సంక్రాంతి తర్వాత విద్యుత్ వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కమ్) కొత్త విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీన విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సమర్పించ నున్నాయి. రెండు డిస్కమ్లకు కలిపి రూ.7,122 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు పేర్కొన్నాయి.