అనంతపురంలో రసాభాసగా 'జన్మభూమి' | protests-mark-new-round-of-janmabhoomi-in-anantapur-district | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 4 2014 12:53 PM | Last Updated on Thu, Mar 21 2024 5:24 PM

అనంతపురంలో జన్మభూమి-మీ ఊరు కార్యక్రమం శనివారం రసాభాసగా మారింది. టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు ఇస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై ఈ కార్యక్రమానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని వృద్ధులు, వికలాంగులు నిలదీశారు.మరోవైపు గార్లపెంటలో జన్మభూమి-మీ ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అధికారులను వృద్ధులు, వితంతులు అడ్డుకున్నారు. అర్హులైన తమను జాబితా నుంచి ఎందుకు తొలగించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement