తిరుమలలో శ్రీవారి దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావుకు శనివారం అలిపిరి వద్ద సమైక్య సెగ తగిలింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సమైక్యవాదులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు పెద్ద పెట్టున్న నినాదాలు చేశారు. అయితే సమైక్యవాదులు వీహెచ్ ప్రయాణిస్తున్న కారువైపునకు దూసుకువెళ్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి సమైక్యవాదుల ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. దాంతో సమైక్యవాదులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తు వీహెచ్ కారుపైకి చెప్పులు విసిరారు. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు భారీ భద్రత నడుమ వీహెచ్ను రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.
Published Sat, Aug 17 2013 2:01 PM | Last Updated on Thu, Mar 21 2024 8:40 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement