పార్లమెంటు సమావేశాలు ముందుగానే నిరవధిక వాయిదా? | Parliament Monosoon Session Vice President Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్య నాయుడుకు వీడ్కోలు.. అనుకున్న తేదీకి ముందే పార్లమెంటు సమావేశాలు ముగింపు!

Aug 8 2022 10:59 AM | Updated on Aug 8 2022 11:45 AM

Parliament Monosoon Session Vice President Venkaiah Naidu - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి,న్యూఢిల్లీ: సోమవారం రాజ్యసభలో వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. వివిధ పార్టీలకు చెందిన నేతలు వీడ్కోలు ప్రసంగాలు చేయనున్నారు. అనంతరం  పార్లమెంటు సమావేశాలు అనుకున్న సమయానికంటే ముందుగానే నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. మొహర్రం , రక్షాబంధన్ సెలవుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఉదయం సెషన్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వీడ్కోలు కార్యక్రమం,  మధ్యాహ్నం తర్వాత రెండు బిల్లులను ఆమోదించే అవకాశం ఉంది. అనంతరం సభను ఛైర్మన్ నిరవధికంగా వాయిదా వేయనున్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 12 వరకు జరగాల్సి ఉంది. కానీ సెలవుల వల్ల ముందే ముగించే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: మహారాష్ట్ర  కేబినెట్‌ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్‌కు హోంశాఖ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement