venkaiah naidu
-
ఘంటసాల సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
‘‘ఘంటసాలగారిని శతాబ్ది గాయకుడు (సింగర్ ఆఫ్ సెంచరీ) అంటారు. ఆయన్ను నేను అమర గాయకుడు అంటాను. ఒక సాధారణ వ్యక్తిగా మొదలైన ఆయన జీవితం సంగీతంతో సాగుతూ... స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా, సినీ గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, భగవద్గీత గానాన్ని అందించిన తొలి తెలుగు స్ఫూర్తిగా భావితరాలకు ఆయన ఆదర్శంగా నిలుస్తారని భావిస్తున్నాను’’ అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దివంగత ప్రముఖ గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘ఘంటసాల: ది గ్రేట్’.ఈ చిత్రంలో ఘంటసాలపాత్రలో కృష్ణచైతన్య నటించారు. ఘంటసాల భార్య సావిత్రిపాత్రలో కృష్ణచైతన్య భార్య మృదుల నటించారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో సీహెచ్ ఫణి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్పోస్టర్ లాంచ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘ఘంటసాలగారిపై సినిమా తీసినందుకు ఫణిగారిని అభినందిస్తున్నాను. కృష్ణచైతన్య, మృదులలను మెచ్చుకుంటున్నాను.సదుద్దేశంతో తీసిన ఈ సినిమా చూడటం తెలుగు వారి కర్తవ్యం’’ అన్నారు. మరో అతిథి దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలి. ఉత్తరాది గాయకులకు ఇచ్చి ఆయనకు ఎందుకు ఇవ్వలేదు? ఎంజీఆర్కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి’’ అని అన్నారు. ‘‘మా సినిమాను ప్రేక్షకులకు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కృష్ణచైతన్య. ‘‘ఘంటసాలగారిపాట ఎంత గొప్పదో అందరికీ తెలుసు. కానీ ఆయన వ్యక్తిత్వం కొందరికే తెలుసు. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని ఈ సినిమాలో చెప్పడం జరిగింది’’ అని తెలిపారు సీహెచ్ రామారావు. -
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్ను హైదరాబాద్తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్చాట్లో హరీష్ రావు -
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: ఈరోజు(జూలై 1) భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్ ఫారం ‘ఎక్స్’లో మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జీవితంలో పాటించిన నిబద్దతను కొనియాడారు.‘వెంకయ్య నాయుడు గారు 75వ జన్మదినోత్సవం జరుపుకుంటున్న తరుణంలో ఆయనకు దీర్ఘాయువు, ఆరోగ్యం కలగాలని ప్రార్ధిస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు. బీజేపీ నేత వెంకయ్య నాయుడు 1949, జూలై 1న జన్మించారు. విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి అడుగిడారు. తన రాజకీయ జీవితంలో వెంకయ్య నాయుడు పలు పదవులు చేపట్టారు. Greetings to Shri @MVenkaiahNaidu Garu on his 75th birthday. Praying for his long and healthy life. On this special occasion, have penned a few thoughts on his life, service and commitment to nation building.https://t.co/rY3WzwQlKI— Narendra Modi (@narendramodi) July 1, 2024 -
వెంకయ్య నాయుడుపై మూడు పుస్తకాలు.. ప్రధాని మోదీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన జీవిత ప్రస్థానంపై మూడు పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్గా విడుదల చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పుస్తక ప్రతిని డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జి.సతీష్ రెడ్డికి వెంకయ్యనాయుడు అందించారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశనం చేస్తాయని, వెంకయ్యనాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. -
వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్
-
సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ
-
Padma Awards 2024: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
-
‘పద్మశ్రీ’లకు రూ.25వేల పింఛన్
సాక్షి, హైదరాబాద్: పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల నగదు బహుమతి, ఖర్చుల నిమిత్తం నెలకు రూ.25 వేలు పింఛను ఇవ్వాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి చెప్పారు. తొవ్వ ఖర్చులకు కూడా కష్టంగా ఉన్నా, కనుమరుగవుతున్న కళలు, తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు కష్టపడుతున్న కళాకారులకు ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావించిందని తెలిపారు. పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవితోపాటు పద్మశ్రీకి ఎంపికైన ఆనందాచార్య, దాసరి కొండప్ప, ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, కేతావత్ సోంలాల్, కూరెళ్ల విఠలాచార్యలను ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను కాపాడేందుకు రాజకీయాలకతీతంగా అందరూ ఏకం కావాలని..లేదంటే తెలుగుభాష కాలగర్భంలో కలిసిపోతుందన్నారు. మారుమూల ప్రాంతాల్లో తెలుగు సంప్రదాయ కళలను కాపాడుతున్న కళాకారులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలతో గౌరవించడం సముచితమని, ఈ పరిస్థితుల్లో పురస్కారాలకు ఎంపికైన వారిని సత్కరించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా భావించినట్టు తెలిపారు. రాజ కీయాలకతీతంగా రాష్ట్రంలో కొత్త సంప్రదాయం నెలకొల్పేందుకు అవార్డుకు ఎంపికైన వారిని సన్మానించే కార్యక్రమం చేపట్టామన్నారు. విద్యార్థి దశ నుంచి తనకు వెంకయ్యనాయుడు ప్రసంగాలు అంటే తనకు ఇష్టమని రేవంత్రెడ్డి చెప్పారు. 1978లో విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా జైపాల్రెడ్డితో కలిసి ప్రజాసమస్యలపై పోరాడిన నేత వెంకయ్యనాయుడని కొనియాడారు. రాజకీయాల్లో భాష ప్రాధాన్యతపై వెంకయ్య చేసిన సూచనలను తాను పాటిస్తానని ఈ సందర్భంగా చెప్పారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాల్సిన నాయకుడన్నారు. కళాకారుడిగా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిరంజీవి అని..పున్నమినాగు సినిమా నుంచి సైరా నరసింహారెడ్డి వరకు ఒకే కమిట్మెంట్తో ఆయన ఉన్నారని కొనియాడారు. కొత్త సంప్రదాయానికి నాంది పలికిన రేవంత్రెడ్డి : వెంకయ్య మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. రాజకీయాల్లో ప్రమా ణాలు తగ్గిపోతున్నాయని, బూతులు మాట్లాడటం రాజకీయాల్లో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. బూతులు మాట్లాడేవారికి పోలింగ్ బూతుల్లోనే సమాధానం చెప్పాలన్నారు. తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎనీ్టఆర్, అక్కినేని అయితే, మూడోకన్ను చిరంజీవి అని కొనియాడారు. కళాకారులు ఎక్కడ గౌరవం పొందుతారో ఆ రాజ్యం సుభిక్షం : చిరంజీవి ప్రముఖ సినీనటుడు చిరంజీవి మాట్లాడుతూ ఎక్కడ కళాకా రులు గౌరవం పొందుతారో.. ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డులకు ఎంపికైన వారిని సన్మానించడం ముదావహమని పేర్కొన్నారు. ప్రజాగాయకు డు గద్దర్ పేరున అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించడం ఆహ్వానించదగిన పరిణామమని చెప్పారు. రాజకీయాల్లో దుర్భాషలు ఎక్కువయ్యాయని, వ్యక్తిగతంగా దుర్భాష లాడటం మంచిది కాదని, అలాంటి వారికి ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ వెంకయ్య, చిరంజీవిల ఔన్నత్యాన్ని కొనియాడారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంకయ్యను సత్కరించిన చిరంజీవి
-
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసిన FNCC సభ్యులు
భారత మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చర్ సెంటర్ (FNCC) ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు, వైస్ ప్రెసిడెంట్ టి. రంగారావు, సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, జాయింట్ సెక్రెటరీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు, ట్రెజరర్ బి. రాజశేఖర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ కాజా సూర్యనారాయణ, జే. బాలరాజు, ఏ. గోపాలరావు గార్లు వెంకయ్య నాయుడు గారిని కలిసి అభినందించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి. ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ.. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే గా, ఎంపీగా ఉండటమే కాకుండా వివిధ శాఖల మంత్రిగా అలాగే మాజీ ఉపరాష్ట్రపతిగా ఎన్నో సేవలు అందించారు. వెంకయ్య నాయుడు గారు చెప్పే విషయాలు చాలా విలువైనవిగా ఉంటాయి. ఆయన మాటల్ని అందరూ స్ఫూర్తిగా తీసుకుంటారు. అలాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషణం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సన్నిహితంగా ఉంటారని ఆయన తెలియ చేశారు. FNCC సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ.. ఈ రోజున వెంకయ్య నాయుడు గారి లాంటి ఉన్నత వ్యక్తికి పద్మ విభూషన్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. తెలుగువారిగా ఉపరాష్ట్రపతి స్థానానికి ఎదిగిన వ్యక్తి. తెలుగు సంప్రదాయ కార్యక్రమాలాకు హాజరవుతూ ప్రోత్సహించడంలో ముందుంటారు. అలాంటి వ్యక్తికి భారతరత్న రావాలని నా అభిప్రాయం అని తెలియజేశారు. మాకు సమయాన్ని కేటాయించినందుకు వెంకయ్య నాయుడు గారికి ధన్యవాదాలు అన్నారు -
నేను ఊహించని అవార్డ్ రావడం సంతోషంగా ఉంది: మెగాస్టార్
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి జాతీయ జెండాను ఎగురవేశారు. హైదరాబాద్లోని తన బ్లడ్ బ్యాంక్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను ఊహించని.. నేను ఎదురు చూడని పద్మవిభూషణ్ అవార్డ్ రావడం సంతోషంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా నా సేవలను గుర్తించి ఈ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా పద్మశ్రీ, పద్మభూషణ్ పొందిన తెలుగు రాష్ట్రాలవారికి.. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మెగాస్టార్ తన ట్వీట్లో రాస్తూ.. 'వెంకయ్యనాయుడు గారి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతిష్టాత్మకమైన 'పద్మవిభూషణ్' రావడం ఆనందంగా ఉంది. మీ సుదీర్ఘమైన ప్రజాసేవ, మీ జ్ఞానం, రాజకీయాల్లో గౌరవప్రదమైన మీ ప్రసంగం..మీ స్థాయిని పెంచుతుంది. మీతో పాటు అవార్డ్ దక్కడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ప్రతిభావంతులైన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రమణ్యం, అలాగే పద్మ అవార్డు గ్రహీతలందరికీ హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా నా సోదర వర్గానికి, తెలుగు రాష్ట్రాల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రియమైన మిథున్ దా (చక్రవర్తి), ఉషా ఉతుప్ జీ, దాసరి కొండప్ప, ఉమా మహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కూరెళ్ల విట్టలాచార్య,ఎ వేలు ఆనంద చారి, కేతావత్ సోమ్లాల్, విజయకాంత్ (మరణానంతరం)గారితో పాటు ప్రతి ఒక్కరికీ అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. Heartiest congratulations to Shri @MVenkaiahNaidu garu on the coveted ‘Padma Vibhushan’! Your long, relentless public service, your wisdom and dignified presence in politics enhances the stature and quality of political discourse. It is an even greater honour for me to be in… — Chiranjeevi Konidela (@KChiruTweets) January 26, 2024 -
చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ పురస్కారాలు
-
వెంకయ్యనాయుడు, చిరంజీవి ‘విభూషణులు’.. సీఎం జగన్, సీఎం రేవంత్ హర్షం
సాక్షి, న్యూఢిల్లీ/ సాక్షి నెట్వర్క్: తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్కు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రమణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీనటుడు విజయ్కాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయ్కాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ, ఏపీల నుంచి ఆరుగురికి.. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కూరెళ్ల విఠలాచార్య, కెతావత్ సోమ్లాల్, ఎ.వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి.ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి ‘అన్సంగ్ హీరోస్’ పేరిట పురస్కారం దక్కింది. క్రీడారంగం నుంచి టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా ఏడుగురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను నాలుగేళ్ల విరామం అనంతరం బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్కు మంగళవారం ప్రకటించడం తెలిసిందే. పద్మ అవార్డుల వివరాలివీ.. పద్మ విభూషణ్ (ఐదుగురికి): వైజయంతిమాల బాలి (కళారంగం–తమిళనాడు), కొణిదెల చిరంజీవి (కళారంగం–ఆంధ్రప్రదేశ్), ఎం.వెంకయ్యనాయుడు (ప్రజావ్యవహారాలు–ఆంధ్రప్రదేశ్), బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ–బిహార్), పద్మా సుబ్రమణ్యం (కళారంగం–తమిళనాడు). పద్మభూషణ్ (17 మందికి): ఫాతిమా బీవీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–కేరళ), హోర్మూస్ జీ ఎన్.కామా (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర), మిథున్ చక్రవర్తి (కళారంగం–పశ్చిమబెంగాల్), సీతారాం జిందాల్ (వర్తకం–పరిశ్రమలు–కర్నాటక), యంగ్ లియు (వర్తకం–పరిశ్రమలు–తైవాన్), అశ్విన్ బాలచంద్ మెహతా (వైద్యం–మహారాష్ట్ర), సత్యబ్రత ముఖర్జీ (మరణానంతరం–ప్రజా వ్యవహారాలు–పశి్చమ బెంగాల్), రాంనాయక్ (ప్రజా వ్యవహారాలు–మహారాష్ట్ర), తేజస్ మధుసూదన్ పటేల్ (వైద్యం–గుజరాత్), ఓలంచెరి రాజగోపాల్ (ప్రజా వ్యవహారాలు–కేరళ), దత్తాత్రేయ్ అంబాదాస్ మయలూ అలియాస్ రాజ్ దత్ (కళారంగం–మహారాష్ట్ర), తోగ్డన్ రింపోచే (ఆధ్యాత్మికత–లద్దాఖ్), ప్యారేలాల్ శర్మ (కళారంగం–మహారాష్ట్ర), చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ (వైద్యం–బిహార్), ఉషా ఉతుప్ (కళారంగం–మహారాష్ట్ర), విజయ్కాంత్ (మరణానంతరం–కళారంగం–తమిళనాడు), కుందన్ వ్యాస్ (సాహిత్యం, విద్య, జర్నలిజం–మహారాష్ట్ర) – పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవీ పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. బాధ్యతను పెంచింది ‘‘దేశం అమృత కాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నా. ఇది నా బాధ్యతను మరింతగా పెంచింది. రైతులు, యువత, మహిళలు సహా నవభారత నిర్మాణంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ పురస్కారాన్ని అంకితం చేస్తున్నా’’ – ఎం.వెంకయ్యనాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి సంస్కృతిని, కళలను చాటి చెప్పారు: రేవంత్రెడ్డి తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని.. సంస్కృతిని, కళలను దేశమంతటికీ చాటిచెప్పారని ప్రశంసించారు. తెలుగువారికి పద్మాలు గర్వకారణం: ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైనవారిని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవిలకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ‘పద్మ’ అవార్డులను దక్కించుకున్న వారిని అభినందించారు, వారు మనకు గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. తెలుగు వెలుగులకు శనార్తులు: బండి సంజయ్ పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వెలుగులకు తెలంగాణ శనార్తులు చెబుతోందని పేర్కొన్నారు. -
సాటిలేని మేటి నటి జమున
బంజారాహిల్స్: అందం, అభిమానం అభినయం, అభిజాత్యం కలిగిన సాటిలేని గొప్ప నటి జమున అని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ప్రముఖ రంగస్థల, సినీ నటుడు డా.అక్కిరాజు సుందర రామకృష్ణ రచించిన కంద పద్య సంపుటి ‘జమునా రమణ’ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించి ప్రసంగించారు. ‘ఆకృతి’ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..కంద పద్యం తెలుగు వారికి చాలా ఇష్టమైన పద్య ప్రక్రియ అన్నారు. ఓ సినీ నటి మీద పద్య శృతి రావడం ప్రశంసనీయం అన్నారు. జమున అందంతో పాటు నటనతో ఇతర నటులతో పోటీపడేవారన్నారు. సభకు అధ్యక్షత వహించిన సినీ పాత్రకేయుడు ఇమంది రామారావు మాట్లాడుతూ జమున అందంతో పాటు అభినయంలో కూడా దిట్ట అన్నారు. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావులతో కలిసి పలు చిత్రాల్లో పోటీ పడి నటించారన్నారు. అంతే కాదు ఎందరో పేద కళాకారులకు ఆమె జీవన భృతి కల్పించారని ప్రశంసించారు. నిర్మాత అనూరాధా దేవి మాట్లాడుతూ.. సినీ రంగంలో మేటి అయినా రంగస్థలం మీద నటించడం ఎంతో విశేషమన్నారు. జమున కుమార్తె స్రవంతి తన తల్లి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఫిక్కీ సీఎండీ అచ్యుత జగదీశ్ చంద్ర, ఆకృతి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
‘శాంతల’చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను: వెంకయ్య నాయుడు
నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించిన ‘శాంతల’చిత్రం చూసి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇదొక గొప్ప కళాత్మక చిత్రం. కచ్చితంగా ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘ఫ్యామిలీ మాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రింకి సురేశ్ నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించారు. నిహాల్ హీరోగా నటించారు. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఈ చిత్రం ప్రివ్యూని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో వేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడు. కొత్త నటీనటులైనప్పటికీ చక్కగా నటించారు.నిర్మాణపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం,నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, దర్శకుడు శేషును అభినందిస్తున్నాను. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. -
గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకం పట్ల ప్రధాని మోదీకి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. 1995లో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభ సభాపతి, లోక్సభలో విపక్షనేత, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు సభ్యులుగా ఉంటారు. అహింసాయుత పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన తీసుకురావడంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు, సంస్థలకు ఏటా గాంధీ శాంతి పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. గ్రహీతలకు రూ. కోటి నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. -
తెలుగు సినీ దిగ్గజం.. అక్కినేనికిదే శతజయంతి నివాళి!
తెలుగు సినిమా దిగ్గజం, అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కృష్ణాజిల్లాలో పుట్టి సినీ ప్రపంచంలోనే తనకంటూ ఓ సామ్రాజ్యం ఏర్పరచుకున్న ఏకైక నటుడు మన అక్కినేని. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబరు 20 న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. దాదాపు 250కి పైగా చిత్రాల్లో కళామతల్లి ఒడిలో ఒదిగిపోయారు. ఆయన శత జయంతి సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్లో ఏఎన్నార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. (ఇది చదవండి: భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజం: మెగాస్టార్) అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ తారలు, ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొన్న అక్కినేని నాగార్జున కుటుంబసభ్యులు, సుమంత్, నాగచైతన్య, అమల, అఖిల్ ఆయనకు నివాళులర్పించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అల్లు అరవింద్, బ్రహ్మానందం, మురళీమోహన్, శ్రీకాంత్, జగపతిబాబు, రానా, మంచు విష్ణు, నాని, దిల్ రాజు, మోహన్ బాబు, రామ్ చరణ్, మహేశ్ బాబు, సుమ కనకాల, టాలీవుడ్ సినీ పెద్దలు పాల్గొన్నారు. A moment of joy and pride for the fans of #AkkineniNageswaraRao Garu ✨💫 Former Vice President of India Shri. @MVenkaiahNaidu Garu unveils the statue of #ANR garu at @AnnapurnaStdios marking the centenary birthday ❤️ Watch ANR 100 Birthday Celebrations live now! -… pic.twitter.com/5ajMSNFiM1 — Annapurna Studios (@AnnapurnaStdios) September 20, 2023 -
జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు. ప్రయోజనకరమే.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే పాకిస్తాన్కు ఇండియా పేరు పెట్టుకుంటాం -
వసతులు, సౌకర్యాలపై బిల్డర్లు దృష్టి సారించాలి
సాక్షి, హైదరాబాద్: ‘దేశంలో భూమి లభ్యత పరిమితంగా ఉండటంతో డెవలపర్లు ఎత్తయిన నిర్మాణాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. భవనాల ఎత్తు పెరిగే కొద్దీ సమస్యలు ఉంటాయి. అందుకే ఎత్తు మాత్రమే కొలమానం కాకుండా సౌకర్యాలు, వసతులు కూడా దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేపట్టాలి’అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు డెవలపర్లకు సూచించారు. హైదరాబాద్లో శనివారం నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) రజతోత్సవాలు జరిగాయి. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధమైన రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం కేంద్రం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా...ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు రెరా ప్రతినిధులను నియమించకపోవటం శోచనీయమన్నారు. ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్వేస్, హైవేస్, రైల్వేస్తో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం.. వెరసి హైదరాబాద్ హ్యాపెనింగ్ సిటీ అని వెంకయ్య కొనియాడారు. చంద్రుడిపై ఇళ్లు కట్టే స్థాయికి నరెడ్కో ఎదుగుతుందని ఛలోక్తి విసిరారు. సమర్థ నాయకుడితోనే అభివృద్ధి: వేముల స్థిర, సమర్థవంతమైన నాయకుడితోనే అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెరుగైన మౌలిక వసతులు, శాంతి భద్రతలు బాగున్న చోట పెట్టుబడులు వాటంతటవే వస్తాయని ఈ విషయంలో హైదరాబాద్ ముందున్నదని చెప్పారు. కార్యక్రమంలో నరెడ్కో జాతీయ అధ్యక్షుడు రజన్ బండేల్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా ద్విసహస్ర గళ పద్యార్చన
వన్టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతి వ్యక్తి జీవితంలో మాతృభాష భాగమైనప్పుడే ఆ సమాజ భాషా సంస్కృతులు కలకాలం శోభిల్లుతాయని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆంధ్ర మహాభారత సహస్రాబ్ది మహోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ వన్టౌన్లోని కేబీఎన్ కళాశాలలో మంగళవారం ద్విసహస్ర గళ పద్యార్చన వైభవంగా నిర్వహించారు. రెండు వేల మంది విద్యార్థులు సామూహికంగా 108 పద్యాలను ఆలపించి నన్నయకు నీరాజనాలు పలికారు. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ భాషకు లేని మనదైన గొప్ప సంపద తెలుగు పద్యం అని అన్నారు. ఇటీవల తెలుగు అధికార భాషా సంఘం ఆధ్వర్యాన పరవస్తు చిన్నయసూరి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ ఆదికవి నన్నయ కామధేనువు వంటివారని, ఆయన అందించిన కావ్యం అనేక గ్రంథాలకు స్ఫూర్తిని చ్చిందని తెలిపారు. తొలుత సాహితీవేత్త వాడ్రేవు సుందరరావు నన్నయ్య ఏకపాత్రాభినయంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, కృష్ణా విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జ్ఞానమణి, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ప్రసంగించారు. కేబీఎన్ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, టి.శ్రీనివాసు, కోశాధికారి ఎ.రామకృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ వి.నారాయణరావు, డాక్టర్ కె.రామకృష్ణ, డాక్టర్ నాగరాజు, డాక్టర్ జేవీ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్ ‘టేక్’ శిల్పం
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ బర్మా టేకు శిల్పాన్ని శనివారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. దీనికి బోయిన్పల్లిలోని అనూరాధ టింబర్ ఎస్టేట్స్ వేదికైంది. 21 అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన బర్మా టేకు దుంగతో చేసిన ‘అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి’ కళా ఖండానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి బర్మా (మయన్మార్) దేశ అడవుల్లో సుమారు 1,500 ఏళ్ల క్రితం బర్మా టేకు దుంగను ఆ దేశ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం వేలం వేసింది. అనూరాధ టింబర్స్ భారీ మొత్తం చెల్లించి ఈ దుంగను దక్కించుకుంది. చిత్రకారుడు గిరిధర్ గౌడ్తో పలు రేఖా చిత్రాలను రూపొందించి.. మయన్మార్ దేశ ప్రభుత్వం అనుమతితో అక్కడి శిల్పులతో కళాఖండాన్ని చెక్కించింది. అనంతరం కళాఖండాన్ని భారత్కు రప్పించి తుది మెరుగులు దిద్దించింది. భగవద్గీతలోని 11వ అధ్యాయం 6వ శ్లోకం ఆధారంగా అనంత శేషశయన శ్రీ మహావిష్ణువుతో పాటు, శ్రీదేవి, భూదేవి చిత్రాలతో పాటు 84 చిన్న కళాఖండాల కలయికతో ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. కళాఖండాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అనురాధ టింబర్స్ నిర్వాహకులు చదలవాడ సోదరులు బర్మా టేకుతో అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. -
సుపరిపాలనకు సమష్టిగా కృషిచేయండి
ముంబై: సుపరిపాలనకు శాసనసభ్యులు సమష్టిగా కృషిచేయాలని ప్రధాని మోదీ ఉద్భోదించారు. ముంబైలో మూడ్రోజులుగా జరుగుతున్న జాతీయ శాసనసభ్యుల సదస్సుకు ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం పంపించారు. అందులో మోదీ ఏమన్నారంటే.. ‘ సుపరిపాలన, విజయవంతమైన శాసనాల పరిశీలన, అభివృద్ధి నమూనాలు వంటి ప్రజాస్వామ్య విధానాల రూపకల్పన, వాటి పటిష్టత కోసం భిన్న పార్టీల ప్రతినిధులైన శాసనసభ్యులు ఇలా ఒక్క చోటుకు చేరడం నిజంగా విశేషమైన పరిణామం. దేశం అమృతకాలంలో పయనిస్తున్న ఈ తరుణంలో విధాననిర్ణేతలంతా సమష్టిగా చేసే కృషి.. దేశం అభివృద్ధి పథంలో సమున్నత శిఖరాలకు చేరుస్తుందన్న దృఢ విశ్వాసం నాలో ఇనుమడిస్తోంది. క్షేత్ర స్థాయి నుంచే నిరంతరాయంగా అభివృద్ధిని కాంక్షిస్తూ చేసే కృషి చివరకు ‘వైభవోపేత, అభివృద్ధి చెందిన భారత్’ అనే స్వప్నాన్ని నిజం చేస్తుంది’ అని అన్నారు. ‘ ప్రజలతో మమేకమవడంలో, వారి సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకం. దేశం నలుమూలల నుంచి విచ్చేసిన శాసనసభ్యులు ఒకరినొకరు తెల్సుకుని ఆయా నియోజకవర్గాల్లో వారి సమర్థ పనితీరును అర్థం చేసుకునేందుకు జాతీయ శాసనసభ్యుల సదస్సు చక్కని వేదిక. పనితీరును బేరేజువేసుకుని మెరుగైన అభివృద్ధి నమూనాలతో శాసనసభ్యులు మరింతగా దూసుకుపోగలరనే నమ్మకం నాలో ఎక్కువైంది’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఐఎంఐ–స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ఈ సదస్సును ఏర్పాటుచేసింది. శనివారంతో ముగిసిన ఈ మూడ్రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా మొత్తంగా 1,500 మందికిపైగా శాసనసభ్యులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థ చట్టాలు చేయలేదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య చట్టాల రూపకల్పనలో అత్యున్నతమైన, తుది నిర్ణయాధికారం శాసనవ్యవస్థదేనని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం ముంబైలో జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన ప్రసంగించారు.‘ చట్టాలు చేయడంలో శాసనవ్యవస్థ పాత్ర సర్వోన్నతం. ఈ ప్రక్రియలో న్యాయవ్యవస్థకు ఎలాంటి పాత్ర లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల పాత్రలను రాజ్యాంగం సుస్పష్టంగా నిర్వచించింది. ఏదైనా అంశంలో తామే సర్వోన్నతులమని భావించి పరిధులను దాటడానికి ఈ వ్యవస్థలు ప్రయత్నించకూడదు. శాసనాలను చేసే బాధ్యత రాజ్యాంగం కేవలం శాసనవ్యవస్థలకే అప్పజెప్పింది. రాజ్యాంగానికి బద్దమై ఆయా చట్టాలు ఉన్నాయో లేదో అని తేల్చే సమీక్షాధికారం మాత్రం న్యాయవ్యవస్థకే ఉంది. కోర్టులు చట్టాన్ని రూపొందించలేవు. ఈ విషయాన్ని అవి మననం చేసుకుంటే చాలు’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు. -
ఆ అధికారం వారికి లేదు: వెంకయ్య నాయుడు
న్యూఢిల్లీ: భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జాతీయ శాసనసభ్యుల సదస్సులో మాట్లాడుతూ న్యాయస్థానాలకు చట్టాల రూపకల్పనలో జోక్యం చేసుకునే హక్కు లేదన్నారు. రాజ్యాంగం న్యాయస్థానాల విధులను, చట్టసభల విధులను స్పష్టంగా వివరించిందని, మేము గొప్పంటే మేము గొప్పని ఎవ్వరూ ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇటీవల సుప్రీం కోర్టు పార్లమెంటు చట్టం చేసే లోపు ప్రధాన ఎన్నికల కమీషనరును, ఎన్నికల కమీషనర్లను ఎన్నుకునేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం జరిగిన జాతీయ శాసనసభ్యుల సదస్సులో ఆయన మాట్లాడుతూ.. శాసనాలను చేసే అధికారం రాజ్యాంగం శాసనసభలకు మాత్రమే ఇచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసేటప్పుడు బిల్లు ప్రయోజనాలపై కూలంకషంగా చర్చించి, వాదోపవాదాలు చేస్తారు. అనంతరం అవి ప్రజలకు ఉపయోగపడే అంశమై అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆమోదయోగ్యమైతే తప్ప వాటిని ఆమోదించరు. ప్రజాస్వామ్యంలో అదొక భాగమని తెలిపారు. చట్టసభల్లో ఆమోదించిన బిల్లులు చట్టబద్ధంగానూ, రాజ్యాంగబద్ధంగానూ ఉన్నాయా? లేదా? అని మాత్రమే న్యాయవ్యవస్థ చూడాలి తప్ప చట్టాలు చేసి అధికారం రాజ్యాంగం వారికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలన్నిటినీ శాసనసభ నిర్ణయిస్తుంది, ఎగ్జిక్యూటివ్ అమలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కడైనా నిబంధనలను ఉలంఘించినట్లు అనిపిస్తే ఎవ్వరైనా కోర్టును ఆశ్రయించవచ్చని, అలాంటి సందర్భాల్లో మాత్రం వారు సత్వర న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఇది కూడా చదవండి: ప్లాట్ఫారం నాయకుడిలా మాట్లాడకండి.. నోరు జాగ్రత్త! -
ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా: వెంకయ్యనాయుడు
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, మహేందర్ బర్గాస్ హీరోలుగా, సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'భారతీయన్స్'. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి నిర్మించారు. ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా ఫేమ్) చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రసాద్ లాబ్స్లో ప్రత్యేకంగా వీక్షించారు. మంచి సినిమా తీశారని చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. 'దేశ సమైక్యత, భారతీయ సైనికుల వీరగాథ గురించి దేశభక్తి సినిమా తీయడం అభినందనీయం. దర్శక నిర్మాతలు యువతకు చక్కటి సినిమా అందించారు. దీనికి చాలా సంతోషం. దేశభక్తి చిత్రాలను యువత, ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నా' అని అన్నారు. నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ..'నేను ఇంతకు ముందే సినిమా చూశా. వెంకయ్య నాయుడు చూస్తున్నారని తెలిసి మళ్లీ వచ్చా. సమాజానికి, మన దేశానికి ఉపయోగపడే కంటెంట్ ఉంటేనే సినిమాలను ప్రోత్సహించడానికి వస్తారు. దర్శక, నిర్మాతల్లో ఎంతో దేశభక్తి ఉంటేనే ఇటువంటి సినిమాలు వస్తాయి. తప్పకుండా ప్రేక్షకులు అందరూ సినిమా చూడాలి' అని అన్నారు. దర్శకుడు దీనరాజ్ మాట్లాడుతూ.. ' వెంకయ్య నాయుడు సినిమా చూసి మమ్మల్ని అభినందించడం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. దర్శకుడిగా నాకు మొదటి సినిమా ఇది. 'కలిసుందాం రా', 'లాహిరి లాహిరి లాహిరిలో', 'ప్రేమించుకుందాం రా' తదితర హిట్ సినిమాలకు వర్క్ చేశా. దేశభక్తి సినిమాతో దర్శకుడిగా పరిచయం కావాలని ఈ కథ రాశా. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడండి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా' అని అన్నారు. -
సినీ గ్లామరే కాదు.. గ్రామర్ ఉండాలి: వెంకయ్య నాయుడు
‘శక్తిమంతమైన ప్రచార, ప్రసార మాధ్యమం సినిమా. అలాగే, నేటికీ ప్రజలకు అత్యంత చౌకగా వినోదం అందించే సాధనమూ సినిమా. కానీ, నేటి సినిమాల్లో ఎక్కువగా గ్లామర్, అక్కడక్కడా హ్యూమర్ నిండి, అసలైన గ్రామర్ (చెప్పుకోదగ్గ విషయం) తక్కువగా ఉంటోంది. ఒకప్పటి సినిమాల్లా వినోదంతో పాటు, విజ్ఞానం, ఎంతో కొంత సందేశం ఉండేలా చూసుకోవడం సినీరంగం బాధ్యత’’ అని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిశోర్ రూపొందించిన ‘స్వాతంత్య్రోద్యమం–తెలుగు సినిమా–ప్రముఖులు’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ‘స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న పాత తరం సినీ ప్రముఖులపై ఇలాంటి మంచి పుస్తకాలు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. ‘వరకట్నం, సతీసహగమనం లాంటి దురాచారాలకు వ్యతిరేకంగా మంచి ఇతివృత్తాలతో, సంభాషణలతో వచ్చిన సినిమాలు గతంలో విజయవంతమయ్యాయయని గుర్తు చేశారు.. అలాంటి మంచి సినిమాలు తీస్తే ఆడవనే మాట తప్పని ఆయన విశ్లేషించారు. ‘నేటి తరం గురువును మర్చిపోయి, గూగుల్ను చూస్తోందని.. గూగుల్ పాడైతే, దాన్ని బాగుచేయడానికి సాంకేతిక నిపుణుడనే గురువునే పిలవాలి. అది మర్చిపోకండని వెంకయ్య చమత్కరించారు. భాష, సంస్కృతి, రాజకీయ రంగాలపై మాజీ ఉపరాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేశమంటే మట్టి కాదు మనుషులే. పెద్దల్ని గౌరవించడం, దేశాన్ని ప్రేమించడం, సర్వప్రాణులతో కలసి జీవించడం, ఉన్నది పదుగురితో పంచుకోవడం, తోటివారి పట్ల అక్కరచూపడం (షేర్ అండ్ కేర్) మన భారతీయ సంస్కృతికి మూలం. ఎవరు ఏ మతాన్ని అనుసరించినా ఇదే మన సంస్కృతి. అంటే మన జీవనవిధానం. ఇవాళ రాజకీయాల్లోనూ విలువలు దిగజారిపోయాయి. ఇవాళ సభ అంటే బస్, బిర్యానీ, బాటిల్ అనే 3 బీ ఫార్ములా అనుసరించి జనాన్ని తరలిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి. సిద్ధాంతాలు పోయి రాద్ధాంతాలు పెరిగాయి. అసెంబ్లీ, పార్లమెంట్ల స్థాయి తగ్గిపోయి, ప్రజాప్రతినిధుల భాష పతనమవుతున్న ధోరణిని ఆపాలి, అడ్డుకట్ట వేయాలి. నేను ఇంగ్లీషుకు వ్యతిరేకం కాదు. ఇంగ్లీషువాడికి వ్యతిరేకం. మాతృభాషను పక్కనపెట్టేసి, పరాయిభాషను నెత్తినపెట్టుకొనే భావదారిద్య్రానికి వ్యతిరేకం. స్వాతంత్య్రానికి పూర్వం మన స్థూలజాతీయోత్పత్తి ప్రపంచంలో మూడోవంతు ఉండేది. కానీ, మనల్ని దోచుకువెళ్ళి, ఆనాడే అగ్గిపెట్టెలో పట్టేలా చీరను నేసి ఎగుమతి చేసిన మనల్ని పనికిమాలిన, తెలివితక్కువవారనే అభిప్రాయంలో ఇవాళ్టికీ ఉంచేలా చేసిన పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకం. సభకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి అధ్యక్షత వహించగా, ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కిమ్స్ వ్యవస్థాపకులు బొల్లినేని కృష్ణయ్య, పారిశ్రామికవేత్తలు వి. రాజశేఖర్, రాజు, జేవీ కృష్ణప్రసాద్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ‘ఎందరో సినీప్రముఖుల గురించి రాసిన ఈ పుస్తకావిష్కరణను సినీపరిశ్రమ చేసి ఉండాల్సింది’ అని రమణాచారి అభిప్రాయపడ్డారు. బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ‘గతంలో దాదాపు ప్రతి సినిమాలో ప్రబోధాత్మక గీతం ఉండేది. ఒకప్పుడు దేశం కోసం ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేసిన గొప్పవారున్నారు. ఇవాళ దేశాన్నే త్యాగం చేస్తున్న ప్రబుద్ధులు తయారయ్యారు. అల్లూరి సీతారామరాజు, ఆంధ్రకేసరి లాంటి ఒకరిద్దరి గురించే తెలుగులో సినిమాలొచ్చాయి. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న తెలుగువారైన మరెందరో త్యాగధనుల గురించి సినిమాలు రావాలి’ అని అభిలషించారు. తమ్మారెడ్డి మాట్లాడుతూ, ‘వాస్తవాలను వక్రీకరించకుండా, చరిత్రను చెప్పే సినిమాలు రావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా రమణాచారి ఇచ్చిన సలహా మేరకు ఎంతో శ్రమించి, ఈ పుస్తకం రాసినట్టు సంజయ్ కిశోర్ తెలిపారు. సురేఖామూర్తి, శ్రీమతి భూదేవి తదితర ప్రముఖ గాయనులు స్వాతంత్య్ర గీతాలాపన, అంబటిపూడి మురళీకృష్ణ వ్యాఖ్యానం సభను రక్తి కట్టించాయి. పలువురు సినీ, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు. -
‘అరి’ ట్రైలర్పై వెంకయ్య నాయుడు ప్రశంసలు
పేపర్ బాయ్ ఫేం జయశంకర్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం అరి. మై నేమ్ ఈజ్ నో బడీ అనేది ట్యాగ్లైన్. అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, శుభలేక సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు. ‘అరి’ సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు జయశంకర్, నిర్మాత అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. "అరి" సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ,సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/HLeeE5scoF — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2023 -
వెంకయ్యను ఉప రాష్ట్రపతిని చేయడం నాకు నచ్చలేదు: రజినీకాంత్
సాక్షి, చెన్నై: భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వెంకయ్య నాయుడుకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, రజినీకాంత్ శనివారం సెపియన్స్హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడికి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వడం తనకు నచ్చలేదన్నారు. గొప్ప నాయకుడైన వెంకయ్యను రాజకీయాల నుంచి దూరం చేశారని తెలిపారు. ఉప రాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు. మరికొన్ని రోజులపాటు ఆయన కేంద్రమంత్రిగా కొనసాగి ఉంటే బాగుండేది అని తన మనసులోని మాటను బయటపెట్టారు. దీంతో, సూపర్ స్టార్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రజినీకాంత్ మంచి నటుడు. ఆయన రాజకీయాల్లోకి రావద్దని నేను చెప్పాను. ఆరోగ్యంగా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదని సలహా ఇచ్చాను. ప్రజలను సేవ చేయడానికి రాజకీయాలు ఒక్కటే కాదు.. అనేక మార్గాలున్నాయని అన్నారు. అయితే, ఇదే సమయంలో రాజకీయాల్లోకి వచ్చేవారిని తాను నిరుత్సాహపరచడం లేదన్నారు. ఎక్కువ మంది యువకులు రాజకీయాల్లోకి రావాలని, క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం, భావజాలానికి నిబద్ధత ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని సూచించారు. -
సీఎం కేసీఆర్కు బర్త్డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: నేడు(ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. Birthday greetings to Telangana CM Shri KCR Garu. I pray for his long life and good health. @TelanganaCMO — Narendra Modi (@narendramodi) February 17, 2023 అదే విధంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి, జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గౌరవనీయులైన @TelanganaCMO శ్రీ కె చంద్రశేఖర్ రావుగారికి జన్మదిన శుభాకాంక్షలు. — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 17, 2023 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలతో మీ జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/YtwzOsdsUP — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) February 17, 2023 -
పరిపాలన మాతృ భాషలోనే జరగాలి
మణికొండ: దేశంలో ప్రధాన పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని, పరిపాలన, న్యాయ, వైద్య, శాస్త్ర సాంకేతిక లాంటి అన్ని రంగాలలో మాతృభాషను అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నార్సింగిలో సీనియర్ బీజేపీ నాయకుడు పి.మురళీధర్రావు సారధ్యంలో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృభాషను చిన్నచూపు చూసే భావన పోవాలన్నారు. గతంలో ప్రపంచానికే విశ్వగురువులుగా ఉన్న మనం రాబోయే పదేళ్లలో తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటామని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మనది దీపం వెలిగించే సంస్కృతి అని.. అదే పాశ్చాత్య దేశాల వారు వాటిని ఆర్పి ఉత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీబీసీ డాక్యుమెంటరీలో ప్రధానమంత్రి మోదీ పట్ల అవమానకరంగా కథనం ప్రసారం చేయటం దేశానికే అవమానంగా భావించాలన్నారు. తాను పదవీ విరమణే చేశానని, పెదవి విరమణ చేయలేదని, రిటైర్డ్ అయ్యాను తప్ప టైర్డ్ కాలేదని ఆయన చమత్కరించారు. మన సంస్కృతి ఎంతో గొప్పది.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రస్తుతం ప్రపంచమంతా ఆచరిస్తున్నారని, మనం మాత్రం వారు వదిలిపెట్టిన సంస్కృతి వెంట పడుతున్నామని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషకు మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రధాన పరీక్షలను స్థానిక భాషల్లోనే నిర్వహించేందుకు ముందుకు రావటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో సినీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ, లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నిజంగా తెలుగు భాషపై అంత ప్రేమ ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారా?
విజయవాడలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో జరిగిన తెలుగు మహాసభలలో తెలుగు భాష ప్రాశస్త్యం, చిన్నతనం నుంచే తెలుగు నేర్చుకోవల్సిన అవసరం తదితర అంశాలపై వక్తలు మాట్లాడారు. తెలుగు భాష వికసించాలని కోరుకోవడం తప్పు కాదు. మంచిదే. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రింకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్.వి.రమణ తదితర ప్రముఖులు ఈ సభలలో పాల్గొని తమ సందేశాలు అందించారు. వెంకయ్య నాయుడు అయితే శ్వాస ఆగితే, భాష ఆగితే అంటూ ప్రాసతో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ ప్రముఖులిద్దరని కాదు.. అక్కడ మాట్లాడినవారిలో పలువురు పరోక్షంగా ఎపిలో వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం మాట్లాడారా అన్న అనుమానం వస్తుంది. ఏపీలో ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్దులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపద్యంలో దానిని ఏదో రకంగా వ్యతిరేకిస్తున్నవారు ఈ సభలో తెలుగు గురించి మాట్లాడినట్లు అనిపిస్తుంది. అయితే ఎపి ప్రభుత్వం తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేసిందన్న సంగతిని వీరు విస్మరిస్తున్నారు. తెలుగుదేశం నేత, మాజీ ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్ పాలకులు ఇకనైనా మారాలి అంటూ వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని వెంకయ్య నాయుడు తదితరులు అభిప్రాయపడ్డారు. తెలుగు భాష మృతభాష అవుతుందేమోనని కొందరు ఆందోళన చెందారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటంటే ఈ వక్తల కుటుంబాలకు చెందినవారు ఎంతమంది తెలుగులో ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నది ఎందుకు చెప్పలేకపోతున్నారు. తెలుగు సంస్కృతి కోసం సభలు పెట్టవచ్చు. కానీ తెలుగు భాషకు ఏదో అయిపోతోందన్న భావన కలిగించే యత్నమే బాగోలేదు. ఏ భాష ఎప్పుడూ మరణించదు. అందులోను కోట్ల మంది మాట్లాడే భాష అంత తేలికగా పోయేటట్లయితే, ఈ పాటికి చాలా భాషలు కనుమరుగు అయి ఉండేవి. వెంకయ్య నాయుడు కాని, రమణకాని, లేదా బుద్ద ప్రసాద్ కాని, ఇలాంటి ప్రముఖులంతా తమ మనుమలు, మనుమరాళ్లను సభకు తీసుకు వచ్చి వీరిని తెలుగు భాషలోనే తాము చదివిస్తున్నామని చెప్పగలిగి ఉంటే వారిని అంతా మరింతగా మెచ్చుకునేవారు. వెంకయ్య నాయుడు కుమార్తె ఆధ్వర్యంలోని స్వర్ణభారతి ట్రస్టులో తెలుగులోనే పాఠశాల నడుపుతున్నామని చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఒకవేళ అలా జరుగుతుంటే అభినందించాల్సిందే. తెలుగుకు సంబంధించి ఏ వార్త వచ్చినా పూనకం పూనినట్లు వార్తా కధనాలు, బానర్లు పెట్టే ఈనాడు అధినేత రామోజీరావు నడిపే రమాదేవి పబ్లిక్ స్కూలలో తెలుగు మీడియంలోనే ప్రాధమిక విద్యను చెబుతామని ప్రకటించి ఉంటే గొప్పగా ఉండేది కదా? పోనీ రామోజీరావు లేదా, ఆయన వద్ద పనిచేస్తున్న ఎడిటర్లు, జర్నలిస్టులు ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివించారో, చదివిస్తున్నారో తెలపగలిగి ఉంటే ఎవరైనా విశ్వసించవచ్చు. తెలుగు భాషపై అంత ప్రేమ ఉన్న ప్రవాసాంధ్రులు తమ పిల్లలను అమెరికాలో కూడా తెలుగులోనే చదివిస్తున్నారా? లేదా వారిని ఇండియాకు తీసుకు వచ్చి స్వరాష్ట్రంలో తెలుగు స్కూళ్లలో చదివిస్తున్నారా? అమెరికాలో మనవాళ్లు తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం మంచిదే. ఇళ్ల వద్ద తెలుగు మాట్లాడిస్తే స్వాగతించవలసిందే. కొంతమంది కళలపట్ల ఆసక్తికలిగిన తల్లిదండ్రులు తెలుగులో పద్యపఠనం తదితర ప్రక్రియలను బోధిస్తున్నారు. ఇది సంతోషించవలసిన అంశమే. కాని అత్యధిక శాతం తెలుగువారి పిల్లలు ఇంగ్లీష్ లోనే మాట్లాడడం అలవాటు చేసుకుంటున్నారు. తెలుగు మర్చిపోతున్నారు. వచ్చినా ఏదో పొడి, పొడి మాటలు మాట్లాడుతున్నారు. ముందుగా వారికి ఎలా తెలుగు నేర్పించాలా అన్నదానిపై తానా లేదా ఇతర తెలుగు సంస్థలు దృష్టి పెడితే బాగుంటుంది. తెలుగు రాష్ట్రాలలో తెలుగు గురించి వారు సభలు పెట్టి విమర్శలు చేస్తే మొత్తం మారిపోతుందా? ఎపిలోనే కాదు.. తెలంగాణలో సైతం ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు. దానికి స్పష్టమైన కారణం ఉంది. ఆంగ్ల మీడియం ఉన్న స్కూళ్లకే 90 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తున్నారు.దాంతో ప్రభుత్వ స్కూళ్లు కేవలం పేదలకు, ఆర్థికంగా స్తోమత లేని బలహీనవర్గాలకే పరిమితం అవుతున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన వైసిపి ప్రభుత్వం కాని, కెసిఆర్ ప్రభుత్వం కాని ఆంగ్ల మీడియంను ప్రవేశపెట్టాయి. కెసిఆర్కు ఈ విషయంలో ఇబ్బంది రాలేదు కాని, ఎపిలో జగన్ ను మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం, బిజెపి, జనసేన, వామపక్షాలు చాలా ఇబ్బంది పెట్టే యత్నం చేశాయి. తెలుగును కంపల్సరీ సబ్జెక్టుగా చేసినా ఏదో రకంగా జగన్ ముందుకు వెళ్లకూడదని చివరికి కోర్టులను కూడా అడ్డం పెట్టుకుని టిడిపి చేసిన యాగీ ఇంతా ,అంతా కాదు. ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు నానా రభస చేశాయి. పోనీ ఈ మీడియా సంస్థల యజమానుల పిల్లలు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా తెలుగులో చదువుతున్నారా అంటే అదేమీ లేదు. వీరిలో అత్యధికులు హైదరాబాద్, ముంబై వంటి నగరాలలో కార్పొరేట్ స్కూళ్లలో ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. ఎపిలో మాత్రం ఆంగ్ల మీడియం పెట్టకూడదని యాగీ చేశారు. వీరెవరూ ప్రైవేటు స్కూళ్లు ఆంగ్ల మీడియం మాత్రమే అమలు చేస్తున్నప్పుడు నోరు మెదపలేదు. అంతదాకా ఎందుకు! తెలుగు గురించి చంద్రబాబు గారు చాలా ఉపన్యాసాలు చేశారు కదా? ఆయన కుమారుడు లోకేష్ను ఏ మీడియంలో చదివించారు? ప్రస్తుతం ఆయన మనుమడు దేవాన్ష్ను కాని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? బుద్ద ప్రసాద్ వంటి వారు ముందుగా ఈ విషయంలో సలహా ఇవ్వవలసింది వీరికి కదా! ప్రాధమిక విద్య మాతృభాషలోనే జరగాలని చెబుతున్న ఈ పెద్దలు, తమ వాళ్లు మాత్రం ఆంగ్లంలో చదివినా బాగా చదవగలరని, మిగిలినవారు అర్ధం చేసుకోలేరని ఎలా భావిస్తున్నారో అర్ధం కాదు. వీరంతా ఒక్కసారి కాకినాడ జిల్లా బెండపూడిలోని ప్రభుత్వ స్కూల్కుకు వెళ్లి, అక్కడ పిల్లలు, ఆంగ్లంతో పాటు, తెలుగు భాషలో కూడా ఎలా రాణిస్తున్నది తెలుసుకుంటే బాగుంటుంది. వారిని ఇలాంటి సంఘాలు ప్రోత్సహించి, ఏ సందేశం ఇచ్చినా వినబుద్ది అవుతుంది. చిన్నతనంలోనే ఏమి నేర్పినా పిల్లలకు బాగా వంటపడుతుందని అంటారు. తెలుగు గురించి ఇంతలా బాధ పడుతున్నవారు పాటించి చూపిస్తే కదా మిగిలినవారు ఆచరించే అవకాశం ఉండేది. చెప్పేటందుకే నీతులు అన్నట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారడం దురదృష్టకరం. ప్రవాసాంద్రులు తెలుగు భాష గురించి ఏ కార్యక్రమం చేసినా సంతోషమే. దానికి ముందుగా అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించగలిగితే , అప్పుడు వారు ఏమి చెప్పినా విలువ పెరుగుతుంది కదా! - హితైషి -
వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు
-
ప్రజాఉద్యమంగా ప్రకృతి సేద్యం
సాక్షి, హైదరాబాద్/శంషాబాద్ రూరల్: ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం ప్రజాఉద్యమంగా మారాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రైతులు, వినియోగదారులు, ప్రభుత్వాలు, మీడియాసహా సమాజంలో అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ఆదివారం రైతునేస్తం మాసపత్రిక 18వ వార్షికోత్సవంలో పలువురికి ‘పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం’పురస్కా రాలను ప్రదానం చేశారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని వెంకయ్య సూచించారు. ప్రజలకు ఆరోగ్యం, రైతుకు రాబడి సేంద్రీయ సాగుతోనే సాధ్యమవుతుందన్నారు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు మంచి తరుణం ఇదేనని, రైతులతోపాటు అధికారులు, శాస్త్రవేత్తలు ఈ దిశగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. మనదేశంలో రైతులకు అందించే ప్రోత్సాహకాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు. కరోనా సమయంలో కూడా మన ఆహార అవసరాలను తీర్చగలిగిన రైతులను రక్షించుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. పురస్కారాల ప్రదానం నాబార్డు మాజీ చైర్మన్ చింతల గోవిందరాజులుకు జీవిత సాఫల్య పురస్కారం, డా. వై.ఎస్.ఆర్. విశ్వవిద్యాల యం వైస్ చాన్సలర్ డాక్టర్ టి.జానకిరామ్కు ‘కృషిరత్న’ బిరుదు, అహ్మదాబాద్కి చెందిన ‘గోకృపామృతం’ రూపశిల్పి గోపాల్భాయ్ సుతారియాను ‘గోపాలరత్న’బిరుదు తో సత్కరించారు. 16 మంది అభ్యుదయ రైతులకు, వ్యవసాయ, అనుబంధ రంగాల్లో విశేష కృషిచేసిన 10 మంది శాస్త్రవేత్తలకు, విస్తరణకు కృషి చేసిన 11 మందికి, అగ్రిజర్నలిజం విభాగంలో ఐదుగురికి రైతునేస్తం పురస్కారాలు ప్రదానం చేశారు. ‘సాక్షి సాగుబడి’తరఫున సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబు పురస్కారాన్ని అందుకు న్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కామి నేని శ్రీనివాసరావు, నాబార్డు తెలంగాణ చీఫ్ జనరల్ మేనేజర్ చింతల సుశీల, ‘నార్మ్’డెరైక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు, రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆయనే మన జేమ్స్బాండ్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి/హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూతతో సినీ జగత్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నటశేఖరుడి అస్తమయంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్విటర్ ద్వారా సంతాపం తెలియజేశారు. ‘‘కృష్ణగారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి... ఆయనే మన జేమ్స్ బాండ్. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఘట్టమనేని కుటుంబంతో వైఎస్ కుటుంబానికి ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. (2/2) — YS Jagan Mohan Reddy (@ysjagan) November 15, 2022 ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సైతం కృష్ణ కన్నుమూతపై సంతాపం ప్రకటించారు. కృష్ణ మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు సంతాపం ప్రకటించిన వాళ్లలో ఉన్నారు. ఇదీ చదవండి: నటశేఖరుడికి సాక్షి ప్రత్యేక నివాళి -
గూగుల్ వచ్చినా గురువుకు సాటి రాలేదు
సుల్తాన్బజార్: గూగుల్ వచ్చినా గురువుకు ఏ మాత్రం సాటి రాలేదని, గూగుల్ అందించేది సమాచారం మాత్రేమేనని గురువులు మాత్రమే విజ్ఞానంతో పాటు, ఆ విజ్ఞానాన్ని ఎలా వినియోగించుకోవాలన్న వివేకాన్ని ప్రసాదిస్తారని భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. గురువారం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో పోలూరి హనుమజ్జానకీ రామశర్మ పురస్కారాన్ని ప్రముఖ రచయిత దూరదర్శన్ పూర్వ సహాయ డైరెక్టర్ జనరల్ రేవూరి అనంత పద్మనాభరావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... తనకు జీవితంలో లభించిన ఉన్నతమైన గురువుగా హనుమజ్జానకీ రామశర్మ స్థానం తన మనస్సులో పదిలంగా నిలిచిందన్నారు. అందుకే తన పేరున ఏర్పాటు చేస్తామన్న అవార్డును గురువుల గొప్పతనం ముందు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో గురువు పేరిట ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. జానకీరామ శర్మ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. నేటికీ నిత్య విద్యార్థిగా పరిశోధనలు కొనసాగిస్తున్న పద్మనాభరావు జానకీరామ శర్మ ప్రియ శిష్యుల్లో ఒక్కరన్నారు. అలాంటి వ్యక్తికి మరో శిష్యుడు అవార్డు అందించడం ద్వారా జానకీరామశర్మ ఆత్మ సంతృప్తి చెందుతుందన్నారు. తన గురువు జానకిరామశర్మ సాక్షాత్తు సరస్వతి సరూపమని కొనియాడారు. తమ సంస్కృతిని ముందు తరాలకు తెలియజేసే చక్కని వారధి మన భాషే అనే సత్యాన్ని గుర్తించాలన్నారు. భాషను కాపాడుకుంటే సాహిత్యం ద్వారా సంస్కృతిని భావితరాలకు అందించవచ్చన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్లాంటి సంస్థలు చొరవ తీసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను నేర్పించే వినూత్న పద్ధతులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అనంత పద్మనాభరావు రచించిన ఆచార్య దేవోభవ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్రెడ్డిలతో పాటు సాహితీవేత్తలు పాల్గొన్నారు. (చదవండి: చదువులు సాగేదెలా?) -
హైదరాబాద్ : ఎన్టీఆర్ స్టేడియంలో శోభాయమానంగా శ్రీవారి వైభవోత్సవాలు (ఫొటోలు)
-
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దు
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండాలే తప్ప శత్రుత్వం ఉండొద్దని, రాజకీయ నేతలు నీతి, నిజాయితీతో సేవలందించి స్ఫూర్తిగా నిలవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా ధర్మాపూర్లోని జేపీఎన్సీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్రెడ్డితో కలిసి కేంద్ర మాజీ మంత్రి దివంగత ఎస్.జైపాల్రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జయ ప్రకాశ్ నారాయణ్ 120వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అన్యాయాలు, అక్రమాలకు అరాచకా నికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పటిష్టతకు అలుపె రగకుండా పోరాటం చేసిన గొప్ప నాయకుడు లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ అని.. ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన ని వెల్లడించారు. తాను, జైపాల్రెడ్డి ఇద్దరమూ జాతీయవాదులమే.. అయినా సిద్ధాంతపరంగా భిన్నమైనవాళ్లమని అన్నారు. చట్టసభల్లో ఉన్నత ప్రమాణాలు పాటించాలని.. డిస్కస్, డిబేట్, డిస్క్రైబ్ చేయాలి కానీ డిస్ట్రబ్ చేయకూడదన్నారు. చట్టసభల్లో మాట్లాడండి, శాంతియుతంగా పోరాడండి, కానీ సభను జరగనివ్వండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండని పిలుపునిచ్చారు. కలలు కనండి, కష్టపడండి, సాకారం చేసుకోండని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. జైపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకోవడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జైపాల్రెడ్డి భార్య లక్ష్మి, ఆయన సోదరుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించారు అల్లు
‘‘ఆరోగ్యకరమైన హాస్యాన్ని చేరువ చేయ డానికి అల్లు రామలింగయ్యగారు చేసిన కృషి మరువలేనిది’’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాస్య నటుడు అల్లు రామలింగయ్య జీవన ఛాయ చిత్ర మాలిక పుస్తకాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘హావభావాల ద్వారా తన నటనలో హాస్యాన్ని పండించిన సిద్ధహస్తుడు రామలింగయ్యగారు. సమాజంలో వ్యక్తులను అధ్యయనం చేస్తూ ఆయన సాధించిన గొప్ప కళ హాస్యం పండించడమే. సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా కళాకారులు చొరవ చూపాలి. ప్రజలను ఆకర్షించడానికి హాస్య రసాన్ని ఉపయోగించుకుంటూనే ఆలోచింపజేసే విధంగా సమాజం పట్ల ఓ బాధ్యతను ప్రజల్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. పుస్తక సంపాదకులు మన్నెం గోపీచంద్, విషయాలను కూర్పు చేసిన వెంకట సిద్ధారెడ్డి, పరిశోధన చేసిన శ్రీకాంత్ కుమార్కు అభినందనలు’’ అన్నారు. -
ప్రధాని మోదీకి వెంకయ్యనాయుడి సలహా
న్యూఢిల్లీ: ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేతలను కలవాలని సలహా ఇచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు.. ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుస్తక ఆవిష్కరణలో ముందుగా ప్రధాని మోదీపై ప్రశంసలు గుప్పించారు వెంకయ్యనాయుడు. భారతదేశం ఇప్పుడు లెక్కించదగిన శక్తి. దాని స్వరం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. మోదీ పాలనలో దేశం ఆరోగ్య రంగం, విదేశాంగ విధానం, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లో లక్ష్యసాధనతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుందని కొనియాడారు. ఇంత తక్కువ టైంలో ఇలాంటి ఘనత సాధించడం సర్వసాధారణ విషయం కాదని, అద్బుతమన్న వెంకయ్యనాయుడు.. మోదీ నిర్ణయాలు, ఆ మార్గంలో యావత్ దేశపౌరులు పయనించడమే కారణమని చెప్పారు. కానీ, మోదీ పాలనాపరమైన విధానాలపై కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఉందని.. అందుకు రాజకీయపరమైన కారణాలు, అపార్థాలు కూడా కారణం అయ్యి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు వెంకయ్యనాయుడు. వాటిని చెరిపేసేందుకు తరచూ మోదీ రాజకీయ వర్గాలను కలుస్తూ ఉండాలని, ముఖ్యంగా ప్రతిపక్షాలను కలుస్తూ ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. తద్వారా అపార్థాలు తొలగిపోతాయన్నారు. అదే సమయంలో, రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, ప్రజల ఆదేశాన్ని గౌరవించాలని నాయుడు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు రాజకీయ ప్రత్యర్థులే తప్ప.. శత్రువులు కారని గుర్తించాలని అని సూచించారు. ముఖ్యమంత్రి, రాష్ట్రపతి.. ఇలా ఉన్నతపదవులకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారాయన. 2019 మే-2010 మే మధ్య ప్రధాని మోదీ ప్రసంగాలతో కూడిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐబీ సెక్రెటరీ అపూర్వ చంద్ర హాజరయ్యారు. ఇదీ చదవండి: హర్తాల్ కోసమే కాంగ్రెస్ యాత్రకు బ్రేక్! -
September 17: ‘విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్కు విచ్చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్పార్క్ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బస్సల్, తరుణ్చుగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. -
రాధిక మంగిపూడి నూతన కవితా సంపుటి ఆవిష్కరణ
సింగపూర్ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడి రచించిన కవితా సంపుటి "నవ కవితాకదంబం" వంశీ ఆర్ట్ థియేటర్స్ స్వర్ణోత్సవ వేడుకల సభలో, హైదరాబాద్ రవీంద్రభారతి వేదికపై, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సభలో గౌరవ అతిథులుగా పాల్గొన్న సినీనటి జమున రమణారావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, మాజీ కేంద్రమంత్రి టీ సుబ్బరామిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, డా.గురవారెడ్డి, పలు విదేశీ తెలుగు సంస్థల ప్రతినిధులు రాధికను అభినందించారు. వంశీ ఆర్ట్ థియేటర్స్ ప్రచురించిన ఈ పుస్తకం తొలిప్రతిని శుభోదయం గ్రూప్స్ ఛైర్మన్ డా. కే. లక్ష్మీప్రసాద్ అందుకున్నారు. ప్రముఖ సినీ కవులు సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, ఆచార్య ఎన్ గోపి, డా. తెన్నేటి సుధా దేవి ఈ పుస్తకానికి ముందుమాట అందించగా, ప్రచురణకర్తగా డా. వంశీ రామరాజు రాధికను అభినందించారు. శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తదితరులు రాధికకు అభినందనలు తెలిపారు. "ఎందరో సినీ దిగ్గజాలు, ప్రముఖ రచయితల సమక్షంలో వెంకయ్యనాయుడు గారు తన పుస్తకం ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని," రాధిక నిర్వాహకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
‘హుందాతనంతో కృష్ణంరాజు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు’
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణం రాజు అకాల మరణం అందరనీ దిగ్భ్రాంతికి గురిచేసింది. అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచిన కృష్ణం రాజుకు ప్రమువురు ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. సోమవారం ఉదయం కృష్ణం రాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. రెబల్ స్టార్ కుటుంబ సభ్యులకు వెంకయ్య నాయుడు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణవార్త విని చాలా బాధపడ్డాను. చలన చిత్ర పరిశ్రమలోనే కాదు పాలిటిక్స్లో కూడా కృష్ణంరాజు తనదైన ముద్ర వేశారు. హుందాతనం కూడిన నటనతో ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. విలక్షణ నటుడుగా మన్ననలను పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. మరోవైపు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కృష్ణం రాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణం రాజు మరణం బీజేపీకి, సినీ రంగానికి, రాజకీయ రంగానికి తీరని లోటు. రెబల్ స్టార్ రాజకీయాల్లో చురకుగా పాల్గొన్నారు. దివంగత ప్రధాన మంత్రి వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
రాష్ట్రపతి కావాలనుకోలేదు.. ఆ సమయంలో నా కళ్లలో నీళ్లు తిరిగాయి
రాష్ట్రపతి పదవి కావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని వెంకయ్య నాయుడు చెప్పారు. పదవుల్లో లేకపోయినా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూనే ఉంటానని తెలిపారు. సోమవారం రాజ్యసభలో తన వీడ్కోలు కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడారు. చట్టసభలో అర్థవంతమైన చర్చలు, సంవాదాలు జరగాలని ప్రజలు ఆశిస్తారని గుర్తుచేశారు. అంతేతప్ప ఆందోళనలు, గొడవలు, అంతరాయాలను కోరుకోరని చెప్పారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులంతా కృషి చేయాలని సూచించారు. సభలో ఉన్నప్పుడు మర్యాదగా నడుచుకోవాలన్నారు. ఉన్నత ప్రమాణాలను అనుసరించాలన్నారు. పదవీ విరమణ తర్వాత ఇంటికే పరిమితం కాబోనని, అన్నిచోట్లా తిరుగుతూ అందరితో భిన్న అంశాలపై మాట్లాడుతూనే ఉంటానని వెంకయ్య స్పష్టం చేశారు. రాజ్యసభపై గొప్ప బాధ్యతలు ఉన్నాయని, ఈ విషయాన్ని సభ్యులంతా సదా గుర్తుంచుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్ చక్కగా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. రాజ్యసభ చైర్మన్గా సభ గౌరవాన్ని కాపాడేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించానని, అందరికీ మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానని వెల్లడించారు. బీజేపీకి రాజీనామా చేసినప్పుడు తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. చదవండి: (Venkaiah Naidu: వెంకయ్య భావోద్వేగం) -
Venkaiah Naidu: వెంకయ్య భావోద్వేగం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ‘‘రాజకీయాల నుండి రిటైర్ అయ్యానని, కానీ ప్రజా జీవితంలో అలసిపోలేదని మీరు తరచుగా చెబుతుంటారు. మీ పదవీ కాలం ముగియవచ్చు గానీ మీ జీవితం, మీ అనుభవాలు రాబోయే కాలంలో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయి’’ అని వెంకయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య పదవీ కాలం 10న ముగియనుంది. ఇదిలా ఉంటే, వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు. ఆత్మకథ రాయండి వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు. చదవండి: (పాలిటిక్స్లో పిడుగుపాటు.. బీజేపీతో సీఎం నితీశ్ కుమార్ తెగదెంపులు!) -
వెంకయ్యనాయుడు.. స్ఫూర్తిదాయకం: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయకమని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రాజ్యసభ అధ్యక్షస్థానంలో తెలుగువ్యక్తి కూర్చోవడం గురించి ఉభయసభల్లోని తెలుగు రాష్ట్రాల ఎంపీలు గర్వంగా చెప్పుకొంటారన్నారు. వెంకయ్యనాయుడు పదవీ విరమణ చేయనున్న సందర్భంగా సోమవారం రాజ్యసభలో నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. వెంకయ్యనాయుడు సొంత జిల్లా అయిన నెల్లూరుకు చెందిన వ్యక్తిని కావడం తన అదృష్టమన్నారు. అనేక సభల్లో వెంకయ్యనాయుడు చేసిన ఉపన్యాసాలు తెలుగు రాష్ట్రాల ప్రజలనేగాక దేశవ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పారు. విద్యార్థి దశలో తాను ఎంతో ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లుగా తెలుగు, ఇంగ్లిష్, హిందీ, తమిళం వంటి అనేక భాషల్లో వెంకయ్యనాయుడు పరిజ్ఞానం అపారమైనదని కొనియాడారు. రాజ్యసభను సమర్థంగా నడిపించారని, కొత్త, పాత అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ మాట్లాడే అవకాశం కల్పించారని చెప్పారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370పై జరిగిన చర్చను గుర్తుచేస్తూ.. ఉద్రిక్త వాతావరణంలో చర్చ జరుగుతున్నప్పటికీ ప్రాంతీయ పార్టీలకు సైతం బిల్లుపై మాట్లాడే అవకాశం కల్పించడం వెంకయ్యనాయుడు గొప్పతనానికి నిదర్శనమన్నారు. ఆరేళ్ల కిందట సభలో అడుగుపెట్టినప్పుడు చివరి వరసలో కూర్చున్న తనకు మాట్లాడే అవకాశం వస్తుందో రాదోనని సంశయిస్తున్న తరుణంలో అంతమందిలో కూడా తనను గుర్తించి తనకు మాట్లాడే అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలకు వెంకయ్యనాయుడు ఇచ్చిన ప్రాధాన్యత ఎనలేనిదన్నారు. వైస్ చైర్మన్ ప్యానల్గా రాజ్యసభ అధ్యక్షస్థానంలో కూర్చుని సభను నిర్వహించే అవకాశం కల్పించడం తన జీవితంలో మరపురానిదని చెప్పారు. వెంకయ్యనాయుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
హామీలను త్వరగా అమలు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించిన హామీల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న, ప్రతిపాదిత ప్రాంతాలకు అధికారులు వ్యక్తిగతంగా వెళ్లడం ద్వారానే పనులు వేగం పుంజుకుంటాయని చెప్పారు. సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణల్లో చేపట్టిన కార్యక్రమాల పురోగతిని ఆయన సోమవారం న్యూఢిల్లీలోని తన నివాసంలో సమీక్షించారు. ఈ కార్యక్రమాల పురోగతిని కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ఉపరాష్ట్రపతికి వివరించారు. కాకినాడ సీ–ఫ్రంట్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నెల్లూరు–పులికాట్–ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్–నేలపట్టు–కొత్తకోడూరు–మైపాడు–రామతీర్థం–ఇస్కపల్లి ప్రాజెక్టుతో పాటుగా కోస్టల్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్, గుంటూరు, అమరావతి నగరాల్లో పర్యాటక అభివృద్ధి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం ఆలయాల అభివృద్ధి, నెల్లూరులోని వేదగిరి నరసింహస్వామి దేవాలయం, అరకు–విశాఖ విస్టాడోమ్ (రైల్వే) ప్రాజెక్టు, తిరుపతి రైల్వేస్టేషన్ అభివృద్ధి, పుట్టపర్తిలో సౌండ్ లైట్ షో పనుల వివరాలు తెలిపారు. ఉడాన్ పథకంలో భాగంగా విశాఖ–రాజమండ్రి, హైదరాబాద్–విద్యానగర్ (హంపి) రూట్ల పురోగతిని వివరించారు. వీలైనంత త్వరగా వీటిని పూర్తిచేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. -
సభకు నమస్కారం.. రెండువారాలు రచ్చ రచ్చే!
ఢిల్లీ: వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని.. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారమే ప్రకటించారు స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. డ్యూ డేట్ కంటే ఐదురోజులు ముందుగానే ఇలా ఉభయ సభలు వాయిదా పడడం ఇదే ఏడోసారి. మిగిలిన ఐదురోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగష్టు 12వ తేదీవరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలి. ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. లోక్సభ పదహారు రోజులు మాత్రమే సమావేశం అయ్యిందని, ఏడు చట్టాలకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటలకంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. మేజర్ హైలెట్స్ ► ధరల పెంపుపై విపక్షాల నిరసనలు.. నిత్యం నిరసన గళాలతో నినాదాలు ► సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ఆవరణలో ఉంటూ నిరసన ► రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. వాటి ఫలితాలు ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ సభల్లో బీజేపీ ఆందోళనతో హోరెత్తించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ► పలు కీలక బిల్లులపై ఆమోదం ► టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ను.. ధరల చర్చ జరుగుతున్న టైంలో టేబుల్ కింద దాయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య పట్ల పార్లమెంట్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది. -
వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభ వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వెంకయ్యకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ పలు ప్రశ్నలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెనక్కు తీసుకున్న వివాదాస్పద వ్యవసాయ చట్టాలను 2020, సెప్టెంబరు 20న ఎగువ సభ ఆమోదించినప్పుడు రాజ్యసభ చైర్మన్ స్థానంలో వెంకయ్య లేరని డెరెక్ ఓబ్రెయిన్ గుర్తు చేశారు. ‘బహుశా ఏదో ఒక రోజు మీరు మీ ఆత్మకథలో దీనికి సమాధానం ఇస్తార’ని ఆయన చమత్కరించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2 సెప్టెంబర్ 2013న పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వెంకయ్య నాయుడు చేసిన ఉద్వేగభరిత ప్రసంగం గురించి కూడా ప్రస్తావించి.. దీనికి కూడా ఆత్మకథలోనే సమాధానం చెబుతారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ వివాదంపై 2013లో ఎగువ సభలో మాట్లాడిన వెంకయ్య నాయుడు.. తాను రాజ్యసభ చైర్మన్ ఉన్న సమయంలో మాత్రం పెగాసస్పై చర్చకు అవకాశం ఇవ్వలేదని గుర్తుచేశారు. ‘మార్చి 1, 2013న, మీరు సభలో 5-6 నిమిషాల పాటు ఫోన్ ట్యాపింగ్పై జోక్యం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా పెగాసస్ అంశాన్ని సభలో చర్చించడానికి మేము చేసిన ప్రయత్నాలు ఫలించలేద’ని అన్నారు. కాగా, వెంకయ్య నాయుడు పదవీ కాలం ముగియడంతో నూతన ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆగస్టు 6న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాపై ధన్కర్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. (క్లిక్: ఇది ఉద్వేగభరితమైన క్షణం.. ప్రధాని మోదీ) -
గ్రామీణ అభివృద్ధి వెంకయ్య నాయుడు ఇష్టంగా నిర్వహించారు: ప్రధాని మోదీ
-
6 ఏళ్ల క్రితం...నేను అక్కడ కూర్చున్న..
-
వెంకయ్య నాయుడికి రాజ్యసభలో వీడ్కోలు.. ఇది ఉద్వేగభరితమైన క్షణం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి సోమవారం రాజ్యసభలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఇది ఉద్వేగభరితమైన క్షణమని అన్నారు. పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వెంకయ్య నాయుడికి అభినందనలు తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. బీజేపీ అధ్యక్షుడు సహా అనేక పదవులు చేపట్టారని కొనియాడారు.. యువ ఎంపీలను వెంకయ్య నాయుడు ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు కొత్తతరంతో మమేకమయ్యారని మోదీ పేర్కొన్నారు. ఆయన వాక్చాతుర్యం అందరికీ తెలిసిందేనన్నారు. భావితరాలకు వెంకయ్య నాయుడు ఆదర్శమని అన్నారు. వెంకయ్య మాటల్లో వ్యంగ్యం, గంభీరత ఉంటుందని పేర్కొన్నారు. చైర్మన్ హోదాలో విజయవంతంగా రాజ్యసభను నడిపించారని ప్రశంసించారు. పెద్దల సభ గౌరవ మర్యాదలను మరింత పెంచారన్నారు. రాజ్యసభ సచివాలయంలో ఎన్నో మార్పులు తెచ్చారని ప్రస్తావించిన ప్రధాని.. అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని తెలిపారు. వెంకయ్య నిబద్ధత స్పూర్తిదాయకమని, ఆయనను చూసి అందరూ నేర్చుకోవాలన్నారు. చదవండి: యూపీలో అనూహ్య పరిణామం.. బీజేపీ కార్యకర్త ఇంటిపైకి బుల్డోజర్.. -
పార్లమెంటు సమావేశాలు ముందుగానే నిరవధిక వాయిదా?
సాక్షి,న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం, మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ? -
నూతన సీవీసీ సురేశ్ ఎన్ పటేల్
న్యూఢిల్లీ: విజిలెన్స్ కమిషనర్ సురేశ్ ఎన్ పటేల్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ)గా నియమితులయ్యారు. రాష్ట్రపతి భవన్లో బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. సీవీసీ పోస్ట్ ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. సంజయ్ కొఠారీ పదవీ కాలం పూర్తి కావడంతో సురేశ్ ఎన్ పటేల్ జూన్ నుంచి తాత్కాలిక సీవీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సురేశ్ ఎన్ పటేల్ పేరును గత నెలలోనే ఖరారు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇద్దరు కమిషనర్ల పేర్లను హోం మంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేతతో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సీవీసీగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ ఎన్ పటేల్ అనంతరం ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ అర్వింద్ కుమార్, రిటైర్డు ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవలతో విజిలెన్స్ కమిషనర్లుగా ప్రమాణం చేయించారు. సీవీసీ, ఇద్దరు కమిషనర్ల నియామకంతో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇక పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఆంధ్రా బ్యాంక్ మాజీ చీఫ్ అయిన సురేశ్ ఎన్ పటేల్ 2020 ఏప్రిల్లో విజిలెన్స్ కమిషనర్గా నియమితులయ్యారు. అదేవిధంగా, 1984 బ్యాచ్ రిటైర్డు ఐపీఎస్ అధికారి అయిన అర్వింద్ కుమార్ 2019–22 సంవత్సరాల్లో ఐబీ డైరెక్టర్గా ఉన్నారు. అస్సాం–మేఘాలయ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన శ్రీవాస్తవ కేబినెట్ సెక్రటరీగా పనిచేశారు. సీవీసీ, విజిలెన్స్ కమిషనర్లు నాలుగేళ్లపాటు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవుల్లో కొనసాగుతారు. -
మూసీనది ఆక్రమణలతోనే వరదలు
సాక్షి, హైదరాబాద్: మూసీనది ఆక్రమణలకు గురికావడం వల్లే హైదరాబాద్లో వర్షాలు కురిసినప్పుడు వరదలు పోటెత్తుతున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం రామంతాపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్వర్ణోత్సవాలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రకృతి చాలా ముఖ్యమైనదని, నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదమని అన్నారు. నదుల ఆక్రమణలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు. దేశంలోని ఉన్నతమైన విద్యాసంస్థల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఒకటని కొనియాడారు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, కృషితోనే మంచి భవిష్యత్ సాధ్యమని విద్యార్థులకు సూచించారు. వ్యాయామం అవసరం శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతిరోజు శరీరానికి వ్యాయామం అవసరమని వెంకయ్యనాయుడు సూచించారు. యోగా అనేది మోదీది కాదని, వ్యాయామానికి కులమతాల భేదాలు లేవని అన్నారు. సంగీతం, సాహిత్యం రోజువారీ జీవితంలో భాగం కావాలని, ప్రకృతిని, సంస్కృతిని ఆరాధిస్తూ జీవితాన్ని సాఫీగా గడపాలన్నారు. చదువు కోసం చాలామంది విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని, అనంతరం దేశం కోసం పనిచేయడానికి తిరిగి రావాలన్నారు. కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సింహారెడ్డి, హెచ్పీసీ అధ్యక్షుడు శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
విశ్వసాహితీ మూర్తి సినారె
సాక్షి, హైదరాబాద్: తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, విశ్వ సాహితీమూర్తి సి.నారాయణరెడ్డి చిరస్మరణీయుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసించారు. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసి, సినిమా సాహిత్యానికి సైతం గౌరవం తెచ్చి పెట్టారన్నారు. సుశీల నారాయణరెడ్డి ట్రస్టు రవీంద్రభారతిలో శుక్రవారం నిర్వహించిన సి.నారాయణరెడ్డి 91వ జయంత్యుత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మకమైన సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పుర స్కారాన్ని ప్రముఖ ఒడియా రచయిత్రి డాక్టర్ ప్రతిభారాయ్కు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సినారె కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ మానవ జీవనం, తత్వం, ప్రకృతిని ప్రేమించడం వంటి అంశాల చుట్టూనే సాగిందన్నారు. ఆలోచనాత్మక కావ్యం విశ్వంభర ఆయనను విశ్వసాహితీ పీఠంపై నిలబెట్టిందని అభినందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, తెలు గు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా, అధికార భాషాసంఘం అధ్యక్షుడిగా, ప్రభుత్వ భాషా సంస్కృతుల సలహాదారుగా.. ఆయన తన ప్రతి పదవికీ వన్నె తీసు కొచ్చారని గుర్తుచేశారు. సినారె తెలుగుదనానికి నిలువెత్తు సంతకమన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టిన బిల్లుల్లో మాతృభాష బిల్లు ప్రధానమైందన్నారు. ఉన్నత విద్యవరకు మాతృభాష ఉండాలనే నిబంధనను తప్పనిసరి చేయాలని పట్టుబట్టారని, నూత న జాతీయ విద్యావిధానం మాతృభాషకు ఇస్తున్న ప్రాధాన్యం ఆయన ఆకాంక్షించిందేనని చెప్పారు. ప్రతిభారాయ్ మాట్లాడుతూ, సినారె పురస్కారాన్ని అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ ప్రారంభంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి బృందం ప్రదర్శించిన నృత్య రూపకాలు ప్రేక్షకులను అలరించాయి. కార్యక్రమంలో మంత్రి నిరంజన్రెడ్డి, సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ కార్యదర్శి జె.చెన్నయ్య, రచయిత్రి ఓల్గా, సినారె కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతికి ప్రధాని వీడ్కోలు విందు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు వీడ్కోలు విందు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముతోపాటు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పద్మ అవార్డు గ్రహీత మొగిలయ్య, గిరిజన నేతలు పాల్గొన్నారు. హోటల్ అశోకాలో జరిగిన ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కాంగ్రెస్ నేత ఆధిర్ రంజన్ చౌధురితోపాటు 18 పార్టీల నేతలు కూడా ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. -
పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
-
Monsoon session of Parliament: పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు LIVE అప్డేట్స్ 2.00PM ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల, ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభా వెల్లోకి దూసుకెళ్లారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభ, రాజ్యసభ్య రెండూ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. 11.48AM ► టీఆర్ఎస్ ఎంపీల ధర్నా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. Delhi | TRS MPs hold protest in front of Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation pic.twitter.com/agdkAOXVaN — ANI (@ANI) July 19, 2022 11.29AM ► ఆప్ ఎంపీల నిరసన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు అనుమతి మంజూరు ఆలస్యాన్ని.. కేంద్రానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆప్ ఎంపీలు నిరసన చేపట్టారు. Delhi | Aam Aadmi Party MPs protest against the Centre in front of Gandhi statue in Parliament against the delay in nod for Singapore visit to Arvind Kejriwal pic.twitter.com/gSpKUYSidX — ANI (@ANI) July 19, 2022 11.17AM ►లోక్సభ సైతం వాయిదా విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకు ముందు రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది. 11.05AM ► రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. #SansadUpdate#RajyaSabha adjourned till 2 PM #MonsoonSession2022 pic.twitter.com/55AhC4yv6b — SansadTV (@sansad_tv) July 19, 2022 11.03AM ► లోక్సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. గందరగోళం నడుమే లోక్ సభ కార్యాకలాపాలు నడుస్తున్నాయి. Opposition MPs raise slogans against price hike and inflation in Lok Sabha as house proceedings begin on the second day of Parliament pic.twitter.com/c3HTjMRsGj — ANI (@ANI) July 19, 2022 ► సోమవారం మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకూ కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా తొలి రోజు ఉభయసభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. ► ఇక రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందే.. గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలు,అగ్నిపథ్ సహా ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, at Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/KqMp3rrLSM — ANI (@ANI) July 19, 2022 ► ప్రధాని మోదీ.. మంత్రులతో సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చలు జరిపారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు సెషన్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు గందరగోళం నడుమే ఉభయ సభలు వాయిదా పడటంతో రెండో రోజు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
విపక్షాల ఆందోళన.. రాజ్యసభ వాయిదా
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మొదటి రోజు అవాంతరం ఎదురైంది. విపక్షాల ఆందోళనతో సోమవారం రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తూ సభ వెల్ దాకా దూసుకెళ్లారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్సభ వాయిదా పడింది. -
మా గ్రామానికి రండి
సాక్షి, న్యూఢిల్లీ: తన స్వగ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (వైఎస్సార్సీపీపీ) నేత విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి చెప్పారు. గ్రామంలో పనులన్నీ పూర్తయ్యాక ఒకసారి సందర్శించాలని కోరారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీల నేతలు వెంకయ్యనాయుడుతో తమకున్న సాంగత్యాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజాజీవితంలో వెంకయ్యనాయుడుకు ఉన్న సుదీర్ఘ అనుభవం పదవీ విరమణ అనంతరం కూడా దేశానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. తామిద్దరూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒకే నియోజకవర్గానికి చెందిన వారమన్నారు. సభలో కొన్నిసార్లు వెంకయ్యనాయుడుతో విభేదించి ఉండొచ్చుగానీ.. తర్వాత అలాచేసి ఉండకపోతే బాగుండునని అనిపించేదని ఆయన చెప్పారు. వెంకయ్యనాయుడు స్ఫూర్తి పాఠశాల రోజుల నుంచే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిత్వం, ప్రసంగాలు, దార్శనికత తనకు స్ఫూర్తినిచ్చాయని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ చెప్పారు. ప్రజాజీవితం, సేవల నుంచి వెంకయ్యనాయుడు ఎప్పటికీ విరమించుకోరని పేర్కొన్నారు. సుదీర్ఘ అనుబంధం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు చెప్పారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలు వినడానికి తాను చాలా దూరం ప్రయాణించానని నాటి రోజులు గుర్తుచేసుకున్నారు. మాతృభాష వినియోగాన్ని ప్రోత్సహించడంలో వెంకయ్యనాయుడు నిబద్ధతను కొనియాడారు. ప్రజాజీవితంలో ఎదురులేని మంచి వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు ఒకరని కొనియాడారు. -
విశ్వానికి దివ్య యోగం
సాక్షి, హైదరాబాద్: ‘యోగా విద్యకు ఎల్లలు లేవు.. కులం లేదు.. మతం లేదు.. ప్రాంతం లేదు.. ఇది విశ్వవ్యాప్తంగా అనుసరణీయం’ అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మంగళవా రం ఉదయం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ యోగాను ఐక్యరాజ్య సమితి వరకూ తీసుకెళ్లి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించిన ప్రధాని మోదీని అభినందిస్తున్నానన్నారు. ప్రస్తుత తరం యోగా ప్రాధానాన్ని తెలుసుకునేలా ఈ ఏడాది యోగా థీమ్ను ‘యోగా ఫర్ స్పిరిట్యువాలిటీ’గా ఎంచుకున్నట్టు తెలిపారుæ. కోవిడ్ వల్ల శారీరకం గా, మానసికంగా సమస్యలు ఎదురయ్యాయని, ఈ నేపథ్యంలో ఒత్తిడి నివారణకు యోగా ఉపకరి స్తుందని చెప్పారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఆయుష్ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా దినోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే ఈటల సహా పలువురు బీజేపీ నాయకులు, నటుడు అడివి శేషు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, యోగా సాధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా వర్చ్యువల్ సందేశాన్ని వినిపించారు. -
రాష్ట్రపతి ఎన్నికలు: వెంకయ్యనాయుడితో నడ్డా, షా భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార పక్షం తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని నిలబెడతారనే చర్చ జోరందుకుంది. ఈ తరుణంలో.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జేపీ నడ్డా, అమిత్ షా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం వెంకయ్యనాయుడుని కలిసి.. హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చర్చించారు. ఈ తరుణంలో.. రాష్ట్రపతి రేసులో వెంకయ్యనాయుడును నిలబెడతారా? అనే చర్చ మొదలైంది. గతంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టిన వాళ్లు.. రాష్ట్రపతిగానూ పదోన్నతి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఉపరాష్ట్రపతులుగా చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి. గిరి, ఆర్. వెంకట్రామన్, డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, కె.ఆర్ నారాయణన్లు రాష్ట్రపతులయ్యారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ల పర్వం మొదలై.. వారం గడుస్తున్నా ఇటు ఎన్డీయే, అటు విపక్షాల కూటమి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించలేదు. విపక్షాలు మరోసారి భేటీ కానున్న తరుణంలో.. బీజేపీ కమిటీ మాత్రం అభ్యర్థి ఎవరనేది కనీసం హింట్ కూడా ఇవ్వలేదు. మంగళవారం రాత్రి 7 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో.. రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయొచ్చని భావిస్తున్నారు. ఇక విపక్షాల తరపున యశ్వంత్ సిన్హా పేరు తెర మీదకు వచ్చింది. అయితే అందరి ఆమోదయోగ్యమైన పేరును ప్రకటిస్తామని సీపీఐ నేత డి రాజా చెప్తున్నారు. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. -
రాజ్యసభ చైర్మన్కు మూడు నివేదికలు.. అందులో అంశాలివే..
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పాటైన నూతన జిల్లాలను వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్(ఓడీఓపీ) పథకంలో చేర్చాలని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. ఓడీఓపీలో సులభతర వాణిజ్యాన్ని పెంచాలని కోరింది. ఒక్కో జిల్లాలో ఒక్కో ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ స్థానికంగా లభ్యమయ్యే వాటికి విస్తృత ప్రచారం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ఓడీఓపీ పథకం లక్ష్యం. ఈ–కామర్స్ సంస్థలకు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ట్రేడ్(డీపీఐ ఐటీ)లో నమోదును తప్పనిసరి చేయాలని స్థాయీ సంఘం సూచించింది. తేయాకు బోర్డును పునఃనిర్మాణం చేయాలని కోరింది. ఈ మేరకు వాణిజ్య శాఖ స్థాయీ సంఘం చైర్మన్ వి.విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు మూడు నివేదికలను అందజేశారు. అనంతరం అందులో ముఖ్యాంశాలను మీడియాకు వివరించారు. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. సాధికారత బృందం ఏర్పాటు చేయాలి ఓడీఓపీలో ప్రస్తుతం 733 జిల్లాలు మాత్రమే ఉన్నాయని, మిగతా జిల్లాలను కూడా పథకంలో చేర్చాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నూతనంగా ఏర్పాటైన 13 జిల్లాలను ఇందులో చేర్చాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసిందన్నారు. ఓడీఓపీకి సంబంధించి ఎగుమతులు, ఎంఎస్ఎంఈ, వివిధ శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలతో నివేదిక రూపొందించామని తెలిపారు. వ్యవసాయం, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఎంఎస్ఎంఈ రంగాల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖలు/విభాగాల కార్యదర్శులతో సాధికారత బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు చేసిందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ సమర్థంగా అమలు చేసే క్రమంలో సమన్వయం కోసం డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఈపీసీ)లు ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. దేశీయ ఉత్పత్తులకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర చోట్ల మార్కెటింగ్ అవకాశాలు విస్తృతంగా దక్కేలా చూడాలని కోరామన్నారు. వివిధ జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) నమూనాలు ప్రారంభించాలని సూచించామన్నారు. ఆరోగ్యసేతు తరహాలో.. ఎంఎస్ఎంఈల్లో ఎక్కువగా అనధికార, అసంఘటిత రంగంలో పని చేస్తున్నందున ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు సరైన రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ ఉండడం లేదని కమిటీ గుర్తించిందన్నారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ఎంఈలను ఒకే వేదికపైకి తెచ్చేలా ఆరోగ్యసేతు తరహాలో ఒకే మ్యాపింగ్ విధానం తేవాలని సూచించామన్నారు. డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ (డీఈహెచ్) సమర్థంగా పని చేసేలా చేపట్టిన చర్యలను వివరించామన్నారు. ఓడీఓపీ ఉత్పత్తులతో పెద్దపెద్ద ఈ–కామర్స్ సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని, అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్న ఉత్పత్తులను గుర్తించి ఎగుమతులను ప్రోత్సహించాలని కోరామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నకిలీ టీ ఎగుమతులను అరికట్టాలి షాంపైన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డార్జిలింగ్ టీ నకిలీ ఎగుమతులను అరికట్టాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. టీ పరిశ్రమకు రాయితీలు, పెండింగ్లు క్లియర్ చేయాలని సూచించామన్నారు. తేయాకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పర్జా పట్టాలు ఇవ్వాలని కోరామన్నారు. కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని వర్తింపజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచించామన్నారు. కృషి సించాయ్ పథకాన్ని తేయాకు రంగానికి వర్తింపచేసి టీ బోర్డును పూర్తిగా పునఃనిర్మాణం లేదా తగిన సవరణలు చేయాలని సూచించామని తెలిపారు. ఈ–కామర్స్లో గుత్తాధిపత్యం లేకుండా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)లో ఈ–కామర్స్ సంస్థల నమోదును తప్పనిసరి చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని విజయసాయిరెడ్డి తెలిపారు. పెద్దపెద్ద సంస్థల గుత్తాధిపత్యం లేకుండా అన్ని సంస్థలు ఒకే ప్లాట్ఫాంలోకి తేవాలని సిఫారసు చేశామన్నారు. దేశవ్యాప్తంగా విస్తృతంగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినపుడే ఈ–కామర్స్ విజయవంతం అవుతుందని సూచించామన్నారు. ఈ–కామర్స్ పాలసీ తేవాలని కోరామన్నారు. రూ.40 లక్షల లోపు ఉన్న ఈ–కామర్స్ సంస్థలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కోరగా కేంద్ర కార్యదర్శి వీలు కాదని చెప్పారన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) తరహాలో ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ జోన్స్ నెలకొల్పి ఎగుమతులను ప్రోత్సహించాలని సిఫార్సు చేశామని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నేషనల్ సైబర్ క్రైం పాలసీ తీసుకురావాలని, సైబర్ సెక్యూరిటీ ఆడిట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసిందని తెలిపారు. కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే కర్మ ఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు, రాహుల్గాంధీని ఈడీ ప్రశ్నించడంపై ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏ అభ్యర్థికి మద్దతు తెలపాలనేది వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాహుల్గాంధీని ఈడీ ప్రశ్నించడంలో కేంద్రానికి సంబంధం ఏముంటుందని ప్రశ్నించారు. ‘కర్మ సిద్ధాంతం ప్రకారం పుణ్యం చేసిన వారు పుణ్య ఫలం, పాపం చేసిన వారు పాప ఫలం ఇప్పుడు కాకపోతే వచ్చే జన్మలోనైనా అనుభవించక తప్పదు. కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతా’’ అని పేర్కొన్నారు. -
ఉపరాష్ట్రపతికి వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ నివేదిక అందజేత..
సాక్షి, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను చైర్మన్ విజయసాయిరెడ్డి అందించారు. ఈ సందర్బంగా మూడు నివేదికలను విజయసాయిరెడ్డి అందించారు. స్టాండింగ్ కమిటీ నివేదికలో కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ఆయన సిఫార్సు చేశారు. సిఫార్సులలో 20 కీలక అంశాలు.. 1. వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) పథకంలో ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏర్పాటైన నూతన జిల్లాలు చేర్చాలని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు. ఓడీఓపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచాలి. 2. ఈ-కామర్స్ సంస్థలు డిపార్ట్మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ట్రేడ్ (డీపీఐఐటీ)లో నమోదు తప్పనిసరి చేయాలి. 3. టీ బోర్డును పునఃనిర్మాణం చేయాలి. 4. ఓడీఓపీలో ప్రస్తుతం 733 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాలను కూడా ఆ పథకంలో కవర్ చేయాలి. 5. ఓడీఓపీకి సంబంధించి ఎగుమతులు, ఎంఎస్ఎంఈ, ఇంటర్ మినిస్టీరియల్ కో-ఆర్డినేషన్ సహా అన్ని సమస్యలు నివేదికలో రూపొందించాలి. 6. వ్యవసాయం, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఎంఎస్ఎంఈ రంగాల కోసం సంబంధిత మంత్రిత్వశాఖలు /డిపార్ట్మెంట్ల సెక్రటరీల సాధికారత బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు. 7. క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసే క్రమంలో సమన్వయం నిమిత్తం డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఈపీసీ)లు ఏర్పాటు చేయాలి. 8. దేశీయ ఉత్పత్తులకు లాటిన్ అమెరికా, ఆఫ్రికా తదితర చోట్ల కూడా మార్కెట్ దక్కేలా చూడాలి. 9. జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) నమూనాలు ప్రారంభించాలి. 10. ఎంఎస్ఎంఈలు ఎక్కువగా అనధికార, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నాయని, తద్వారా ప్రభుత పథకాల ప్రయోజనాలు పొందడానికి సరైన రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ ఉండడంలేదని గమనించిన కమిటీ ఎంఎస్ఎంఈలను ఒకే ప్లాట్ఫాం మీదకి తీసుకురావడానికి ఆరోగ్యసేతు తరహాలో ఒకే మ్యాపింగ్ విధానం తీసుకురావాలి. 11. డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ (డీఈహెచ్) సమర్థంగా పనిచేయడానికి చర్యలు తీసుకోవాలి. 12. ఓడీఓపీ ఉత్పత్తులకు పెద్ద పెద్ద ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. అంతర్జాతీయ ఉత్పత్తులు గుర్తించి ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. 13. షాంపైన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డార్జిలింగ్ టీ.. నకిలీ ఎగుమతులు అరికట్టాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. 14. టీ పరిశ్రమకు రాయితీలు, పెండింగ్లు క్లియర్చేయాలి. 15. తేయాకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పర్జాపట్టాలు ఇవ్వాలి. కార్మికులకు మినిమం వేజేస్ యాక్ట్ వర్తింపజేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సూచన. 16. కృషి సింఛాయి పథకంలో టీ రంగానికి వర్తింపజేయాలని, తేయాకు బోర్డును పూర్తిగా పునఃనిర్మాణం లేదా తగిన సవరణలు చేయాలి. 17. డిపార్ట్మెంట్ ఫర్ ప్రొమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)లో ఈ-కామర్స్ సంస్థలు నమోదు తప్పనిసరి చేయాలి. పెద్దపెద్ద సంస్థల గుత్తాధిపత్యం లేకుండా అన్ని సంస్థలు ఒకే ప్లాట్ఫాంలోకి తీసుకురావాలి. 18. నేషనల్ సైబర్ క్రైం పాలసీ తీసుకురావాలని, సైబర్ సెక్యూరిటీ ఆడిట్చేయాలని కమిటీ సిఫార్సు. 19. ఈ-కామర్స్ పాలసీ తీసుకురావాలి. 20. ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్) తరహాలో ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ జోన్స్ పెట్టి ఎగుమతులు ప్రోత్సహించాలి. -
ఆహార తయారీలో పవిత్ర యజ్ఞమే వ్యవసాయం
సాక్షి, హైదరాబాద్: మట్టి నుంచి మనుగడకు ఉపయోగపడే ఆహారాన్ని తయారు చేసే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వాఖ్యానించారు. ఈ యజ్ఞంలో కీలకపాత్ర పోషిస్తున్న రైతుల పట్ల ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు పక్షపాతం చూపించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. పంటల ఉత్పత్తిలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు. శనివారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో రైతునేస్తం పబ్లికేషన్ ప్రచురించిన ‘ప్రకృతి సైన్యం’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులకు మళ్లీ పట్టం కడుతూ, విజయాలు సాధించిన వంద మంది రైతుల విజయ గాథలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని, ప్రచురణ కర్త యడ్లపల్లి వెంకటేశ్వరరావు, రచయిత డి.ప్రసాద్లను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆంగ్లేయుల పాలనలో భారతీయ సంస్కృతి, సంప్ర దాయాలతో పాటు వ్యవసాయ రంగం కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొందని, స్వరాజ్య సాధన తర్వాత మన అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడంలో పర్యావరణాన్ని అశ్రద్ధ చేశామన్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గుచూపడం సంతోషకరమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులను అదుపు చేసుకుని, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించవచ్చని, ఈ పద్ధతిలో ఏ వస్తువును బయట నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా, ఆకర్షణీయంగా మార్చేందుకు చిత్తశుద్ధితో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. పార్లమెంట్, పార్టీలు, ప్రణాళికా సంఘాలు, నీతి ఆయోగ్, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నీ వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలన్న ఆయన.. యువత కూడా ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నార్మ్ సంచాలకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బాలు చిరస్మరణీయుడు
బంజారాహిల్స్: పాటల కార్యక్రమాల నిర్వహణ వెనుక పిల్లలను గాయకులుగా, ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు సినీగాయకుడు బాలసుబ్రమణ్యం పడిన తపన కనిపి స్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హాసం సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ పీఎస్ గోపాలకృష్ణ రచించిన ‘జీవనగానం’ గ్రంథాన్ని జూబ్లీహిల్స్లోని దస్పల్లా హోటల్లో శుక్రవారం ఆవిష్కరించారు. సంజయ్కిశోర్ రూపొందించిన బాలు జీవన చిత్రం డాక్యుమెంటరీని, సినీనటుడు కమల్ హాసన్, హాసం సంస్థ, శాంతాబయోటెక్ సంస్థ ఫౌండర్ వరప్రసాద్రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లా డుతూ.. బాలు స్ఫూర్తితో మన భాష, సంస్కృతి, కళలను భావితరాలకు సగర్వం గా అందించేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఆలయ సుప్రభాత నివేద నల్లో, తెలుగు ప్రజల జీవితాల్లోనూ బాలు చిరస్మరణీయుడని కొనియాడారు. బాలు జీవితం గురించి ముందు తరాలు తెలుసుకోవాలన్న తపనతో పుస్తకాన్ని తీసుకొచ్చిన పుస్తక రచయిత డా‘‘పి.ఎస్.గోపాలకృష్ణ, చిత్ర రూపకర్త సంజయ్ కిశోర్, ప్రచురణకర్త డా.వర ప్రసాద్ రెడ్డిలను, హాసం సంస్థను ఆయన అభినందించారు. పుస్తకాన్ని ఆవిష్కరించడం, వారికి ఆత్మీయులైన కమల్ హాసన్కి తొలిప్రతిని అందజేయడం ఆనందంగా ఉందన్నారు. కమల్హాసన్ మాట్లాడుతూ తమ ఇద్దరి ఆత్మ ఒకటేనన్నారు. -
ఆకాశవాణి రేడియో కేంద్రం.. మీరు వింటున్నారు..
ఆకాశవాణి రేడియో కేంద్రం.. ఆబాలగోపాలాన్ని అలరించిన అత్యంత ప్రియనేస్తం. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి. మన సంస్కృతిని సజీవంగా నిలిపిన ఓషధి. జాతీయ సమైక్యతకు సారథి. కళాకారులకు పెన్నిధి. ఒక్కమాటలో చెప్పాలంటే.. యావత్ భారత జనజీవనాన్ని అత్యంత ప్రభావితం చేసింది. మన జాతి సంస్కృతి సంప్రదాయాలను నిలపడంలో, కళలు మొదలు కరెంట్ అఫైర్స్ వరకు ఆకాశవాణి పోషించిన పాత్ర మరపురానిది. వార్తలకు అత్యంత ప్రామాణికత, ప్రాధాన్యం ఉండేది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, వివిధ సమయాల్లో ప్రజలు ఆకాశవాణి వార్తలపైనే ఆధారపడేవారు. అలనాటి తరాన్ని అలరించిన ఆకాశవాణి.. ఇప్పుడు సింహపురి వాణిగా శ్రోతలను అలరిస్తోంది. నెల్లూరు(బారకాసు): ఆకాశవాణి.. విజయవాడ, విశాఖపట్నం కేంద్రమంటూ సమాజంలో జరిగిన ముఖ్యమైన విశేషాలను వార్తల రూపంలో ప్రసారాలతో శ్రోతలను రేడియోలకు కట్టిపడేసింది. పాడి పంటలు, నాటికలు, భక్తి గీతాలు, సినీపాటలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, ఇలా అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేసి అలరించేది. సుమారు మూడు దశాబ్దాల క్రితం వరకు శ్రోతలను ఓలలాడించిన రేడియో ఆధునిక టెక్నాలజీ కారణంగా కనుమరుగైంది. టెలివిజన్ రంగం వైపు ప్రజలు మొగ్గు చూపారు. ఈక్రమంలో సాంకేతికతను అందిపుచ్చుకుని ఎఫ్ఎం స్టేషన్లను తీసుకురావడం ద్వారా ఆకాశవాణి ప్రసారాల్లో నాణ్యత, స్పష్టత పెరిగింది. దీంతో శ్రోతలు మళ్లీ ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రసార భారతి (భారత ప్రజా సేవా ప్రసార సంస్థ)ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల భాషకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన వివిధ కార్యక్రమాలను ప్రసారాలు చేయడం ప్రారంభించింది. చదవండి: (SPSR Nellore District: నీరు చెట్టు.. కనిపిస్తే ఒట్టు) నెల్లూరులో.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో నెల్లూరుకు ఆకాశవాణి కేంద్రం మంజూరైంది. ఈ కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతోపాటు దీనిని గత నెల 27వ తేదీన ఆయన చేతుల మీదుగానే ప్రారంభించడం విశేషం. కార్పొరేట్ హంగులతో భవనాన్ని నిర్మించి అందులో అత్యాధునిక టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అదే ప్రాంగణంలో వంద మీటర్ల ఎత్తులో ప్రసార టవర్ను ఏర్పాటు చేశారు. తద్వారా ఈ కేంద్రం నుంచి 85 కి.మీ. మేర వరకు ప్రసారాలు అందుబాటులోకి వచ్చాయి. గతంలో ఇదే కేంద్రం నుంచి కేవలం 45 కి.మీ. మేర లోపే ప్రసారాలు అందుబాటులో ఉండేవి. నెల్లూరులో స్థానిక భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, స్థానిక పండగల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. సింహపురిలో ఆకాశవాణి నెల్లూరు కేంద్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన రాష్ట్రంలో మొదటగా విజయవాడ తర్వాత విశాఖపట్నం, కడప, తిరుపతి రేడియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరి కొంతకాలానికి అనంతపురం, కర్నూలు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, ఇటీవల నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇక్కడి కేంద్రం విశేషాలు ►నెల్లూరులో 2019 మేలో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రారంభం ►అదే ఏడాది నవంబర్లో ఎఫ్ఎంఎస్ ఆధారిత సేవలు ►2020 ఫిబ్రవరిలో ఉదయం కార్యక్రమాలు ప్రారంభం. ►2020 సంవత్సరం జూలైలో ఆకాశవాణి కేంద్రాన్ని సింహపురి ఎఫ్ఎం కేంద్రంగా మార్చారు. ►2020 ఆగస్టులో సాయంత్రం ప్రసారాలు ప్రారంభం. ►న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ప్రపంచానికి సింహపురి ఎఫ్ఎం సేవలు అందుబాటులోకి.. ►2021 నవంబర్లో జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికి ప్రత్యేక బులెటిన్ ప్రసారం. ►కరోనా కాలంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు. ►నెల్లూరుకు చెందిన వారితో కవి సమ్మేళనాలు, సాహిత్య సదస్సులు ప్రసారం. ►స్థానిక సాహితీవేత్తల సహకారంతో ప్రకృతి నేర్పిన పాఠాలు, పెన్నా కథల పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు. ►ప్రసార సామర్థ్యాన్ని పెంచేందుకు టవర్ ఎత్తును వంద మీటర్ల వరకు ఏర్పాటు. ►ఎంత వ్యయంతో.. : రూ.15 కోట్లు ►ప్రసారాలు : ఉదయం 5.48 నుంచి రాత్రి 11.11 గంటల వరకు -
పార్లమెంటులో ఆరుగురు నెల్లూరు వాసులు
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యక్తికి పెద్దల సభ రాజ్యసభలో చోటు దక్కనుంది. బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బీద మస్తాన్రావును వైఎస్సార్సీపీ తన అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాజ్యసభ, లోక్సభ కలిపి ఆరుగురు జిల్లా వాసులకు చోటు దక్కినట్టయింది. బీద మస్తాన్రావు రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం లాంఛనమే. ఇప్పటికే జిల్లా నుంచి రాజ్యసభలో ఇద్దరు, లోక్సభలో ఇద్దరు ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, విజయసాయిరెడ్డి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. నెల్లూరు ఎంపీ ఆదాల, ఒంగోలు ఎంపీ మాగుంట లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా నెల్లూరు జిల్లా వాసే. చదవండి: (వైఎస్సార్సీపీ నలుగురు రాజ్యసభ అభ్యర్థులు ఖరారు) -
నెల్లూరులో ఆకాశవాణి కేంద్రం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మీడియా అద్దం లాంటిదని, అది సమాజాన్ని ప్రతిబింబించడంతో పాటు సమాజంలో సానుకూల మార్పునకు కృషి చేయాలని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని నెల్లూరు ఆలిండియా రేడియో కేంద్రాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. అనంతరం 100 మీటర్ల 10 కిలోవాట్ల ఎఫ్ఎం స్టేషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడు తూ.. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి హో దాలో నెల్లూరు ఎఫ్ఎంకు శంకుస్థాపన చేశామని, అది పూర్తి స్థాయి రేడియో కేంద్రంగా రూపుదిద్దుకో వడం, ఇప్పుడు దాన్ని జాతికి అంకితం చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజల జీవితాల్లో రేడియో పాత్రను ప్రస్తావిస్తూ మీడియాకు పలు సూచనలు చేశారు. ప్రచార, ప్రసార మాధ్యమాలు అందించే వార్తలు సంచలనాలకోసం కాకుండా సత్యానికి దగ్గరగా ఉండాలన్నారు. చానళ్లలోని చర్చల్లో సభ్యత, సంస్కారంతో గౌరవప్రదమైన పదాలు వాడాలన్నారు. ఇప్పటికీ 60 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారని వారికి అనువుగా ఉండేలా సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, వ్యవసాయం వంటి వాటిని ప్రోత్సహించేందుకు పత్రికలు, మీడియా మాధ్యమాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ప్రసార భారతి సీఈవో శశిశేఖర్ వెంపటి, ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ ఎన్. వేణుధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఊరికో సేవాలయం ఉండాలి ప్రతి ఊరిలో ఒక విద్యాలయం, ఒక గ్రంథాలయం, ఒక దేవాలయం లాగా ఒక సేవాలయం కూడా ఉం డాలని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరు కాలువ వద్ద ఏర్పాటు చేసిన దేవిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ను ఆయన ప్రారంభించారు. దేవిరెడ్డి శారదమ్మ విగ్రహం వద నివాళులర్పించారు. -
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అంటే గౌరవమే కాని...
ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేసిన కొన్ని సూచనలు ఆహ్వానించదగినవే. కాకపోతే ముందుగా వాటిని ఆయనకు లేదా, గతంలో ఆయన ప్రాతినిథ్యం వహించిన రాజకీయ పార్టీకి వర్తింపచేసుకుని, తదుపరి ఇతర పార్టీలకు సూచించి ఉంటే అర్దవంతంగా ఉండేది. రాజకీయ పక్షాలు బాద్యతారహితంగా, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడంపై దేశ వ్యాప్తంగా అన్ని స్థాయిలలో చర్చ జరగాలని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాలతో పాటు, ఇతర వ్యవస్థలలో వేళ్లూనుకుంటున్న కులం, మతం, ప్రాంతీయ తత్వాలు దేశానికి చాలా ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుణం, సామర్థ్యం, యోగ్యత, నడతలకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉండగా వాటి స్థానంలో కులం, డబ్బు, మతం, నేర స్వభావాలకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. ఇవన్ని ఆయన జనరల్గా మాట్లాడినట్లు కనిపించినా, ఆంధ్రప్రదేశ్కు వెళ్లే మాట్లాడుతున్నారన్న భావన కలగడమే ఇబ్బందికరంగా ఉంటోంది. ఇతర రాష్ట్రాలలో ఉచిత హామీలుకాని, ఆచరణ సాద్యం కాని వాగ్దానాలు అనేకం చేస్తున్నా వాటిని పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్న కొందరు ప్రముఖులు ఎపికి వచ్చేసరికి మాత్రం సుద్దులు చెబుతున్నారన్న అనుమానం ఉంది. వెంకయ్య నాయుడు కూడా అలా మాట్లాడేరేమోనన్న సంశయం వస్తుంది. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఏపీలో ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని బిజెపి నేతలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నిజమే.. అసలు గుమ్మడి కాయల దొంగలను వదిలేసి, ఇతరులపై మాత్రం నిందలు మోపుతున్నారన్న భావన కలిగితేనే విమర్శలు వస్తాయన్న సంగతి గ్రహించాలి. అలాగే తమకు కావల్సినవారు ముఖ్యమంత్రిగానో, మరే కీలకమైన పదవిలోనో ఉన్నప్పుడు గుర్తుకు రాని అంశాలు ఇప్పుడే జ్ఞప్తికి వస్తున్నాయన్న భావన కలిగితేనే ప్రతిస్పందన వస్తుంది. లేకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుంది. నిజంగానే వెంకయ్యనాయుడు ధైర్యంగా చెప్పదలిచి ఉంటే, ఏ ఏ హామీలు ఆచరణ సాధ్యం కానివో నిర్దిష్టంగా చెప్పగలిగి ఉండాల్సింది. అలాగే ఏ స్కీములు వృదా అయినవో ఆయన వివరించి ఉండాలి. అలాకాకుండా ఏపీకి వచ్చి ఆ ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను అమలు చేస్తున్న నేపథ్యంలో వెంకయ్య వంటివారు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యం వస్తుంది. మరి అదే వెంకయ్య నాయుడు తెలుగుదేశం మిత్రపక్షంగా ఉన్నప్పుడు ఏకంగా లక్ష కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినప్పుడు తనపక్కనే కూర్చున్న చంద్రబాబును ఉద్దేశించి అదెలా సాధ్యమని అప్పటికప్పుడే సభలలో ప్రశ్నించి ఉంటే ప్రజలంతా ఆయనను శెహబాష్ అని మెచ్చుకునేవారు. లక్షల కోట్లతో అమరావతి రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు హడావుడి చేసినప్పుడు అదెలా కుదురుతుందని వెంకయ్య అడిగి ఉంటే అంతా బాగా మాట్లాడారని అభినందించేవారు. టీడీపీ వందల కొద్ది హామీలు ఇచ్చినప్పుడు బీజేపీ భాగస్వామిగా ఉంది. వారి పార్టీతో తమకు ఏమి సంబంధం అని తప్పించుకోవచ్చు. కాని ఇద్దరూ కలిసి ప్రచారం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోరు కదా!పోనీ బీజేపీ చేసిన వాగ్దానాల విషయానికే వద్దాం. తిరుపతిలో మోదీగారితో కలిసి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీ ఆచరణ సాధ్యమైనదా?కాదా? అది సాధ్యమైనదే అయితే కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? వెంకయ్య దాని గురించి ఎందుకు ప్రశ్నించడం లేదు. ఆంద్ర ప్రదేశ్కు కేంద్ర మంత్రిగా వెంకయ్య ఏమీ చేయలేదని అనజాలం. ఆయా విద్యాసంస్థలు రావడానికి ఆయన కృషి చేశారు. అది వేరే విషయం. కాని ప్రత్యేక హోదాను వెంకయ్యే పట్టుబట్టి సాధించారని 2014 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఘనంగా చెప్పుకున్నారు కదా?కాని అది ఇవ్వలేదు. అంటే వెంకయ్య ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చారా? ఉత్తరప్రదేశ్లో పలు ఉచిత స్కీములతో పాటు రుణమాఫీ హామీ కూడా 2017 ఎన్నికలలో ఇచ్చారు. అప్పుడు వెంకయ్య అలాంటివి వద్దని చెప్పలేకపోయారే. ముస్లింల మక్కా యాత్రకు సబ్జిడీ ఇవ్వడంపై విమర్శించే బీజేపీ నేతలు నాగాలాండ్లో క్రైస్తవులు జెరుసలెం వెళ్లడానికి ఆర్దిక సాయం చేస్తామని ఎలా ప్రకటించారు. మరి అది తప్పా?రైటా? అన్నది కూడా ఆయన తెలియచేయాలి. తెలంగాణలో దళితులకు పదిలక్షల రూపాయల ఆర్ధిక సాయం చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. దానిని వెంకయ్య నాయుడు వ్యతిరేకిస్తే ఆ మాట ఆ రాష్ట్రంలో చెప్పి ఉండాలి కదా? ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం పెడితే వెంకయ్యతో సహా కొందరు ప్రముఖులు గగ్గోలుగా మాట్లాడారు. వారి పిల్లలు, మనుమళ్లు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే ఫర్వాలేదు. ఆ పని చేయరు. తెలంగాణలో ఆంగ్ల మీడియం పెడితే మాత్రం ఎవరూ నోరెత్తలేదు. ఇదంతా తమాషాగా ఉంటుంది. బీజేపీ ఎదిగిందే మతపునాదుల మీద అన్నది అత్యధిక ప్రజల అభిప్రాయం. దానిని నిర్దారిస్తూ ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లింకు కూడా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ టిక్కెట్ ఇవ్వలేదు?మరి అది సరైనదేనా? కర్నాటకలో హిజబ్ వివాదం వంటివాటిని సృష్టించింది ఎవరు? దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని బీజేపీ హామీ ఇవ్వడం సరైనదేనా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దానిని అమలు చేస్తామని అంటున్నారు. అది మత సామరస్యానికి ఉపకరిస్తుందా? జమ్ము-కశ్మీర్ లో ఆర్టికిల్ 370 రద్దు చేస్తామని బీజేపీ గతంలోనే చెప్పింది. దానిని మోదీ ప్రభుత్వం అమలు చేసింది. కాని ఆ తర్వాత ఇంతవరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడలేదు. పైగా ఉగ్రవాదుల బెడద పోలేదు. మరి బీజేపీ విదానం ఆచరణ సాధ్యం అనుకోవాలా? లేక కాదనుకోవాలా;? ఇలా కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుందన్నట్లుగా మాట్లాడితేనే విమర్శలు వస్తాయి.ఆంద్రప్రదేశ్లో మతం పేరుతో వివాదాలు సృష్టించడానికి బీజేపీ నేతలు గత రెండేళ్లలో ఎన్ని ప్రయత్నాలు చేసింది తెలియదా? కాకపోతే ఉప రాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఉన్నందువల్ల ఆయన వీటి గురించి పట్టించుకుని ఉండకపోవచ్చు. ఏపీ వచ్చినప్పుడు ఆ విషయాలు ప్రస్తావించడం ఆయనకు ఇబ్బంది కావచ్చు. కులం గురించి ఆయన మాట్లాడారు. వద్దన్నారు. ఆ భావనే వద్దన్నారు. కాని ఆచరణలో అలాగే ఉంటోందా? ఈ విషయంలో ఆయన చుట్టూ ఉన్నవారి గురించి రాయడం ఇష్టం లేదు. కర్నాటకలో ఎడ్యూరప్పను కాని, ఆ తర్వాత బొమ్మైని కాని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో తెలియదా? ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ల ,పోలీసు అదికారుల సమావేశంలో మాట్లాడుతూ తమవారికే పనులు చేయాలని చెబితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కులం,మతం, చూడవద్దు, ప్రాంతం చూడవద్దు, పార్టీ చూడవద్దు అని అదే అధికారులకు సూచించారే. ఆయా సంక్షేమ పధకాలలో జగన్ అలాగే చేస్తున్నారే. మరి వెంకయ్య దానిని గుర్తించరా? గుణం గురించి మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఒక ప్రముఖుడు ఇరుక్కుంటే కాపాడింది ఎవరు? అలాంటివి ఏ కేటగిరి కిందకు వస్తాయి? నిజంగానే పార్టీలను చూడదలిస్తే కృష్ణా జిల్లా పరిషత్ ఆవరణలో ఒకప్పుడు కాంగ్రెస్ ప్రముఖుడు, ఇప్పటి టీడీపీ నేత తండ్రి అయిన పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహానికి అనుమతి ఇచ్చి ఉండేవారా? అలాగే టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పేరుతో జగన్ జిల్లా ఏర్పాటు చేసి ఉండేవారా?. ఆయా సంక్షేమ పధకాలు కులం, మతం చూడకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలలోకి వేస్తున్నది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కాదా? వృద్దులకు ఇళ్లవద్దకే పెన్షన్ ఇచ్చే కొత్త సంస్కృతిని తీసుకు వచ్చింది జగన్ కాదా? మరి వీటన్నిటిని కూడా వెంకయ్య నాయుడు పరిగణనలోకి తీసుకుని మాట్లాడి ఉంటే అంతా ప్రశంసించేవారు. ఏది ఉచితం కాదు. ఏది కాదు.. అంటే కాలాన్నిబట్టి పరిస్థితిని బట్టి మారిపోతుంది. ఒకప్పుడు ఎన్.టి.ఆర్. రెండు రూపాయలకే కిలో బియ్యం ఇస్తానంటే అప్పటి ఇతర రాజకీయ పక్షాలు ఆయనను తీవ్రంగా విమర్శించాయి. కాని చివరికి ఆయనే రైట్ అయ్యారు. 1994లో తిరిగి ఆయన అదే స్కీమ్ తీసుకు వచ్చినప్పుడు అది మానవ ఉత్సాదకకు సంబందించిన అంశం కనుక కాపిటల్ వ్యయం గా చూడాలని తెలుగుదేశం వాదించింది. మరి ఇప్పుడు బడులను నాడు-నేడు కింద అభివృద్ది చేయడం పెట్టుబడి వ్యయం అవుతుందా?లేదా ? కనీసం ఈ అంశాలకైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించి, ఆ తర్వాత ఆయన చెప్పదలిచిన హితోక్తులు చెప్పి ఉంటే ఎవరూ ఆక్షేపించేవారు కాదు కదా? ఏది ఏమైనా వెంకయ్య నాయుడు గొప్పవారు. ఆయన గొప్పస్థానంలో ఉన్నారు. అయినా ఆయన పక్షపాతంగా మాట్లాడుతున్నారన్న భావన సమాజానికి వెళ్లడం మంచిది కాదన్న ఉద్దేశంతోనే ఈ కామెంట్ రాయడం జరిగింది తప్ప, ఆయనపై గౌరవం లేక కాదు. కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
ఫిరాయింపుల చట్టంలో సవరణలు: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
బెంగళూరు: పార్టీ ఫిరాయింపుల చట్టంలో లొసుగుల పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అవి మూకుమ్మడి ఫిరాయింపులకు దోహదం చేస్తున్నాయన్నారు. చట్టంలో సవరణలు తేవాలని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరు ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. పార్టీ మారదలిచిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ గెలుపొందాలన్నారు. ఫిరాయింపుల కేసులపై నిర్ణయాన్ని స్పీకర్లు, చైర్పర్సన్లు, న్యాయమూర్తులు జాప్యం చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిరాయింపులపై నిర్ణయం వెలువరించేందుకు కాలపరిమితి ఉండాలన్నారు. స్థానిక సంస్థలను బలో పేతం చేయాల్సిన అవసరముందన్నారు. మీడియా పాత్ర కీలకం దేశంలోని పెనుమార్పుల్లో మీడియా పాత్ర నిర్ణయాత్మకమని వెంకయ్య అన్నారు. కనిపించని వాస్తవాలను వెలుగులోకి తేవాలన్నారు. తన పదవీకాలం మూడు నెలల్లో ముగుస్తుందని, మళ్లీ రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఖాళీగా మాత్రం ఉండనని, ఏదో వ్యాపకాన్ని చేపడతానని తెలిపారు. -
రాజకీయాల్లో విలువలు, నైతికత ముఖ్యం
సాక్షి, మచిలీపట్నం: ‘పార్టీలు మారే రాజకీయ నాయకుల పదవుల విషయంలో మార్పురావాలి. విలువలు పాటించిన నాయకులనే జాతి కలకాలం గుర్తుంచుకుంటుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో దిగజారుడుతనం, వ్యక్తిగత విమర్శలు ఆందోళనకరంగా ఉన్నాయి. రాజకీయాల్లో విలువలు, నైతికత అత్యంత ఆవశ్యకం’ అని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన కృష్ణాజిల్లా మాజీ జెడ్పీ చైర్మెన్ పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయ నాయకుల నడవడిక, ప్రవర్తన, వ్యవహార శైలి ప్రజలను ప్రభావితం చేస్తాయన్నారు. వారసత్వంతో కాదు... జవసత్వంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శల విషయంలో దిగజారుడుతనం, ప్రసంగాల్లో స్థాయిని మరచి మాట్లాడడం ఆందోళనకరమైన పరిస్థితికి దారి తీస్తోందన్నారు. జాతీయ రాజకీయాలతోపాటు ప్రాంతీయ రాజకీయాల్లోనూ ఈ పరిస్థితి స్థాయి దాటుతోందని తెలిపారు. పార్టీలు మారే రాజకీయ నాయకుల విషయంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉందన్న ఉప రాష్ట్రపతి.. పార్టీ మారడంతో పాటు పదవిని త్యజించే విధంగా చట్టాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయపార్టీల ఎన్నికల హామీలకు నిధులు ఎలా వస్తాయనే అంశాన్ని పార్టీలన్నీ ప్రణాళికతో పాటు వివరించేలా చట్టంలో మార్పులు తీసుకురావాలని ఉప రాష్ట్రపతి సూచించారు. ప్రచార, ప్రసార సాధనాలు, పత్రికలు అందించే సమాచారం సత్యానికి దగ్గరగా, సంచలనానికి దూరంగా ఉండాలని తెలిపారు అసాధారణ నాయకుడు పిన్నమనేని.. ఇరవై ఏడు సంవత్సరాల పాటు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన పేదల పక్షపాతి పిన్నమనేని కోటేశ్వరరావు అసాధారణ నాయకుడన్నారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఉపాధ్యాయులకు సన్మానాలు, పారితోషికాలు అందించేందుకు శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, దూలం నాగేశ్వరరావు, వసంత కృష్ణప్రసాద్, కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, మాజీ మంత్రులు వసంత నాగేశ్వరరావు, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాల్లోకి రావాలి: వెంకయ్య నాయుడు
సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లాలోని మచిలీపట్నంలో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించారు. జిల్లా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. పిన్నపనేని కోటేశ్వరరావు నిత్యం ప్రజల కోసం పని చేశారని అన్నారు. కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు పేర్ని నాని, సామినేని ఉదయభాను, ఎంపీ కేశినేని నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా త ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. జై ఆంధ్ర ఉద్యమంలో పిన్నమనేని కోటేశ్వరరావుతో పాల్గొన్న అనుభవం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగుదనం ఉట్టిపడేలా ఆహార్యంతో అందరినీ ఆకట్టుకున్న వ్యక్తి కోటేశ్వరరావు అని, నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడిన వ్యక్తి అని ప్రశంసించారు. ఏపీలో కృష్ణాజిల్లాతో ఆయనకు ఒక ప్రత్యేకత ఉందని, 22 ఏళ్లు జిల్లాకు చైర్మన్గా పనిచేయడం సాధారణ విషయం కాదన్నారు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు పుట్టింది ఈ జిల్లాలోనేనని, ఘంటసాల వెంకటేశ్వరరావు లాంటి మహనీయులు ఈ జిల్లా వాసులనేనని ప్రస్తావించారు. పాఠశాలల అభివృద్ధిపై పిన్నమనేని ప్రత్యేక శ్రద్ధ చూపించారు. రాజకీయంగా పార్టీ మారకుండా పార్టీలకు అతీతంగా పాలించడం సాధారణ విషయం కాదు. ఇప్పుడున్న రాజకీయాల్లో హుందాతనం తగ్గిపోతుంది. చట్ట సభల్లో శాసన సభ్యులు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. వారసత్వంతో కాదు జవసత్వాలతో రాజకీయాలలోకి రావాలి. కులం కన్న గుణం మిన్న అనేది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల సమయాల్లో రాజకీయపార్టీలు అమలుకాని హామీలు ఇస్తున్నాయి. ఎన్నికల మ్యానిఫెస్టోకి చట్టబద్దత కల్పించాలనే డిమాండ్ వస్తుంది. ఇది మంచిదే.. దీనిపై విస్తృత మైన చర్చ జరగాలి’ అని తెలిపారు చదవండి: ఏపీ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు.. ఇక సులభంగా మ్యుటేషన్లు -
హైదరాబాద్లో ఉప రాష్ట్రపతి పర్యటన.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం నగరానికి రానున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 29లోని తన నివాసం నుంచి బోయిన్పల్లిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ది ఎంపర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ (ఎన్ఐఈపీఐడీ)కు వెళతారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, శ్రీనగర్ టీ జంక్షన్, ఎన్ఎఫ్సీఎల్, పంజగుట్ట ఫ్లై ఓవర్, మోనప్ప జంక్షన్, సీఎం క్యాంప్ ఆఫీస్, గ్రీన్ ల్యాండ్స్ ఫ్లై ఓవర్, బేగంపేట ఫ్లై ఓవర్, పీఎన్టీ ఫ్లై ఓవర్, రసూల్పురా జంక్షన్, సీటీఓ ఫ్లై ఓవర్, ప్లాజా జంక్షన్, కార్ఖానా హనుమాన్ టెంపుల్, బోయిన్పల్లి మార్కెట్ యార్డ్, ఎన్ఐఈపీఐడీ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 గంటలకు కార్యక్రమం ముగిసిన అనంతరం.. తిరిగి అదే మార్గంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని పేర్కొన్నారు. ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ఎంచుకోవాలని ఆయన సూచించారు. చదవండి: బోయిగూడ అగ్నిప్రమాదం.. గాయపడిన ప్రేమ్ మృతి -
కాశీలో శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం సేవలు మరువలేనివి
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కాశీ విశ్వనాథుడుని దర్శించుకున్నారు. అంతుకు ముందు శుక్రవారం సాయంత్రం ఆయన గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి కాశీ పర్యటన సందర్భంగా శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం తరఫున ఆశ్రమం చైర్మన్ పీవీఆర్ శర్మ , ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వీవీ సుందర శాస్త్రి, పీవీ రఘువీర్, వీవీఎస్పీ గణేష్ గౌరవపూర్వకంగా కలిశారు. ఆశ్రమం అభివృధి గురించిన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్ర పతి మాట్లాడుతూ గతంలో ఈ ఆశ్రమానికి వచ్చినట్టు చెప్పారు. ఎన్న ఏళ్లుగా ఈ ఆశ్రమం తెలుగు వారికి కాశీలో అనేక రకాల సేవలు అందిస్తోందని కొనియాడారు. ఆశ్రమం తరఫున ఉపరాష్ట్రపతిని సన్మానించారు. -
ఆధ్యాత్మిక దివ్యధామం అయోధ్య
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని పునర్నిర్మాణం భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవా నికి, శ్రీరాముని జీవితం బోధించిన మానవీయ విలువల పట్ల మన నిబద్ధతకు ప్రతీక అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అయో ధ్య పర్యటన భారతీయ ఆధ్యాత్మిక మూలాలను, సాంస్కృతిక వారసత్వాన్ని ఏకకాలంలో దర్శింపజేస్తుందని అభిప్రాయ పడ్డారు. శుక్రవారం ఉదయం లక్నో నుంచి ప్రత్యేక రైలులో అయోధ్య చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులు రామమందిర నిర్మాణ స్థలాన్ని, రామ్లల్లా మందిరాన్ని సందర్శించుకున్నారు. అనంతరం హనుమాన్ గఢి లో, తర్వాత సరయు నదీతీరంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారణాసి చేరుకుని, దశాశ్వమేథ ఘాట్లో గంగా హారతిలో పాల్గొన్నారు. శనివారం విశ్వనాథుని దర్శించుకోనున్నారు. -
ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఓ కళ నేర్పించాలి
సాక్షి, న్యూఢిల్లీ/విజయవాడ కల్చరల్ : ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడం, సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో కళారూపాలు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. కనీసం పదోతరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగడంతో పాటు ప్రతి విద్యార్థికీ బాల్యం నుంచే ఏదైనా ఓ కళను నేర్పించి వారిలో సృజనాత్మకతకు బాటలు వేయొచ్చన్నారు. తద్వారా బాల్యం నుంచే చిన్నారుల్లో కళలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయత భావన అలవడుతాయని చెప్పారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో శనివారం నిర్వహించిన సంగీత, నాటక అకాడమీ అవార్డులు, లలితకళ అకాడమీ ఫెలోషిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. 2018 నుంచి 2021 వరకు మూడేళ్లకు అవార్డులు ఒకేసారి అందజేశారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. బ్రిటీషర్ల అరాచకాన్ని ఎదిరించే ప్రయత్నంలో కళలు, సాంస్కృతిక రూపాలు ప్రభావవంతమైన రాజకీయ ఆయుధాలుగా ఉపయోగపడ్డాయన్నారు. అలాంటి భారతీయ కళ, సాంస్కృతిక రూపాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. మల్లాదికి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం తెలుగు రాష్ట్రాలకు చెందిన మల్లాది సూరిబాబు(కర్ణాటక సంగీతం), ఎస్.కాశీం, ఎస్.బాబు(నాదస్వరం), పసుమర్తి రామలింగశాస్త్రి (కూచిపూడి), కోట సచ్చిదానందశాస్త్రి(హరికథ)లు అవార్డులు అందుకున్నారు. 62వ జాతీయ ప్రదర్శన అవార్డుల్లో భాగంగా శిల్పకళల విభాగంలో జగన్మోహన్ పెనుగంటికి ఉపరాష్ట్రపతి అవార్డును అందజేశారు. కాగా, విజయవాడకు చెందిన మల్లాది సూరిబాబు తన తండ్రి శ్రీరామమూర్తి వద్ద సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. వేలాది కచేరీలు నిర్వహించారు. నారాయణ తీర్థులు, రామదాసు, సదాశివబ్రహ్మేంద్రులు, అన్నమయ్య కీర్తనలకు స్వర రచన చేశారు. విజయవాడ ఆకాశవాణిలో సుదీర్ఘకాలం పనిచేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సంగీత, నాటక అకాడమీ, లలితకళ అకాడమీ అధ్యక్షురాలు ఉమ నందూరి తదితరులు పాల్గొన్నారు. -
మన కళలను మనమే కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ రంగం నుంచి సామాన్య పౌరుల వరకు ప్రతి ఒక్కరూ మన శిల్పులు, చేతివృత్తి కళాకారుల ఉత్పత్తులను కొనడం ద్వారా వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ఇలా చేయడం ద్వారా మన కళలు అంతరించిపోకుండా కాపాడుకునేందుకు మన వంతు బాధ్యతను నిర్వర్తించినట్టు అవుతుందన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన 12వ రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ను ఉప రాష్ట్రపతి ప్రారంభించారు. భారతీయ శిల్పులు, చేతివృత్తి కళాకారులకు అవసరమైన మేర రుణాలు అందించడం, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వసతులు కల్పించడం అవసరమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. వారికాళ్ల మీద వారు నిలబడే పరిస్థితిని కల్పించినప్పుడే వారు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే వీలుంటుందన్నారు. కళలను పాఠ్యాంశాల్లో చేర్చాలి వివిధ రకాల భారతీయ కళలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరాన్ని వెంకయ్యనాయుడు నొక్కిచెప్పారు. విద్యతో పాటు కళల్లో రాణించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందన్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి ప్రసంగిస్తూ.. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను గిరిజన సంప్రదాయాలు, నృత్యాలకు అంకితం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెందిన 550 మంది స్థానిక కళాకారులతో సహా అన్ని రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని చెప్పారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు మాట్లాడారు. 580 మంది జానపద కళాకారులు, 150 మందికి పైగా చేతివృత్తి కళాకారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన దాదాపు 150 మంది నృత్య కళాకారులు తమ కళలను ప్రదర్శించారు. భిన్నసంస్కృతులపై అవగాహన అవసరం భిన్న ప్రాంతాలు, రాష్ట్రాలకు సంబంధించిన సంస్కృతులను ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో చేతి వృత్తులు–వంటకాల ప్రదర్శనను శుక్రవారం ఉదయం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భిన్న సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఇలాంటి ఉత్సవాలు దోహదం చేస్తాయన్నారు. కాగా పలు ఉత్పత్తుల స్టాల్స్, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటో ఎగ్జిబిషన్ను గవర్నర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సందర్శించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కిషన్రెడ్డి సన్మానించారు. -
రాజ్యసభలో 72మంది సభ్యుల పదవీకాలం పూర్తి
-
అనుభవాన్ని అందరికీ పంచండి!
న్యూఢిల్లీ: త్వరలో రాజ్యసభ నుంచి రిటైరవుతున్న సభ్యులు దేశ ప్రయోజనాలకు అనుగుణంగా, యువతలో ఆసక్తి రేపేలా తమ అనుభవసారాన్ని అన్నిదిశలకు వ్యాపింపజేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. జ్ఞానం కన్నా అనుభవం గొప్పదని, సభ్యులంతా తమ అనుభవాన్ని దేశ సేవకు వినియోగించాలని కోరారు. రాజ్యసభలో రిటైరవుతున్న 72 మంది సభ్యులకు గురువారం వీడ్కోలు పలికారు. ఈ ఏడాది మార్చి– జూలై సమయంలో వీరంతా పదవీ విరమణ చేయనున్నారు. చట్టసభల సభ్యులు సమర్థవంతమైన పనితీరు చూపాలని, చట్టసభల విధులకు అంతరాయం కలిగించకుండా పనిచేయాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. -
ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్
న్యూఢిల్లీ: పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికింది. రిటైర్ అవుతున్న సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫొటో సెషన్లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఫొటో సెషన్లో ఉన్నారు. ఈ సభ ఎంతో ఇచ్చింది: మోదీ పదవీ విరమణ చేసిన సభ్యులు మాట్లాడేందుకు వీలుగా రాజ్యసభలో ఈరోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను వెంకయ్య నాయుడు రద్దు చేశారు. రిటైర్ అయిన సభ్యులు మళ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మన రాజ్యసభ సభ్యులకు అపార అనుభవం ఉంది. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్ కంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్లో చాలా కాలం గడిపాం. మనం ఇచ్చిన దాని కంటే ఎంతో ఎక్కువ ఈ సభ మనకు ఇచ్చింది. ఇక్కడ గడించిన అనుభవాన్ని దేశంలోని నాలుగు దిశలకు తీసుకెళ్లాల’ని మోదీ అన్నారు. ఆంటోనీ, స్వామి, గుప్తా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ.. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, స్వపన్ దాస్గుప్తాలతో సహా మొత్తం 72 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. నిర్మలా సీతారామన్ జూన్లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనుండగా.. పియూష్ గోయల్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, కపిల్ సిబల్.. శివసేన నేత సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ పటేల్ కూడా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. (క్లిక్: అఖిలేష్కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఎంపీలకు వెంకయ్య విందు వెంకయ్య నాయుడు తన నివాసంలో రాజ్యసభ సభ్యులందరికీ ఈ రాత్రి విందు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు ‘పీటీఐ’కి వెల్లడించాయి. పదవీ విరమణ చేస్తున్న 72 మంది సభ్యులకు, ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన మరో 19 మందికి జ్ఞాపికలను వెంకయ్య నాయుడు అందజేస్తారు. ఈ విందులో ఆరుగురు ఎంపీలు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శిస్తారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: థ్యాంక్యూ మోదీ జీ: కేటీఆర్ సెటైర్లు)