జిల్లాలోని నందికొట్కూరు ఆర్టీసీ బస్టాండ్లో ఓ దొంగ బస్సు చోరీకి యత్నించాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బస్సును పట్టుకోవడానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ రమణను ఆదొంగ బస్సుతో ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.