కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రాలకు చెల్లించే నిధుల్లో కోత పెట్టడం, పెద్ద నోట్లను రద్దు చేయడంతో చోటుచేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయే ప్రమాదముందని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం గురువారం సాయంత్రం రాజ్భవన్కు వెళ్లి గవర్నర్తో దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన పన్నుల వాటా తగ్గింపు, పెద్ద నోట్ల రద్దు ప్రభావంపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. నెలకు రూ.1,000 కోట్లనుంచి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయానికి గండి పడుతుందని సీఎం నివేదించినట్లు తెలిసింది. అంతమేరకు కేంద్ర ప్రభుత్వ నష్ట పరిహారం నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని, కేంద్రం ఎలాంటి మినహారుుంపులు, సవరణలు ఇస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
Published Fri, Nov 11 2016 7:22 AM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement