ప్రస్తుతం రాష్ట్రంలో ఏ బ్యాంకుకు వెళ్లినా చాంతాడంత క్యూలు.. గంటలకొద్దీ నిలబడినా క్యాష్ అందుతుందన్న నమ్మకం లేదు. ఇచ్చే నగదుకూ పరిమితులు.. ఇక 80 శాతం ఏటీఎంల్లో ‘నో క్యాష్’ అంటూ బోర్డులు.. కొన్ని ఏటీఎంలలో అప్పుడప్పుడూ కొద్దిగా నగదు పెడుతున్నా కొద్దిసేపటికే అయిపోతోంది.. కేంద్రప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రకటించి 19 రోజులు గడిచినా నగదు కొరత, సమస్య తీవ్రత పెరుగుతుందేతప్ప తగ్గట్లేదు... ప్రజల అవసరాలకు తగిన నగదు లభించట్లేదు.. ఇటువంటి పరిస్థితుల్లో ఒకటో తారీఖు వస్తుందంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేతన జీవుల గుండెలు దడదడమంటున్నారుు. పాత నోట్ల రద్దువల్ల ఆదాయం తగ్గినప్పటికీ ఉద్యోగుల వేతనాలకు సమస్య లేదని, వారి బ్యాంకుఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. జీతం సొమ్మును ఎలా తీసుకోవాలనే భయం ఉద్యోగులకు పట్టుకుంది.
Published Mon, Nov 28 2016 8:54 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement