ఐపీఎల్ వేలంలో 'భారత్‌' వెలవెల..! | dissappoint to indian cricketers | Sakshi
Sakshi News home page

Published Mon, Feb 20 2017 1:10 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

ఈసారి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) వేలంపాటలో భారత క్రికెటర్లకు చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం ఇప్పటివరకు జరిగిన వేలంపాటలో విదేశీ ఆటగాళ్లకు రికార్డుస్థాయి ధరకు అమ్ముడుపోగా.. భారత క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు మొగ్గు చూపలేదు. భారత్‌ స్టార్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మను సైతం కొనుగోలు చేసేందుకు ఏ జట్టు ఆసక్తి చూపలేదు. అతని కనీస ధర రూ. 2 కోట్లు కావడంతో కొనుగోలుకు ఫ్రాంచైజీలు వెనుకడుగువేశాయి. ఇక మరో భారత క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. అతని కనీస ధర రూ.50 లక్షలైనా ఫ్రాంచైజీలు ముందుకురాకపోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement