రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్కు వివిధ రూపాల్లో రూ.2.03 లక్షల కోట్ల నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైటీ ప్రకటించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004 నుంచి 2009 వరకూ 13 జిల్లాలకు రూ.34 వేల కోట్లు, 2009 నుంచి 2014 వరకూ రూ.69 వేల కోట్ల ఇచ్చిందని, తాము ఐదేళ్లలోనే అంతకు ఐదు రెట్ల నిధులు ఇస్తామని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడి సమీపంలో పరిపాలనా నగరం, రాజధాని రోడ్ గ్రిడ్లోని ఏడు రహదారుల నిర్మాణానికి అరుణ్ జైట్లీ మరో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. విజయవాడలో మురుగు నీటిపారుదల వ్యవస్థ, గుంటూరులో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి అక్కడి నుంచే రిమోట్తో శంకుస్థాపన గావించారు.
Published Sat, Oct 29 2016 6:41 AM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement