైతుల ఇండ్లలో ఆయన ఫోటో కనిపిస్తుంది. బోర్లాగ్ కుమార్తె జీని బోర్లాగ్ తండ్రి కృషిని ముందుకు తీసుకెళుతోంది. గ్లోబల్ వీట్ కమ్యూనిటీని బలోపేతం చేయడంలో విశేషమైన కృషి చేస్తున్న జీని బోర్లాగ్ ‘సూపర్ ఉమెన్ ఆఫ్ వీట్’ గా పేరుగాంచింది. బోర్లాగ్ గ్లోబల్ రస్ట్ ఇన్షియేటివ్(బీజిఆర్ఐ) చైర్పర్సన్గా గోధుమ రంగానికి సంబంధించిన పరిశోధన ఫలితాలను రైతుల దగ్గరికి తీసుకెళుతుంది. 2010లో ఏర్పాటు చేసిన జీని బోర్లాగ్ లాబ్ వుమెన్ ఇన్ ట్రిటికమ్ మెంటర్ అవార్డ్ను గోధుమరంగంలో విశిష్ట కృషి చేసిన వారికి, కొత్తతరాన్ని ప్రోత్సహిస్తున్న వారికి ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ప్రతిష్ఠాత్మకమైన అంతర్జాతీయ అవార్డ్కు గానూ పంజాబ్కు చెందిన శాస్త్రవేత్త డా.పర్వీన్ చూనెజ ఎంపికైంది. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. గతంలో మన దేశం నుంచి డా.మిథాలీ బన్సాల్, డా.సాను ఆరోరా ఎర్లీ కెరీర్ విభాగంలో ఈ అవార్డ్కు ఎంపియ్యారు. పర్వీన్ ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు పీహెచ్డీ చేయడం విశేషం. వివిధ దేశాల నుంచి ఎర్లీ కెరీర్ విన్నర్స్తో పాటు మెంటర్స్ను కూడా ఎంపిక చేస్తుంది బీజిఆర్ఐ. మెంటర్ విభాగంలో ఈ అవార్డ్ అందుకోనుంది పర్వీన్. మన దేశం నుంచి ఈ విభాగంలో ఎంపికైన తొలి భారతీయ సైంటిస్ట్గా ప్రత్యేకత సాధించింది పర్వీన్. పంజాబ్లోని ఫరీద్కోట్లో జన్మించిన పర్వీన్ కెఎన్ జైన్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో చదువుకుంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. సందేహాలను తీర్చుకోవడంలో ఎప్పుడూ సంశయించేది కాదు. లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్విటీలో బీఎస్సీ చేసింది. 1992లో పీహెచ్డీ పూర్తి చేసింది. 1996లో డీఎస్టీ యంగ్ సైంటిస్ట్ అవార్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్, న్యూ దిల్లీ ‘ఔట్స్టాండింగ్ ఉమెన్ సైంటిస్ట్’ అవార్డ్తో సహా ఎన్నో అవార్డ్లు అందుకుంది. ఇంటర్నేషనల్ వీట్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉంది. ‘పర్వీన్లో మార్గదర్శక నైపుణ్యాలే కాదు, గొప్ప స్నేహలక్షణాలు ఉన్నాయి. ఆమె దగ్గర పనిచేయడం అంటే ఎన్నో కొత్తవిషయాలను తెలుసుకునే అవకాశమే కాదు, క్రమశిక్షణ కూడా అలవడుతుంది’ అంటున్నారు పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ సర్వ్జీత్ సింగ్. లుథియానాలోని స్కూల్ ఆఫ్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న పర్వీన్ యువ మహిళా శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించడంలో చేసిన కృషికి ఈ అవార్డ్ లభించింది. ఇప్పటివరకు 30 మంది మహిళా యువ శాస్త్రవేత్తలకు మార్గదర్శకత్వం వహించింది. వీరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖస్థానాలలో పనిచేస్తున్నారు. -
చేయని నేరానికి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు.. నంబి నారాయణన్ రియల్ స్టోరీ
1994 నవంబర్ 30.. అప్పటి వరకు ఆయన దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త. యావత్ భారత్ ఆయనపై ప్రశంసలు జల్లు కురిపించింది. ఆయన కనిపెట్టిన ‘వికాస్’ ఇంజన్ అద్భుతమైనదని ప్రపంచమంతా కొనియాడింది. కానీ ఒకే ఒక ఘటనతో ఆయన జీవితం తలకిందులైపోయింది. దేశం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయనను ‘దేశద్రోహి’ అన్నారు. చేయని తప్పుకు 50 రోజులు జైలులో పెట్టి నరకం చూపించారు. చివరకు నిర్థోషిగా బయటకు రావడమే కాకుండా.. దేశ మూడో అత్యున్నత పురస్కారమైన ‘పద్మభూషణ్’ అందుకున్నారు. ఆయనే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్. జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చవిచూసిన నంబి నారాయణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. విలక్షణ నటుడు మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా నంబి నారాయణన్ గురించి.. నాసా ఆఫర్ని సున్నితంగా తిరస్కరించి.. నంబి నారాయణన్ మధ్య తరగతి కుటుంబానికి చెందినవారు. 1941 డిసెంబర్ 12న తమిళనాడులో జన్మించారు. ఆయన తల్లిదంద్రులు కొబ్బరి పీచు వ్యాపారం చేసేవారు. ఐదుగురి బాలికల తర్వాత ఆయన పుట్టాడు. ఇంట్లో అందరికంటే చిన్నవాడైన నారాయణన్.. చదువులో మాత్రం బాగా రాణించేవాడు. ఇంజనీరింగ్ పూర్తి చేశాక.. కొంతకాలం స్థానికంగా ఉండే చక్కెర కర్మాగారంలో పనిచేశారు. 1966లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సీటీలో రాకెట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ చదివేందుకు స్కాలర్షిప్ పొందారు. 1966లో నంబి నారాయణన్ నాసాలో ఉద్యోగ అవకాశం లభించినా.. దేశం కోసం సున్నితంగా తిరస్కరించి తిరిగి ఇస్రోలో చేరారు. అక్కడ విక్రమ్ సారాబాయి, సతీష్ ధావన్, అబ్దుల్ కలాం లాంటి ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. స్వదేశీ రాకెట్లను అభివృద్ది చేసే ప్రాజెక్ట్లో నారాయణన్ కీలక పాత్ర పోషించారు. ప్యూయల్ టెక్నాలజీని ఇస్రోకు అందించాలనుకున్నాడు. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే క్రయోజెనిక్ ఇంజిన్స్. ఈ టెక్నాలజీ అప్పట్లో మనకు అందుబాటులో లేదు. దీంతో రష్యాతో రూ.235 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని ఈ టెక్నాలజీని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. ఈమేరకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి. ఆ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చేయని తప్పుకు నంబి నారాయణన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలేం జరిగింది? 1994 నవంబర్ 30న నంబిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకు నెల రోజుల ముందు వీసా గడువు ముగిసిన తర్వాత కూడా భారత్లోనే ఉన్నారంటూ మాల్దీవులకు చెందిన మహిళ మరియమ్ రషీదా, ఫయూజియ్యా హసన్ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆ మహిళలిద్దరు భారత రాకెట్ సాంకేతిక విషయాలను పాకిస్తాన్కు చేరవేస్తున్నారని తేలింది. అంతేకాదు వీరికి ఇస్త్రోలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు సహకరిస్తున్నారని మీడియాతో వార్తలు వచ్చాయి. ఆ మహిళలు వేసిన వలలో నంబి నారాయణన్ కూడా ఉన్నారని కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి 50 రోజులు జైల్లో పెట్టి విచారణ పేరుతో నరకం చూపించారు. దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ అని కొనియాడిన మీడియానే ఆయన్ను ‘దేశద్రోహి’గా చూపించింది. గూఢచారి, దేశద్రోహి అంటూ అనేకమంది ఆయనను నిందించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తే ఆయన ఇంటిపై దాడి చేశారు. న్యాయమే గెలిచింది దేశం కోసం నాసా ఆఫర్ని తిరస్కరించిన నంబి నారాయణన్కు.. అసలు తనని ఎందుకు అరెస్ట్ చేశారో కూడా మొదట్లో అర్థం కాలేదు. పోలీసులు ఎంత హింసించిన నేరం ఒప్పుకోలేదు. అరెస్టయిన నెల రోజుల తర్వాత ఈ కేసు కేరళ ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి సీబీఐకు బదిలీ అయింది. 1995 జనవరి 19న ఆయనకు బెయిల్ వచ్చింది. సీబీఐ విచారణలో నంబి నారాయణన్ ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీబీఐ తమ నివేదికను 1996 ఏప్రిల్లో కేరళ హైకోర్టుకు సమర్పించింది. ఇస్రోకు చెందిన సమాచారం పాకిస్తాన్కు వెళ్లినట్లు ఎక్కడ ఆధారాలు లేకపోవడంతో నంబి నారాయణన్తో పాటు మరో ఐదుగురికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో నంబి నారాయణన్ తిరిగి ఇస్రోలో చేరారు. సీబీఐ ఈ కేసును మూసివేసినా.. అప్పటి కేరళ ప్రభుత్వం మళ్లీ తెరిచేందుకు ప్రయత్నించింది. ఈ కేసుని మళ్లీ విచారించాలని కోరుతూ..1998లో సుప్రీకోర్టు మెట్లు ఎక్కింది. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ కేసును తిరస్కరించింది. తనపై అక్రమంగా కేసును బనాయించి, వేధించిన కేరళ ప్రభుత్వంపై డాక్టర్ నారాయణన్ కేసు వేశారు. నారాయణన్కు రూ.50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని సుప్రీంకోర్టు 2018లో ఆదేశించింది. అంతేకాదు తప్పుడు కేసు బనాయించడంపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది. తన తప్పును తెలుసుకున్న కేరళ ప్రభుత్వం కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు అదనంగా ఇస్తామని 2019లో ప్రకటించింది. 2019లో భారత ప్రభుత్వం నారాయణన్ని ‘పద్మభూషణ్’తో సత్కరించింది. నారాయణన్పై కుట్ర పన్నిందెవరనే విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. గుఢచార్యం కేసు వెనుక అమెరికా హస్తం ఉందని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్ అనుమానం వ్యక్తం చేశారు. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కంటికి కనిపించే... జంబో బ్యాక్టీరియా
బ్యాక్టీరియా. సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. శక్తిమంతమైన మైక్రోస్కోప్కు మాత్రమే చిక్కుతుంది. దాని పరిమాణానికి ఏ ఐదారు వేల రెట్లో పెద్దగా ఉంటే తప్ప చూడలేం. అలాంటి ఏక కణ సూక్ష్మజీవి కంటికి కనిపిస్తే? గమ్మత్తుగా ఉంటుంది కదా! సరిగ్గా అలాంటి కంటికి కనిపించే జంబో బ్యాక్టీరియా ఒకటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని పేరు థియోమార్గరిటా మ్యాగ్నిఫికా. తెల్లగా సేమ్యా పోగులా కన్పించే ఇది ఏకంగా ఓ సెంటీమీటర్ సైజులో ఉంటుందట. కరీబియన్ దీవుల్లో ఉన్న లెసర్ ఆంటిలిస్లోని మడ తడి అడవుల్లో నీటి అడుగున ఇది కనిపించింది. సల్ఫర్ (గంధకం) కణాలతో స్వచ్ఛమైన ధవళ వర్ణంలో ఉండే ఈ బ్యాక్టీరియా కాంతిని వెదజల్లుతూ ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. ఒకవిధంగా బ్యాక్టీరియాల్లో ఇది డైనోసార్ టైపన్నమాట. బ్యాక్టీరియా అంటే అతి సూక్ష్మజీవి అనే వాదనను ఇప్పుడిది పటాపంచలు చేసింది. కొత్త పరిశోధనల దిశగా శాస్త్రవేత్తలు చూపు సారించేట్టు చేసింది. మొక్కల్ని పోలిన జీవక్రియ కాలిఫోర్నియాలోని లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీకి చెందిన సముద్రజీవ శాస్త్రవేత్త జీన్ మేరి వోలాండ్ మరికొంత ముందుకు వెళ్లి శక్తిమంతమైన మైక్రోస్కోప్ ద్వారా ఎక్స్రే టొమోగ్రపీ పద్ధతి ద్వారా ఈ బ్యాక్టీరియా పొడవును కచ్చితంగా నిర్ధారించారు. ఇది దాదాపు ఒక సెంటీమీటర్ (9.66 మిల్లీమీటర్ల) పొడవున్నట్టు గుర్తించారు. మ్యాగ్నిఫికా సైజును సాధారణ బ్యాక్టీరియాతో ఆయన పోల్చిన తీరు చూస్తే అది ఎంత పెద్దదో అర్థమవుతుంది. మామూలు బ్యాక్టీరియాకూ దీనికీ హిమాలయాలంత ఎత్తున్న మనిషికి, మామూలు మనిషికి ఉన్నంత తేడా ఉందంటారు వోలాండ్! దీని జీవక్రియ మొక్కల జీవక్రియను పోలి ఉంటుంది. జడ సమ్మేళనాల నుంచి కార్పోహైడ్రేట్ల నిర్మాణం ద్వారా మ్యాగ్నిఫికా జీవక్రియ సాగుతుందని వోలాండ్ విశ్లేషించారు. తనలోని గంధకాన్ని మండించడం ద్వారా శక్తిని పొందుతుందని వివరించారు. ఈ బ్యాక్టీరియాను చాలా విశిష్టమైనదిగా గుర్తించి ఆశ్చర్యపోవడం తమ వంతయిందంటారు ఆంటిలిస్ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులార్ బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ సిల్వినా గొంజాలెస్ రిజ్జో. ‘‘మ్యాగ్నస్ అంటే లాటిన్లో భారీ అని అర్థం. అందుకే దీనికి మ్యాగ్నిఫికా అని పేరు పెట్టాం. పైగా అందమైన ఫ్రెంచ్ పదం ‘మ్యాగ్నిఫిక్’కు కూడా ఈ పేరు దగ్గరగా ఉంటుంది’’ అన్నారాయన. దీనికంటే ముందు వరకూ అతి పెద్ద బ్యాక్టీరియా అన్న రికార్డు ‘థియోమార్గరిటా నమీబియెన్సిస్’ పేరిట ఉండేది. దాన్ని నమీబియా దగ్గర్లోని సముద్ర జలాల్లో గుర్తించారు. దాని పొడవు 0.75 మిల్లీమీటర్లని రిజ్జో చెప్పారు. బ్యాక్టీరియాల్లోకెల్లా ఈ బ్యాక్టీరియా వేరయా అన్నట్టు మ్యాగ్నిఫికా ఎందుకంత జంబో సైజులో ఉందో శాస్త్రవేత్తలు ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారు. బహుశా భారీ బ్యాక్టీరియాల ఉనికికి ఇదో సూచన కావచ్చని వారంటున్నారు. ఇంతకన్నా పెద్ద బ్యాక్టీరియాలు కూడా ఎక్కడో ఉండే ఉంటాయని కూడా వాదిస్తున్నారు. ప్రయోగశాలలో మ్యాగ్నిఫికాను పునరుత్పత్తి చేస్తే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని వాషింగ్టన్ యూనివర్సిటీ (సెయింట్ లూయీ)కి చెందిన శాస్త్రవేత్త పెటా ఆన్నె లెవిన్ భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ బ్యాక్టీరియా అంటే... ►ఇది కేంద్రకం ఉండని ఏక కణ సూక్ష్మజీవి ►భూమిపై సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పర్యావరణ వ్యవస్థలో దీనిది కీలక పాత్ర. ►కొన్నిరకాల బ్యాక్టీరియా అత్యల్ప, అత్యుగ్ర ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద కూడా మనగలుగుతుంది. ►ఒకరకంగా మానవ శరీరం పూర్తిగా బ్యాక్టీరియామయమే అని చెప్పాలి. అసలు మన ఒంట్లో మానవ జీవ కణాల కంటే కూడా బ్యాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువంటే అతిశయోక్తి కాదు! ►అయితే మన ఒంట్లో ఉండే బ్యాక్టీరియాలో చాలావరకు అపాయరహితమైనవి, ►మనకు ఉపయుక్తమైనవే. చాలా తక్కువ బ్యాక్టీరియా జాతులు మాత్రమే రోగ కారకాలు. 2009లోనే గుర్తించినా... నిజానికి ఈ జీవిని 2009లోనే గుర్తించారు. ఫ్రెంచ్ ఆంటిలెస్ యూనివర్సిటీకి చెందిన ఒలివర్ గ్రాస్ అప్పట్లో దీన్ని గుర్తించారు. కానీ దీన్ని ఫంగస్గా పొరబడ్డారు. నిజానికది జంబో బ్యాక్టీరియా అని మరో ఐదేళ్ల పరిశోధన తర్వాత గాని ఆయన గుర్తించలేకపోయారు. ‘‘మొదట్లో ఏదో గమ్మత్తయిన జీవి అనుకున్నాను. తెల్లటి ఫిలమెంట్లా ఉన్న ఈ జీవి అబ్బురంగా తోచింది’’ అని గ్రాస్ తన అనుభవాన్ని ఓ జర్నల్లో పంచుకున్నారు. ఈ పరిశోధన ఫలితాన్ని ఓ మామూలు జర్నల్లో ప్రచురించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు నమ్మలేదు. కానీ ఈ పరిశోధనా క్రమాన్ని, ఫలితాన్ని తాజాగా సైన్స్ జర్నల్లో ప్రచురించడంతో అందరికీ నమ్మకం కుదిరింది. -
పి.సి. మహలనోబిస్(1893–1972): సర్వేల శాస్త్రవేత్త
గణాంకవేత్త అయిన ప్రశాంత చంద్ర మహలనోబిస్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కొత్తగా ఏర్పడిన మంత్రిమండలికి గణాంక సలహాదారుగా నియమితులయ్యారు. 1955లో జాతీయాభివృద్ధి మండలికి రెండో పంచవర్ణ ప్రణాళిక ముసాయిదాను అందించారు. వివిధ దేశాల మధ్య ఆదాయ వ్యత్యాసాలకు ప్రధాన కారణాలు కాగలిగిన అనేక అంశాలను అధ్యయనం చేసిన మహలనోబిస్, ఉక్కు ఉత్పత్తిని చాలా కీలకమైనదిగా నిగ్గు తేల్చారు. దాంతో భారీ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆయన సిఫార్సు చేశారు. దీని ఫలితంగా భారతదేశ తూర్పు ప్రాంతంలోనూ, మధ్య ప్రాంతంలోనూ ఉక్కు నగరాలు నిర్మాణమయ్యాయి. మహలనోబిస్ అందించిన సేవలలో చిరస్థాయిగా నిలిచిపోయినవి అనేకం ఉన్నాయి. వాటిలో.. భారీ సర్వేలకు ఏర్పాట్లు చేయడం ఒకటి. వివిధ రకాల భారతీయ సమస్యలకు గణాంక సూత్రాలను అనువర్తింప జేయడం మరొకటి. తన జీవితకాలం తర్వాత కూడా వీటి అమలు కొనసాగే విధంగా మహలనోబిస్ అందుకు అవసరమైన వ్యవస్థలను నెలకొల్పడం అన్నిటికన్నా ముఖ్యమైనది. మహలనోబిస్ ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జిలో గణితం, భౌతిక శాస్త్రం చదివిన తరువాత 1915లో భారతదేశానికి తిరిగి వచ్చి, భౌతిక శాస్త్ర బోధనలో పడిపోయారు. గణాంక విధానాలను ముమ్మరంగా అధ్యయనం చేసిన ఆయన తను పని చేస్తున్న కళాశాలలోనే ఒక చిన్న గణాంక ప్రయోగశాలను ప్రారంభించారు. అదే కాలక్రమంలో భారతీయ గణాంక సంస్థ (ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్) గా రూపుదిద్దుకుంది. 1933లో ‘సంఖ్య’ అనే పేరుతో ఒక పత్రికను ప్రారంభించారు. 1920లలో కలకత్తాలోని ఆంగ్లో–ఇండియన్ వర్గం నుంచి సేకరించిన సమాచారాన్ని వివిధ జాతుల భౌతిక స్థాయిల మధ్య అంతరాలకు కొలతలుగా ఉపయోగించిన మహలనోబిస్కు 1930లలో బెంగాల్ మొత్తం మీద జనపనార ఉత్పత్తి అంచనాపై సర్వే చేసే పనిని అప్పగించింది. భారీ స్థాయిలో జరిపిన ఈ సర్వేయే, 1950లో నేషనల్ శాంపిల్ సర్వే (ఎన్.ఎస్.ఎస్.) మొదటి విడత కార్యకలాపాలకు రంగాన్ని సిద్ధం చేసింది. నేటికీ ఎన్.ఎస్.ఎస్. కార్యకాలపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఆచరణాత్మకమైన ప్రశ్నలకు మహలనోబిస్ పెద్ద పీట వేశారు. వాటి లోతుల్ని అన్వేషించారు. -
యువ శాస్త్రవేత్తలను సత్కరించిన ‘ఐన్గరన్’ మూవీ టీం
సాక్షి, చెన్నై: ఐన్గరన్ చిత్ర యూనిట్ యువ శాస్త్రవేత్తలను గౌరవించింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్కుమార్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఐన్గరన్. ఈటీ చిత్రం ఫేమ్ రవిఅరసు దర్శకత్వంలో కామన్ మ్యాన్ పతాకంపై బి. గణే ష్ నిర్మించారు. గత నెల 17వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను, విమర్శల ప్రశంసలు అందుకుంది. కాగా ఈ నెల 10 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని వారంలోనే మూడు మిలియన్ల ప్రేక్షకులు వీక్షించడం విశేషం. కాగా ఒక యువ విజ్ఞాని ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ లభించడంతో చిత్ర యూనిట్ బుధవారం యువ శాస్త్రవేత్తలను గౌరవించే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గిండీలోని ఓ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి అబ్దుల్ కలామ్ అనుచరుడు పొన్రాజ్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలకు చెందిన 30కి పైగా యువ శాస్త్రవేత్తలను ఆహ్వానించి పొన్రాజ్ నేతృత్వంలో ఘనంగా సత్కరించి కానుకలను అందించారు. ఓ విజ్ఞాని ఇతివృత్తంతో ఐన్గరన్ చిత్రాన్ని మంచి సందేశాత్మకంగా మలిచారని పొన్రాజ్ చిత్రం యూనిట్ను అభినందించారు. -
శాస్త్రవేత్త హరికాంత్కు పురస్కారం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డిలోని మామిడి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త పోరిక హరికాంత్ జాతీయస్థాయి పురస్కారం అందుకున్నారు. ఉద్యాన పంటలపై చేసిన పరిశోధనలకు ఆయన ఫెలో ఆఫ్ కాన్ఫడరేషన్ ఆఫ్ హార్టీకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీహెచ్ఏఐ)–2022 పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ హెచ్.పి.సింగ్ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ములుగు జిల్లా అన్నపల్లి గ్రామానికి చెందిన హరికాంత్ ప్రస్తుతం సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈయన ఇజ్రాయిల్ మీషావ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా. ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ దేశాల్లో ఉద్యాన పంటలపై పరిశోధనలు చేశారు. 2018లో ఆయన యువ శాస్త్రవేత్త పురస్కారాన్ని ప్రొఫెసర్ స్వామినాథన్ నుంచి అందుకున్నారు. కేవలం ఆస్ట్రేలియా వంటి దేశాలకే పరిమితమైన రెడ్గ్లోబ్ అనే ద్రాక్ష రకాన్ని భారత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అభివృద్ధి చేసినందుకు హరికాంత్కు గతంలో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. -
జాబిల్లిపై పచ్చదనం!
చందురిడిపై ఏరువాక సాగే రోజులు దగ్గరపడుతున్నాయి. పోషకాలు లేని చందమామ మృత్తికలో మొక్కలు పెరగవన్న అంచనాలను పటాపంచలు చేసే ప్రయోగాన్ని అమెరికా సైంటిస్టులు నిర్వహించారు. దీంతో భవిష్యత్లో చంద్రునిపై నివాసానికి ప్రధాన అడ్డంకి తొలగినట్లేనని భావిస్తున్నారు. వాషింగ్టన్: జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్ జాతికి చెందిన అరబిడోప్సిస్ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్ కమ్యూనికషన్స్ బయాలజీ ప్రచురించింది. మొక్కల్ని ఇలా పెంచారు.. మొక్కలు పెంచాలంటే పోషకాలతో కూడిన మట్టి, సూర్యరశ్మి, నీళ్లు, బ్యాక్టీరియా వంటివెన్నో ఉండాలి.చంద్రుడి నుంచి అపోలో మిషన్ 11, 12, 17 సమయంలో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకుపైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచాలంటే అత్యంత కష్టమైన విషయమే. చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టి మధ్య చాలా తేడాలుంటాయి. ముఖ్యంగా చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో పోషక విలువలు కాగడా వేసి చూసినా కనిపించవు. సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పని చేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ ఉండవు. అందుకే ఇందులో మొక్కలు పెంచడాన్ని ఒక సవాల్ తీసుకున్నారు. అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టి ఒక్కో గ్రాము వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెర్రారియమ్ బాక్సుల్లో ఉంచారు. ప్రతీ రోజూ వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. రెండు రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తడంతో శాస్త్రవేత్తలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆరు రోజుల్లో అవి ఎదిగి పచ్చగా కంటికి ఆహ్లాదాన్నిచ్చాయని హార్టీకల్చర్ శాస్త్రవేత్త అన్నా లిసా పాల్ చెప్పారు. ఎలా పెరిగాయి? చంద్రుడిపై వ్యవసాయానికి వీలు కుదురుతుందా ? భవిష్యత్లో చంద్రుడిపై పరిశోధనల కోసం మరిన్ని రోజులు వ్యోమగాములు గడపాలంటే వారికి కావల్సిన పంటలు అక్కడ పండించుకోవడం సాధ్యమేనా? అన్న దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందులో చంద్రుడి మట్టిలో వ్యవసాయం సాధ్యమేనని తేలింది. అయితే ఈ మొక్కలు భూమిపై పెరిగినంత బలంగా, ఏపుగా పెరగలేదు. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత ఆ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించే ఆర్ఎన్ఏ పరీక్షలు చేశారు. ఆ మొక్కలు కాస్త ఒత్తిడి మధ్య పెరిగినట్టు ఆ పరీక్షల్లో తేలింది. అలాగే ఎక్కువ వయసున్న చంద్ర మృత్తికలో కన్నా తక్కువ వయసున్న చంద్ర మృత్తికలో మొక్కలు తక్కువ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఏదైతేనేం, చంద్రుడి మట్టిలో విత్తనాలు వేస్తే మొలకెత్తడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ పరిశోధన భవిష్యత్లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి బాటలు వేస్తుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యం
మక్కువ : పంట కాలంలో 14 వారాల పాటు శిక్షణ ఇచ్చి రైతును శాస్త్రవేత్తను చేయడమే వైఎస్సార్ పొలంబడి లక్ష్యమని మండల వ్యవసాయాధికారి కె. తిరుపతిరావు అన్నారు. సరయ్యవలస రైతుభరోసా కేంద్రం పరిధిలోని బంగారువలసలో సోమవారం నిర్వహించిన పొలంబడి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ, ఎంపిక చేసిన పంటలో 14 వారాల పాటు 25 మంది రైతులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. నిరంతర పంటల పరిశీలన ద్వారా మిత్ర పురుగులు, వాతావరణాన్ని పరిశీలిస్తూ అవసరమైన నిర్ణయాలపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. గ్రామ రైతులందరూ రాబోయే ఖరీఫ్ సీజన్లో నిర్వహించే పొలంబడికి పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. సర్పంచ్ శంబంగి హరికృష్ణ మాట్లాడుతూ, రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. పచ్చిరొట్ట, పత్తి విత్తనాలు తొందరగా అందించాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ టి. శ్రీరాములు, వీఏఏ త్రివేణి, రైతులు పాల్గొన్నారు. (చదవండి: పంట భద్రుడు...ఆదర్శ రైతుగా మారిన ఉపాధ్యాయుడు) -
ఊసులాడే ఫంగస్లు
లండన్: భూమి మీద పుట్టిన దాదాపు ప్రతి జీవి ఏదో రూపంలో సాటి జీవులతో సమాచార ప్రసారం చేస్తుంటాయి. మనిషి మాటల ద్వారా భావాన్ని ప్రసారం చేస్తే, జంతువులు పలు శబ్దాల ద్వారా, కదలికల ద్వారా చేస్తుంటాయి. వృక్షాలు రసాయన సంకేతాలతో సంభాషించుకుంటాయి. మరి జీవ పటంలో ఇంకా దిగువకు వెళ్లే కనిపించే శిలీంద్రాల సంగతేంటి? పుట్టగొడుగుల్లాంటి శిలీంద్రాలన్నీ మొద్దబ్బాయిల్లాంటివేనా? లేదా మనకు తెలీని రూపంలో వీటిలో సమాచార ప్రసారం జరుగుతుందా? వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్ సైంటిస్టు అండ్రూ అడమట్జీ్క చేపట్టిన నూతన పరిశోధన ఈ ప్రశ్నలకు సమాధానాలిస్తోంది. శిలీంద్రాలు వాటికే సొంతమైన ఎలక్ట్రికల్ భాషలో ఊసులాడుకుంటాయని పరిశోధన సూచిస్తోంది. పుట్టగొడుగులు ఇరుగుపొరుగుతో సంభాషించేందుకు వాక్యాలను కూడా వాడతాయని పేర్కొంది. ప్రతి బహుకణ జీవిలో కూడా సమాచార ప్రసారానికి నాడులు కారణం. ఇవి విడుదల చేసే ఎలక్ట్రిక్ తరంగాల ఆధారంగానే జీవజాలంలో ప్రసారం సాధ్యమవుతోంది. ఫంగస్లో కూడా ఇలాంటి నాడులుంటాయి. వీటిని హైఫే అంటారు. ఒక ఫంగల్ కాలనీలోని జీవులన్నింటి హైఫేలన్నీ కలిసి భూమి ఉపరితలం దిగువన ఒక వలలాంటి నిర్మాణం (మైసీలియం)ను ఏర్పాటు చేస్తాయి. ఈ వల ద్వారా మొత్తం కాలనీకి సమాచారం అందుతుంది. ఈ నెట్వర్క్ను జీవుల్లోని నాడీ వ్యవస్థతో పోల్చవచ్చు. ఇలా కనుగొన్నారు చిన్న చిన్న ఎలక్ట్రోడులను ఉపయోగించి నాలుగు ప్రజాతుల ఫంగస్ మైసీలియంలు విడుదల చేసే విద్యుత్ ప్రేరణలను ఆండ్రూ రికార్డు చేశారు. వీటిని పరిశీలిస్తే ప్రతి ప్రేరణ తరంగధైర్ఘ్యం, తరచుదనం, కాలపరిమితి వేరేగా ఉన్నట్లు తెలిసింది. ఈ ప్రేరణల నమూనాలను గణిత సూత్రాల ఆధారంగా విశ్లేషిస్తే అవి మానవ ప్రసంగ నమూనా(ప్యాటర్న్)తో పోలినట్లు గుర్తించారు. ఫంగస్ల భాషలో దాదాపు 50 వరకు పదాలు వివిధ వాక్యాల రూపంలో పేర్చడం గమనించినట్లు ఆండ్రూ చెప్పారు. ఒక్కో ఫంగస్ ప్రజాతిలో ఒక్కో రకమైన భాష వాడుకలో ఉందని, షైజోఫైలమ్ కమ్యూనే అనే ప్రజాతి అత్యంత క్లిష్టమైన భాషను వాడుతోందని తెలిపారు. దగ్గరలోని ఆహార లభ్యత, ప్రమాద హెచ్చరికలు, నష్టం కలిగించే అంశాల గురించి ఇవి మాట్లాడుకుంటాయని అంచనా వేశారు. ఫంగస్లు భూమిలోపల అంతర్గత నెట్వర్క్తో సమాచార ప్రసారం చేస్తాయని గతంలోనే అంచనాలున్నాయి. తాజా పరిశోధనతో ఈ సమాచార ప్రసారం ఆషామాషీగా జరగదని, మానవుల్లో జరిగినంత పకడ్బందీగా జరుగుతుందని తెలిసింది. ఫంగస్ల తెలివితేటలు, చేతనపై మరిన్ని పరిశోధనలకు తాజా సమాచారం ఉపయోగపడనుంది. సో, ఇకపై పుట్టగొడుగులు తినేముందు అవి ఏం చెబుతున్నాయో తెలుసుకోండి! -
అంతరిక్ష కేంద్రానికి ఆహ్వానం.. ఇలా దరఖాస్తు చేసుకోండి!
రాజాం సిటీ: యువ శాస్త్రవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కృషిచేస్తోంది. ఇందులో భాగంగా యువికా–2022 (యువ విజ్ఞాన కార్యక్రమం) యువ శాస్త్రవేత్తలను తయారుచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యాసంవత్సరంలో దేశవ్యాప్తంగా 9వ తరగతి చదివే విద్యార్థుల నుంచి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నూతన ఆవిష్కరణల వైపు యువతను నడిపించడం, అంతరిక్షంపై మక్కువ పెంచుకోవడం కోసం రాబోయే తరాల్లో శాస్త్రవేత్తలను గుర్తించే దిశగా ఇస్రో దృష్టి సారించి దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తోంది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్లలో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ వరకు అవకాశం కల్పించింది. దరఖాస్తు చేయండిలా.. విద్యార్థులు నాలుగు దశల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతిదశలో జాగ్రత్తగా వివరాలు నమోదుచేయాలి. అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరిస్తారు.యువికా–2022 కోసం ఏర్పాటుచేసిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీఓవీ.ఐఎన్ వెబ్సైట్లో విద్యార్థులు సొంత ఈ–మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్విజ్ సూచనలు చదివి ఈ–మెయిల్ క్రియేట్ చేసిన 48 గంటల వ్యవధిలో ఇస్రో ఏర్పాటుచేసిన ఆన్లైన్ క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. క్విజ్ అప్లోడ్ చేసిన 60 నిమిషాల తరువాత యువికా పోర్టల్లోని ఆన్లైన్ దరఖాస్తులో పూర్తి వివరాలు నమోదుచేయాలి. అనంతరం డౌన్లోడ్ చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు విద్యార్థి సంతకం చేసిన ప్రతిని, విద్యార్థి మూడేళ్లలో వివిధ అంశాల్లో రూపొందించిన ప్రగతికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇందులో ఎంపికైన వారిని ఇస్రో వడబోసి తుదిజాబితా అదే నెల 20న వెబ్సైట్లో ఉంచుతుంది. రాష్ట్రానికి ముగ్గురు విద్యార్థులు చొప్పున అవకాశం కల్పిస్తారు. ఎంపికైన విద్యార్థులకు విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (తిరువనంతపురం), యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (అహ్మదాబాద్), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (హైదరాబాద్), నార్త్ ఈస్ట్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (షిల్లాంగ్)లలో మే 16 నుంచి 28 వరకు 13 రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. అర్హులు వీరే.... ఈ ఏడాది మార్చి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. వారికి ఎనిమిదో తరగతిలో వచ్చిన మార్కులతోపాటు గత మూడు సంవత్సరాల్లో పాఠశాల, జిల్లా, రాష్ట్రస్థాయి సైన్స్ఫెయిర్లో పాల్గొని ఉండాలి. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్లలో సభ్యుడై ఉండాలి. -
ఫిక్షన్ నుంచి యాక్షన్కు..
అలా అలా ఆడుతూ పాడుతూ ఆకాశంలోకి దూసుకెళ్తుంటారు.. గ్రహాల్లో తిరిగేస్తుంటారు.. చిత్రవిచిత్రమైన ఆయుధాలతో యుద్ధాలు చేస్తుంటారు.. హాలీవుడ్ ఫిక్షన్ సినిమాల్లో ఇదంతా మామూలే. నిజానికి ఇప్పుడున్న టెక్నాలజీల్లో చాలావరకు ఒకప్పుడు సినిమాల్లో ఊహించినవే కూడా. అలాగే భవిష్యత్తులో సాకారమయ్యే అవకాశమున్న టెక్నాలజీలే నాసా ‘నియాక్’ ఐడియాలు. మరి ఏమిటీ నాసా ‘నియాక్’? ఈ టెక్నాలజీలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్డెస్క్ సరికొత్త ఆవిష్కరణల దిశగా.. అంతరిక్ష టెక్నాలజీల్లో ఎన్నో అద్భుతాలను సృష్టించినది అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా. ఉన్న టెక్నాలజీని అభివృద్ధి చేయడం, సరికొత్త సాంకేతికతను సృష్టించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగా వినూత్న ఐడియాలను ప్రొత్సహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చే వారిని గుర్తించి.. అందులో ఆచరణ సాధ్యమైనవాటి రూపకల్పన, అభివృద్ధి, ఆవిష్కరణల కోసం నిధులు ఇస్తుంది. అవసరమైన శిక్షణ, ఇతర సాయమూ అందజేస్తుంది. ఇందుకోసం ‘నాసా ఇన్నోవేటివ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ (ఎన్ఐఏసీ– నియాక్)ను ఏర్పాటు చేసింది. 2022కు గాను నియాక్ ప్రోగ్రామ్ కింద 17 ప్రాజెక్టులను ఎంపిక చేసి.. వాటిపై ప్రాథమిక పరిశోధనల కోసం సుమారు రూ.40 కోట్ల నిధులు ఇచ్చింది. ఫిక్షన్ నుంచి వాస్తవానికి.. ‘‘సరికొత్త, వినూత్న ఆలోచనలపై పరిశోధన చేపట్టడం, వాటి అమలుకు ప్రయత్నించడమంటే.. సైన్స్ ఫిక్షన్ (అభూత కల్పన) నుంచి వాస్తవ రూపంలోకి అడుగులు వేసినట్టే..’’ అని నాసా స్పేస్ టెక్నాలజీ మిషన్ డైరెక్టరేట్ శాస్త్రవేత్త జిమ్ రూటర్ పేర్కొనడం గమనార్హం. ఈ ఏడాది పరిశోధనకు ఎంపికైన కొన్ని వినూత్న ఐడియాలు ఇవి.. యురోపాపై జీవం గుట్టు తేల్చేందుకు.. గురుగ్రహం చుట్టూ తిరిగే యురోపా.. శని చుట్టూ తిరిగే ఎన్సెలాడెస్.. ఈ రెండు ఉపగ్రహాలు నిండా మంచుతో కప్పబడి ఉన్నాయి. దాని కింద భారీ సముద్రాలు ఉన్నాయి. అంటే అక్కడ జీవం కూడా ఉండొచ్చని శాస్త్రవేత్తల అంచనా. ఈ గుట్టు తేల్చేందుకు ‘సెన్సింగ్ విత్ ఇండిపెండెంట్ మైక్రో స్విమ్మర్స్(స్విమ్)’ప్రయోగం చేపట్టనున్నారు. యురోపా, ఎన్సెలాడెస్లపై దిగే స్పేస్క్రాఫ్ట్ నుంచి.. చిన్న మైక్రో స్విమ్మర్లు బయటికి వస్తాయి. అవి మంచును చీల్చుకుంటూ దిగువన సముద్రంలోకి వెళ్లి అక్కడి పరిస్థితులను వ్యోమనౌకకు పంపిస్తాయి. వీనస్ మేఘాల్లోంచి శాంపిల్ కోసం.. శుక్రగ్రహం (వీనస్)పై సుమారు 40, 50 కిలోమీటర్ల ఎత్తున మేఘాల్లో దాదాపుగా భూమ్మీద ఉన్నట్టుగా జీవానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అక్కడ సూక్ష్మజీవులు వంటి ప్రాథమిక జీవం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రగ్రహ వాతావరణంలో ప్రవేశించి.. అక్కడి శాంపిల్స్ను సేకరించి.. తిరిగి భూమిపైకి తీసుకొచ్చే ‘ఒక ఆర్బిటర్–ప్రోబ్’ స్పేస్క్రాఫ్ట్ను రూపొందిస్తున్నారు. రేడియేషన్ను ఆపేలా.. సూర్యుడి నుంచి భారీగా రేడియేషన్ వెలువడుతూ ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ, అయస్కాంతశక్తి కారణంగా అది మనపై ప్రభావం చూపలేదు. కానీ అంతరిక్షంలోకి వెళ్లినప్పుడు ఈ రేడియేషన్కు లోనవక తప్పదు. వ్యోమగాములు ఎక్కువకాలం అంతరిక్షంలో ఉండలేరు. దీన్నుంచి తప్పించేందుకు ‘క్రూ హ్యాట్’ పేరిట పరికరాన్ని రూపొందించనున్నారు.ఇది నిర్ధారిత ప్రదేశంలో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిచి రేడియేషన్ను అడ్డుకుంటుంది. త్వరలో చంద్రుడిపైకి, మార్స్పైకి మానవ యాత్రలు చేపట్టనున్న నేపథ్యంలో ఇది వ్యోమగాములకు రక్షణగా ఉంటుంది. ఆస్టరాయిడ్లను ముక్కలు చేసేలా.. అంతరిక్షంలో తిరుగాడే గ్రహశకలాల్లో ఏదైనా భూమివైపు దూసుకొస్తుంటే.. దాన్ని ధ్వంసం చేసి, భూమిని కాపాడుకొనేందుకు రూపొందిస్తున్న పరికరమే ‘పై’. ఇప్పటివరకు ఈ విషయంలో పెద్ద పెద్ద అణుబాంబుల వంటి వాటిపైనే శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. వాటినుంచి ఫలితం తక్కువేననే అభిప్రాయాలున్నాయి. అయితే ఆస్టరాయిడ్పై వేల సంఖ్యలో చిన్నచిన్న పేలుళ్లు సృష్టించి, ముక్కలు చేసే ఆలోచనతో ముందుకొచ్చినదే ‘పై’. దీని నుంచి ఫలితం కూడా బాగుంటుందని అంచనా వేస్తున్నారు. అంతరిక్షంలోనే 3డీ స్పేస్సూట్ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లాలంటే స్పేస్సూట్ వేసుకోవడం తప్పనిసరి. వాటి తయారీ కాస్త ఖర్చు, శ్రమతో కూడిన వ్యవహారం. భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్రలు పెరిగే నేపథ్యంలో.. ఎక్కడైనా 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో స్పేస్సూట్లను తయారు చేయడం, మరమ్మతు చేయడం కోసం ప్రత్యేక పరికరాన్ని, అందులో వాడే పదార్థాలను అభివృద్ధి చేయనున్నారు. ఇవి ఎప్పుడంటే అప్పుడు.. ఎవరికి తగినట్టుగా వారికి స్పేస్సూట్లను తయారు చేసేలా రూపొందించనున్నారు. సూర్యుడి శక్తిని పట్టేసుకుని.. సౌర కుటుంబంలో దూరంగా ఉన్న యురేనస్, నెఫ్ట్యూన్ వంటి గ్రహాలు, వాటి అవతల ఉన్న మరుగుజ్జు గ్రహాల వద్దకు స్పేస్క్రాఫ్ట్లను పంపాలంటే దశాబ్దాలు పడుతుంది. వందల కోట్ల కిలోమీటర్ల దూరంలోఉన్న వాటి వద్దకు స్పేస్క్రాఫ్ట్లు త్వరగా వెళ్లాలంటే అత్యంత వేగం అవసరం. ఈ క్రమంలోనే ‘ఒబెర్త్ మన్యువర్’ సాంకేతికతపై దృష్టిపెట్టారు. అత్యంత వేడిని తట్టుకునేలా స్పేస్క్రాఫ్ట్కు హీట్షీల్డ్ అమర్చి సూర్యుడికి దగ్గరగా పంపుతారు. ఆ స్పేస్క్రాఫ్ట్ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ.. ఆ వేడిని ఇంధనంగా ఉపయోగించుకుంటూ,సూర్యుడి గురుత్వాకర్షణశక్తి సాయంతో విపరీతమైన వేగం పుంజుకుంటుంది. ఆ వేగంతో సౌర కుటుంబం అవతలివైపు ప్రయాణిస్తుంది. ఉదాహరణకు వడిసెలో రాయిపెట్టి తిప్పి విసిరినట్టు అనుకోవచ్చు. సాధారణ స్పేస్క్రాఫ్ట్లు 20 ఏళ్లలో ప్రయాణించే దూరాన్ని.. ‘ఒబెర్త్ మన్యువర్’తో కొద్ది నెలల్లోనే చేరుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శుక్రుడి గుట్టు తేల్చేందుకు.. మన భూమిని పోలి ఉన్నా.. వందల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో భగభగ మండుతూ ఉండే గ్రహం శుక్రుడు. దానిపై ఒకప్పుడు జీవం ఉండేదని శాస్త్రవేత్తల అంచనా. ప్రస్తుతం క్లిష్టమైన వాతావరణంతో నిండి ఉన్న శుక్రుడి గుట్టును పరిశోధించేందుకు ‘బ్రీజ్’ స్పేస్క్రాఫ్ట్ను తయారు చేయనున్నారు. సముద్రాల్లో ఉండే స్టింగ్రేల తరహాలో డిజైన్ చేశారు. గాలి నింపినప్పుడు బెలూన్ ఉబ్బినట్టుగా.. చిన్నప్రోబ్ నుంచి విమానం ఆకారంలో ఈ స్పేస్క్రాఫ్ట్ రూపొందుతుంది. మార్స్పై గుహల్లో పరిశోధనకు.. అంగారక గ్రహంపై వందల కోట్ల ఏళ్లపాటు నీళ్లు పారినట్టుగా ఆధారాలున్నాయి. అంటే జీవం కూడా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ నేపథ్యంలో మార్స్పై ఉన్న గుహల లోపలికి వెళ్లి.. పరిశోధించేందుకు ‘ది రీచ్బోట్’ను రూపొందిస్తున్నారు. -
సినిమా సైంటిస్ట్ లు
-
శాస్త్రవేత్తల కృషితోనే కరోనాపై విజయం
లాలాపేట (హైదరాబాద్): మన శాస్త్రవేత్తలు కనుగొన్న వ్యాక్సిన్ కారణంగానే కరోనాపై భారత్ విజయం సాధించగలిగిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ విషయంలో శాస్త్రవేత్తల కృషి ఎంతో గొప్పదని, అధికారులు, ప్రజల సహకారం కూడా దీనికి తోడైందని పేర్కొన్నారు. తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్)లో 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు, ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న సైన్స్ వారోత్సవాల కార్యక్రమంలో శనివారం కిషన్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కోసం 150 దేశాలు ఎదురు చూస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలో 170 కోట్ల డోస్ల వ్యాక్సిన్ను ఉచితంగా పంపిణీ చేసినట్లు వివరించారు. కరోనా కాలంలో దేశంలో పదివేల స్టార్టప్ కంపెనీలు ప్రారంభమైనట్లు తెలిపారు. శాస్త్రజ్ఞులు, మేధావుల కృషివల్ల నేడు మనదేశం వ్యాక్సిన్, పీపీఈ కిట్లను ఎగుమతి చేయగలుగుతోందన్నారు. కాగా, ఉక్రెయిన్లో ఉన్న భారతీయులందరినీ సురక్షితంగా మన దేశానికి తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత మాట్లాడుతూ.. దేశంలో పోషకాహార లోపాలను అధిగమించేందుకు ఎన్ఐఎన్ చేస్తున్న పరిశోధనలను వివరించారు. తర్వాత కిషన్రెడ్డి ఎన్ఐఎన్లో సైన్స్ ప్రదర్శనను తిలకించారు. -
నిజం... నిజం... డార్వినిజం
ఈ భూమి మీద మానవునితో సహా సకల జీవజాతులూ యథాతథంగా సృష్టించబడ్డాయనీ సంప్రదాయంగా ఉన్న వాదనలను సవాలు చేశాడు డార్విన్. ఆయన ప్రవచించిన జీవపరిణామ సిద్ధాంతం సైన్సుకు నూతన దృక్కోణాన్ని ప్రసాదించింది. ఆయన వాదనలను వ్యతిరేకించేవాళ్లు అప్పుడే కాదు, ఇప్పుడూ ఉన్నారు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి?’ అని ప్రశ్నించే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది. కానీ నిరూపిత సత్యాలను విశ్వాసాలు ఎదుర్కోలేవు. ఆఖరికి గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది? పాలిచ్చే జంతువులైన పంది, మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా! వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్ని పెంచుతూనే ఉంది. సమస్త చరాచర జగత్తు భగవంతుని సృష్టి అని ప్రబలంగా విశ్వసిస్తున్న కాలంలో ఒక వినూత్న ఆలోచనకు బీజం వేసినవాడు బ్రిటన్కు చెందిన ప్రకృతి, జీవ, భూగర్భ శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ (1809–1882). జీవ జాతుల పుట్టుకపై 1859వ సంవత్సరంలో డార్విన్ రాసిన ‘జాతుల ఆవి ర్భావం’ (ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్) ఒక సత్యాన్ని ఆవిష్కరించింది. ఆ సత్యమే ‘పరిణామం’. అప్పట్లో అదొక సంచలనం. ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ భూమిపై నెలకొన్న అనంత జీవవైవిధ్యం పరిణామ ఫలితమని చాటాడు డార్విన్. మనం చూస్తున్న జీవులు, వాటి పూర్వీకుల నుండి పరిణామం చెంది భిన్న రూపాలను సంతరించుకున్నవే. తద్వారా నాటి వాతా వరణ పరిస్థితులను తట్టుకొని పరిణతి చెందటం జరిగింది. ఆ క్రమంలో సమర్థవంతంగా అనుకూలనం (అడాప్టేషన్) చెందినవి బతికి బట్ట కట్టాయనీ, తట్టుకోలేనివి నశించాయనీ చెప్పాడు. అలా నిలబడిన జీవులను ప్రకృతి ప్రోత్సహిస్తుందనీ, ఎంపిక చేస్తుందనీ సూత్రీకరించాడు. అదే డార్విన్ ప్రకృతివరణ సిద్ధాంతం (నేచురల్ సెలక్షన్ థియరీ)గా ప్రసిద్ధి చెందింది. ఇదేదో ఊహాజనిత వాదం కాదు. విస్తృత పరిశీలన, అధ్యయనం దీనికి మూలం. డార్విన్ చరిత్రాత్మక నావ ప్రయాణం ‘హెచ్.ఎం.ఎస్. బీగిల్’లో 1831లో మొదలైంది. 1836 వరకు ఐదేళ్లపాటు కొన సాగింది. ఆ నావ ప్రయాణంలో చూసిన అబ్బురపరిచే జీవ వైవిధ్యం, డార్విన్ మదిలో కొత్త ఆలోచనలకు తెర తీసింది. జీవజాతులు ఎందుకు భిన్నత్వాన్ని చూపుతాయి? వాటి మధ్య ఉన్న సంబంధానికి కారణమేమిటన్న ప్రశ్నలు, వాటికి జవాబుల శోధనలో డార్విన్ లెక్కకు మిక్కిలి సాక్ష్యాలను సేకరించాడు. పురాతన జీవులకు చెందిన శిలాజాలనెన్నింటినో సేకరించి భద్రపరిచాడు. డార్విన్ పరిశోధనకు పసిఫిక్ మహాసముద్రంలోని గెలాపాగోస్ దీవుల(ఈక్వెడార్) సందర్శన ఎంతో మేలు చేసింది. రాకాసి తాబేళ్ళు ఒక దీవి నుండి మరొక దీవికి విభిన్నంగా ఉన్నాయి. అక్కడి పక్షుల ముక్కు... ఆకారంలో, నిర్మాణంలో విశిష్ట అనుకూలనాన్ని ప్రదర్శిం చింది. గడ్డి మైదానాల్లో నివసించే జంతువులు సైతం విభిన్నత కన బరిచాయి. అర్జెంటీనాలో ఉండే జంతువులకూ, ఆస్ట్రేలియా గడ్డి మైదాన ఆవరణ వ్యవస్థలో జీవించే జీవులకూ మధ్య పోలికే లేదు. ఇవేవీ ఐరోపా జంతువులను పోలి లేవు. ఈ వైవిధ్యం జీవ పరిణామ సిద్ధాంతానికి ఒక శాస్త్రీయ ప్రాతిపదికనిచ్చింది. అదే సమయంలో తన దేశానికే చెందిన ప్రకృతి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ మలే సియాలో చేసిన క్షేత్రస్థాయి పరిశోధనలు కూడ జీవులు పరిణామం ద్వారానే ఆవిర్భవించాయనే భావనకు బలం చేకూర్చాయి. వాలెస్ అధ్యయనం దాదాపు రెండు దశాబ్దాల డార్విన్ ఊగిసలాటకు తెరదిం చింది. నిర్ణయం తీసుకోవడాన్ని వేగిరపరిచింది. ఎట్టకేలకు తన సిద్ధాంతాన్ని ‘జాతుల ఆవిర్భావం’గా ప్రతిపాదించాడు. జీవులు సృష్టి కాదనీ, పరిణామ క్రమంలో ఏర్పడ్డాయనీ, జీవుల మధ్య పరస్పర సంబంధం ఉన్నదనీ పరిణామ సిద్ధాంతం వెల్లడిం చింది. జీవ ప్రపంచం అంతా యథాతథ సృష్టి అనే సృష్టివాదానికి జీవ పరిణామ సిద్ధాంతం పెను సవాల్ విసిరింది. వేళ్ళూనుకుని ఉన్న మత విశ్వాసాన్ని కాదని సైన్సును అగ్ర భాగాన నిలిపింది. దీనిలో డార్విన్ సిద్ధాంతంపై పలు కోణాల నుండి విమర్శలు వచ్చాయి. జీవ పరిణామ శాస్త్రవేత్తలు హేళనకూ, కవ్వింపులకూ గురయ్యారు. థామస్ హక్సలే వంటి ఎందరో జీవశాస్త్రవేత్తలు సృష్టివాదుల విమర్శ లకు దీటుగా సమాధానం చెప్పారు. తొలినాళ్లలో డార్విన్ సిద్ధాంతం విమర్శలను ఎదుర్కోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ నేడు 21వ శతాబ్దిలో సైతం పరిణామ సిద్ధాంతంపై దాడులు ఆగటం లేదు. ‘కోతి నుండి మనుషులొస్తే ఇంకా కోతులెందుకున్నాయి? కోతి నుండి మనిషి రావడాన్ని చూడలే’ దనే రాజకీయ తరగతి ఒకటి బయలుదేరింది. నిజాన్ని చూడటం, సత్యాన్ని గ్రహించటం కొందరి వల్ల కాదు. ముఖ్యంగా సత్యాన్ని చూడ టానికి ఇష్టపడని వాళ్లకు. దాచేస్తేనో, దాడి చేస్తేనో కనుమరుగయ్యేది కాదు సత్యం. రుజువులు చూపి సత్యాన్ని నిరూపించేదే సైన్సు. అందుకే జీవ పరిణామ సిద్ధాంతం ప్రపంచ ఆలోచనా విధానాన్ని మార్చి వేసింది. భౌగోళిక విస్తరణ, విభిన్న జీవుల్లో కనిపించే ఏకరూప శరీర నిర్మాణాలు, పిండదశలో జీవులు చూపించే సారూప్యత, శిలాజ నిదర్శనాలు డార్విన్ సిద్ధాంతానికి బలం చేకూర్చాయి. డార్విన్ తరు వాతి కాలంలో అభివృద్ధి చెందిన సైన్సు సైతం జీవ పరిణామ సిద్ధాంతానికి మెరుగులు దిద్దటం విశేషం. వివిధ ప్రాంతాల తవ్వ కాల్లో దొరికిన పురాతన శిలాజాలు పూర్వీకుల లింకులను బయట పెట్టాయి. చేపల నుండి మనుషుల వరకు పిండాలన్నీ ఆరంభంలో ఒకే రకంగా ఉండటం జీవుల మధ్య సంబంధానికి గొప్ప రుజువు. వాతావరణ పరిస్థితులకు ‘అనుకూలనం’ చెందటాన్ని పరిణా మంలో కీలకంగా డార్విన్ భావిస్తే, మెండల్ పరిశోధనలు జీవుల లక్ష ణాలు ఒక తరం నుండి మరో తరానికి ఎలా బదిలీ అవుతాయో చూపించాడు. ఆ అనువంశిక లక్షణాలే జీవులు ‘అనుకూలనం’ చెంద టంలో కీలక పాత్ర పోషిస్తాయని బలమైన రుజువులు చూపాడు. జీవుల్లో మార్పులకు ‘ఉత్పరివర్తనాలు’ (మ్యుటేషన్స్) కారణమని చెప్పాడు. మెండల్ కాలానికి కూడా ఉత్పరివర్తనం చెందేవాటి భౌతిక రూపం తెలియదు. అందుకే మెండల్ వాటిని ‘కారకాలు’గా పేర్కొ న్నాడు. ఆధునిక జీవశాస్త్రం, ముఖ్యంగా జన్యుపదార్థం–డీఎన్ఏ ఆవి ష్కరణ తర్వాత వీటి వెనుక దాగిఉన్న రహస్యం ‘జన్యువులు’ (జీన్స్) అని తేల్చింది. నాటి నుండి నేటి వరకు వెలుగు చూస్తున్న నూతన సమాచారం డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత ఔన్నత్యాన్నీ, సత్యాన్నీ ఆవిష్కరిస్తూనే ఉంది. గత నెలలో పంది గుండెను మనిషికి అమర్చారన్న వార్త ఏం సూచిస్తున్నది? పాలిచ్చే జంతువులైన పంది, మనిషి మధ్య ఒక సజీవ సంబంధం ఉందనేగా! కోతుల నుండి మనుషులు వచ్చారని డార్విన్ ఎక్కడా చెప్పలేదు. కోతులు, కొండముచ్చులు, చింపాంజీల వంటి జాతులకూ, మానవ జాతికీ మధ్య దగ్గరి పోలికలున్నాయనీ, ఇవన్నీ ఒకే మూలం నుండి వచ్చాయనీ, చింపాంజీల డీఎన్ఏ మనుషుల డీఎన్ఏతో 98.8 శాతం పోలి ఉంటుందనీ 2005లో వెలువరించిన చింపాంజీ జీనోమ్ చెబుతున్నది. సూక్ష్మజీవి నుండి మనిషి వరకూ అన్ని రకాల జీవులు ఒకేవిధమైన జీవన క్రియలను చూపుతాయి. అన్నింటిలో శ్వాసక్రియ ఒకే రకం. అన్ని జంతువులూ ఆక్సిజన్ తీసు కుని కార్బన్ డయాక్సైడ్ను వదులుతాయి. ప్రొటీన్లు, డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, జీవాణువులు జీవజాతులన్నింటిలో ఒకే రకమైన పదా ర్థాలతో నిర్మితమై ఉంటాయి. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి? జీవుల మధ్య పరస్పర సంబంధం ఉందనే కదా! పరిణామం చెందటం ద్వారానే శాఖోపశాఖలుగా విస్తరించాయని కదా! జీవ పరిణామ సిద్ధాంతం ఒక సైన్సు. కానీ ఎప్పటికీ ఇలాగే ఉంటుందనీ, ఉండాలనీ కోరుకునే వాళ్లకూ... ప్రతిదీ మార్పు చెందు తుందనీ, మార్పు సహజమనీ, ప్రపంచ గమనానికి మార్పు ఇరుసూ అని నమ్మేవాళ్లకూ మధ్య నాటి నుండి నేటి వరకూ ఘర్షణ జరుగు తూనే ఉంది. ‘‘ప్రస్తుతం పాతకొత్తల మధ్య, సత్యాసత్యాల మధ్య పోరాటం జరుగుతున్నది. బుద్ధిమంతులైనవారు ఏ పక్షంలో చేరాలో, అంతిమ విజయం ఎవ్వరిదో చెప్పనక్కర్లేదు. ఈ సంగ్రామం సుదీ ర్ఘంగా సాగవచ్చు. తీవ్రంగా ఉండవచ్చు. అయితే జ్ఞానం అజ్ఞానాన్ని, సత్యం అసత్యాన్ని తప్పక జయిస్తాయి’’ అన్న కందుకూరి వీరేశలింగం మాటలు నేటికీ, ఏనాటికీ కూడా అక్షర సత్యాలే.జీవ పరిణామ సిద్ధాంతం సత్యశోధకుల చేతుల్లో ఒక ఆయుధం వంటిది. ఫిబ్రవరి 12 అంతర్జాతీయ డార్విన్ దినోత్సవ సందర్భంగా సైన్సు ప్రేమికులు, శాస్త్ర ప్రచార కార్యకర్తలు సామాజిక మార్పు కోసం యువతలో హేతుబద్ధ ఆలోచనా బీజాలు నాటాలి. వ్యాసకర్త జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఉపాధ్యక్షుడు మొబైల్: 94900 98918 -
కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ.2.. స్పందించిన డబ్ల్యూహెచ్ఓ
లండన్: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతునే ఉంది. మరొవైపు ఒమిక్రాన్ కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్ పలు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్వో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజా అధ్యయనాల ప్రకారం.. బీఏ.2 వేరియంట్ ఇప్పటికే.. 57 దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కన్నా.. రెట్టింపు వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్వో తెలిపింది. కాగా, ఈ వేరియంట్ పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. చాలా తక్కువ సమయంలో పలుదేశాల్లో విస్తరించిందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన తాజా నమునాలలో.. అనేక కొత్త వేరియంట్లు కనుగొనబడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా.. బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్లు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో బీఏ.2 సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని తెలిపారు. కొత్త వేరియంట్ ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకొనే సామర్థ్యం కల్గి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఏ.1, బీఏ.1.1 వేరియంట్లను గుర్తించామని, గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్కి 96 శాతం.. ఓమిక్రాన్ వేరియంట్ను పోలి ఉందని పరిశోధకులు వెల్లడించారు. బీఏ.2 వేరియంట్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్వో పరిశోధకుల్లో ఒకరైన వాన్ కెర్ఖోవ్ బీఏ.2 వేరియంట్పై స్పందిచారు. దీనిపై సమాచారం పరిమితంగా ఉందని తెలిపారు. బీఏ.1 కంటె కూడా.. బీఏ.2 అధిక వ్యాప్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం డెల్లా వేరియంట్.. మునుపటి కరోనా కంటె.. తక్కువ తీవ్రత కల్గి ఉందని అన్నారు. ప్రస్తుతం కరోన ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని వాన్ కెర్ఖోవ్ చెప్పుకొచ్చారు. చదవండిః సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు? -
ఒమిక్రాన్కు ఉప వేరియెంట్!.. బీఏ.2గా నామకరణం
లండన్/జెనీవా: ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్కు ఉప వేరియంట్ పుట్టుకొచ్చినట్లు డెన్మార్క్లోని స్టాటెన్స్ సీరం ఇనిస్టిట్యూట్(ఎస్ఎస్ఐ)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది అసలైన ఒమిక్రాన్ రకం వైరస్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. సబ్ వేరియంట్ను బీఏ.2గా పరిగణిస్తున్నారు. ఒమిక్రాన్కు బీఏ.1గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. బీఏ.2, బీఏ.1లలో ఏది అధికంగా వ్యాప్తి చెందుతోందన్న అంశాన్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. బీఏ.2 వ్యాప్తి వేగం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మెడ్ఆర్ఎక్స్ఐవీ అనే వెబ్సైట్లో ఈ అధ్యయన ఫలితాలను పోస్టు చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం బీఏ.2 సబ్ వేరియంట్కు సహజంగానే సంక్రమించిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని పేర్కొంటున్నారు. అంటే ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని చెప్పొచ్చు. బీఏ.2 వ్యాప్తి రేటు 39 శాతం, బీఏ.1 వ్యాప్తి రేటు 29 శాతంగా ఉందని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ఎస్ఎస్ఐ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకొంటే వైరస్ నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే తీసుకున్నవారిలో బీఏ.1, బీఏ.2 వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కాబట్టి టీకా తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని చెప్పారు. ఎస్ఎస్ఐ అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హగన్, స్టాటిస్టిక్స్ డెన్మార్క్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు. వైద్య వ్యర్థాలతో మానవాళికి పెనుముప్పు కోవిడ్–19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచమంతా పెద్ద యుద్ధమే చేస్తోంది. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్లు, ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు నిత్యావసరాలుగా మారిపోయాయి. నిత్యం లక్షలాది మాస్కులు, గ్లౌజ్లు అమ్ముడుపోతున్నాయి. అంతిమంగా ఇవన్నీ చెత్త కిందకే చేరుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఉపయోగిస్తున్న సిరంజీల గురించి చెప్పాల్సిన పనిలేదు. వ్యాక్సినేషన్ కోసం ఒకసారి వాడి పారేసే సిరంజీలే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వైద్య వ్యర్థాల (హెల్త్కేర్ వేస్ట్) గుట్టలుగా పేరుకుపోతున్నారని, వీటితో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. లెక్కలేనంతగా పోగుపడుతున్న వైద్య వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి సైతం ప్రమాదమేనని మంగళవారం వెల్లడించింది. ఈ పరిస్థితిలో త్వరగా మార్పు రాకపోతే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం నడుం కట్టాలని పిలుపునిచ్చింది. మాస్కులు, గ్లౌజ్లు, పీపీఈ కిట్లు, సిరంజీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా శాస్త్రీయంగా నిర్మూలించాలని సూచించింది. వ్యర్థాల నిర్మూలన విధానాలను మెరుగుపర్చడంపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరింది. ప్రజలు అవసరానికి మించి మాస్కులు, గ్లౌజ్లు, పీపీఈ కిట్లు ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ మార్గరెట్ మాంట్గోమెరీ చెప్పారు. దీనికి స్వస్తి పలకాలని అన్నారు. కరోనా రక్షణ పరికరాల తయారీ విషయంలో పర్యావరణ హిత, పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ మెటీరియల్కు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ అన్నె వూల్రిడ్జ్ తెలిపారు. -
దేశమే ఆయన కార్యక్షేత్రం
వైజ్ఞానికరంగంలో ఖ్యాతిగాంచిన ప్రొఫెసర్ రాధాకృష్ణ (ఆర్కే) 80 ఏళ్ళ వయసులో జనవరి 21న హైదరాబాదులో మరణించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్లో ఉత్తీర్ణులైన తొలితరం విద్యార్థుల్లో ఆయన ఒకరు. బీఏఆర్సీ (బార్క్)లో పరిశోధనలు చేస్తున్న క్రమంలో 1970కి ముందే కంప్యూటర్ రంగంలో ప్రవేశించారు. కశ్మీర్, శ్రీనగర్, చండీగఢ్లలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లలో ప్రొఫెసర్గా పనిచేసారు. అలహాబాద్ ఐఐటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడికి 20 మంది దాకా నోబెల్ బహుమతి గ్రహీతలను ఆహ్వా నించి ‘సైన్సు సదస్సు’లను ఏడెని మిదేళ్ల పాటు నిర్వహించిన బృందంలో ఆర్కే కీలక పాత్ర వహించారు. ఆ నోబెల్ సైంటిస్టులు వారం రోజులపాటు క్యాంపస్ లోనే ఉండి ఉపన్యాసాలు, చర్చల్లో పాల్గొనే వారు. దేశ మంతటి నుంచీ సైన్సులో బోధన – పరిశోధనల పట్ల అసక్తి కల వెయ్యిమంది విద్యార్థులు, టీచర్లు ఆహ్వానితులుగా ఆ వారం రోజులూ అక్కడే ఉండే వీలు కల్పిం చిన విశిష్ట కార్యక్రమం అది. అందులో 200 మంది స్కూల్ ఫైనల్ స్థాయి విద్యార్థులూ ఉండే వారు. ఈ కార్యక్రమ ప్రధాన రూపకర్త ఆర్కే. ఆయన దేశభక్తి కేవలం నినాదప్రాయం కాదు. ప్రొఫెసర్గా ఎందరో విద్యార్థులను సైంటిస్టులుగా తయారుచేసి దేశానికి అందించిన ఆచరణశీలి ఆయన. సైన్సు విద్యను ప్రోత్సహించటానికి జీవితాన్ని అంకితం చేశారు. దశాబ్దాల క్రితమే ఎమ్ఐటీ (అమెరికా)లో ఆయన చేసిన కృషి ప్రశంసలందుకున్నది. 70 దేశాల ఉన్నత విద్యాలయాల్లో సైన్సు కార్యక్రమాల నిర్వహణలో పని చేసిన రాధాకృష్ణ ప్రధాన కార్య క్షేత్రం మాత్రం మన దేశమే. ఆయా దేశాల్లో 16 అంతర్జాతీయ వైజ్ఞానిక సదస్సులు నిర్వహిం చినా, విదేశాల్లో పని చేయటానికి ఆయన ఇష్టపడలేదు. దేశంలోని ఎంటెక్, పిహెచ్డీ వంటి కోర్సులకు, ట్రిపుల్ ఐటీ స్థాయి విద్యాసంస్థలకు కావల్సిన పాఠ్యాంశాలను రూపొందించటం; రక్షణ శాఖలో, విద్యారంగంలో సాంకేతిక సలహా దారుగా పని చేయడం, విద్యా వాతావర ణాన్ని, శాస్త్రీయ çస్పృహను పెంపొందిం చడం వంటి ఎన్నో రకాలుగా దేశానికి విశిష్ట సేవలను అందించారు. – మరింగంటి శ్రీరామ, రిటైర్డ్ సీజీఎం, సింగరేణి ‘ 94922 05310 -
జన్యుమార్పులతోనే గుండెజబ్బుల ముప్పు?
సాక్షి, హైదరాబాద్: చిన్న వయసులోనివారు, రోజూ వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్న వాళ్లు కూడా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలడం గురించి మనం వింటుంటాం. విన్న ప్రతిసారీ మన మెదళ్లలో మెదిలే ఓ ప్రశ్న.. ఎందుకలా? అని! హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల అంచనా ప్రకారం పాశ్చాత్యదేశాల వారితో పోలిస్తే మన దేశ జనాభాలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు ప్రధాన కారణం మన జన్యువుల్లో ఉండే ప్రత్యేకమైన మార్పులే! గుండె కండరాల అంతర నిర్మాణాన్ని మార్చేసే కార్డియో మయోపతి ఉంటే.. ఉన్నట్టుండి గుండె పనిచేయడం ఆగిపోయే అవకాశాలు ఎక్కువవుతాయి. సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ ఈ కార్డియో మయోపతికి గల కారణాలను అన్వేషించేందుకు పరిశోధనలు చేపట్టారు. బీటా మయోసిన్ హెవీఛెయిన్ జన్యువు (–ఎంవైహెచ్7)లోని కొన్ని వినూత్నమైన జన్యుమార్పుల వల్ల భారతీయుల్లో అధికులకు డైలేటెడ్ కార్డియో మయోపతి వస్తున్నట్లు గుర్తించారు. కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఈ తాజా పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. మారిన అమైనోయాసిడ్లు ప్రపంచవ్యాప్తంగానూ ఈ ఎంవైహెచ్7కు, గుండెజబ్బులకు సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే నిరూపణ అయ్యింది. అయితే భారతీయ కార్డియో మయోపతి రోగులపై ఇందుకు సంబంధించిన జన్యు పరిశోధనలు ఏవీ జరగలేదని డాక్టర్ తంగరాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము దాదాపు 137 మంది డైలేటెడ్ కార్డియో మయోపతి రోగులను ఎంపిక చేసుకుని వారిలోని ఎంవైహెచ్7 జన్యువు తాలూకు క్రమాన్ని నమోదు చేశామని, వీరితోపాటు ఇంకో 167 మంది ఆరోగ్యకరమైన వారిలోనూ ఈ జన్యుక్రమాన్ని నమోదు చేసి పోల్చి చూశామని వివరించారు. ‘సుమారు 27 తేడాలు, ఏడు మార్పులు వినూత్నంగా కనిపించాయి. భారతీయ డైలేటెడ్ కార్డియో మయోపతి రోగుల్లో మాత్రమే ఇవి కనిపించాయి. జన్యుమార్పుల్లో ప్రొటీన్లో తప్పుడు అమైనోయాసిడ్లు ఉండే మిస్సెన్స్ మ్యుటేషన్స్ నాలుగు ఉన్నాయి. ఈ నాలుగూ ఎంవైహెచ్7 జన్యువులో యుగాలుగా కొనసాగుతూ వచ్చిన అమైనోయాసిడ్లను మార్చేశాయి. మారిపోయిన అమైనోయాసిడ్లు వ్యాధులకు కారణమవుతాయని బయో ఇన్ఫర్మేటిక్స్ ద్వారా తెలిసింది’అని వివరించారు. గుండెజబ్బులతో బాధపడుతున్న వారికి జన్యుమార్పిడి టెక్నాలజీల ద్వారా రక్షణ కల్పించేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. -
సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త
బరువైన వస్తువు, తేలికైన వస్తువు కన్నా వేగంగా కిందకి పడుతుందని అరిస్టాటిల్ (క్రీ.పూ. 384–332) భావిం చాడు. అది నిజమేనని నమ్ముతూ సాగింది యావత్తు ప్రపంచం సుమారు 20 శతాబ్దాల పాటు! దీన్ని కొందరు విభేదించినా, అరిస్టాటిల్ ప్రతిష్ఠ కారణంగా ఆ అభిప్రాయం చలామణి అవుతూ వచ్చింది – గెలీలియో రంగ ప్రవేశం దాకా! ఇటలీ లోని వాలిన పీసా గోపురం నుంచి వేర్వేరు బరువులున్న వస్తువులను పడవేసి, అరిస్టాటిల్ చెప్పిన భావన తప్పు అని రుజువు చేశాడు గెలీలియో గెలీలి. ఈ వృత్తాంతం జరిగిందనే ఆధారాలు లేకపోయినా – విరివిగా నేటికీ గిరికీలు కొడుతోంది. గెలీలియోతో ఆధునిక విజ్ఞానం మొదలైందని పరిగణిస్తూ క్రీ.శ. 1550ను ప్రారంభంగా సూచిస్తాం. ఆయనను ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా పరిగ ణించాలని ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి వారు పేర్కొంటారు. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలియగానే ఆరునెలల్లో టెలిస్కోపు నిర్మించుకున్నారు గెలీలియో. దీనితో పాలపుంత విషయాలు, జూపిటర్ గ్రహానికుండే చంద్రుళ్ళు, శని గ్రహపు వలయాలు– ఇలా చాలా సంగతులు చూపించి సైన్స్ ఏమిటో వివరించిన తొలి ప్రాయోజిక శాస్త్రవేత్త. తన టెలిస్కోపును తనే తయారుచేసుకున్న ఇంజనీరు కూడా! వైద్యుడు కావాలనుకున్నా గణితం మీద ఇష్టంతో గణితాచార్యుడై ప్రకృతి నియమాలు గణితాత్మకమని ప్రతిపాదించారు. సూర్యుడు, చంద్రుడు మొదలైనవి భూమి చుట్టూ తిరుగుతున్నాయనే నమ్మకం పుస్తకాలలో చేరి మతభావనలలో అంతర్భాగమైంది. కోపర్నికస్ (1473–1543) దీన్ని కాదని సూర్యుని చుట్టూ మిగతా గ్రహాలు తిరుగుతున్నాయనే ‘సూర్య కేంద్రక సిద్ధాంతం’ ప్రతిపాదించి, విశ్వాసాలతో ఇబ్బందులు పడి, అలాగే మరణించాడు. కానీ గెలీలియో టెలిస్కోపుతో ఏది ఏమిటో విప్పిచూపాడు. భూకేంద్రక సిద్ధాంతం కంటే సూర్యకేంద్రక సిద్ధాంతం అర్థవంతమని వివరించాడు. ఫలితంగా అది మత పెద్దలకు కంటగింపుగా మారింది. అయినా పట్టు వదలక ఈ విషయాలను నాటకంగా రాసి, మరింతగా జనాల్లోకి తీసుకెళ్లిన సృజనశీలి గెలీలియో. ఈ సాహసగుణమే ఉద్యోగానికి ఎసరుపెట్టింది. చివరికి గృహఖైదులో కనుమూసేలా చేసింది. గెలీలియో ప్రతిపాదనను గుర్తించినట్టు 1992 అక్టోబర్ 31న వాటికన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్థిరపడిన విషయాన్ని ప్రశ్నించే తత్వాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న గెలీలియోకు కవిత్వం, సంగీతం, కళా విమర్శ అంటే కూడా ఆసక్తికరమైన అంశాలు. నిజానికి అప్పటికి మతం, ఫిలాసఫీ, సైన్స్ మూడూ ఒకటే అనే తీరులో సాగేవి. ఈయన గొప్పతనం ఏమిటంటే – మతం నుంచి సైన్సును వేరుచేశాడు. తర్వాత ఫిలాసఫీ నుంచి సైన్సును వింగడించి పరిపుష్టం చేశాడు. గెలీలియో చేసిన మరో గొప్ప పని ఏమిటంటే – గణితాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టడం. గణితం రాకతో విజ్ఞాన శాస్త్రానికి కచ్చితత్వం ఒనగూడింది. ఆయన ఎంత సూక్ష్మగ్రాహి అంటే – చర్చిలో ఊగే దీపాన్ని పరిశీలించి – వేగం తగ్గినా, కదిలే దూరం మారినా, చలనానికి పట్టే వ్యవధి మారదని గుర్తించారు. ఎలా సాధ్యమైందిది? నాడిని కొలిచి ఈ విషయం చెప్పారు. పరోక్షంగా ‘పల్సో మీటర్’ భావనను ఆయన ఇచ్చారు. 1564 ఫిబ్రవరి 15న జన్మించిన గెలీలియో 1642 జనవరి 8న కనుమూశారు. అదే సంవత్సరంలో ఐజాక్ న్యూటన్ జన్మించడం విశేషం! విశ్వాసాలను పరీక్షకు పెట్టడమే కాదు, పరిశీలనతో తనను తాను సవరించుకునే సైన్స్ టెంపర్ కలిగిన గొప్ప సాహసి అయిన శాస్త్రవేత్త గెలీలియో గెలీలి. - డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి పూర్వ సంచాలకులు -
ప్రకృతి సేద్యమే వెలుగు బాట
ప్రకృతి వ్యవసాయ బాటన నడుస్తున్న రైతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వమూ ఈ బాటకు వచ్చింది. పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. సుభాష్ పాలేకర్ రంగంలోకి వచ్చాక ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రం ఆదేశాలతో, ఇన్నాళ్లూ రసాయనిక సేద్యంపైనే దృష్టి పెట్టిన భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అనుబంధ సంస్థలన్నీ.. ఇప్పుడు ప్రకృతి సేద్యాన్ని చేపడుతున్నాయి. వ్యవసాయ కోర్సుల్లో ప్రకృతి సేద్య పాఠ్య ప్రణాళిక రచనకు సైతం పీజేటీఎస్ఏయూ వీసీ డా. ప్రవీణ్రావు సారధ్యంలో శాస్త్రవేత్తల కమిటీ ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో పలువురు వ్యవసాయ రంగ ప్రముఖుల అభిప్రాయాలు.. ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం.. కమిటీలో ప్రకృతి వ్యవసాయదారులకూ చోటివ్వాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. రసాయనిక వ్యవసాయం సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించడంతోపాటు భూతాపోన్నతి సమస్యకు కూడా ఇది సరైన పరిష్కారం. అయితే, వ్యవసాయ విద్య కోసం సిలబస్ తయారు చేయడానికి ప్రకృతి వ్యవసాయంలో బొత్తిగా అనుభవం లేని విద్యావేత్తలతోనే కమిటీ వేయటం సరికాదు. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా రైతులే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. రైతు సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇది ప్రజా ఉద్యమం. దీనికి నాయకత్వం వహిస్తున్న వారికి ఈ కమిటీలో భాగస్వామ్యం ఉండాలి. ఫ్రాన్స్, జర్మనీ, డెన్మార్క్, సెనెగల్, క్యూబా వంటి దేశాల్లో ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో డా. పాలేకర్, డా. నమ్మాళ్వార్, దీపక్ సచ్దే, భాస్కర్ సావే, సుభాష్ శర్మ, చింతల వెంకటరెడ్డి, భరత్ మనసట, కపిల్ షా.. ఆస్ట్రేలియాకు చెందిన డా. వాల్టర్ యన వంటి వారెందరో శాస్త్ర విజ్ఞానాన్ని సంప్రదాయ విజ్ఞానంతో మేళవించి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై విశేష కృషి చేశారు.. చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వెనుక సార్వత్రికమైన సైన్స్ ఉంది. ప్రిన్సిపుల్స్ ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. సాగు పద్ధతులే ప్రాంతాన్ని బట్టి వైవిధ్యపూరితంగా ఉంటాయి. పాఠ్యప్రణాళిక తయారు చేసే కమిటీలో ప్రకృతి వ్యవసాయంలో కృషి చేస్తున్న రైతులు, రైతు సంస్థలతోపాటు ఆం.ప్ర., హిమాచల్ప్రదేశ్ వంటి ప్రభుత్వాల ప్రతినిధులకూ చోటు ఉండాలి. – టి. విజయకుమార్ ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రకృతి సేద్య విభాగం, ఏపీ వ్యవసాయ శాఖ, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ, గుంటూరు vjthallam@gmail.com మహిళా సంఘాల పాత్ర కీలకం ఇది వ్యవసాయ పరిశోధన, విద్యా రంగాల్లో ఐసిఎఆర్ అనుబంధ సంస్థలు కేంద్ర ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకొని ముందుకు సాగినా.. ప్రకృతి వ్యవసాయం విస్తరణ వీళ్ల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.. ప్రకృతి వ్యవసాయం ఆచరణ ఇప్పటికే ముందుకు వెళ్లింది. దీని వెనకాల సైన్స్ను అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతోంది. పర్వాలేదు. విస్తరణ ముఖ్యంగా రైతు నుంచి రైతుకు, మహిళా రైతుల నుంచి మహిళా రైతులకు ఎలా ముందుకు పట్టుకెళ్లాలి అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఏపీసిఎన్ఎఫ్ ప్రభుత్వ కార్యక్రమంలో ఆచరించి, సత్ఫలితాలను చూపటం జరుగుతోంది. ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తే మంచిదని మా అభిప్రాయం. అదేవిధంగా, ప్రకృతి వ్యవసాయం ముందరికి వెళ్లాలీ అంటే.. ఒక్కొ క్క రైతుతోటి వ్యక్తిగతంగా పనిచేయ వలసి వచ్చిన పాత నమూనా ప్రకారం కాకుండా.. క్షేత్ర స్థాయి సామాజిక సంస్థల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు పట్టుకెళ్లాలి. ఏపీలో కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ ప్రభుత్వ కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఇలాంటి కృషి జరుగుతోంది. ఇదే మాదిరి మహిళా సంఘాల వ్యవస్థను రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్లో దేశమంతా రకరకాల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గతంలోనే నెలకొల్పటం జరిగింది. కాబట్టి, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలంటే.. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలపైనే ఆధారపడకుండా.. కమ్యూనిటీ సంస్థలను ముఖ్యంగా క్షేత్ర స్థాయి మహిళా సంఘాలను ఆధారం చేసుకొని కృషి చేయాలి. వేరే రాష్ట్రాల్లో కూడా అందరి రైతులకూ ప్రకృతి వ్యవసాయాన్ని అలవాటు చేయాలంటే ఏపీలో మాదిరిగా చేయాలి. – కవిత కురుగంటి సమన్వయకర్త, అలియన్స్ ఫర్ సస్టయినబుల్ అండ్ హోలిస్టిక్ అగ్రికల్చర్ (ఆషా), బెంగళూరు kavitakuruganti@gmail.com సేంద్రియ నిపుణులకూ కమిటీలో చోటివ్వాలి మంచి ప్రయత్నం. అనేక సంవత్సరాలుగా వ్యవసాయ విద్యలో మార్పు తేవటానికి మేము, ఇంకా చాలా మంది ప్రయత్నాలు చేసినా భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి అడ్డుపడుతూ వస్తోంది. ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా కూడా ఈ ప్రయత్నం చేసినా ఫలితం లేక పోయింది. ఇప్పుడు ఒక ప్రయత్నం చేయటానికి కమిటీ వేయటం అభినందించాల్సిన విషయం. అయితే, ఈ కమిటీలో చాలా మంది ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల పైన పనిచేసిన వాళ్ళు కాదు.. దాంతో ఫలితం ఎంత అన్నది అనుమానమే. అలాగే కేవలం వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచే కాకుండా, సేంద్రియ వ్యవసాయం పైన పనిచేస్తున్న ఇతరులను కూడా ఈ కమిటీ సభ్యులుగా నియమిస్తే బావుంటుంది. – డా. జీ వీ రామాంజనేయులు స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ ramoo@csaindia.org ప్రభుత్వ నిర్ణయం ఆనందదాయకం వ్యవసాయానికి సంబంధించిన వివిధ ప్రభుత్వ సంస్థలు ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసి, పరిశోధనా ఫలితాలను ప్రజలకు అందజేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆనందదాయకం. సేంద్రియ వ్యవసాయంపై ఎం.ఎస్.సి. కోర్సు చేయదలచిన విద్యార్థులకు పాఠ్య ప్రణాళికను ఐ.సి.ఎ.ఆర్. ఇప్పటికే తయారు చేసింది. డిసెంబర్ 3న కేంద్ర వ్యవసాయ మంత్రి దీన్ని విడుదల చేశారు. సమగ్ర వ్యవసాయం, సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం – ఇటువంటి పలు రకాల పేర్లతో ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారు. ఒక్కొ క్క అడుగూ ముందుకు వేయడమే సరైన యోజన అవుతుంది. విధానాలు వేరైనా, రసాయనాలు వేయని పంటలు మంచివి అనేది మొదట అడుగు. ఒక్కొక్క విధానంపై పరిశోధనా ఫలితాలు అందిన తర్వాత మరొక అడుగు ముందుకు వేయవచ్చు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అధ్యక్షతన నియామకమైన కమిటీ ఈ విషయమై పరిశోధన జరిపి, ఆచరణయోగ్యమైన ఒక కార్యక్రమ రూపాన్ని (రోడ్ మ్యాప్ను) ఇవ్వగలదని ఆశిద్దాం. – పి. వేణుగోపాల్రెడ్డి చైర్మన్, ఏకలవ్య ఫౌండేషన్, హైదరాబాద్ pvg@ekalavya.net సేంద్రియ, ప్రకృతి సేద్యంపై రైతులకు శిక్షణ వెంకటరామన్నగూడెంలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సేంద్రియ సాగు వ్యవసాయ విధానాలను వివిధ ఉద్యాన పంటల్లో పరిశీలించి స్థిరీకరించాం. ‘ఉద్యాన పంటల్లో సేంద్రియ వ్యవసాయం’ పేరుతో 3 నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభానికి పాఠ్య ప్రణాళికను, నియమ నిబంధనలను సిద్ధం చేశాం. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు సేంద్రియ సాగు విధానాలపై 25 రోజుల శిక్షణ నిర్వహించాం. ‘ఉద్యాన పంటలలో సేంద్రియ సాగు విధానాలు’ పుస్తకాన్ని కూడా రైతులకు అందుబాటులో ఉంచాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు కె.వి.కె.ల ద్వారా వివిధ పంటల్లో సేంద్రియ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి నిర్వహించి సాగు పద్ధతులను నిర్వచించి, తగు రీతిన ప్రచారం చేసేలా నెలవారీ ప్రణాళికలను రూపొందిస్తున్నాం. ప్రతి కె.వి.కె.లో ఒక ఎకరం ప్రదర్శన క్షేత్రంలో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేసి.. రైతులకు, విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించబోతున్నాం. వివిధ జిల్లాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం జరిగే క్షేత్రాలను శాస్త్రవేత్తలు సందర్శిస్తున్నారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణకు, సలహాల కోసం విశ్వవిద్యాలయ పరిధిలోని పరిశోధనా స్థానాలు, కె.వి.కె.లను రైతులు సంప్రదించవచ్చు. – డా. టి. జానకిరామ్ ఉప కులపతి, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం vc@drysrhu.edu.in వ్యవసాయ అనుబంధ రంగాలకూ వర్తింపజేయాలి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, విద్యారంగంలో కూడా ఇందుకు అనుగుణంగా మార్పు తేవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం సరైన దిశగా ముందడుగు. హరిత విప్లవ ప్రారంభం అయినప్పటి నుంచి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, సాగు నీటిని విచక్షణారహితంగా వాడి భూసారాన్ని క్షీణింపజేసుకున్నాం. భూసారాన్ని పెంపొందించుకోవడానికి ఇప్పటికైనా సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించడం ప్రారంభించాలి. వివిధ పంటలు, ఉద్యాన తోటలు, పశుపోషణ, చేపలు, రొయ్యల సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గించటం ద్వారా ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని ప్రజలకు అందించడం ఇప్పటి అవసరం. ఖర్చు తగ్గించుకొని, ఆదాయాన్ని పెంచుకోవాలి. పంటల మార్పిడి ద్వారా, ప్రకృతి సేద్యం ద్వారా నాణ్యమైన, పోషకాల సాంద్రతతో కూడిన వైవిధ్యపూరితమైన సమతుల ఆహారాన్ని ప్రజలకు అందించటం సాధ్యమవుతుంది. – డా. విలాస్ కె తొనపి సంచాలకులు, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ director.millets@icar.gov.in ప్రయోగాల ఫలితాలను రైతులకు అందిస్తాం మా విశ్వవిద్యాలయ పరిశోధనా క్షేత్రంతో పాటు రైతుల క్షేత్రాల్లో సమగ్ర ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించి వివిధ పంటలపై పరిశోధనాత్మక సాగును సమదృష్టితో చేపడతాం. ఆ క్షేత్రాల్లో గడించే అనుభవాల ఆధారంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం. – డా. ఎ. విష్ణువర్ధన్రెడ్డి ఉప కులపతి, ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు vicechancellor@angrau.ac.in -
తెనాలి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డు
తెనాలి: గ్రేటర్ నొయిడాలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఆర్ అండ్ డీ) డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న తెనాలి శాస్త్రవేత్త డాక్టర్ తోట చిరంజీవి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ పీకాక్ ఎకో ఇన్నోవేషన్–2021 అవార్డు అందుకున్నారు. రిఫైనరీలో వెలువడే వ్యర్థాలను విలువైన మెటీరియల్గా మార్చే, పర్యావరణ సమస్యలను పరిష్కరించే భారత్ జీఎస్సార్ క్యాట్ అనే ఉత్ప్రేరకాన్ని డాక్టర్ చిరంజీవి, ఆయన బృందం అభివృద్ధి చేసింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య నేతృత్వంలోని అవార్డుల జ్యూరీ సిఫార్సుల ఆధారంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) ఈ అవార్డును అందజేసింది. వీరు అభివృద్ధి చేసిన గ్యాసోలిన్ సల్ఫర్ తగ్గింపు ఉత్ప్రేరకం (భారత్ జీఎస్సార్ కాట్) ప్రయోగశాలలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలతో భారతదేశంలో తొలిసారిగా చేసిన ఒక ప్రత్యేకమైన ఉత్పత్తి. దీనిని భారీస్థాయిలో ఉత్పత్తి చేసి, భారతీయ రిఫైనరీల్లో విజయవంతంగా ఉపయోగిస్తున్నారు. భారత్ జీఎస్సార్ కాట్కు పలు జాతీయ, అంతర్జాతీయ పేటెంట్లు లభించాయి. న్యూఢిల్లీలో వర్చువల్ విధానంలో ఈ అవార్డు ప్రకటించి, శుక్రవారం తనకు పంపినట్టు డాక్టర్ చిరంజీవి శనివారం వెల్లడించారు. -
కరోనా సోకిన ఎలుక కరవడంతో సైంటిస్టుకు పాజిటివ్
దాదాపు రెండేళ్ల నుంచి కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తోంది. కోట్లాది మంది కోవిడ్ భారిన పడగా.. లక్షలాది మంది ఈ మహమ్మారి బలితీసుకుంది. కరోనా తగ్గుముఖం పడతుందనుకున్న ప్రతీసారి మరో కొత్త రూపం దాల్చి మళ్లీ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వేరియంట్లలో ఆల్ఫా, బీటాలు పెద్దగా ప్రభావం చూపకపోయినా ఆ తరువాత వచ్చిన డెల్లా వేరియంట్ మాత్రం ప్రజలను ముప్పు తిప్పలు పెట్టింది. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచ దేశాలకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 57 దేశాలకు పాకింది. కరోనా మహమ్మారి ఇప్పటి వరకూ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలుసు. అలాగే కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా, అతని వాడిన వస్తువులు వేరే వారు తాకిన కోవిడ్ వ్యాపిస్తుందని తెలుసు. అయితే తాజాగా ఎలుక కరిచినా కరోనా సోకుతున్నట్లు తేలింది. తైవాన్లోని అత్యంత కట్టుదిట్టమైన బయో-సేఫ్టీ ల్యాబరేటరీలోని ఓ సైంటిస్ట్కు ఎలుక కరవడంతో కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తైవాన్లోని టాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అకాడెమియా సినికా అనే జన్యుక్రమ విశ్లేషణ సంస్థలో పనిచేస్తున్న 20 ఏళ్ల మహిళకు వైరస్ సోకినట్లు తేలిందని అక్కడి ఆరోగ్య మంత్రి చెన్ షిహ్-చుంగ్ బ్రీఫింగ్ తెలిపారు. చదవండి:: కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం..బాతులు, కోళ్లను చంపేయండి! కాగా ఆమె ఈ మధ్యకాలంలో ఎక్కడికీ ప్రయాణం చేయలేదని, మోడర్నా ఎంఆర్ఎన్ఏ రెండు డోసుల వ్యాక్సిన్ ను కూడా సైంటిస్ట్ తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక గత నెల రోజులుగా ద్వీప దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. చివరి సారిగా నవంబర్ 5న పాజిటివ్ నమోదైంది. తాజాగా ఎలుక కరవడంతో తొలి కేసు నమోదైంది. సైంటిస్ట్కు పాటివ్గా తేలడంతో ఆమెతో సన్నిహితంగా మెలిగిన 100 మందిని క్వారంటైన్లో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఎలుక కరవడం వల్లే కరోనా సోకింది అనేది ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఎలుక కారణంగానే వైరస్ వ్యాపించిందో లేదో తెలుసుకోవడానికి మరింత పరిశోధన జరుగుతంద ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మహిళకు డెల్టా వేరియంట్ సోకిందని అధికారులు భావిస్తున్నారు. కాగా, అకాడమికా సినికాలో జంతువుల్లోని వివిధ వ్యాధి కారక క్రిములను బయటకు తీసి పరిశోధనలను చేస్తుంటారు. టీకా పనితీరు, వాటి ప్రభావం వంటి వాటిని తెలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సైంటిస్ట్కు ఎలుక కరిచిందని అధికారులు చెబుతున్నారు. చదవండి: ఒమిక్రాన్ అలజడి: భారత్లో మరో మూడు కేసులు.. -
మరేం భయం లేదు.. ‘ఒమిక్రాన్’ అంత ప్రమాదకరం కాదు: యూకే శాస్త్రవేత్త
లండన్: ఒమిక్రాన్ అందరూ ఊహిస్తున్నంత ప్రమాదకరమైనది కాదని యూకే శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. కోవిడ్వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఈ వేరియెంట్ నుంచి రక్షణ పొందే అవకాశాలున్నాయని బ్రిటన్ ప్రభుత్వానికి కరోనాపై సలహాలు ఇచ్చే మైక్రోబయోలాజిస్ట్ ప్రొఫెసర్ కేలమ్ సెంపుల్ వెల్లడించారు. ఈ కొత్త వేరియెంట్తో తలనొప్పి, జలుబు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు వంటివి వస్తాయే తప్ప ఆస్పత్రిలో చేరే అవకాశాలు, మరణాలు సంభవించడం వంటివి జరిగే అవకాశం తక్కువేనన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి, గతంలో కరోనా సోకడం వల్ల ఇమ్యూనిటీ వచ్చిన వారికి ఒమిక్రాన్ వేరియెంట్ నుంచి ముప్పు ఉండదని సెంపుల్ అభిప్రాయపడ్డారు. స్వల్ప లక్షణాలే: దక్షిణాఫ్రికా ఒమిక్రాన్తో లక్షణాలు స్వల్పంగా∙బయటపడుతున్నాయని దక్షిణాఫ్రికా మెడికల్అసోసియేషన్ చైర్పర్సన్ ఏంజిలిక్యూ కాట్జీ చెప్పారు. ప్రస్తుతానికి కోవిడ్ రోగుల్ని ఇంట్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. దగ్గు, కండరాల నొప్పులు, అలసట తప్ప అంతకు మించి లక్షణాలేవీ ఈ కొత్త వేరియెంట్ ద్వారా బయటపడలేదని ఆమె చెప్పారు. ‘ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తోంది. కేసులు అత్యధికంగానే బయట పడుతున్నాయి. అయితే ఆస్పత్రులపై భారం పడడం లేదు. 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, వ్యాక్సిన్ తీసుకోని వారే ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇంతవరకు ఈ వేరియెంట్ సోకలేదు. ఎంత ప్రమాదకరమో సంపూర్ణ అవగాహన రావాలంటే మరో 15 రోజులు పడుతుంది’ అని వివరించారు.