శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దోపిడీ దొగలు బీభత్సం సృష్టించారు. సూళ్లూరుపేట సాయినగర్లో దోపిడీ దొంగలు మహిళలపై దాడికి పాల్పడ్డారు. కొందరు గుర్తుతెలియని దుండగులు ముగ్గురు మహిళలపై కత్తులతో దాడిచేసి వారి వద్ద ఉన్న ఆభరణాలు, నగదు దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 17 సవర్ల బంగారం, 17 వేల రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Published Sun, Dec 25 2016 7:25 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement