నోట్లమార్పిడి కోసం వచ్చినవారిపై దాడికి పాల్పడి, వారి వద్ద డబ్బు కాజేసిన మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్సై ఆనంద్గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో నలుగురిని కూడా అరెస్టు చేసినట్లు స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎస్సై ఆనంద్గౌడ్, మరికొందరు ఈ నెల 12న రాత్రి కాళ్లకల్ గ్రామ శివారులో నోట్ల మార్పిడి కోసం వచ్చిన ముఠా సభ్యులను బెదిరించి, వారి నుంచి డబ్బు కాజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Published Sun, Dec 18 2016 12:01 PM | Last Updated on Thu, Mar 21 2024 6:13 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement