కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టిన మహిళ | woman devotee betas constable with sandal at alipiri | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

Jun 8 2014 1:52 PM | Updated on Aug 17 2018 7:54 PM

కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

తిరుపతి: కలియుగ వైకుంఠం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు అలిపిరి చెక్ పోస్టు వద్ద భద్రతా సిబ్బంది దురుసు ప్రవర్తనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో భద్రత్రా సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగుతుండడం నిత్యకృత్యంగా మారింది.

అలిపిరి చెక్ పోస్టు వద్ద తనిఖీల సందర్భంగా ఓ కానిస్టేబుల్కి, భక్తురాలికి మధ్య ఆదివారం వివాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో సహనం కోల్పోయిన భక్తురాలు కానిస్టేబుల్‌ను చెప్పుతో కొట్టింది. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి అలిపిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement