కశ్మీర్లోయలో వరుసగా బుధవారం ఐదోరోజూ ఉద్రిక్తత కొనసాగింది.సాయంత్రం వరకు కొంచెం ప్రశాంతంగా కనిపించగా, ఆ తర్వాత ఒక్కసారిగా మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. కోయ్మోలోని హర్నాగ్లో కొంతమంది యువకులు వాహనాల్లో వెళ్తున్న భద్రతాబలగాలపై రాళ్లు రువ్వారు. బలగాలు కాల్పులు జరపగా, ఒక యువకుడు మృతిచెందాడు. దీంతో ఐదురోజుల ఘర్షణల్లో మృతుల సంఖ్య 35కు పెరిగింది.