కాంగ్రెస్ పాలనలో అధోగతిపాలైన దేశం:వెంకయ్య | Venkaiah Naidu takes on Congress | Sakshi
Sakshi News home page

Published Sun, Aug 11 2013 5:18 PM | Last Updated on Fri, Mar 22 2024 11:32 AM

కాంగ్రెస్ పాలనలో దేశం అధోగతిపాలైందని బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఎల్బి స్టేడియంలో నవభారత యువభేరీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పోవాలి - బిజెపి రావాలి - నరేంద్ర మోడీ కావాలి అన్నట్లు ఉందన్నారు. దేశంలో పేదరికం పెరిగింది, అక్కడ ఇక్కడ అనిలేదు, ఎక్కడబడితే అక్కడ అవినీతి తాండవిస్తోందని చెప్పారు. ఇక భూమ్మీద, భూ గర్భం కూడా కుంభకోణాలమయం అయిందన్నారు. ధరలు అన్నీ విపరీతంగా పెరిగిపోయాయన్నారు. బిజెపి యువతలో విశ్వాసం కలిగిస్తున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ గురజాత్లో మూడు పర్యాయాలు ఘనవిజయం సాధించారు. గుజరాత్ను అభివృద్ధిపరిచారు. యువతకు అవకాశాలు ఇచ్చారని చెప్పారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement