alipiri
-
కూటమి కుట్రల నుంచి ఏడుకొండల్ని రక్షించుకుందాం (ఫొటోలు)
-
తిరుమలపై కూటమి కుట్రలు.. భగ్గుమన్న హిందూ సంఘాలు
తిరుపతి/అమరావతి, సాక్షి: ఆధ్యాత్మిక నగరాన్ని పర్యాటకం పేరిట నాశనం చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. అలిపిరిలో తిరుమల తిరుపతి దేవస్థాన భవనం ఎదుట ముంతాజ్ హోటల్కు స్థలం కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయవి. ఈ చర్యను ఖండిస్తూ.. హిందూ సంఘాలు, స్వామీజీలు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. టీటీడీ పాలక మండలి సమావేశం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసినా.. కూటమి ప్రభుత్వం మాత్రం స్థలాన్ని కేటాయించింది. అయితే.. ముంతాజ్ హోటల్కు కేటాయించిన స్థలం వెనక్కి తీసుకోవాలంటూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి నేతృత్వంలో పలువురు స్వామీజీలు ఆమరణ నిరాహార దీక్ష దిగారు. తిరుమల ఏడుకొండలు రక్షించుకుందామంటూ నినాదంతో దీక్ష చేపట్టారాయన. ఈ క్రమంలో.. తిరుమలను ప్రక్షాళన చేస్తానన్న చంద్రబాబు, సనాతన ధర్మం అంటూ గగ్గోలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎక్కడ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వాళ్లకు పలు ప్రశ్నలు సంధిస్తూ.. ఫోటోలతో ప్రదర్శన చేపట్టారు.గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 👉🏼 ఏడుకొండల్ని రక్షించుకుందాంకూటమి సర్కార్కు హిందూ సంఘాల ప్రశ్నిలివే.. సనాతన ధర్మ రక్షణ వీరుడు, సూరుడు, ధీరుడు.. పవన్కల్యాణ్ ఎక్కడ?వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల దివ్య క్షేత్రానికి గుండు కొట్టడమా? పవన్ కల్యాణ్ గారు..వారాహి డిక్లరేషన్ అంటే.. తిరుమల ఏడు కొండలను నాశనం చేయడమా? పవన్ కల్యాణ్ గారు..వారాహి డిక్లరేషన్ అంటే తిరుమల ఏడు కొండలలో ముంతాజ్ హోటల్ నిర్మించడమా పవన్ కల్యాణ్ గారు?సీజ్ ద ముంతాజ్ హోటల్ ఎప్పుడు పవన్ కల్యాణ్?తిరుమల ఏడు కొండలకు వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీ నాయకులుతిరుమల ప్రక్షాళన అంటే తిరుమలను అపవిత్రం చేయడమా? చంద్రబాబు నాయుడు గారుతిరుమల ప్రక్షాళన అంటే.. ముంతాజ్ హోటల్ నిర్మించడమా? చంద్రబాబు నాయుడు గారుశేషాద్రి పర్వతం అంచున అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడమా?ఏడు కొండలను పాడు చేయడమేనా? ప్రక్షాళన అంటే.. -
అలిపిరి టోల్ గేట్ దగ్గర పుష్ప-2 సాంగ్కు యువతి రీల్..
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రతీ రోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు.. అయితే, కొందరు భక్తులు చేసే పిచ్చి చేష్టలు మిగతా భక్తులకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.. అయితే, తిరుమలలో ఫొటో షూట్లు, రీల్స్ చేయడం.. లాంటివి నిషేధించినా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఎన్నిసార్లు హెచ్చరించినా.కొందరు భక్తులు, యూట్యూబర్లు తీరు మార్చుకోవడం లేదు.. లైక్ ల కోసం పవిత్రమైన చోట ఐటమ్ సాంగ్కు రీల్స్ చేస్తూ.. వెగటు పుట్టిస్తున్నారు.. తాజాగా, అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప 2 మూవీలోని ‘కిస్సిక్’ సాంగ్కు డాన్స్ చేసింది ఓ యువతి.. అలిపిరి టోలేట్ ముందు డాన్స్ చేసిన ఆ వీడియోను యువతి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడంతో.ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.ఆ వీడియోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, గతంలోను కోండపై సినీ నటి నయనతార ఫొటో షూట్, దర్శనం క్యూ లైన్లో చెన్నై యువకులు రీల్స్ చేయడం.. మొన్న అలిపిరి మెట్ల వద్ద పులి అంటూ బిగ్ బాస్ ఫేమ్ యువతి రీల్ చేయడం.. ఇలా.. వరుస ఘటనలు జరుగుతుండడంపై భక్తులు మండిపడుతున్నారు.. pic.twitter.com/PLmEypMVys— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసేందుకు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, విషయం తెలుసుకున్న యువతి.. శ్రీవారి భక్తులు తనను క్షమించాలంటూ మరో వీడియో విడుదల చేయడం గమనార్హం. https://t.co/DrCk8b8lOm pic.twitter.com/eYdYE9U2RZ— Telugu Scribe (@TeluguScribe) December 4, 2024 -
తిరుమల ప్రాంక్ వీడియోపై స్పందించిన ప్రియాంక, శివ
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) -
భక్తులతో కిటకిటలాడిన అలిపిరి (ఫొటోలు)
-
టీటీడీ ఈవో లేఖ.. ఎట్టకేలకు స్పందించిన పురావస్తుశాఖ
సాక్షి, తిరుపతి: అలిపిరి పాదాల మండపం శిథిలావస్థలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండపం వెనుకభాగం కూలిపోయింది. దీంతో ఇనుప రాడ్లుతో మండపానికి సపోర్ట్ ఇచ్చి తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు,.. కానీ ఏ సమయంలో కూలిపోతుందో తెలియని ఈ మండపం ద్వారా భక్తులకు ప్రాణహాని ఉందని.. టీటీడీ ఈ మండపాన్ని పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకోగా.. దీనిపై రాజకీయ రంగు పులిమి మండప నిర్మాణాన్ని అడ్డుకున్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి రాసిన లేఖపై ఎట్టకేలకు పురావస్తుశాఖ స్పందించింది. ఢిల్లీ ఎఎస్ఏ నుంచి పురావస్తు బృందాన్ని పంపారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం అలిపిరి పాదాల మండపాన్ని పరిశీలించారు. బెంగుళూరు నుంచి జి.శ్రీనివాసులు, చెన్నై నుంచి ఏ. సత్యం, హైదరాబాద్ నుంచి కే.కృష్ణ చైతన్య బృందం మరిన్ని పురాతన మండపాలను పరిశీలించనున్నారు. శిథిలావస్థలో ఉన్న పాదాల మండపం మరమ్మత్తుపై ఆర్కియాలజీ బృందం నివేదిక సమర్పించనున్నారు. -
అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: అలిపిరి మండపాల పునఃనిర్మాణంపై రాజకీయాలు చేస్తున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పాదాల మండపం ఆర్కియాలజీ పరిధిలో లేదన్నారు. ఎప్పుడైనా కూలే పరిస్థితి ఉందని.. అందుకే ఆర్కియాలజీ సంస్థకు లేఖ రాశామని ఈవో పేర్కొన్నారు. అనేకమార్లు ఆర్కియాలజీ సంప్రదింపు చేసిన స్పందించలేదు. అలిపిరి పాదాల మండపం కూడా శిథిలావస్థలో ఉన్నా.. వాటిపై రాజకీయాలు చేస్తూ, భక్తులు ప్రాణాలతో ఆడుకుంటున్నారు. టీటీడీ వద్ద శిల్పకళా, ఆలయాల నిర్మాణం సంబంధించిన అన్ని వింగ్స్ ఉన్నాయని ధర్మారెడ్డి తెలిపారు. డిసెంబరు 23 నుంచి జనవరి 1 తేదీతో వైకుంఠ ద్వార దర్శనం ముగిసిందని ఈవో అన్నారు. 6,47,452 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో 40.20 కోట్ల ఆదాయం కానుకలుగా సమర్పించారు. గత ఏడాది రూ. 39.40 కోట్లు, 2022లో రూ.26.61 కోట్ల ఆదాయం వచ్చింది. 10 రోజుల్లో 35.60 లక్షల లడ్డూలు భక్తులకు అందించామని ఈవో వెల్లడించారు. -
తిరుమలకు స్టార్ హీరోయిన్.. కాలి నడకన కొండపైకి!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె తిరుమల చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి అలిపిరి కాలిబాట మార్గం నడిచి వెళ్లారు. సామాన్య భక్తులతో కలిసి దాదాపు ముడున్నర గంట పాటు నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. నడక మార్గంలో దీపికా పదుకుణేతో భక్తులు సెల్పీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. అనంతరం తిరుమలలోని రాధేయం అతిధి గృహం చేరుకున్నా దీపికా పదుకుణే.. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయమే స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొననున్నారు. అనంతరం విఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.. -
తిరుమల అలిపిరి మార్గంలో మరో చిరుత
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ చిక్కింది. చిన్నారి అక్షితపై దాడి చేసి చంపిన స్థలంలోనే చిరుత సంచరించినట్లు తెలుస్తోంది. శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత పేరుతో నాలుగు చిరుతలను అధికారులు బంధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో చిరుత సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు. -
తిరుమలకు ప్రత్యేక బృందాలు.. కొనసాగుతున్న చిరుతల వేట
సాక్షి, తిరుమల: ఇటీవల తిరుమల నడకమార్గంలో బాలిక లక్షిత.. చిరుత దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ భక్తుల భద్రతపై అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తిరుమలలో చిరుతల వేట కొనసాగుతోంది. కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. తిరుమలకు నడకదారిలో జంతువుల సంచారం కోసం 500 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటుచేస్తోంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చారు. అంతేకాకుండా నడకదారిలో అదనపు ఎల్ఈడీ లైటను అధికారులు ఏర్పాటుచేశారు. ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం ఎన్ని గంటలంటే? -
తిరుమల మెట్ల మార్గంలో ఎలుగుబంటి సంచారం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి మెట్ల నడకదారిలో ఎలుగుబండి సంచరించింది. 2వేల మెట్టదగ్గర సోమవారం ఉదయం భక్తులకు ఎలుగుబండి కనిపించింది. కాగా, ఎలుగు బండి సంచారంతో భక్తులు భయాందోళను గురవుతున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఇటీవల ఓ బాలిపై దాడి చేసిన చిరుత బోనులో చిక్కిన విషయం తెలిసిందే. తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అనంతరం, చిరుతను అధికారులు జూకు తరలించారు. ఇది కూడా చదవండి: చిరుత కడుపులో మానవ మాంస ఆనవాళ్లు తెలియాలి: డీఎఫ్ఓ శ్రీనివాసులు -
టీటీడీ కీలక నిర్ణయం.. నడక మార్గంలో ఆంక్షలు ఇవే..
సాక్షి, తిరుమల: చిరుత దాడి నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నడక మార్గాల్లో చిన్నారుల భద్రతపై టీటీడీ దృష్టి సారించింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు టీటీడీ అనుమతి ఇవ్వనున్నట్టు పేర్కొంది. వివరాల ప్రకారం.. ఇటీవల తిరుమలకు నడకదారిలో ఓ చిన్నారిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలిపిరి నడకమార్గం, శ్రీవారి మెట్లమార్గంలో టీటీడీ ఆంక్షలు విధించింది. రేపటి(సోమవారం) నుంచి మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్ని తర్వాతే చిన్నారులను పూర్తి స్థాయిలో నడకమార్గంలో అనుమతించనున్నట్టు టీటీడీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండవ ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల తర్వాత బైక్లకు నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. మరోవైపు.. తిరుమలలో చిరుత కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి లక్షిత పై దాడిచేసిన చిరుత పట్టుకోవడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మూడు ప్రాంతాలలో బోన్లు ఏర్పాటు చేసిన అధికారులు.. చిరుత సంచారంపై నిఘా వేశారు. ఇందుకోసం పోలీసు బృందాలు ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి. చిరుత జాడను కనిపెట్టడానికి దాదాపు 500 కెమెరాలను ఏర్పాటు చేశారు. చిరుత భయంతో నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతోంది టీటీడీ అధికారులు. ఇది కూడా చదవండి: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన -
మేమేమి చేశాము పాపం?
బుడిబుడి అడుగులు వేస్తూ.. కేరింతలు కొడుతూ.. అందర్నీ దాటుకుంటూ.. ఒక్కో మెట్టూ ఎక్కుతున్న కుమార్తెను చూసి ఉప్పొంగిపోయారు. ఆ గోవిందుడిని స్మరిస్తూ.. ముందు వెళ్తున్న కుమార్తెను గమనిస్తూ.. ముందుకు సాగారు. ఇంతలో బాలిక హఠాత్తుగా అదృశ్యమవ్వడంతో తల్లిదండ్రులు ఒకింత గందరగోళానికి లోనయ్యారు. ఎక్కడుందోనన్న ఆత్రుతతో చీకటిని చీల్చుకుంటూ వెతుకులాడడం ప్రారంభించారు. నిశీధిలో రెప్ప వాల్చకుండా ఎక్కడో ఒకచోట సురక్షితంగా ఉంటుందని ఎదురుచూశారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. వన్యమృగాల దాడిలో చిన్నారి మృతిచెందిందని తెలిసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మా ఇంటి మహాలక్ష్మిని తీసుకెళ్లావా..దేవుడా! అంటూ గుండెలవిసేలా రోదించారు. అక్క ఎక్కడుందమ్మా..? అంటూ తమ్ముడు అడిగే మాటలకు ఆ తల్లి జవాబు చెప్పలేక కన్నీరుమున్నీరవుతూ విలపించడం అక్కడి వారిని కలిచివేసింది. ఈ విషాద ఘటన రుయా ఆస్పత్రి వద్ద శనివారం కనిపించింది. సాక్షి, తిరుపతి: తిరుమల అలిపిరి నడక మార్గంలో శుక్రవారం రాత్రి ఘోరం చోటుచేసుకుంది. వన్యమృగం దాడిలో ఆరేళ్ల బాలిక మృతిచెందడం అందరినీ కలిచివేసింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, కోవూరు మండలం, పోతిరెడ్డిపాళెంకు చెందిన దినేష్కుమార్, శిశికళ కుమార్తె లక్షిత(6) శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది జల్లెడ పట్టారు. శనివారం తెల్లవారు జాము నుంచి మరోమారు గాలింపు చేపట్టగా.. అలిపిరి నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయానికి వంద నుంచి 200 మీటర్ల దూరంలో ఓ బండరాయిపై లక్షిత మృతదేహం లభ్యమైంది. క్రూరం..ఘోరం చిన్నారి లక్షితను వన్యమృగాలు అతికిరాతకంగా హతమార్చినట్టు తెలుస్తోంది. మెడ, తల భాగాన్ని.. కుడి కాలు తొడ భాగంలోని కండను పూర్తిగా తినేయడంతో భయానకంగా మారింది. చిన్నారి మృతదేహాన్ని ఉదయం 7.55 గంటలకు తిరుపతి రుయా ఆస్పత్రి తీసుకొచ్చారు. 15 నిమిషాల పాటు డాక్టర్లు పరిశీలించి శవపరీక్ష కోసం మార్చురీకి తరలించారు. ఎస్వీ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగ వైద్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఉదయం 11.05 గంటలకు పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు టీటీడీ అంబులెన్స్ సిద్ధం చేసింది. కొంప ముంచిన బెలూన్! సీసీ ఫుటేజ్ పరిశీలించిన అధికారులు చిన్నారి హుందాగా.. వేగంగా ఆడుకుంటూ తల్లిదండ్రులకంటే ముందే మెట్లెక్కడం కనిపిచింది. ఈ క్రమంలో ఆంజనేయస్వామి విగ్రహం తర్వాత ఓ దుకాణం వద్ద బిస్కెట్ ప్యాకెట్ను కొనిచ్చారు. వాటిని తింటూ చిన్నారి ముందుకు సాగింది. నరసింహస్వామి ఆలయ సమీపంలో చిన్నారి కనిపించకుండా పోయింది. బెలూన్తో ఆడుకుంటున్న సమయంలో గాలికి ఆ బెలూన్ మెట్లమార్గం దాటి వెళ్లడం.. దానికోసం పరుగులు తీసేక్రమంలో ఆ పరిసర ప్రాంతాల్లో చెట్ల మాటున దాగి ఉన్న క్రూరమృగం పాపను ఎత్తుకెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. రుయాలో మిన్నంటిన ఆర్తనాదాలు రుయా మార్చురీ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చిన్నారి మృతదేహాన్ని చూసి భోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న నా బిడ్డ దక్కకుండా పోయిందంటూ తల్లి శశికళ గుండెలు బాదుకుంటూ రోదించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నారి నానమ్మ మనుమరాలితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ దేవుడా..! ఇంత శిక్షవేశావేంటయా... అంటూ విలపించడం కలిచివేసింది. అక్క ఎక్కడమ్మా?..అంటూ తమ్ముడు లిఖిత్ అడుగుతుండడంతో తల్లి సమాధానం చెప్పలేక.. ఇంకెక్కడ అక్క నాయనా! దేవుడు తీసుకెళ్లి పోయాడురా అంటూ.. కన్నీరుమున్నీరైంది. మా ఇంటి మహాలక్ష్మి ఇక లేదన్న విషయాన్ని ఎలా జీర్ణించుకోవాలంటూ తల బాదుకుంటూ విలపించడం చూపరులను కంటతడి పెట్టించింది. దాడి చేసింది చిరుతేనా? వన్యమృగం చిన్నారి శరీరాన్ని చిన్నాభిన్నం చేసింది. చూడడానికి వీలుకాని రీతిలో మృతదేహం పడిఉండడం.. చూస్తే చిరుతా..లేక ఎలుగుబంటా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించలేకపోతున్నారు. మరికొందరు రేసుకుక్కల పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఒక నిర్ణయానికి రాగలమని అధికారులు చెబుతున్నారు. అయితే చిరుతదాడేనని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వరరావు, డీఎఫ్ఓ సతీష్కుమార్ పరిశీలించారు. దాడిచేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎలుగుబంటు అయితే మత్తుద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధించనున్నట్లు వెల్లడించారు. జంతువుల కదిలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తామన్నారు. ఏడో మైలురాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్గా ప్రకటించారు. ఘటనా స్థలాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి పరిశీలించారు. చిన్నారి మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ సంఘటనా స్థలాన్ని ఎస్పీ పరమేశ్వరరెడ్డి పరిశీలించారు. బాలికను వన్యమృగాలు దారుణంగా చంపడం బాధాకరమన్నారు. భక్తులందరూ గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. -
TTD: తిరుమల నడకమార్గంలో హైఅలర్ట్ జోన్ ప్రకటన
సాక్షి, తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో తిరుమల నడక మార్గంలో హై అలర్ట్ జోన్ను ప్రకటించింది. భక్తులకు భద్రతా సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరి చేసింది టీటీడీ. తిరమలకు వచ్చే భక్తుల భద్రతపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ ప్రకటించింది. అక్కడ 100 మంది భక్తుల గుంపుని మాత్రమే అనుమాతించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. భక్తులకు ముందువైపు, వెనుకవైపు రోప్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు పైలట్గా సెక్యూరిటీ సిబ్బందిని నియమించనున్నారు. 7వ మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు. మరోవైపు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నడకమార్గంలో ప్రతీ 40 అడుగులకు సెక్యూరిటీ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. టీటీడీ నుంచి రూ.5లక్షలు, అటవీ శాఖ నుంచి రూ.5లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, బాలికపై చిరుత దాడి ప్రాంతాన్ని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ.. నడకదారి భక్తులకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. చిరుత కోసం అటవీశాఖ అధికారులు నడకదారిలో మూడు బోన్లు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. ఇది కూడా చదవండి: అయ్యా పవనూ.. ఊహించలే.. మరీ ఇంత ఘోరంగా దిగజారాలా? -
గోవిందనామ స్మరణలతో మారుమోగిన పాదాల మండపం (ఫొటోలు)
-
అలిపిరిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
అలిపిరి బస్ డిపోకు మొదటి దశలో 50 ఎలక్ట్రిక్ బస్ లు
-
వామ్మో పాము.. అలిపిరి నడక మార్గంలో కలకలం
తిరుమల: అలిపిరి నడక మార్గంలోని నరసింహస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం ఆరు అడుగుల పొడవైన నాగుపాము కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. ఎన్ఎస్ ఆలయానికి సమీపంలో నాగుపామును చూసిన స్థానిక సిబ్బంది... టీటీడీ అటవీ విభాగం ఉద్యోగి భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన వచ్చి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ పామును అటవీప్రాంతంలో విడిచిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ‘బర్డ్’లో ఉచితంగా గ్రహణం మొర్రి ఆపరేషన్లు తిరుపతి తుడా: గ్రహణం మొర్రితో బాధపడుతున్న పేద పిల్లలకు తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న బర్డ్ ఆస్పత్రిలో ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తామని ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్పరెడ్డి శుక్రవారం తెలిపారు. శస్త్రచికిత్సల కోసం ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలో పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అపాయింట్మెంట్, ఇతర వివరాల కోసం 7337318107 నంబరులో సంప్రదించాలని సూచించారు. (క్లిక్: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!) -
పే..ద్ద నాగుపాముతో టీటీడీ ఉద్యోగి
తిరుమల : అలిపిరి – తిరుమల నడకమార్గంలో శుక్రవారం నాగుపాము కలకలం రేపింది. టీటీడీ అటవీ ఉద్యో గి భాస్కర్ నాయుడు తెలిపిన వివరాలు.. అలిపిరి మెట్లదారిలోని 3400 మెట్టు వద్ద ఓ పే..ద్ద నాగుపాము వచ్చినట్లు భక్తులు చెప్పడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బుసలు కొడుతున్న ఆ పామును చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారికోనలో వదిలేశారు. -
జూన్ 1 నుంచి అలిపిరి కాలినడక మార్గం మూత
తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గంలో పైకప్పు పునర్నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు జూన్ 1 నుంచి జూలై 31వ తేదీ వరకు ఆ మార్గాన్ని మూసివేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. అయితే, కాలినడకన తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లాలని కోరింది. ఇందుకోసం అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సుల ద్వారా భక్తులను తరలించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది. సుందరకాండ పారాయణం ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సుందరకాండ 58వ సర్గలో గల 167 శ్లోకాలను వేద పండితులు అఖండ పారాయణం చేశారు. చదవండి: పంపా క్షేత్రమే హనుమంతుని జన్మస్థలం శరణ్య.. నువ్వు డాక్టర్ కావాలమ్మా! -
గుప్తనిధుల కోసం భారీ సొరంగం
సాక్షి, తిరుపతి: శేషాచలంలో ఎర్రబంగారమే కాదు.. అపారమైన గుప్తనిధులు ఉన్నాయనే అనుమానంతో ఓ ముఠా పథకం వేసింది. ఏడాది పాటు శ్రమించి భారీ సొరంగం తవి్వంది. మరికొంత సొరంగం తవ్వితే.. గుప్తనిధులు బయటపడేవని ముఠా సభ్యులు చెబుతున్నారు. శేషాచలం అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలకు యత్నించిన కొందరిని శనివారం అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనకాపల్లికి చెందిన పెయింటర్ నాయుడు 2014లో తిరుపతికి మకాం మార్చాడు. భార్య నుంచి విడిపోయిన అతడు తిరుపతి ముత్యాలరెడ్డిపల్లెలో ఉంటూ కూలీల మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అతడికి గుప్తనిధుల మీద ఆశ మొదలైంది. నెల్లూరుకు చెందిన రామయ్యస్వామితో పరిచయం ఏర్పడింది. తవ్వకాల సమీపంలో రాయిపై ఉన్న గుర్తులు కొన్ని పురాతన రాగిరేకులను బట్టి శేషాచలం అడవుల్లో గుప్తనిధి ఉందని భావించారు. నాయుడు, రామయ్యస్వామి.. ఆరుగురు కూలీలతో కలిసి ఏడాది కిందట తవ్వకాలు ప్రారంభించారు. విషయం బయటకు తెలియకుండా సొరంగం తవ్వుతూ వచ్చారు. ఏడాది పాటు గుట్టుచప్పుడు కాకుండా.. రేయింబవళ్లు 80 అడుగుల సొరంగం తవ్వారు. మరికొంత తవ్వేందుకు శుక్రవారం రాత్రి కూలీలతో బయలుదేరారు. మరికొందరి కోసం మంగళం వెంకటేశ్వరకాలనీ సమీపంలో ఎదురు చూడసాగారు. ఈ ముఠా కదలికలతో అనుమానం వచ్చిన కాలనీవాసులు అలిపిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. గుప్తనిధుల తవ్వకాలకు వచ్చినట్లు వారు విచారణలో తెలిపారు. వారిద్వారా మిగిలిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిధిని సొంతం చేసుకునేందుకు మరో 40 అడుగుల మేరకు తవ్వితే సరిపోయేదని ముఠా సభ్యులు చెబుతున్నారు. -
కిడ్నాప్కు గురైన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతం..
-
అలిపిరి బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం
సాక్షి, తిరుపతి : అలిపిరిలో కిడ్నాప్కు గురైన ఆరేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. విజయవాడ రైల్వేస్టేషన్లో బాలుడ్ని కనుగొన్నారు పోలీసులు. ఈ నెల 27న అలిపిరి బస్టాండ్ వద్ద సాహూ అనే బాలుడ్ని కర్ణాటకలోని మున్నియనపల్లికి చెందిన శివప్ప అనే వ్యక్తి అపహరించిన సంగతి తెలిసిందే. శివప్పకు వి.కోటకు చెందిన కళావతితో వివాహం అయింది. వీరికి పుట్టిన నలుగురు పిల్లల్లో ముగ్గురు అనారోగ్యంతో చనిపోగా.. డిప్రెషన్కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్కు చెందిన సాహూ ఆడుకుంటుండగా కిడ్నాప్ చేశాడు. నిందితుడ్ని గత 14 రోజులుగా పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. అతడు బాలుడ్ని విజయవాడలో వదిలేశాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లి బాలుడ్ని గుర్తించారు. బాలుడితో విజయవాడనుంచి తిరుపతి బయలుదేరారు. చదవండి : మైనర్తో ప్రేమ.. పెళ్లి చేయాలంటూ పోలీస్ స్టేషన్లో.. అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి -
అలిపిరిలో బాలుడి కిడ్నాప్.. ఇంకా దొరకని ఆచూకీ
-
అలిపిరి బాలుడి కిడ్నాప్ కేసులో పురోగతి
తిరుపతి : అలిపిరిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్ కేసులో కిడ్నాపర్ను శివప్పగా పోలీసులు గుర్తించారు. కానీ ఇంతవరకు అతని ఆచూకీ దొరకలేదు. దీంతో అపహరణకు గురైన బాలుడు ఇంకా అతని చెరలోనే ఉన్నాడు. వివరాల ప్రకారం..చత్తీస్గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు.ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. అప్పటినుంచి బాలుడి కోసం గాలించినా ఎలాంటి క్లూ దొరకలేదు. కిడ్నాప్కు నాలుగు రోజుల ముందే శివప్ప పెద్ద కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకుపై అమితమైన ప్రేమ చూపించే శివప్ప..కుమారుడి మృతితో డిప్రెషన్లోకి వెళ్లినట్లు అతని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలిపిరి బస్టాండు వద్ద ఆడుకుంటున్న సాహుని కిడ్నాప్ చేశాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఇంకా బాలుడి ఆచూకీ తెలియలేదు. దీంతో సాహు కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : (తిరుపతిలో ఆరేళ్ల బాలుడు కిడ్నాప్, సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు) -
పేపర్ చదువుతున్నట్టు నటన, పిల్లాడిని తీసుకుని పరార్
తిరుపతి : అలిపిరి లింక్ బస్టాండు వద్ద ఆరేళ్ల బాలుడు అపహరణకు గురి కావడం కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం.. చత్తీస్గఢ్ నుంచి గతనెల 27న శివమ్ కుమార్ సాహు కుటుంబం శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుమల వెళ్లబోతూ ఫుట్పాత్ మీద కాసేపు సేదతీరుతున్న సమయంలో బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆ సమయంలో వారి పక్కనే పేపర్ చదువుతున్నట్టు నటించిన ఓ వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. బాలుడి వెంటబెట్టుకుని దుండగుడు వెళ్తున్న దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. చదవండి : (భార్యను నరికి చంపి, ఆపై ఆత్మహత్య) (హైదరాబాద్లో టెకీపై యువకుడి దారుణం) -
ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా
సాక్షి, తిరుపతి/తిరుపతి అర్బన్: ‘ పోలీసులకు బుర్ర లేదు. ఉద్యోగ సంఘాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. అన్నీ నోట్ చేసుకుంటున్నాం. రిటైర్డ్ అయినా కూడా ఎవరినీ వదలం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ధర్మపరిరక్షణ యాత్ర పేరుతో గురువారం అలిపిరి వద్ద టీడీపీ నేతలు రచ్చ చేశారు. పలుచోట్ల రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారు. శాంతియుతంగా ర్యాలీ చేసుకోవాలని కోరినా పట్టించుకోకపోవడంతో.. చివరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఎమ్మార్పల్లె, చంద్రగిరి పోలీస్స్టేషన్లకు తరలించారు. మరోవైపు టౌన్క్లబ్ సర్కిల్ వద్ద బహిరంగసభ నిర్వహించడానికి బయల్దేరుతున్న అచ్చెన్నాయుడును తిరుచానూరు సమీపంలోని ఓ హోటల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.(చదవండి: అడ్డంగా దొరికిన తెలుగు తమ్ముళ్లు) అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఇంటింటికీ ధర్మపరిరక్షణ యాత్ర నిర్వహించి తీరుతామన్నారు. సంతబొమ్మాళిలో ఏం జరిగిందో చర్చించేందుకు రావాలని వైఎస్సార్సీపీకి సవాల్ విసిరారు. ఆలయంలో నంది విగ్రహం ఖాళీగా ఉంటే.. తీసుకొచ్చి దిమ్మెపై పెట్టారన్నారు. దీనికే ఆలయంలో విధ్వంసం చేసినట్లు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ కూడా యాత్ర చేస్తుంది కదా? అని మీడియా ప్రశ్నించగా.. తమది స్వచ్ఛమైన యాత్ర అని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. కాగా, టీటీడీ నిబంధనలను పట్టించుకోకుండా.. అలిపిరి వద్ద పసుపు జెండాలు కట్టి టీడీపీ నేతలు రాజకీయ ప్రచారం చేయడంపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం) ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా తిరుచానూరు సమీపంలోని హోటల్ వద్ద విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ దీపిక పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దురుసుగా ప్రవర్తించారు. ఆమె కాలును తొక్కడమే కాకుండా.. ‘ఇక్కడ నీకేం పని.. అంతు చూస్తా..’ అంటూ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళా ఎస్ఐ దీపిక కన్నీరుపెట్టుకున్నారు. మాదంతా ఖాకీ కులం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీల నేతలు పోలీస్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని కించపరిచే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నామని, తమకు కులమతాలు ఉండవని, తమదంతా ఖాకీ కులమని డీఐజీ, ఏపీ పోలీస్ టెక్నికల్ చీఫ్ పాలరాజు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలతో గురువారం డీజీపీ డి.గౌతమ్సవాంగ్ సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్బాబుతో కలిసి పాలరాజు మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పోలీస్ వ్యవస్థను దిగజార్చేలా రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న ప్రయత్నాలు మానుకోవాలన్నారు. ఆపదలో ఆలయాలు అంటూ రాజకీయ నేతలు దుష్ప్రచారం చేయడం తగదన్నారు. వాస్తవంగా 2015 నుంచి 2021 వరకు నమోదైన కేసులను గమనిస్తే 2020–21లో ఆలయ ఘటనలు పెరగలేదన్నారు. ఈ ఏడాది 44 కేసుల్లో 29 కేసులు నిగ్గు తేల్చి దోషులను అరెస్టుచేసినట్లు ఆయన చెప్పారు. తొమ్మిది కేసుల్లో రాజకీయ నేపథ్యం కలిగిన వారున్నారన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా కుట్రపూరిత చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. పోలీసు శాఖ సూచించిన నిబంధనలను ఉల్లఘించినందుకే టీడీపీ తలపెట్టిన ధర్మ పరిరక్షణ యాత్రకు అనుమతిని రద్దుచేసినట్లు శాంతిభద్రతల డీఐజీ రాజశేఖర్బాబు చెప్పారు. -
భార్యను కాల్ గర్ల్గా మార్చిన భర్త రేవంత్
సాక్షి, తిరుపతి: భార్యను కాల్ గర్ల్గా మార్చిన శాడిస్టు భర్త రేవంత్ను అరెస్టు చేసిన అలిపిరి పోలీసులు మరికాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్భంగా దిశ పీఎస్ డీఎస్పీ రామరాజు మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి చెందిన ఓ కాలేజీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ నాలుగు నెలల క్రితం నిరోషాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనంతరం ఆదనపు కట్నం తేవాలంటూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడని చెప్పారు. ఈ క్రమంలో ఆమెను మానసికంగా హింసించడంతో నిరోషా గతంలో అలిపిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిందని చెప్పారు. దీంతో ఎస్ఐ హిమబిందు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారన్నారు. అయినప్పటికి రేవంత్ ఆమెను మరింత వేధింపులకు గురిచేయడమే కాక వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడన్నారు. అంతేగాక ఆమె న్యూడ్ ఫొటోలను పోస్టు చేసి గంటకు రూ. 3వేలు అంటూ భార్యను కాల్ గర్ల్గా చిత్రీకరించాడని తెలిపారు. అది తెలిసిన నిరోషా మరోసారి అలిపిరి పోలీసులకు ఇటీవల ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు రేవంత్పై ఐపీసీ సెక్షన్ 307, 313, 354(డీ), 324, 506, 66(ఈ) కింద కేసు నమోదు చేసి రేవంత్ను అరెస్టు చేశామన్నారు. అయితే మొదటి సారి నిరోషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయని ఎస్ఐపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
నడకదారికి కొత్తశోభ
-
అలిపిరి వద్ద మద్యం, మాంసం స్వాధీనం
తిరుమల: అలిపిరి టోల్గేట్ వద్ద బుధవారం మద్యం, మాంసం స్వాధీనం చేసుకున్నట్లు టీటీడీ వీఎస్ఓ ప్రభాకర్ తెలిపారు. తిరుపతికి చెందిన ఒక టీవీ చానల్ వీడియో జర్నలిస్టు కారులో తిరుపతి నుంచి తిరుమలకు వెళుతుండగా అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. 5 కిలోల చికెన్, సిగ్నేచర్ విస్కీ–4 బాటిళ్లు, ఓట్కా–2 బాటిళ్లు, లూజ్ లిక్కర్–2000 ఎంఎల్ ఉన్నాయి. నిందితుడిని తిరుమలలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. అతనిపై గతంలో నమోదైన ఒక కేసు విచారణలో ఉంది. -
తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు
సాక్షి, తిరుమల : కోవిడ్–19 వైరస్ను అరికట్టడంలో భాగంగా శ్రీవారి ఆలయంలోకి ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని వారం రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం అదనపు ఈవో ధర్మారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలతో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులందరికీ శ్రీవారి దర్శనం కల్పించి అనంతరం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తామన్నారు. ప్రతి నిత్యం స్వామి వారికి నిర్వహించే కైంకర్యాలు యథాతథంగా కొనసాగుతాయని, అర్చకులు ఏకాంతంగా నిర్వహిస్తారని చెప్పారు. -
అలిపిరి టోల్గేట్ మూసివేత
-
వారం రోజులు శ్రీవారి దర్శనాలు రద్దు
-
వారం రోజులు శ్రీవారి దర్శనాలు రద్దు : ఈవో
సాక్షి, తిరుపతి : కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం మూసివేయడం లేదని తెలిపారు. భక్తుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలివేస్తున్నామని చెప్పారు. వారం రోజుల పాటు దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి శ్రీవారికి ఏకాంత సేవలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. పద్మావతి అమ్మవారి ఆలయంలోనూ భక్తుల ప్రవేశం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం వారం రోజుల పాటు ఆంక్షలు అమలవుతాయని వివరించారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న భక్తులకు రాత్రి శ్రీవారి దర్శనం చేయించి తిరుపతికి పంపుతామన్నారు. వారం తర్వాత సమీక్ష నిర్వహించి నిర్ణయాలు ప్రకటిస్తామని అన్నారు. టీటీడీ నిర్ణయాలకు భక్తులు సహకరించాలని కోరారు. టీటీడీ ప్రతిరోజు కరోనా పరిస్థితిపై సమీక్ష చేస్తుందని గుర్తుచేశారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రధాన ఆలయాలను మూసివేశారని గుర్తుచేశారు. తిరుమలకు గురువారం ఒక కరోనా అనుమానితుడు వచ్చాడని తెలిపారు. ఆ వ్యక్తికి చెందిన బృందంలో మొత్తం 110 మంది ఉన్నారని.. వారు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో తిరిగి తిరుమలకు వచ్చారన్నారు. ఆ బృందంలో కొందరికి గుర్తింపు కార్డులు లేవని.. అందుకే వారికి దర్శనం టోకెన్ ఇవ్వలేదని వెల్లడించారు. అస్వస్థతకు గురికాగానే అతని ప్రాథమిక చికిత్స చేయించామని.. అనంతరం రుయా ఆస్పత్రికి పంపిచామని తెలిపారు. కరోనా గురించి రాష్ట్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే అలిపిరి టోల్ గేట్ను టీటీడీ అధికారులు మూసివేశారు. భక్తుల వాహనాలు తిరుమల కొండపైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అలాగే శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాలను కూడా టీటీడీ అధికారులు మూసివేశారు ఇప్పటికే తిరుమలలో ఉన్నవారికి శ్రీవారి దర్శనం చేసి పంపించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఏపీలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా తేలగా.. దేశవ్యాప్తంగా 169 మందికి కరోనా సోకినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అన్నవరంలో సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతి సాక్షి, తూర్పుగోదావరి : అన్నవరం సత్యదేవుని ఆలయంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. శుక్రవారం నుంచి భక్తుల సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు చెప్పారు. ఆలయ ఈవో త్రినాధరావు మాట్లాడుతూ.. భక్తులకు అంతరాలయ దర్శనానికి అనుమతి లేదని తెలిపారు. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు, సేవలు యథావిథంగా జరుగుతాయని వెల్లడించారు. భక్తులకు వీటిలో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. పదేళ్లలోపు చిన్నారులను, అరవై ఏళ్లు పైబడిన వృద్ధులను ఆలయానికి తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆలయంలో అన్నదానంకు బదులు పులిహోరా, దద్దోజనం, సాంబారు అన్నం ప్యాకింగ్చేసి భక్తులకు అందజేస్తామన్నారు. చదవండి : ఏపీలో థియేటర్లు, మాల్స్ బంద్ -
త్వరలో అలిపిరిలో ఫాస్టాగ్
సాక్షి, తిరుమల: డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే క్రమంలో జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద ‘ఫాస్టాగ్’ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అలిపిరి టోల్గేట్ వద్ద ఫాస్టాగ్ విధానాన్ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. తిరుమలకు వచ్చే ప్రతి వాహనానికీ ఫాస్టాగ్ ఉండేలా టీటీడీ చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు ఎస్బీఐ బ్యాంక్తో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో తిరుమలకు వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇక వీలైనంత తర్వలో ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని టీటీడీ విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. దీంతో దేశంలో ఫాస్టాగ్ విధానాన్ని అనుసరించే తొలి దేవాలయ పాలకమండలిగా టీటీడీ ఖ్యాతి గడించనుంది. కాగా ఇప్పటికే కేంద్రం టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: పండుగపూట ఫాస్టాగ్ పరేషాన్ హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయం -
ప్రేమ వివాహం చేయించారని ఏఎస్సై దాడి
సాక్షి, తిరుపతి : తన సోదరుడి కూతురికి ప్రేమ వివాహం చేయించారని ముగ్గురు యువకులపై దాడి చేశాడో ఏఎస్సై. రౌడీలా ప్రవర్తిస్తూ యువకులను చితకబాదారు. వివరాల్లోకి వెళితే.. అలిపిరి పీఎస్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రాము సోదరుడి కూతురు ఓ యువకుడిని ప్రేమించింది. ఇంట్లో వాళ్లు ఒప్పుకోరనే భయంతో స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సందర్భంగా దిగిన ఫోటోలను యువకుడి స్నేహితులు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాలో ఫోటోలను చూసిన రాము.. ముగ్గురు యువకులను పట్టుకొని చితకబాదాడు. రౌడీలా ప్రవర్తిస్తూ దాడి చేశాడు. ఏఎస్సై తమపై దాడి చేశారని ఆ యువకులు వెస్ట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఏఎస్సైపై చర్యలు తీసుకోవాలని యువకుల బంధువులు డిమాండ్ చేశారు. -
కాలిబాటన కొండపైకి..
సాక్షి, తిరుపతి, చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా ముగించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పాదయాత్ర ముగిసిన ఇచ్ఛాపురం నుంచి నేరుగా తిరుపతికి వచ్చిన ఆయన అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. అశేష సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అనుసరించగా.. తొలి మెట్టుకు మొక్కి వైఎస్ జగన్ నడక ప్రారంభించారు. పాదరక్షలు లేకుండా నడుస్తూ.. దారి పొడవునా శ్రీవారిని ధ్యానిస్తూ.. ‘గోవిందా.. గోవిందా.. శ్రీమన్నారాయణ’ అంటూ నామస్మరణ చేస్తూ.. భక్తి ప్రపత్తులతో వడివడిగా మెట్లు ఎక్కారు. దారిలో ఎక్కడా విశ్రమించకుండా ముందుకు సాగారు. కాలినడకన వచ్చే భక్తులకు దర్శనం కోసం ఇచ్చే ‘దివ్యదర్శనం’ టోకెన్ను సామాన్య భక్తుడిగా వైఎస్ జగన్ తీసుకున్నారు. ఆయన వెంట వచ్చిన నాయకులు, కార్యకర్తలు కూడా దివ్యదర్శనం టోకెన్లు తీసుకుని ముందుకుసాగారు. వైఎస్ జగన్, ఆయనతో నడిచినవారు చేసిన నామస్మరణతో మెట్ల మార్గం మొత్తం గోవింద నామంతో మార్మోగింది. ఏకబిగిన మెట్లు ఎక్కిన జగన్.. సాయంత్రం 4.30 గంటలకు తిరుమల చేరుకున్నారు. అనంతరం శ్రీకృష్ణ అతిథిగృహంలో కాసేపు ఆగారు. సంప్రదాయ దుస్తులు ధరించి సాయంత్రం 6 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా దివ్యదర్శనం టోకెన్తో శ్రీవారి దర్శనానికి క్యూలైన్లో ప్రవేశించారు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత ధ్వజస్తంభానికి మొక్కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. స్వామివారి దర్శనం అనంతరం.. ఆనంద నిలయంపైన కొలువై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామికి మొక్కారు. శ్రీవారి ఆలయం ప్రాంగణంలోని అన్నమయ్య భాండాగారాన్ని (అన్నమయ్య సంకీర్తనల ప్రతులను భద్రపరిచిన గది) సందర్శించారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం యోగనరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత రంగనాయక మండపంలో వేదపండితులు వైఎస్ జగన్ను ఆశీర్వదించి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందించారు. దర్శనం అనంతరం రాత్రి 7 తర్వాత ఆయన బసచేసే శ్రీకృష్ణ అతిథి గృహానికి వెళ్లారు. రైల్లో రేణిగుంటకు.. పాదయాత్ర పూర్తయిన తర్వాత దురంతో ఎక్స్ప్రెస్లో నేరుగా రేణిగుంట స్టేషన్కు ఉదయం 10.10 గంటలకు వైఎస్ జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి తిరుపతి పద్మావతి అతిథిగృహానికి వెళ్లారు. దారి పొడవునా ఆయనకు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహం వద్దకు భారీగా ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు చేరుకోవడంతో అక్కడ కోలాహలం నెలకొంది. అతిథి గృహం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి అలిపిరి మెట్లమార్గం వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకు వచ్చి వైఎస్ జగన్పై పూలు చల్లారు. అందిరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు.వైఎస్ జగన్.. అలిపిరి మెట్ల మార్గం మధ్యలో గాలిగోపురం వద్ద శ్రీకృష్ణుడి ఆలయంలోకి వెళ్లి దణ్ణం పెట్టుకున్నారు. మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరికాయ కొడుతున్న జగన్ ఏడోమైలు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. కాలినడక ముగించే ముందు ఆఖరి మెట్టు వద్ద హారతి ఇచ్చి దణ్ణం పెట్టుకున్నారు. వైఎస్ జగన్ వెంట రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మాజీ ఎంపీలు మిథున్రెడ్డి, వరప్రసాదరావు, పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, అనిల్కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్రెడ్డి, పలు నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నేతలు, కార్యకర్తలు నడిచారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు శ్రీవారి దర్శనం అనంతరం శారదాపీఠానికి చెందిన మఠానికి జగన్ వెళ్లారు. ఆయనకు పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి మఠంలోకి తీసుకెళ్లారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీర్వచనం తీసుకున్నారు. టీటీడీ నిర్లక్ష్యం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వస్తున్నారని ముందస్తు సమాచారం ఉన్నా టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తిరుమల చేరుకున్న వైఎస్ జగన్కు టీటీడీ ముఖ్య అధికారులు ఎవరూ స్వాగతం పలకలేదు. దివ్యదర్శనం కోసం వైఎస్ జగన్తో 400 మందికి టోకెన్లు ఇచ్చినా ఆలయంలోకి వారిని అనుమతించలేదు. దీంతో క్యూలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. అయినా టీటీడీ సెక్యూరిటీ విభాగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల దర్శనానికి వచ్చినపుడు ఆయనతో లోనికి వెళ్లే టీడీపీ నాయకులకు టికెట్లు లేకపోయినా అనుమతించే అధికారులు.. వైఎస్ జగన్ విషయంలో భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కుతున్న వైఎస్ జగన్ -
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
-
శ్రీవారి దర్శనానికి బయల్దేరిన వైఎస్ జగన్
-
తిరుమల చేరుకున్న వైఎస్ జగన్..
-
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్ జగన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. వైఎస్ జగన్ వెంట వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డిలు ఉన్నారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైఎస్ జగన్ తిరుమలలోని విశాఖ శారదా పీఠం చేరుకున్నారు. అక్కడ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వైఎస్ జగన్ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. రాత్రికి తిరుమలలో బస చేయనున్న ఆయన.. శుక్రవారం ఉదయం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. సుదీర్ఘమైన ప్రజాసంకల్పయాత్రను పూర్తిచేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం ఉదయం తిరుపతికి చేరుకున్నారు. పద్మావతి గెస్ట్హౌస్ నుంచి అలిపిరి చేరుకున్న వైఎస్ జగన్.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం దగ్గర తొలిమెట్టుకు నమస్కరించిన ఆయన.. శ్రీనివాసుడి దర్శనం కోసం నడక ప్రారంభించారు. పెద్దసంఖ్యలో అభిమానులు ఆయన వెంట కదిలారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో కాలినడక మార్గమంతా మార్మోగిపోయింది. దారిపొడువునా భక్తులకు అభివాదం చేస్తూ.. సామాన్య భక్తుడిలా ముందుకుసాగిన జననేత.. మార్గమధ్యలో ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ జననేత కొబ్బరికాయ కొట్టారు. తర్వాత నరసింహస్వామి ఆలయంలో వైఎస్ జగన్ పూజలు చేశారు. వడివడిగా మెట్లు ఎక్కిన ఆయన ఎక్కడా ఆగకుండా ముందుకు కదిలారు. అలుపులేకుండా పాదయాత్ర నిర్వహించిన జననేత.. తిరుమల మెట్లు ఎక్కడంలోనూ అదే ఉత్సాహాన్ని ప్రదర్శించారు. మెట్ల దారిలో సాటి భక్తులను పలుకరిస్తూ.. వారికి ఆత్మీయంగా అభివాదం చేస్తూ ముందుకు కదిలిన వైఎస్ జగన్.. మర్గమధ్యలో నరసింహా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మోకాళ్ల పర్వతం నుంచి తిరుమల చేరుకున్నారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి వైఎస్ జగన్ చేరుకున్నారు. వైఎస్ జగన్ రాకపై భక్తులు, తిరుపతి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు వైఎస్ జగన్కు, ఆయన కుటుంబానికి ఎల్లవేళలా ఉంటాయని అంటున్నారు. చిన్న వయస్సులోనే ఎన్నో బాధలు ఎదుర్కొని తండ్రి చూపిన బాటలో ప్రజాశ్రేయస్సు కోసం వైఎస్ జగన్ పాదయాత్ర చేపట్టారని అన్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రజలను కుటుంబంగా భావించి వారి కష్టాను తీర్చాడానికి ముందుకు సాగుతూనే ఉన్నారని తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని అన్నారు. వైఎస్ జగన్తో కలిసి పది అడుగులు వేసిన తమ అదృష్టంగా భావిస్తామన్నారు. రేణిగుంటలో... వైఎస్ జగన్ ఈ ఉదయం 10 గంటల ప్రాంతంలో రేణిగుంట చేరుకున్నారు. దురంతో ఎక్స్ప్రెస్ రైలులో ఇక్కడికి వచ్చిన జననేతకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు తరలివచ్చిన జనంతో రేణిగుంట రైల్వే స్టేషన్ కిక్కిరిసింది. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై జగన్ నినాదాలతో రైల్వే స్టేషన్ ప్రాంగణం మార్మోగింది. సీఎం జగన్ అంటూ రైల్వేస్టేషన్లో ఉన్న వారితో పాటు, రైలులో ఉన్న ప్రయాణికులు నినదించడం విశేషం. -
కాలినడకన కొండపైకి బయల్దేరిన వైఎస్ జగన్
-
కాలినడకన తిరుమలకు వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం మధ్యాహ్నం అలిపిరి చేరుకున్నారు. వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు సామాన్య భక్తుడిలా కాలినడకన తిరుమలకు బయలు దేరారు. మెట్ల మార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించారు. సాయంత్రానికి కొండ మీదకు చేరుకుంటారు. ఆయన వెంట తిరుమల వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గోవింద నామ స్మరణతో ముందుకు సాగుతున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పార్టీ శ్రేణులను వైఎస్ జగన్ ఆదేశించారు. సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్న తర్వాత శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకుంటారు. ఈ రోజు రాత్రి సర్వదర్శనం ద్వారా స్వామివారిని వైఎస్ జగన్ దర్శించుకుంటారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు చేరుకుంటారు. -
తనిఖీ డొల్ల.. భద్రత డీలా..!
అలిపిరి టోల్గేట్ అధికారుల నిర్లక్ష్యంతో తిరుమలకెళ్లే వాహనాల తనిఖీ డొల్లతనంగా తయారైంది. భద్రత ప్రశ్నార్థకమైంది. అందుకు మంగళవారం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ జెండాలు, నినాదాల ప్లకార్డులతో టోల్గేట్ ద్వారా ప్రవేశించి తిరుమలకు వెళ్లినా నిలువరించే నాధుడు లేకపోవడమే నిదర్శనం. టీటీడీ భద్రతా విభాగం ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపంతో టోల్గేట్లో సిబ్బంది నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు. చిత్తూరు, తిరుపతి అర్బన్: టీటీడీ భద్రతా నిబంధనల ప్రకారం టోల్గేట్ వద్దకు చేరుకునే ప్రతి వాహనాన్ని వాటిలోని ప్రతి వ్యక్తిని కిందకు దింపి అధునాతన తనిఖీ యంత్రాలు, పరికరాల ద్వారా తనిఖీ చేసి తిరుమలకు అనుమతించాలి. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే టీటీడీ ఉద్యోగులకు సైతం మినహాయింపు లేదు. అయితే టోల్గేట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో భద్రత డొల్లగా మారింది. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ఉద్యోగులు, సొంత వాహనాల్లో, ట్యాక్సీల్లో వచ్చే వారిని వాహనాల్లో నుంచి దింపకుండానే తూతూ మంత్రంగా తనిఖీలు చేసి పంపేస్తున్నారు. సిఫార్సులుండే వారి వాహనాలకు కనీస తనిఖీలు కూడా లేకుండానే రైట్ చెబుతున్నారు. తనిఖీలెందుకు..? టోల్గేట్లో ప్రతిరోజూ వేకువజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు షిప్టుల వారీగా పనిచేస్తూ తనిఖీలు నిర్వహిస్తారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో నిత్యం వేల సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు నిషేధిత వస్తువులైన మాంసం, మారణాయుధాలు, మద్యం, గుట్కా, పాన్ ప్యాకెట్లు, పేలుడు పదార్థాలు ఏ మార్గంలోనూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకుండా కట్టడి చేయడమే టోల్గేట్లో చేపడుతున్న తనిఖీల ప్రధాన ఉద్దేశం. ఆర్టీసీ బస్సుల్లో పడకేసిన తనిఖీలు.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే యాత్రికుల్లో సగభాగానికి పైగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వీరిలో సామాన్య భక్తులు, టీటీడీ ఉద్యోగులు, కొందరు కిందిస్థాయి అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. టీటీడీలోని భద్రతా విభాగంలో రూపొందించిన కఠిన నియమాల ప్రకారం బస్సుల్లో ప్రయాణించే డ్యూటీ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరినీ అలిపిరి టోల్గేట్ వద్ద కచ్చితంగా కిందికి దింపి తనిఖీలు చేయాల్సి ఉంటుంది. కానీ చాలా మంది టీటీడీ కార్మికులు, ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది బస్సుల్లో నుంచి కిందికి దిగి తనిఖీలు చేయించుకోకున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. గతంలో అనేక సందర్భాల్లో ఆర్టీసీ సిబ్బంది, టీటీడీలోని కొం దరు ఉద్యోగులు, సిబ్బంది తిరుమలకు నిషేధిత మాంసం, మద్యం, గుట్కా ప్యాకెట్లు బస్సుల్లో తీసుకెళ్తూ పట్టుబడ్డ సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆ సంఘటనలపై మీడియాలో వార్తలు వచ్చిన కొన్ని రోజుల వరకు మాత్రమే అధికారులు నానా యాగీ చేసి మిన్నకుండిపోతున్నారు. సెలవుల్లో తనిఖీలు ఇలాగైతే..? తిరుమలకు సాధారణ రోజుల్లోనే వాహనాల ద్వారా రోజుకు కనీసం 45– 60వేల మంది వెళ్తుంటారు. అలాంటిది రానున్న పండుగలు, సెలవుల కాలంలో రద్దీ విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీలు డొల్లతనంగానే కొనసాగితే ఏ పరిస్థితికైనా దారి తీయవచ్చనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనైనా భద్రతను, తనిఖీలను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు గుర్తించాలి. లగేజీలు సైతం కొందరివే.. తిరుమలకు వెళ్లే వాహనాల్లోని లగేజీలను సైతం కొందరివే తనిఖీలు చేసి మిగిలిన వారివి యథేచ్చగా వదిలేస్తున్నారు. ఈ అంశంలో ముఖ్యంగా కొందరు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతో లగేజీలను వాహనాల్లో నుంచి దించకుండానే తూతూ మంత్రంగా తనిఖీ చేసి వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనదారులకు భద్రతా సిబ్బంది కల్పిస్తున్నారని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా భద్రతా విభాగం ఉన్నతాధికారులు స్పందించి అలిపిరి టోల్గేట్ వద్ద నిబంధనల మేరకు పటిష్టంగా తనిఖీలు జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
వైఎస్సార్, చంద్రబాబుకు ఉన్న తేడా ఇదే!
సాక్షి, తిరుపతి : హుందాతనం అంటే ఇది.. ప్రజా నాయకుడంటే ఇలా ఉండాలి.. అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిరుపతి వాసులు కొనియాడారు. కానీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడికి మానవత్వం అన్నదే లేదని మండిపడ్డారు. 2003లో అలిపిరి వద్ద జరిగిన బాంబు దాడిలో అప్పటి సీఎం చంద్రబాబు గాయపడితే.. వెంటనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వయంగా తిరుపతి కి వచ్చి చంద్రబాబును పరామర్శించారని తెలిపారు. అదే రోజు తిరుపతిలోని గాంధీ విగ్రహం ఎదుట ఆ మహానేత మౌనదీక్ష చేసి.. తన నిండైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నారని, తన నిరసనతో నక్సల్స్ చర్యలను తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగితే మానవత్వం చూపని చంద్రబాబు విమర్శలు చేయటం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్కు చంద్రబాబుకు ఉన్న తేడా ఇదేనని మండిపడుతున్నారు. నాటి వైఎస్సార్ మౌనదీక్షకు సంబంధించిన ప్లెక్సీని శనివారం లక్ష్మీపురం సర్కిల్లో ఏర్పాటు చేసి చంద్రబాబుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. కాగా.. నాటి వైఎస్సార్ మౌనదీక్షకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చంద్రబాబుకు, మహానేత వైఎస్సార్కు ఉన్న తేడా ఇదేనంటూ నెటిజన్లు ఈ ఫొటోను షేర్ చేస్తున్నారు. -
అలిపిరిలో ప్రెస్మీట్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఈరోజు (మంగళవారం) తిరుపతికి చేరుకుని, రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి దేవుడుని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తన 64వ జన్మదినం రోజున తన మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తిరుమల వెళ్తున్నాని తెలిపారు. రేపు ఉదయం అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడి పాదయాత్రగా కొండపైకి చేరుకుంటానని అన్నారు. 12వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతానని ప్రకటించారు. -
గవర్నర్ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
-
అది చంద్రబాబుకే నష్టం: సోము వీర్రాజు
సాక్షి, హైదరాబాద్ : చట్టం తమ చేతుల్లో ఉందనే వైఖరిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రదర్శిస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. అలిపిరి దాడి ఘటన చంద్రబాబు కుట్రేనని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల మీద భౌతిక దాడులు చేస్తున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. దాడులకు పాల్పడితే చంద్రబాబుకే నష్టమన్నారు. తమ డిమాండ్లపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కాగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. అలిపిరిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై దాడి తర్వాత, బీజేపీ నాయకుల మీద కేసులు పెట్టడంపై వారు ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అమిత్ షా పర్యటన అనంతరం జరిగిన సంఘటనలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. గవర్నర్ను కలిసినవారిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీమంత్రి, ఎమ్మెల్యే మాణిక్యాలరావు, దినేష్ రెడ్డి ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా పై దాడి గవర్నర్తో భేటీ అనంతరం మాణిక్యాలరావు మాట్లాడుతూ... ‘ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా మీద దాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. అమిత్ షా కు రక్షణగా ఉన్న మా కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని ...తమ అధికారంతో తుంగలోకి తొక్కుతున్నారు. చంద్రబాబు దుశ్చర్యను తిప్పికొడతాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని బీజేపీతో లింక్ పెడుతున్నారు. టీటీడీలో అక్రమాలు జరిగాయంటే... అది పట్టించుకోకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. టీటీడీలో అక్రమాలపై దర్యాప్తు చేయకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. విచారణ పారదర్శకంగా జరిపించాలి.’ అని డిమాండ్ చేశారు. -
శ్రీవారి ఆశీస్సులు అందుకునేందుకు వచ్చా
సాక్షి, తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, ఆశీస్సులు అందుకునేందుకు తిరుమల వచ్చానని, సంతోషంగా ఉందని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. అలిపిరి నుంచి శనివారం కాలినడకన తిరుమల వచ్చిన ఆయన ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుమల ఆలయంలోని యోగనృసింహస్వామి సన్నిధి వద్ద తనకు అన్నప్రాసన చేసి, పేరు పెట్టారన్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో దైవ సంబంధిత విషయాలు తప్ప వేరేవి మాట్లాడకూడదన్నారు. అంతకుముందు సుమారు 64 మందితో కలసి ఆయన వైకుంఠం క్యూకాంప్లెక్స్ మార్గం నుంచి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం తర్వాత కూడా పవన్ తిరుమలలోని హంపి మఠంలోనే బస చేశారు. -
మళ్లీ తుపాకి కలకలం
సాక్షి ప్రతినిధి, తిరుపతి : అలిపిరి చెక్ పాయింట్లో మళ్లీ తుపాకీ కలకలం రేగింది. శుక్రవారం ఉదయం వాహనాల తనిఖీ నిర్వహిస్తున్న టీటీడీ భద్రతా విభాగం పోలీసులకు పిస్టల్తో కొండ మీదకు వెళ్తున్న వ్యక్తి కనిపించాడు. ఆయన దగ్గర్నుంచి పిస్టల్ను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన సుబ్రమణి అనే వ్యక్తి తన బ్యాగ్లో పిస్టల్ పెట్టుకుని అలిపిరి తనిఖీల్లో పట్టుబడ్డాడు. వెంటనే అతడిని కస్టడీలోకి తీసుకుని సీవీఎస్ఓ ఆకే రవికృష్ణ విచారణ జరుపుతున్నారు. ఏడాదిలో ఇది ఐదోసారి... ఏడాది కాలంలో తుపాకీలు లభ్యం కావడం ఇది ఐదోసారి. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ పోలీసులు సూక్ష్మ స్థాయిలో తనిఖీలు జరపడమే కారణం. గతంలో మహారాష్ట్ర, కోల్కతా, మధ్యప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన కొంత మంది వ్యక్తులు పిస్టల్స్తో అలిపిరి పాయింట్లో పట్టుబడ్డారు. ఒకట్రెండు సంఘటనల తర్వాత మారణాయుధాలతో కొండ మీదకు వెళ్లే వ్యక్తులపై భద్రతా విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. సీవీఎస్ఓ రవికృష్ణ స్వయంగా తనిఖీల్లో పాల్గొంటున్నారు. దీంతో కిందిస్థాయిలో పనిచేసే పోలీసులూ అప్రమత్తమై క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నారు. నడక మార్గంలో ఆకస్మిక తనిఖీలు... కొండమీదకు వెళ్లే వాహనాలన్నీ తప్పనిసరిగా అలిపిరి చెక్ పాయింట్ మీదగానే వెళ్లాలి. అలిపిరి, మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లే భక్తుల విషయంలో కొన్నాళ్ల కిందటి వరకూ తనిఖీలు పెద్దగా లేవు. దీంతో చాలామంది తెలివిగా నడక మార్గాలను ఎంచుకుంటున్నారు. చెక్పాయింట్కు కాస్త పక్కనే ఉన్న వీఎస్టీ పాయింట్ నుంచి నడక మార్గంలో కొండనెక్కి వినాయక స్వామి గుడి దగ్గర వాహనాలను పట్టుకుని కొండను చేరుకుంటున్నారు. ఇంకొంతమంది కొత్తకొత్త మార్గాల్లో కొండకు చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరివల్ల తిరుమల క్షేత్రం దగ్గరకు అడపాదడపా లిక్కర్ బాటిళ్లు, గంజాయి, మాంసం, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు చేరుతున్నాయి. దీన్ని అరికట్టేందుకు సీవీఎస్ఓ రవికృష్ణ నిత్యం నాలుగు ప్రత్యేక బృందాలను నడక మార్గాలకు కేటాయిస్తున్నారు. ఈ మధ్య కాలంలో వీరి తనిఖీలు ముమ్మరమయ్యాయి. మద్యం బాటిళ్లు, గంజాయి, ఇతరత్రా నిషేధిత వస్తువులను ఇటీవల పెద్ద ఎత్తున పట్టుకున్నారు. దీనికితోడు కొండ పైన కూడా విజిలెన్సు, భద్రతా పోలీసుల తనిఖీలు విస్తృతమయ్యాయి. భవన నిర్మాణ పనివారలుగా షెడ్లల్లో నివాసముండే కూలీలను నిత్యం తనిఖీ చేస్తున్నారు. మేస్త్రీలు, కాంట్రాక్టర్లతో మాట్లాడి కూలీల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తున్నారు. -
అలిపిరి చెక్పోస్టు వద్ద పిస్టల్ కలకలం..
సాక్షి, తిరుపతి: అలిపిరి చెక్ పోస్టు వాహనాల తనిఖీలో పిస్టల్ దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. ఒరిస్సాకు చెందిన రామన్ పాణిగ్రహి అనే వ్యక్తి కారులో స్టీరింగ్ క్యాబిన్లో పిస్టల్ పెట్టుకుని తిరుమలకు బయలుదేరాడు. అలిపిరి వద్ద తనిఖీ చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక అతనికి గన్ లైసెన్స్ కూడా లేదని సమాచారం. దీంతో అతని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామన్ విచారణ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. సీవీఎస్ఓ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. నిందితుడు పలు కేసులలో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. ‘తనకు వివాదాలు ఉన్నట్లు, సేఫ్టి కోసమే గన్ కొన్నట్లు అతను చెబుతున్నాడు. అంతేకాక పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఒంటరిగా గన్తో రావడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని’ రవికృష్ణ చెప్పారు. -
అలిపిరి కేసులో మావోయిస్టు దంపతుల అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సుమారు 15ఏళ్ల క్రితం అలిపిరి వద్ద హత్యాయత్నానికి పాల్పడ్డ కేసుల్లో నిందితులైన మావోయిస్టు దంపతులు పోలీసులకు చిక్కారు. వీరు పట్టుబడిన సమయంలో తప్పించుకున్న మరో పదిమంది మావోల కోసం ఏపీ–తమిళనాడు సరిహద్దుల్లో తమిళనాడు క్యూ బ్రాంచ్ పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. తిరువళ్లూరు సమీపంలోని పూండి గ్రామంలో వెట్రివీరపాండియన్ అనే వ్యక్తి ఇంట్లో మావోలు సమావేశం అవుతున్నట్లు జిల్లా ఎస్పీ శిబిచక్రవర్తికి అందిన సమాచారంతో ఈనెల 10న పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆటోలో వెళ్తున్న మావోయిస్టు దంపతులు దశరథన్, సెన్బగవళ్లి పట్టుబడ్డారు. ఈ సంఘటనతో పదిమంది మావోలు పారిపోయినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దశరథన్పై ధర్మపురి జిల్లాలో ఆయుధ శిక్షణ, ఏపీ సీఎం చంద్రబాబుపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది. ఐఎస్ తీవ్రవాది అరెస్ట్ కాగా, చెన్నైలో విధ్వంసం సృష్టించేందుకు పథక రచన చేస్తున్న అన్సార్మీరాన్ అనే ఐఎస్ తీవ్రవాదిని నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (ఎన్ఐఏ) పోలీసులు సోమవారం రాత్రి అరెస్టుచేశారు. తమిళనాడులోనే తలదాచుకుని ఉన్న మరో ఐదుగురు ఐఎస్ తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు. -
ఒక దొంగ కథ.. 23 చైన్ స్నాచింగ్లు.. 900 గ్రా. బంగారం!
సాక్షి, తిరుపతి సిటీ: చీటీల పేరుతో చేసిన అప్పులు తీర్చలేక ఓ వ్యక్తి చైన్ స్నాచర్ అవతారం ఎత్తాడు. 23 చైన్ స్నాచింగ్లతో 900 గ్రాముల బంగారాన్ని కొల్లగొట్టాడు. ఇలా దొంగగా మారిన వీరనాగులు అనే యువకుడిని స్థానికుల సహకారంతో అలిపిరి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎఎస్పీ సిద్ధారెడ్డి, అలిపిరి సిఐ శ్రీనివాసులు సోమవారం విలేకరుల సమావేశంలో నిందితుడిని, స్వాధీనం చేసుకున్న బంగారు గొలుసులూ మీడియా ఎదుట హాజరుపరిచారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం పెడన గ్రామానికి చెందిన రామలక్ష్మి కాలనీకి చెందిన భద్రరావు కుమారుడు వీరనాగులు (27). కొన్నేళ్ల కిందట వీరనాగులు తల్లిదండ్రులపై అలిగి తిరుపతికి పారిపోయి వచ్చాడు. తిరుపతిలోనే ఉంటూ ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వారికి నాలుగేళ్ల చిన్నారి ఉంది. వీరు నగరంలోని భవానీ నగర్లో చిన్న కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరనాగులుకు స్థానికులతో పరిచయాలు కావడంతో రూ.2 లక్షల మేర చీటీ నిర్వహిస్తున్నాడు. అయితే చీటీలు ఎత్తుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో చీటీలు వేసిన వారికి డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఆర్థికంగా చితికిపోవడంతో చైన్ స్నాచింగ్ను ఎంచుకున్నాడు. ఒంటరిగా వెళుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని వారి మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని వెళ్ళేవాడు. 23 చైన్ స్నాచింగ్లు.. 900 గ్రాములు బంగారం రెండేళ్లుగా ఎవ్వరికీ అనుమానం రాకుండా వీరనాగులు చైన్ స్నాచింగ్ను వృత్తిగా చేసుకున్నాడు. ఒకసారి చైన్ స్నాచింగ్ చేసుకుని వచ్చాడంటే తిరిగి 20 రోజులదాకా అటు వెళ్లడు. ఆలోపు కిరాణా షాపు నిర్వహించుకుంటూ ఉండేవాడు. చైన్ స్నాచింగ్లతో మూడు పువ్వులు, ఆరుకాయలుగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుండేవాడు. ఇటీవల రామచంద్రానగర్లో ఒక మహిళ పట్టపగలు ఒంటరిగా నడిచి వెళ్తుండగా ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికుల సహకారంతో అలిపిరి సీఐ శ్రీనివాసులు, క్రైం పార్టీ పోలీసు బృందం రవిరెడ్డి, గోపి, రాజు ఇతర సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈస్ట్, అలిపిరి, తిరుచానూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 గ్రాముల విలువ చేసే సుమారు 23 బంగారు గొలుసులను లాక్కెళ్లినట్లు విచారణలో తేలింది. వీరనాగులు నుండి చోరీలకు పాల్పడిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీఎస్పీ సిద్ధారెడ్డి తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
అలిపిరిలో మారణాయుధం స్వాధీనం
- చెక్పాయింట్ వద్ద కారులో పిస్టల్, బుల్లెట్లు లభ్యం - పోలీసుల అదుపులో నలుగురు పుణే వాసులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల కొండకు వెళ్లే వాహనాల తనిఖీ కోసం ఏర్పాటు చేసిన అలిపిరి చెక్ పాయింట్ వద్ద పిస్టల్, బుల్లెట్లు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. చెక్ పాయింట్ వద్ద బుధవారం ఉదయం విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ వెంకట్రావు, కానిస్టేబుల్ మౌలాలీ పుణేకి చెందిన ఓ నల్లరంగు కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న 14 రౌండ్ల బుల్లెట్లు, ఐఎన్ మోడల్ గ్లాక్ పిస్టల్ను స్వాధీనం చేసుకు న్నారు. కారులో ప్రయాణిస్తున్న సౌరభ్ అనే యువకుడిని, మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆయుధం గురించి ప్రశ్నించారు. పిస్టల్ తనది కాదని, కారు యజమాని విజయ్ మాణేది అని సమాధానమిచ్చారు. లైసెన్స్ను పరిశీలించిన పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అది ఒరిజినల్ లైసెన్స్ కాదన్న అనుమానంతో పూర్తి వివరాలను సేకరించారు. ఒకవేళ ఒరిజినల్ లైసెన్స్ అయినప్పటికీ అది జారీ చేసిన రాష్ట్రం దాటి ఆయుధాలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం నేరం. దీన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని తిరుమలకు తీసుకెళ్లి విచారణ జరిపారు. మెట్ల మార్గంలో కొండపైకి చేరిన విజయ్ మాణేను తిరుమలలో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గంజాయి, మద్యం సీసాలు లభ్యం: ఇదిలా ఉండగా బుధవారం అలిపిరి వద్ద తనిఖీల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన బబ్లూ, బీరాన్ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి 60 గ్రాముల గంజాయి, 9 మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో 100 గుట్కా ప్యాకెట్లు, 30 బీడీ కట్టలను కూడా గుర్తించినట్లు తెలిపారు. -
అలిపిరి తరహాలో రహదారులు
- శ్రీశైలం ప్రధాన రహదారుల విస్తరణపై ప్రిన్సిపల్ సెక్రటరీ - ఆధ్యాత్మికత ఉట్టి పడేలా నిర్మించాలని ఆదేశం శ్రీశైలం: శ్రీశైలమహాక్షేత్రంలోని ప్రధాన రహదారులను అలిపిరి తరహాలో అధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్వీ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా రూ. 200 కోట్లతో చేపట్టిన రహదారి విస్తరణ పనులను మంగళవారం ఈఓ నారాయణభరత్గుప్తతో కలిసి ఆయన పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రథశాల వీధి, పోçస్టాఫీస్రోడ్డు, అసుపత్రి నుంచి మల్లికార్జునసదన్ వెళ్లే రూటు, టోల్గేట్ నుంచి శివసదనం కూడలి రోడ్లను పరిశీలించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందునా అందుకు తగ్గట్టు ప్రధాన రహదారుల విస్తరణ చేపట్టాలన్నారు. ఇరువైపులా మొక్కలతో పచ్చదనాన్ని పెంపొందిస్తే క్షేత్రంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు. తిరుమలలోని అలిపిరి తరహాలో క్షేత్రంలో కూడా ప్రవేశ రహదారులను ఆధ్యాత్మికంగా, ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలంలోని ప్ర«ధాన రహదారుల విస్తరణలో పక్కా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆధ్యాత్మికతతో కూడిన ఆహ్వాన ద్వారాలు, సందేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆయుర్వేద వైద్యశాల పరిశీలన.. దేవస్థానం పరిధిలోని ఆయుర్వేద ఆసుపత్రిని జేఎస్వీ ప్రసాద్.. ఈఓ నారాయణభరత్గుప్త, ఎండోమెంట్ సీఈ సుబ్బారావు, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం హార్టికల్చరిస్ట్ ఏడీ వెంకట్రావు తదితరులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయుర్వేద వైద్యాధికారిణి డాక్టర్ లావణ్య ఆసుపత్రికి సంబంధించిన విషయాలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి ఆవరణలో ఔషధ మొక్కలను పెంచాలని, వాటి వివరాలు, ఆవశ్యకతను తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన దేవస్థానం నిర్వహిస్తున్న ఉచిత వైద్యశాలను పరిశీలించారు. అక్కడి డాక్టర్లు భక్తులు, స్థానికులకు అందిస్తున్న వైద్యసేవలు, అందుకు అవసరమైన వసతులపై ఈఓ నారాయణ భరత్గుప్త, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎండోమెంట్ సీఈ సుబ్బారావు, ఈఈ శ్రీనివాస్, దేవస్థానం హార్టికల్చరిస్ట్ ఏడీ వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
తిరుమలలో పెరటాశి భక్తుల రద్దీ
-
తిరుమలలో పెరటాశి భక్తుల రద్దీ
సాక్షి,తిరుమల: తిరుమల శనివారాల్లోని రెండో శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో నిండాయి. సాయంత్రం 6 గంటల వరకు రెండు కాలిబాటల్లోనూ సుమారుగా 24 వేల మంది నడిచివచ్చారు. కాలిబాట భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండాయి. సర్వదర్శనం క్యూలైన్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో సాయంత్రం ఆరుగంటల వరకూ 61,271 మంది దర్శించుకున్నారు. పెరిగిన రద్దీ వల్ల గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు గదుల కోసం నిరీక్షించారు. కల్యాణ కట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. అదనపు లడ్డూలు పొందేందుకు భక్తులు ఇక్కట్లు చవిచూశారు. హుండీ కానుకలు రూ.2.32 కోట్లు లభించాయి. -
తిరుమలలో భక్తుల రద్దీ
సాక్షి,తిరుమల: తిరుమల శనివారాల్లోని రెండో శనివారం కావటంతో శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాలు నడిచివచ్చే భక్తులతో నిండాయి. సాయంత్రం 6 గంటల వరకు రెండు కాలిబాటల్లోనూ సుమారుగా 24 వేల మంది నడిచివచ్చారు. కాలిబాట భక్తులతో నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్లు నిండాయి. సర్వదర్శనం క్యూలైన్లు కూడా భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో సాయంత్రం ఆరుగంటల వరకూ 61,271 మంది దర్శించుకున్నారు. పెరిగిన రద్దీ వల్ల గదులు ఖాళీ లేవు. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ భక్తులు గదుల కోసం నిరీక్షించారు. కల్యాణ కట్టల్లోనూ తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. అదనపు లడ్డూలు పొందేందుకు భక్తులు ఇక్కట్లు చవిచూశారు. హుండీ కానుకలు రూ.2.32 కోట్లు లభించాయి. -
త్వరలో తమిళ ఎస్వీబీసీ చానల్ ప్రారంభం
తిరుపతి సిటీ: మన పూర్వీకులు మనకు అందించిన ఆధ్యాత్మిక కళాసంపదను భావితరాలకు అందించాలని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ నమూనా ఆలయం వద్ద బుధవారం శ్రీవెంకటేశ్వర భక్తిచానల్ నూతన స్టూడియో, పరిపాలనా భవనాలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు భూమి పూజ నిర్వహించారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తిరుపతిలో మొట్టమొదటిసారిగా అన్ని వసతులతో కూడిన స్టూడియోను నిర్మిస్తుదన్నారు. తద్వారా కళాకారులకు అద్భుత అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఎస్వీబీసీ ప్రసారాలకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తున్నదని, కార్యక్రమాలను మరింత నాణ్యంగా రూపొందించాలని ఆయన కోరారు. ఈవో సాంబశివరావు మాట్లాడుతూ శ్రీవారి కార్యక్రమాలను, ధర్మప్రచారానికి ఎస్వీబీసీ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. త్వరలో ఎస్వీబీసీ తమిళ చానల్ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. శ్రీవేంకటేశ్వర భక్తిచానల్ నూతన స్టూడియో, పరిపాలనా భవనాలను రూ.14.50 కోట్లతో 4525.36 మీటర్ల విస్తీర్ణంలో మూడు అంతస్తులతో నిర్మిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్లు సుధాకర్యాదవ్, భానుప్రకాష్రెడ్డి, చీప్ ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, ఎస్వీబీసీ సీఈవో నరసింహరావు, ఎస్ఈ రమేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఇవేం తనిఖీలండీ బాబూ..
► అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీల్లో సిబ్బంది నిర్లక్ష్యం ► పట్టించుకోని టీటీడీ భద్రతాధికారులు తిరుపతి అర్బన్: టీటీడీ భద్రతా విభాగం నిబంధనల మేరకు తిరుమల కెళ్లే ప్రతి వాహనాన్ని, అందులోని ప్రతి వ్యక్తినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలి. అందుకోసం అలిపిరి వద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తనిఖీ యంత్రాల టోల్గేట్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పటిష్ట తనిఖీలు చేపట్టేందుకు వీలుగా టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని నియమించారు. వీరు రోజూ వేకువజామున 3 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు షిప్టుల వారీగా పనిచేస్తూ తనిఖీలు నిర్వహిస్తుంటారు. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకుండా పోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అలిపిరి టోల్గేట్ వద్ద భద్రతా తనిఖీల్లో డొల్లతనం కొట్టొచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు వాహనాల్లోని కొందరు వ్యక్తులను కిందికి దించకుండా అలాగే వాహనాల్లోనే ఉంచడం, మరికొందరిని బలవంతంగా వాహనాల్లో నుంచి కిందికి దింపి మనుషులను, లగేజీలను తనిఖీలు చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ఈ విధానంపై గతంలో అనేకసార్లు యాత్రికులు టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండాపోతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి యాత్రికు లు కార్లు, ఇతర వాహనాలు, ద్విచక్ర వాహనాలతో పాటు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో నిత్యం వేలసంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు నిషేధిత వస్తువులైన మాంసం, మారణాయుధాలు, మద్యం, గుట్కా, పాన్ ప్యాకెట్లు, పేలుడు పదార్థాలు ఏ మార్గంలోనూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్లకుండా కట్టడి చేయడమే ఈ టోల్గేట్లో చేపడుతున్న తనిఖీల ప్రధాన ఉద్ధేశం. కానీ అధికారుల పర్యవేక్షణా లోపం, సిబ్బంది నిర్లక్ష్యంతో అలిపిరి టోల్గేట్ వద్ద తనిఖీలు ఎవరి ఇష్టం వారిదే అన్నట్లు కొనసాగుతోంది. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే భ విష్యత్లో ఇబ్బందులు తప్పవని పలువురు సూచిస్తున్నారు. ఎవరైనా తనిఖీ తప్పనిసరి టీటీడీ భద్రతా నియమాల ప్రకారం టోల్గేట్ వద్ద ప్రతి వాహనంలోని ప్రతి వ్యక్తినీ, లగేజీ బ్యాగులను కచ్చితంగా తనిఖీ చేయాల్సిందే. అందుకు భిన్నంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించబోం. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి తనిఖీలను పటిష్టం చేస్తాం. - నందీశ్వరరావు, అలిపిరి అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ -
వ్యభిచారం కేసులో ఐదుగురి అరెస్టు
తిరుపతి క్రైం: అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళం రోడ్డులోని లాడ్జిలో నలుగురు విటులు సహా లాడ్జి నిర్వాహకుడిని అలిపిరి పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. మంగళం రోడ్డులోని ఓ ప్రైవేటు లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హరీష్, యశ్వంత్రెడ్డి, బబ్బులు, దిలీప్, ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. లాడ్జి నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. అనంతరం రిమాం డ్కు తరలించారు. యువతికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. -
అలిపిరి వద్ద భారీగా బంగారం పట్టివేత
తిరుపతి: తిరుపతి అలిపిరి టోల్గేట్ వద్ద సోమవారం విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బంగారంతో ఉన్న ఓ బ్యాగు వెలుగు చూసింది. భక్తుల బ్యాగులను స్కానింగ్ చేస్తున్న క్రమంలో బంగారం ఉన్నట్టు బయటపడడంతో దాన్ని స్వాధీనం చేసుకున్నారు. తెరచి చూడగా భారీ మొత్తంలో బంగారం బయటపడింది. దాన్ని తీసుకొచ్చిన వారిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. బంగారం విలువను ఇంకా లెక్కించాల్సి ఉంది. -
అలిపిరి కేసు; మాజీ మావోయిస్టుకు విముక్తి
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన 2003 అక్టోబర్ 1న జరిగిన దాడి కేసులో కోర్టు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకేకృష్ణను కోర్టు నిర్దోషిగా పేర్కొంది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సందానందమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో 25వ నిందితుడిగా అభియోగాలు ఎదురొన్న దామోదరంను తిరుపతి టూటౌన్ పోలీసులు బెంగళూరులో 2014లో అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్ష్యులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్ష్యం చెప్పాలని కోర్టు సమన్లు పంపినా వారు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆత్మహత్యాయత్నం కేసులో రామచంద్రయ్య అరెస్ట్
ఆత్మహత్యాయత్నం కేసులో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు అన్నా రామచంద్రయ్యను అలిపిరి సీఐ శ్రీనివాసులు సోమవారం అరెస్టు చేశారు. బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ అన్నా రామచంద్రయ్య నిరాహార దీక్ష చేపట్టగా నాలుగో రోజున పోలీసులు దీక్షను అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ని చికిత్స నిమిత్తం రుయాకు తరలించారు. కాగా, ఈ సందర్భంగా రామచంద్రయ్య పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయన్ని సోమవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. -
అలిపిరి ఘటన కేసులో ముగిసిన సాక్షుల విచారణ
తిరుపతి లీగల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై 2003 అక్టోబర్ 1వ తేదిన తిరుపతి అలిపిరి సమీపంలో జరిగిన క్లెమోర్మైన్ దాడి కేసులో సాక్షుల విచారణ సోమవారం ముగిసింది. ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 7వ తేది నుంచి సాక్షుల విచారణ ప్రారంభమైంది. 52 మంది ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యం ఇచ్చారు. సుమారుగా 85 పత్రాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలో కేసులో 25వ నిందితుడైన దామోదర్ అలియాస్ సాకే కృష్ణను సోమవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కేసు దర్యాప్తు అధికారి, అప్పట్లో సిట్ డీఎస్పీగా ఉన్న ఎస్.ఎం.వల్లీ ఇచ్చిన సాక్ష్యాన్ని తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తి రికార్డు చేశారు. ఎస్.ఎం.వల్లీని దామోదరం తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేసారు. దీంతో ప్రాసిక్యూషన్ తరఫున సాక్షుల విచారణ ముగిసింది. కాగా, కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబునాయుడు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు కోర్టుకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి వారి సాక్ష్యాలను క్లోజ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే రెడ్డివారి రాజశేఖర్రెడ్డిలు మాత్రం కోర్టుకు హాజరై సాక్ష్యం ఇచ్చారు. ఇదిలా ఉండగా, దామోదరం స్టేట్మెంట్ రికార్డు చేయడానికి న్యాయమూర్తి కేసును ఫిబ్రవరి 4వ తేదికి వాయిదా వేశారు. -
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా గంజాయి!
-
కీలక దశకు అలిపిరి ఘటన కేసు విచారణ
- సీఎం, మంత్రి బొజ్జలకు 17లోగా సమన్లు - అదేరోజు హాజరయ్యేలా చూడాలని పోలీసులకు కోర్టు ఆదేశం తిరుపతి లీగల్: సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి సమీపంలో క్లెమోర్ మైన్స్తో దాడి జరిగిన కేసు విచారణ వేగవంతమైంది. కేసులో రెండవ సాక్షి, ప్రస్తుత ఏలూరు పోలీసు ట్రైనింగ్ కాలేజ్ డీఎస్పీ కె. రాజేశ్వరరెడ్డి బుధవారం కోర్టుకు హాజరయ్యారు. ఇదివరలో జడ్జి జారీచేసిన బెయిలబుల్ వారెంట్ను రీకాల్ చేసుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో సీఎం కాన్వాయ్ పైలట్ ఆఫీసర్గా ఉన్న రాజేశ్వరరెడ్డి సంఘటనను కోర్టులో వివరించారు. కాగా, విచారణ షెడ్యూల్ ప్రకారం సాక్షులను హాజరుపరచకపోవడంపై జడ్జి బుధవారం పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి సాక్షి సమన్లు ఈ నెల 17వ తేదీలోగా అంద జేసి 17వ తేదీన కోర్టుకు హాజరయ్యేలా చూడాలని జడ్జి ఆదేశించారు. అనంతరం కేసును ఈ నెల 11వతేదీకి వాయిదా వేస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సదానందమూర్తి ఆదేశాలు జారీ చేశారు. -
అన్నమయ్య మార్గానికి మహర్దశ
అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పురాతన అన్నమయ్య మార్గానికి అనుసంధానంగా ఫుట్ఓవర్బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించింది. బ్రహ్మోత్సవాల నాటికి ఈ పనులు పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసింది. తిరుమల: అన్నమయ్య మార్గానికి అనుసంధానంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా సాగుతున్నాయి. అలిపిరి కాలిబాట మార్గంలో తిరుమలకు రోజుకు 10 నుంచి 20 వేల మంది భక్తులు వస్తుంటారు. తిరుమల శనివారాలు, వైకుంఠ ఏకాదశి రోజుల్లో ఆ సంఖ్య యాభైవేలు దాటుతుంది. అవ్వాచ్చారి కోన వద్ద రోడ్డు చాలా ఇరుకుగా ఉండడంతో వాహన ప్రమాదాల్లో భక్తులు తీవ్రంగా గాయపడుతుంటారు. ఇక్కడే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వీటి నివారణలో భాగంగా ఎగువ మార్గాన 1.5 కి.మీ దూరంలో ఉన్న పురాతన అన్నమయ్య కాలిబాట మార్గాన్ని అధునాతనంగా పునరుద్ధరించారు. ఐదేళ్లకు ముందు రూ.2 కోట్లతో 680 మీటర్ల మేరకు గ్రానైట్ బండరాళ్లను పరిచారు. 2012లో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అప్పటి సీఎం కిరణ్కుమార్రెడ్డి చేతుల మీదుగా టీటీడీ అధికారులు హడావిడిగా ప్రారంభోత్సవం చేశారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, రోడ్డు విస్తరణ రూ.6 కోట్ల అంచనాలతో పనులు మొదలుపెట్టి రూ.2 కోట్లతో అన్నమయ్య పురాతన మార్గాన్ని అభివృద్ధి చేశారు. మిగిలిన రూ.4 కోట్లతో అక్కడి నుంచి మోకాళ్ల పర్వతం వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అవ్వాచ్చారి కోన ప్రాంతంలోని ఇరుకైన రోడ్డు విస్తరణ పనులు కొనసాగించాల్సి ఉంది. దీనిపై టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు సమీక్షించి మలిదశ పనులకు అనుమతి ఇచ్చారు. తొలి విడతగా రూ.30 లక్షలతో పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించారు. ఇందుకు అనువుగా కొంత రోడ్డును విస్తరించారు. బ్రహ్మోత్సవాలకు ఈ మార్గాన్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు అధికారులు పనులు వేగంగా చేస్తున్నారు. శ్రీవారికి రూ.31 లక్షల విరాళం సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారికి గురువారం రూ.31 లక్షలు విరాళం గా అందింది. ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు చెన్నైకు చెందిన డి.శ్రీనివాస్ రూ.25 లక్షలు ఇచ్చారు. నిత్యాన్నప్రసాదం ట్రస్టుకోసం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పల్లంరాజు సుబ్బారావు రూ.లక్ష, హైదరాబాద్కు చెందిన కె.రామకృష్ణ రూ.2లక్షలు, బ్రిటన్కు చెందిన ప్రవాస భారతీయురాలు కె.నిత్య రూ.లక్ష, విజయవాడకు చెందిన అప్పారావు రూ.లక్ష, శ్రీనివాస్ చక్రవర్తి రూ.లక్ష అందజేశారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నానికి 31 కంపార్టుమెంట్లు నిండాయి. సాధారణ దర్శనానికి 15 గంటలు, కాలినడక భక్తులకు 7 గంటల సమయం పడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో అలిపిరి గేట్ వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో కూడా శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తడం విశేషం. -
వేలం వర్రీ!
అంపిలి గ్రామ రైతులకు బుధవారం ఆంధ్రాబ్యాంకు షాకిచ్చింది. ఈ గ్రామంలోని 30 రైతులకు బ్యాంకు నుంచి నోటీసులందాయి. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు చెల్లించకపోతే వాటిని వేలం వేస్తామన్న హెచ్చరిక ఆ నోటీసుల సారాంశం. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. రుణమాఫీ ఉచ్చులో పడి పీకల మీదకు తెచ్చుకున్నామని ఆందోళన చెందుతున్నారు. పాలకొండ : రైతు రుణమాఫీ హామీతో ఆధికారం చేపట్టిన ప్రభుత్వం.. ఆనక సవాలక్ష నిబంధనలతో తమను మోసగించిందని రైతులు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్కేల్ ఆఫ్ పైనాన్స్ పేరుతో రుణమాఫీ అర్హుల జాబితాను, మొత్తాలను సగానికి సగం కోత వేసినా..మిగిలిన వాటికైనా ఇప్పటికీ చెల్లింపులు జరపకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏడాది వడ్డీతో సహా రుణాలు చెల్లించాలని బ్యాంకులు పీక మీద కత్తి పెడుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో తాజాగా బ్యాంకులు బంగారం తాకట్టు రుణాలకు సంబంధించి జారీ చేస్తున్న వేలం నోటీసులు రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. పంట రుణాలతోపాటు బంగారం రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులు తీసుకున్న రుణంలో నాలుగోవంతు బ్యాంకులకు జమ చేస్తామని, మిగతా మొత్తానికి బ్యాంకులకు ఒప్పంద పత్రాలు అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో బ్యాంకు అధికారులు తమ పని తాము చేసుకుపోతున్నారు. బకాయి పడిన రైతులకు వేలం నోటీసులు జారీ చేస్తున్నారు. అందులో భాగంగా పాలకొండ మండలం అంపిలి గ్రామానికి చెందిన 30 మంది రైతులకు బుధవారం ఆంధ్రాబ్యాంకు నుంచి నోటీసులు అందాయి. వీరంతా బంగారు అభరణాలను తాకట్టుపెట్టి రుణాలు పొందినవారే. మాఫీ జాబితాలో పేర్లు ఉండడంతో రుణాలు చెల్లించకుండా ఉన్నారు. అయితే రుణమాఫీ నిధులు బ్యాంకులకు జమ కాకపోవడంతో బ్యాంకర్లు బంగారు అభరణాలను వేలం వేసేందుకు సిద్ధమయ్యారు. వడ్డీతో సహా రుణ మొత్తాలు భారీగా పెరిగిపోవడం.. ఒకేసారి ఆ మొత్తం చెల్లించాల్సి రావడం రైతులను కలవరపరుస్తోంది. బ్యాంకులు మాత్రం తమకేమీ సంబంధం లేదని రైతులపైనే భారం వేస్తున్నాయి. మాఫీ జాబితాలో పేరు ఉన్నా... ఆంధ్రా బ్యాంకులో బంగారు అభరణాలు తాకట్టుపెట్టి రూ. 30 వేల రుణం తీసుకున్నాను. ఇప్పుడు వడ్డీతో కలిపి రూ. 42 వేలు చెలించాల్సి ఉంది. రుణమాఫీ జాబితాలో నా పేరు ఉండడంతో అప్పు చెల్లించలేదు. రుణమాఫీ పత్రాలు అందజేశారు. కానీ నిధులు జమ కాలేదంటూ వస్తువులను వేలం వేస్తామని నోటీసులు అందజేశారు. -లంక సూర్యనారాయణ, రైతు, అంపిలి మాఫీకి రుణాలకు సంబంధం లేదు రుణమాఫీకి రుణాలు చెల్లించడానికి సంబంధంలేదు. ప్రభుత్వం మాఫీ ప్రకటిస్తే నిధులు బ్యాంకులకు జమ కావాలి. ఎడాదిన్నర దాటిన రుణాలకు నోటీసులు ఇస్తున్నాం. ఒకవేళ మాఫీ వస్తే రుణాలు కట్టిన వారికీ వర్తిస్తుంది. ప్రభుత్వం నిధులు చెల్లించే వరకూ రుణాలు చెల్లించకుండా ఉంటే ఎలా? ప్రభుత్వం నిధులు జమ చేస్తే నోటీసులు వెనుక్కి తీసుకుంటాం. -జె.షన్ముఖరావు, ఆంధ్రా బ్యాంకు మేనేజర్ -
'నా భర్త నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించండి'
హైదరాబాద్: ఎస్ఐగా పనిచేస్తున్న తన భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉన్నట్లు బుధవారం ఓ వివాహిత మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)ని ఆశ్రయించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన సవితాబాయ్ అలిపిరి స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న గణేష్ భార్య. వీరు గతంలో శ్రీశైలంలో పెళ్లి చేసుకున్నారు. ఇరువురికీ రెండో పెళ్లి. గణేష్ గత కొంతకాలంగా విడాకులు కావాలంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. తనకు, తన ఇద్దరు పిల్లలకు రక్షణ కల్పించాలని కోరడంతో ఫిర్యాదు స్వీకరించిన హెచ్ఆర్సీ ఈనెల 29 లోపు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తిరుపతి అర్బన్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో సామూహిక అత్యాచారం
-
'అలిపిరి’ ఘటన కేసులో ముగ్గురికి శిక్ష
నాలుగు సంవత్సరాలు జైలు, రూ.700 జరిమానా 2003 అక్టోబర్ 1న చంద్రబాబు కాన్వాయ్పై మావోయిస్టుల దాడి సాక్షి, తిరుపతి: ఏపీ సీఎం చంద్రబాబుపై 2003 అక్టోబర్ ఒకటిన జరిగిన బాంబుదాడి కేసులో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులు తిరుపతికి చెందిన జి.రామ్మోహన్రెడ్డి అలియాస్ తేజ, వైఎస్సార్జిల్లా వెంకటరెడ్డిగారి పల్లెకు చెందిన సడిపిరాళ్ల నరసింహారెడ్డి అలియాస్ రాజశేఖర్, చిత్తూరు జిల్లా దిగువ అంకమవారి పల్లెకు చెందిన ఎం.చంద్ర అలియాస్ కేశవ్ అలియాస్ వెంకటరమణకు నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ గురువారం తిరుపతి అదనపు సహాయక సెషన్స్ కోర్టు జడ్జి ఒ.వెంకటనాగేశ్వరరావు తీర్పు చెప్పారు. కుట్ర, హత్యాయత్నం, దాడి, పేలుడు పదార్థాల దుర్వినియోగం నేరారోపణలతో ఐపీసీ సెక్షన్ 307, 326, 324, 120(బి) మారణాయుధాల చట్టం 4, 6 సెక్షన్ల కింద 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీటీ నాయక్ నేతృత్వంలో డీఎస్పీ ఎస్ఎం వలీ ప్రత్యేక బృందంగా (సిట్) ఏర్పడి కేసును దర్యాప్తు చేశారు. తిరుపతి కోర్టులో 2004లో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 96 మంది సాక్షులను చూపగా 76 మందిని కోర్టు విచారించింది. 131 పత్రాలను, 146 వస్తువులను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో చంద్రబాబునూ 14వ సాక్షిగా కోర్టు విచారించింది. -
'నా కుమారుడు ఏ తప్పూ చేయలేదు'
తిరుపతి: తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని, అన్యాయంగా శిక్ష విధించారని, అలిపిరి ఘటనలో శిక్ష పడిన రామ్మోహన్ రెడ్డి తల్లి ఇంద్రావతి వాపోయారు. సమాజంలో అరాచకాలు చూసి తట్టుకోలేకనే తన కుమారుడు రెండేళ్లపాటు నక్సలైట్లతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. పది సంవత్సరాల క్రితమే నక్సలైట్ బాట వదిలి, జనజీవన స్రవంతిలో కలిసినట్లు చెప్పారు. రామ్మోహన్ రెడ్డి టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్లలో పనిచేసినట్లు వివరించారు. విధించిన శిక్షపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. తన కుమారుడు ఎప్పటికైనా నిర్దోషేనని ఇంద్రావతి అన్నారు. ** -
అలిపిరి కేసులో దోషులకు శిక్ష ఖరారు
-
అలిపిరి కేసులో దోషులకు నాలుగేళ్లు జైలు
తిరుపతి : అలిపిరి బాంబు దాడి కేసులో దోషులకు గురువారం శిక్ష ఖరారైంది. న్యాయస్థానం ముగ్గురు దోషులకు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు రూ.500 జరిమానాను విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2003 అక్టోబర్లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద నక్సల్స్ దాడి చేసిన విషయం విదితమే. ఈ కేసులో నిందితులు రాంమ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కేశవ్లను దోషులగా నిర్థారిస్తూ న్యాయస్థానం ఈ శిక్షలు ఖరారు చేసింది. తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న బాబుపై ఈ దాడి జరిగింది. కాగా తాము ఎప్పుడో జనజీవన స్రవంతిలో కలిసిపోయామని, కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు దోషులు నర్సింహారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, కేశవ్ తెలిపారు. -
అలిపిరి కేసులో ముగ్గురు దోషులుగా నిర్థారణ
తిరుపతి : అలిపిరి బాంబు దాడికేసులో ముగ్గురిని న్యాయస్థానం దోషులుగా నిర్థారించింది. నిందితులు రాంమ్మోహన్ రెడ్డి, నర్సింహారెడ్డి, కేశవ్లను కోర్టు దోషులుగా తేల్చింది. మరికాసేపట్లో వారికి శిక్షలు ఖరారు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 2003 అక్టోబర్ ఒకటో తేదీన అలిపిరి సమీపంలో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. కేసులో మొత్తం 33మంది నిందితులు ఉన్నారు. వీరిలో ఇదివరలో నలుగురిపై కేసు విచారణ జరగ్గా ఇద్దరిపై తిరుపతి నాల్గో అదనపు జిల్లా జడ్జి కోర్టు కేసు కొట్టివేస్తూ 2012 నవంబర్ 8న తీర్పు చెప్పింది. మరో ఇద్దరికి కోర్టు శిక్ష విధించటంతో వారు హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. కేసులో మొత్తం 96మంది సాక్షులు ఉండగా ఇదివరలోనే చాలామందిని కోర్టు విచారించింది. మొత్తం 33మంది నిందితుల్లో 29 మందిని మావోయిస్టులుగా పోలీసులు పేర్కొన్నారు. -
బాబుపై దాడి కేసులో మరో ఇద్దరు మావోలు అరెస్ట్
తిరుపతి : అలిపిరిలో చంద్రబాబు నాయుడుపై బాంబు దాడి ఘటనకు సంబంధించి మరో ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణ అలియాస్ దామోదరం, అతని భార్య భవాని అలియాస్ గీతలను పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గురువారం వారిని తిరుపతి కోర్టులో హాజరు పరిచారు. మావోయిస్టు దంపతులకు కోర్టు... అక్టోబర్ 1వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరిది అనంతపురం జిల్లా గూనిపల్లికి చెందినవారు. కాగా చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నాలుగు రోజుల క్రితం మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని కోల్కతాలో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
అలిపిరి దాడి కేసు నిందితుడి అరెస్ట్
చెన్నై: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై 2003లో అలిపిరి సమీపంలో జరిగిన దాడితో సంబంధం ఉన్న మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని కోల్కతాలో అదుపులోకి తీసుకుని చెన్నై మీదుగా నెల్లూరు తరలించారు. అయితే మాజీ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్థన్రెడ్డిపై దాడి కేసులో అతడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని సమాచారం. మావోయిస్టు అగ్రనేత కిషన్ జీ అనుచరుడైన దీపక్ పై పలు కేసులున్నాయి. -
టీటీడీ మార్కెటింగ్ గోదాంలో అగ్నిప్రమాదం