చంద్రబాబు సర్కార్పై గట్టిగా ఒత్తిడి తెస్తామని, అసైన్డ్ భూములంటే అత్తగారి భూములనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చట్టాలను మార్చుతామని ఆయన తెలిపారు. భూములు ఇచ్చేస్తే ప్రజలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. పేదల భూములు లాక్కునే హక్కు ఎవరిచ్చారన్నారు. పరిశ్రమల పేరుతో జరుగుతున్న దోపిడీని ఆపాలని ఆయన అన్నారు. ఖర్మకాలి చంద్రబాబు సీఎం అయిన తర్వాత కృష్ణా డెల్టాకు కూడా కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు.