ఏజన్సీలో మృత్యుఘోష ఆగడం లేదు. విలీన మండలాలను పట్టి పీడిస్తున్న కాళ్లవాపు వ్యాధితో వీఆర్పురం మండలంలో ఇప్పటికే ఆరుగురు మృతి చెందగా తాజాగా చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన బందం సుబ్బమ్మ (60) అనే గిరిజన మహిళ కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. బొడ్రాయిగూడెంకు చెందిన సుబ్బమ్మ వారం రోజులక్రితం చట్టిలోని తన బంధువుల ఇంటికి వెళ్లగా జ్వరం రావడంతో చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు జ్వరంతోపాటు రక్తహీనత, కాళ్లవాపు లక్షణాలు కనిపించడంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటినుంచి కాకినాడలో చికిత్స పొందుతున్న సుబ్బమ్మ పరిస్థితి శుక్రవారం ఒక్కసారిగా విషమించడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Published Sat, Oct 1 2016 10:31 AM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement