Indian Premier League
-
BCCI: బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం
ప్రపంచంలోని అత్యంత సంపన్న బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) పేరుగాంచింది. ఇతర క్రికెట్ బోర్డులకు అందనంత ఎత్తులో ఉన్న బీసీసీఐకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగానే ఆదాయం చేకూరింది. ఏడాది కాలంలో రెవెన్యూలో రూ. 4200 కోట్ల మేర పెరుగుదల కనిపించింది.వార్తా సంస్థ పీటీఐ అందించిన వివరాల ప్రకారం.. ‘‘2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,493 కోట్లుగా ఉన్న బీసీసీఐ నగదు, బ్యాంక్ బ్యాలెన్స్.. 2024 ముగింపు నాటికి రూ. 20,686 కోట్లకు చేరింది. సుమారుగా రూ. 4200 వేల కోట్ల మేర ఆదాయం పెరిగింది’’ అని బీసీసీఐ తన డాక్యుమెంట్లో పేర్కొంది.ప్రధాన ఆదాయ వనరులివేకాగా క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన లీగ్గా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) కొనసాగుతోంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ద్వారానే బీసీసీఐకి అధికమొత్తంలో ఆదాయం చేకూరుతోంది. ఐపీఎల్ మీడియా హక్కుల రూపంలో భారీ మొత్తం ఆర్జిస్తున్న బీసీసీఐ.. ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల ద్వారానూ దండిగానే సంపాదిస్తోంది.ఐసీసీ నుంచి సింహభాగంజూన్ 2022లో ఐదేళ్ల కాల వ్యవధికి గానూ ఐపీఎల్ మీడియా హక్కులను భారత బోర్డు రికార్డు స్థాయిలో రూ. 48,390 కోట్లకు అమ్ముకుంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మార్కెట్ కలిగి ఉన్న బీసీసీఐకి.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ద్వారా వచ్చే ఆదాయం కూడా ఎక్కువే. మిగతా బోర్డులతో పోలిస్తే బీసీసీఐకే సింహభాగం లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే రిచెస్ట్ బోర్డుగా బీసీసీఐ అవతరించింది.బీసీసీఐ దరిదాపుల్లో కూడా లేని బోర్డులునిజానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ. 7476 కోట్ల మేర ఆదాయం ఆర్జించాలని బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, అనూహ్య రీతిలో రూ. రూ. 8995 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బీసీసీఐ రూ. 10,054 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా బీసీసీఐ పరిధిలో 38 స్టేట్ క్రికెట్ బోర్డు విభాగాలు ఉన్నాయి.ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 2024 నాటికి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల విలువ కలిపి రూ. 1608 కోట్లు. బీసీసీఐ(రూ. 20,686 కోట్లు) తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా(రూ. 658 కోట్లు), ఇంగ్లండ్(రూ. 492 కోట్లు), పాకిస్తాన్(రూ. 458 కోట్లు), బంగ్లాదేశ్(రూ. 425 కోట్లు), సౌతాఫ్రికా(రూ. 392 కోట్లు) టాప్-5లో ఉన్నాయి. చదవండి: ‘త్వరలోనే భారత్కు కోహ్లి గుడ్బై... లండన్లో స్థిరనివాసం’ -
IPL 2025: మరో జెర్సీలో ఊహించుకోలేను..ఎప్పటికీ ఆర్సీబీతోనే!
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్లు ఆడిన ఏకైక ప్లేయర్గా విరాట్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకు 252 మ్యాచ్లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు. ‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను. జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను. ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు. విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్ ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది. వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది. -
BCCI: ఐపీఎల్ మాదిరే మరో టీ20 లీగ్? లెజెండ్స్ స్పెషల్?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాదిరే మరో ఫ్రాంఛైజీ లీగ్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శ్రీకారం చుట్టనుందా?.. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనుందా?.. అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అయితే, ఈ టీ20 లీగ్ రిటైర్ అయిన క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని సమాచారం.బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్గా పేరొందింది. ఈ క్యాష్ రిచ్ లీగ్లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు.. పేరుప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్ ద్వారా ఇంకా యాక్టివ్ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.లెజెండ్స్ స్పెషల్?అయితే, ఐపీఎల్కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే, ఇలా ప్రైవేట్ లీగ్లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చుబీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్తో పాటు మహిళా ప్రీమియర్ లీగ్(WPL) కూడా నిర్వహిస్తోంది. ఇక ఈసారి ఐపీఎల్ మెగా వేలం కూడా జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగ్ల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు. అయితే, భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐతో అన్ని సంబంధాలు తెంచుకున్న క్రికెటర్లు మాత్రమే విదేశీ లీగ్లలో ఆడేందుకు అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ లీగ్తోనే మరోసారి సత్తా చాటాలని మాజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.చదవండి: అతడే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్: సౌరవ్ గంగూలీ -
ఐపీఎల్ సృష్టికర్త కుమార్తె.. వేల కోట్లకు వారసురాలు! ఆమె ప్రత్యేకత ఇదే!
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగ్గా పేరొందింది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఈ క్యాష్ రిచ్ లీగ్ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ. సినీ సెలబ్రిటీలు, కార్పొరేట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించి.. ప్రపంచ క్రికెటర్లందినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత సొంతం చేసుకున్నాడు ఈ బిజినెస్మేన్.అప్పటి వరకు ఎన్ని వ్యాపారాలు ఉన్నా ఐపీఎల్తోనే పాపులర్ అయిన లలిత్ మోదీ.. క్రికెట్ ప్రపంచంలో ఓ వెలుగు వెలిగాడు. అయితే, ఆర్థిక లావాదేవీల విషయంలో అవకతవలకు పాల్పడి అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. దేశం నుంచి పారిపోయి ఆర్థిక నేరగాడిగా ముద్రవేసుకున్నాడు.ఆ మధ్య సుస్మితా సేన్తో ప్రేమాయణంతో మళ్లీ వార్తల్లోకి వచ్చిన లలిత్ మోదీ.. ఇటీవల టీ20 ప్రపంచకప్-2024లో ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ టికెట్ రేట్ల విషయమై ఐసీసీని విమర్శిస్తూ తెరమీదకు వచ్చాడు.ఈ నేపథ్యంలో లలిత్ మోదీ వ్యక్తిగత జీవితం, నెట్వర్త్, ఆయన వారసుల గురించి తాజాగా నెటిజన్లలో చర్చ మొదలైంది. తనకంటే వయసులో తొమ్మిదేళ్లు పెద్దదైన మినాల్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లలిత్ మోదీకి కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ ఉన్నారు.DNA ఇండియా నివేదిక ప్రకారం.. జూలై 2022 నాటికి లలిత్ మోదీ నికర ఆస్తుల విలువ 4,555 కోట్ల రూపాయలు. ఇక ఆయనకు సంబంధించిన మోది ఎంటర్ప్రైజెస్ విలువ రూ. 23,450 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం.అలియా మోదీ.. ఆసక్తికర నేపథ్యంలలిత్ మోదీ ఆస్తులకు వారసురాలైన అలియాకు తన తమ్ముడు రుచిర్తో మంచి అనుబంధం ఉంది. తోబుట్టువులిద్దరు ఒకరికి ఒకరు అండగా ఉంటూ.. వ్యాపారంలో రాణిస్తున్నారు.అలియా మోదీ ఇంటీరియర్ డిజైనర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె సొంతంగా రూ. 41 కోట్ల మేర ఆస్తి కలిగి ఉన్నట్లు సమాచారం. ఇక అలియా వ్యక్తిగత జీవితానికొస్తే.. 2022 మేలో ఆమె బ్రెట్ కార్ల్సన్ను పెళ్లి చేసుకున్నారు.ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు- అల్లుడి ఫొటోలను షేర్ చేస్తూ లలిత్ మోదీ మురిసిపోయాడు. ఇక సెలబ్రిటీల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న నెటిజన్లు ఈ ఫొటోలను తవ్వితీసి.. అలియా మోదీని హైలైట్ చేస్తున్నారు. అదీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ కుటుంబం సంగతి! -
పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్దది: వసీం అక్రమ్
ఐపీఎల్- ప్రపంచంలో ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లకు రారాజు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ ఐపీఎల్లో భాగం కావాలని కలలు కంటుంటారు. పీఎల్కు పోటీగా ఎన్నో లీగ్లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాచ్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. అయితే మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ సైతం ఐపీఎల్కు పోటీగా ఓ టీ20 లీగ్(పాకిస్తాన్ సూపర్ లీగ్)ను నిర్వహిస్తోంది. ఇప్పటికీ 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్ఎల్ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. కానీ పాక్ క్రికెటర్లు, మాజీలు పాకిస్తాన్ సూపర్ లీగ్నే వరల్డ్లో నెం1 అని ప్రగల్బాలు పలుకుతూ వస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్ లెజెండ్ వసీం అక్రమ్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ లీగ్ అని అక్రమ్ పేర్కొన్నాడు. అక్రమ్ తాజాగా ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్కీడాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా వరల్డ్ ప్రాంఛైజీ క్రికెట్ లీగ్లో ఐపీఎల్ లేదా పీఎస్ఎల్ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది. అందుకు బదులుగా.. 'నేను పీఎస్ఎల్తో పాటు ఐపీఎల్లోనూ కోచ్గా పనిచేశాను. అన్నిటికంటే ఐపీఎల్ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్ లీగ్. అందులో ఎటువంటి సందేహం లేదు. పీఎస్ఎల్ను ఐపీఎల్తో పోల్చడం సరికాదు. పీఎస్ఎల్ పాకిస్తాన్కు మినీ ఐపీఎల్ వంటిది" అని అక్రమ్ పేర్కొన్నాడు. చదవండి: #Saumy Pandey: ఐపీఎల్ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో -
అలా మొదలై.. కాసుల పంట పండిస్తోంది
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. భారత క్రికెట్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది. అభిమానులకు టీ20 క్రికెట్ రుచిని చూపించేందుకు పుట్టుకువచ్చిన ఐపీఎల్.. ఇప్పుడు కాసుల వర్షం కురిపించే క్యాష్ రిచ్ లీగ్గా మారిపోయింది. ఈ క్యాష్రిచ్ లీగ్ ద్వారా ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ ప్రపంచానికి పరిచమయ్యారు. కోహ్లి నుంచి తిలక్ వర్మ వరకు ఈ మెగా ఈవెంట్లో సత్తా చాటి భారత జట్టులోకి వచ్చిన వారే. ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను కోట్లకు అధిపతి చేసిన ఘనత కూడా ఈ ఐపీఎల్దే. ప్రపంచంలోని ప్రతీ ఒక్క ఆటగాడు కనీసం ఒక్కసారైనా ఐపీఎల్లో భాగం కావాలని భాగం కావాలని కలలు కంటాడు. ఈ ఏడాదితో మొత్తం 16 సీజన్లను ఐపీఎల్ దిగ్వజయంగా పూర్తిచేసుకుంది. ఐపీఎల్తో భారత క్రికెట్లో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పాలి. ఎంతోమంది టాలెంటెడ్ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసిన ఐపీఎల్.. అంతే స్థాయి లాభాలతో మురిసిపోయింది. ఒక సాధరణ ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్గా మొదలైన ఐపీఎల్.. ప్రపంచక్రికెట్ను శాసించే స్ధాయికి ఎలా చేరుకుందో ఓ లూక్కేద్దాం. అలా మొదలైంది.. 15 ఏళ్ల క్రితం వరకు భారత డొమాస్టిక్ క్రికెట్లో కనీస మౌళిక సదుపాయాలు ఉండేవి కావు. ఈ క్రమంలో జాతీయ జట్టు నుంచి ఆటగాళ్లు రిటైర్ అయ్యాక.. వారిని భర్తీ చేసేందుకు సరైన ఆటగాళ్లు అందుబాటులో లేకపోయేవారు. ఈ సమయంలో ఈస్సెల్ గ్రూపు సీఈవో సుభాష్ చంద్ర భారత క్రికెట్ను అభివృద్ది చేసేందుకు ముందుకు వచ్చాడు. భారత్లో జరిగే మ్యాచ్ల ప్రసారాల కోసం జీ స్పోర్ట్స్ ఛానల్ను ప్రారంభించాడు. అదే విధంగా టెన్స్పోర్ట్స్ ఛానల్లోని 50 శాతం వాటాను కూడా సుభాష్ చంద్ర కొనుగోలు చేశాడు. దీంతో పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్లో జరిగే మ్యాచ్లను ప్రసారం చేసే కాంట్రాక్ట్ టెన్స్పోర్ట్స్ దక్కించుకుంది. అయితే భారత్లో జరిగే మ్యాచ్లు టెలికాస్టింగ్ రైట్స్ మాత్రం జీ స్పోర్ట్స్ దక్కలేదు. జీ ఛానల్కు స్పోర్ట్ మార్కటింగ్ అనుభవం లేదని అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రసార హక్కులను తిరష్కరించాడు. సుభాష్ చంద్ర తన రాజకీయ పలుకుబడి ఉపయోగించిన ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో టీ20 క్రికెట్కు ప్రపంచవ్యాప్తంగా ప్రజాధారణ పెరుగుతోంది. దీంతో 2007లో దక్షిణాఫ్రికా వేదికగా తొలి టీ20 ప్రపంచకప్ను ఐసీసీ నిర్వహించింది. ఈ టోర్నీలో అండర్ డగ్స్గా బరిలోకి దిగిన భారత్.. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. టీమిండియా తొలి టీ20 ప్రపంచకప్ సాధించినప్పటికీ.. భారత్లో మాత్రం టీ20 క్రికెట్కు అదరణ పెద్దగా లేదు. ఈ క్రమంలో బీసీసీఐకు రెబల్గా ఉన్న సుభాష్ చంద్ర దేశీవాళీ క్రికెట్లో ఓ టీ20 టోర్నీని నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లోని స్టార్ ఆటగాళ్లు, ప్రపంచంలోని కొంతమంది క్రికెటర్లతో సుభాష్ చంద్ర ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్కు అతడు ఇండియన్ క్రికెట్ లీగ్ అని నామకారణం చేశాడు. ఇండియన్ క్రికెట్ లీగ్ మొదటి సీజన్ 2007లో ప్రారంభమైంది. అయితే ఈ లీగ్పై బీసీసీఐ మొదటి నుంచే అంసతృప్తిగా ఉంది. ఈ లీగ్ను అపేందుకు బీసీసీఐ చాలా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో ఒక్కసారిగా డొమాస్టిక్ క్రికెట్లో ఆటగాళ్ల జీతాలను భారీగా పేంచేసింది. ఆటగాళ్లు ఎవరూ ఈ లీగ్లో ఆడకూడదని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసింది. ఐసీఎల్కు ఎండ్కార్డ్ వేయాలని బీసీసీఐ వ్యూహాలు మొదలుపెట్టింది. క్రమంలో బీసీసీఐ వైస్ప్రెసిడెంట్గా ఉన్న లలిత్ మోడీకి ఆలోచన వచ్చింది. బీసీసీఐ అద్వర్యంలోనే ఓ క్రికెట్ లీగ్ మొదలుపెడితే బాగుటుందని మోడీ నిర్ణయించుకున్నాడు. లలిత్ మోడీ ఆలోచనల నుంచి పుట్టుకువచ్చిందే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్. 13 సెప్టెంబర్ 2007న ఐపీఎల్ను బీసీసీ అధికారంగా లాంఛ్ చేసింది. నేషనల్ బాస్కెట్బాల్ అసోసియేషన్ (NBA) ఫార్మాట్ ఆధారంగా ఐపీఎల్ ఫార్మాట్ను మోడీ తీర్చిదిద్దాడు. మొదటి ఐపీఎల్ వేలం జనవరి 24, 2008న జరిగింది. 2008లో ప్రారంభమైన తొలి సీజన్లో మొత్తం 8 జట్లు పాల్గొనున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్,డెక్కన్ ఛార్జర్స్,ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్కతా నైటరైడర్స్ జట్లు, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మొదటి సీజనన్లో భాగమయ్యాయి. ఈ క్యాష్రిచ్ లీగ్ విజేతగా దివంగత షేన్ వార్న్ సారధ్యంలోని రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. ప్రస్తుతం ఐపీఎల్లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ రూపంలో మరో రెండు జట్లు ఈ లీగ్లో భాగమయ్యాయి. ఇప్పటివరకు 16 సీజన్లలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు ఛాంపియన్స్గా నిలవగా.. కోల్కతా, డెక్కన్ ఛార్జర్స్ రెండు సార్లు, రాజస్తాన్, గుజరాత్ ఒక్కసారి టైటిల్ను సొంతం చేసుకున్నాయి. యువ క్రికెటర్లు ఎంట్రీ.. యువ క్రికెటర్లు తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఐపీఎల్ ఒక సరైన వేదిక. ఎంతో మంది ఆటగాళ్లు ఇదే వేదికపై సత్తాచాటి జాతీయ జట్టులో చోటు దక్కించకున్నారు. ప్రతీ ఐపీఎల్ సీజన్ నుంచి సరికొత్త యంగ్ టాలెంట్ ప్రపంచానికి పరిచయవుతోంది. ముఖ్యంగా సీనియర్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడంతో యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చకుంటున్నారు. భారత్ మాత్రమే కాకుండా విదేశీ యువ క్రికెటర్లు కూడా ఐపీఎల్లో దుమ్మురేపుతున్నారు. బీసీసీఐపై కాసుల వర్షం... ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లపైనే కాకుండా భారత క్రికెట్ బోర్డుపై కాసుల వర్షం కురిపిస్తోంది. బీసీసీఐను ప్రపంచక్రికెట్లో ధనిక బోర్డుగా ఐపీఎల్ మార్చేసేంది. బీసీసీఐకు ఐపీఎల్ బంగారు బాతు. ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ద్వారా బీసీసీఐ భారీగా అర్జిస్తోంది. తాజాగా ఐపీఎల్ ఐదేళ్ల(2023-27) మీడియా రైట్స్ను రూ. 48,390 కోట్లకు బీసీసీఐ విక్రయించింది. అంతేకాకుండా ఫ్రాంజైలు, కార్పొరేట్ స్పాన్సర్స్ల నుంచి వేల కోట్లు బీసీసీఐ ఖాజానాలో వచ్చి చేరుతున్నాయి. అభిమానులకు పండగే.. ప్రతీ ఏడాది క్రికెట్ అభిమానులను రెండు నెలల పాటు ఈ క్యాష్రిచ్ లీగ్ అలరిస్తోంది. మార్చిలో మొదలై మేలో ఈ వరల్డ్ ఫేమస్ లీగ్ ముగుస్తుంది. మ్యాచ్లో సమయంలో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. ప్రతీ జట్టుకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది. ఐపీఎల్ వల్ల నష్టాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చాయి. ఈ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లలో మోజులో పడి ఆటగాళ్లు తమ దేశం తరపున ఆడేందుకు విముఖత చూపుతున్నారు. కొంతమంది అయితే ఈ లీగ్ల్లో భాగం కావడానికి ఏకంగా అంతర్జాతీయ క్రికెట్కే విడ్కోలు పలుకుతున్నారు. ఒకప్పుడు తమ దేశం తరపున ఆడితే చాలని భావించిన క్రికెటర్లు.. ఇప్పుడు ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్ల్లొ ఆడితే చాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా ఐపీఎల్లో విరామం లేకుండా రెండు నెలలపాటు ఆడటంతో ఆటగాళ్లు అలసటకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ లీగ్లో గాయపడి దేశం తరపున ఆడే కీలక టోర్నీలకు దూరం అవుతున్నారు. అదే విధంగా ఈ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్లు వల్ల టెస్టుక్రికెట్ కూడా ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రావడం లేదు. చాలా కెరీర్ ఉన్నప్పటికీ ముందుగానే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. బెట్టింగ్లు జోరుగా ఇక ఐపీఎల్లో మొదలైతే చాలు బెట్టింగ్ రాయులకు పండగే. ఈ క్రికెట్ పండగ జరిగే రెండు నెలలపాటు దేశవ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. చాలా మంది బెట్టింగ్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐపీఎల్లో చీకటి కోణాలు.. ఇక విజయవంతంగా దూసుకుపోతున్న ఐపీఎల్లో వినోదం మాత్రమే కాదు ఎన్నో చీకటి కోణాలు కూడా ఉన్నాయి. సరిగ్గా పదేళ్ల క్రితం 2013 సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ తీవ్ర కలకలం రేపింది. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అజయ్ చండీలా, అంకిత్ చౌహాన్ బుకీల నుంచి డబ్బు తీసుకుని ఫిక్సింగ్కు పాల్పడ్డారు. దీంతో బీసీసీఐ వారిపై జీవితకాల నిషేధం విధించింది. అలాగే రాజస్థాన్, చెన్నై సూపర్కింగ్స్ జట్లపై రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించారు. ఐపీఎల్ లో ఓ సారి రాహుల్ శర్మ, దక్షిణాఫ్రికా ప్లేయర్ వైన్ పార్నెల్ ఓ రేవ్ పార్టీలో పోలీసులకు పట్టుబడ్డారు. ఆ పార్టీలో డ్రగ్స్ కూడా దొరికాయి. ఈ విషయాన్ని బీసీసీఐ సీరియస్గా తీసుకుంది. అదే విధంగా ఛీర్ గర్ల్స్ ఊదంతం కూడా ఐపీఎల్ ను ఓ ఊపు ఊపేసింది. కొంతమంది ఆటగాళ్లు తామతో అసభ్య ప్రవర్తన చేశారని ఛీర్ గర్ల్స్ గతంలో ఆరోపణలు చేశారు. చదవండి: PV Sindhu Headlines This List: అప్పుడు వాళ్లు అలా! ఇప్పుడు వీరిలా.. తలెత్తుకునేలా చేశారు.. శెభాష్! -
కప్ కొట్టేది ఎవరు ?
-
IPL 2023: ‘రన్’రంగం రె‘ఢీ’... ఐపీఎల్ పూర్తి షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ విశేషాలు
కరోనా నేపథ్యంలో గత మూడు సీజన్లు పలు ఆంక్షల మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 క్రికెట్ టోర్నీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులకు పూర్తిస్థాయిలో వేసవిలో పరుగుల విందు అందించడానికి ఐపీఎల్ జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం అహ్మదాబాద్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్తో ఐపీఎల్ 16వ సీజన్కు తెర లేవనుంది. మొత్తం 10 జట్ల మధ్య 12 నగరాల్లో 74 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ దశలో 70 మ్యాచ్లు ఉండగా... ప్లే ఆఫ్ దశలో నాలుగు మ్యాచ్లతో (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2, ఫైనల్) టోర్నీ ముగుస్తుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టు జైపూర్తోపాటు గువాహటిలో... పంజాబ్ కింగ్స్ జట్టు మొహాలితోపాటు ధర్మశాలలో కూడా మ్యాచ్లు ఆడతాయి. కరోనా కంటే ముందు ఐపీఎల్లో ఇంటా, బయటా పద్ధతిలో ఆయా ఫ్రాంచైజీల మధ్య మ్యాచ్లు జరిగేవి. కరోనా కారణంగా ఈ పద్ధతికి విరామం ఇచ్చారు. ఇప్పుడు అంతా బాగుండటంతో నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలో ఐపీఎల్ను నిర్వహించనున్నారు. నోట్: ప్లే ఆఫ్ (క్వాలిఫయర్–1, ఎలిమినేటర్, క్వాలిఫయర్–2) మూడు మ్యాచ్ల తేదీలను, వేదికలను తర్వాత ప్రకటిస్తారు. ఫైనల్ మ్యాచ్ మే 28న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ వేదికను కూడా తర్వాత ప్రకటిస్తారు. మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్లో, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. -
నేటి నుంచి ఐపీఎల్–2021
-
మార్చి 29 నుంచి ఐపీఎల్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 షెడ్యూల్ విడుదలైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత ఏడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడుతుంది. ప్రస్తుతానికి లీగ్ మ్యాచ్ల షెడ్యూల్నే విడుదల చేయగా, నాకౌట్ మ్యాచ్ల వివరాలను తర్వాత ప్రకటిస్తారు. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఫైనల్ మాత్రం మే 24న నిర్వహించడం ఖాయమైంది. గతంతో పోలిస్తే ఈ సారి ‘డబుల్ హెడర్’ మ్యాచ్ల (ఒకే రోజు 4 గంటలకు, 8 గంటలకు రెండు మ్యాచ్లు) సంఖ్యను బాగా తగ్గించారు. ఇప్పుడు తొలి రోజు, చివరి రోజు మినహాయించి మిగిలిన ఆదివారాల్లో మాత్రమే డబుల్ హెడర్లు జరుగుతాయి. దాంతో లీగ్ దశ రోజుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకు 44 రోజుల్లో లీగ్ మ్యాచ్లను ముగిస్తుండగా, ఇప్పుడు అది 50 రోజులు కానుంది. మరోవైపు రాజస్తాన్ మినహా మిగిలిన ఏడు ఐపీఎల్ జట్లన్నీ తమ సొంత వేదికలను కొనసాగించనున్నాయి. రాజస్తాన్ మాత్రం జైపూర్తో పాటు రెండు మ్యాచ్లను గువాహటి వేదికగా నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఇలా రెండో నగరాన్ని హోం గ్రౌండ్గా వాడుకోవడం కుదరదంటూ రాజస్తాన్ క్రికెట్ సంఘం కోర్టులో కేసు దాఖలు చేసింది. ఏప్రిల్ 1 నుంచి హైదరాబాద్లో...: సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ ‘హోం’ మ్యాచ్లను ఎప్పటిలాగే ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది. హైదరాబాద్లో ఈ ఏడు మ్యాచ్లు ఏప్రిల్ 1, 12, 16, 26, 30, మే 5, 12 తేదీల్లో జరుగుతాయి. ఇతర వేదికల్లో ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్రైజర్స్ తమ మ్యాచ్లు ఆడుతుంది. -
మార్చి 29 నుంచి ఐపీఎల్!
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. మార్చి 29న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్తో లీగ్ మొదలవుతుంది. మే 24న ముంబైలోనే ఫైనల్ నిర్వహిస్తారు. టోర్నీ ఆనవాయితీ ప్రకారం డిఫెండింగ్ చాంపియన్ జట్టుకు తర్వాతి సీజన్లో ప్రారంభ మ్యాచ్తోపాటు ఫైనల్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతుంది. 2019 ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ చాంపియన్గా నిలువడంతో ఈ ఏడాది ముంబైలో ఆరంభ మ్యాచ్ను, ఫైనల్ను నిర్వహిస్తారు. మొత్తం 57 రోజుల పాటు టోర్నీ జరగనుంది. ఎప్పటిలా రాత్రి 8 గంటల నుంచి కాకుండా ఈ సారి 7.30 నుంచి మ్యాచ్లు మొదలు చేసే అవకాశం ఉంది. పలు ఫ్రాంచైజీలతో పాటు ప్రసారకర్త స్టార్ స్పోర్ట్స్ కూడా ఇదే సరైన సమయంగా భావిస్తోంది. ఈసారి లీగ్ వ్యవధి పెరిగినా... సాధ్యమైనంత వరకు రోజూ ఒకటే మ్యాచ్ ఉండేలా షెడ్యూల్ రూపొందించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో 2019 ఐపీఎల్ మార్చి 23 నుంచే మొదలైంది. -
పుట్టింట్లోనే టి20 పండుగ
న్యూఢిల్లీ: దేశంలోని క్రికెట్ వీరాభిమానులకు సంతోషకర వార్త. తరలింపు ఊహాగానాలకు తెరదించుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2019) ఈ ఏడాది పూర్తిగా భారత్లోనే జరుగనుంది. అత్యంత జనాకర్షక టోర్నీ 12వ ఎడిషన్కు మార్చి 23న తెరలేవనుంది. వినోద్ రాయ్, డయానా ఎడుల్జీలతో కూడిన ఇద్దరు సభ్యుల క్రికెట్ పాలకుల మండలి (సీఓఏ) మంగళవారం ఇక్కడ సమావేశమై బీసీసీఐ తరఫున ఈ మేరకు ప్రకటించింది. ఎన్నికలకు అడ్డు రాకుండా... సహజంగా ఐపీఎల్ ఏటా ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై మే చివరి వారంలో ముగుస్తుంది. అయితే, ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో లీగ్ను దక్షిణాఫ్రికా, యూఏఈలకు తరలిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. మే 30 నుంచి వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుండటం షెడ్యూల్పై ఒత్తిడి పెంచింది. దీంతో రెండింటికీ అడ్డురాకుండా చూసుకుంటూనే టోర్నీని స్వదేశంలోనే నిర్వహించాలని బీసీసీఐ తీర్మానించుకుంది. అందులో భాగంగానే దాదాపు 20 రోజుల ముందే లీగ్ను ప్రారంభించాలని నిర్ణయించింది. ‘మ్యాచ్ల కోసం అన్ని ప్రాథమిక వేదికలతో పాటు ప్రత్యామ్నాయ వేదికల జాబితానూ సిద్ధం చేశాం. వీవీఐపీల ఎన్నికల ప్రచారం, పోలింగ్ వంటి కారణాలతో ఇబ్బంది తలెత్తితే మార్పు కోసమే ఈ ఏర్పాటు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు, భద్రతా వర్గాలనూ సంప్రదించాం’ అని రాయ్ తెలిపారు. ఖరారైన వేదికల సమాచారం, మ్యాచ్ల తేదీలను ప్రభుత్వ వర్గాలను సంప్రదించాక ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ఫ్రాంచైజీలతో విస్తృతంగా చర్చించి షెడ్యూల్ విడుదల చేస్తామని వివరించారు. ఫైనల్ మే 12–15 మధ్య... ఊహాగానాల ప్రకారం 8 ప్రధాన... 4 లేదా 6 ప్రత్యామ్నాయ వేదికల వివరాలతో షెడ్యూల్ ఫిబ్రవరి తొలి వారంలో విడుదలవుతుంది. ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను ప్రకటించాక అవసరాన్ని బట్టి వీటిలో మార్పు చేర్పులు చేస్తుంది. ఎప్పటిలాగే డిఫెండింగ్ చాంపియన్ సొంత మైదానంలో ప్రారంభ, ముగింపు మ్యాచ్లు ఉంటాయి. దీని ప్రకారం ఈసారి తొలి మ్యాచ్ చెన్నైలో జరుగనుంది. మే 12 నుంచి 15వ తేదీ మధ్య ఫైనల్ జరిగే అవకాశం ఉంది. అయితే, ఇది కూడా పోలింగ్ తేదీలపై ఆధారపడి ఉంటుంది. దీనికి తగ్గట్లుగా సిద్ధంగా ఉండమని రాష్ట్రాల క్రికెట్ సంఘాలు, ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మార్పు తప్పింది... సాధారణ ఎన్నికల కారణంగానే 2009లో లీగ్ను పూర్తిగా దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. 2014లో సగ భాగం యూఏఈలో జరిగింది. ఇప్పుడు కూడా పలు ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఆలోచించారు. చివరకు ఇక్కడే నిర్వహించేందుకు మొగ్గుచూపారు. విదేశీ ఆటగాళ్ల అందుబాటెంతో? వన్డే ప్రపంచ కప్ మే 30 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ఐపీఎల్ ప్రపంచకప్కు 15 రోజుల ముందే ముగుస్తుంది. తమ జట్లను ప్రపంచ కప్నకు సంసిద్ధం చేయాలని ఆయా దేశాలు భావిస్తాయి. ఇప్పటికే న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ మినహా మిగతా దేశాలన్నీ లీగ్ నుంచి ముందుగానే రావాలని తమ ఆటగాళ్లకు సూచనలిచ్చాయి. ఈ నేపథ్యంలో టోర్నీ చివరకు వచ్చేసరికి విదేశీ ఆటగాళ్ల అందుబాటు ఎంతవరకు ఉంటుందో అనే అనుమానం నెలకొంది. -
వాలీబాల్ లీగ్ అంబాసిడర్గా సింధు
ముంబై: ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్), ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్), ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లు విజయవంతంగా సాగుతున్న తరుణంలో మరో కొత్త లీగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రొ వాలీబాల్ లీగ్ సీజన్–1 ప్రారంభం కానుంది. ఈ లీగ్కు రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, అమెరికన్ స్టార్ స్పైకర్ డేవిడ్ లీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు. ‘నా తల్లిదండ్రులు రమణ, విజయ వాలీబాల్ ఆటగాళ్లు కావడంతో చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి ఆడేందుకు భారత ఆటగాళ్లకు ఇది చక్కటి అవకాశం’ అని సింధు తెలిపింది. ‘భారత్లో వాలీబాల్ అభివృద్ధికి ఈ లీగ్ ఎంతో తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేను అనేక లీగ్లలో పాల్గొన్నాను. ఇప్పుడు అది ఇక్కడ కూడా కొనసాగేందుకు ప్రయత్నిస్తా’ అని రెండుసార్లు ఒలింపిక్స్ పతక విజేత డేవిడ్ లీ అన్నాడు. -
హెట్మైర్ కోసం ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీల వేట?
హైదరాబాద్ : వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మన్ షిమ్రాన్ హెట్మైర్ ఐపీఎల్-2019 సీజన్కు హాట్ కేక్ కానున్నాడా? అంటే అవుననే అంటున్నారు.. క్రికెట్ విశ్లేషకులు. తాజాగా భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో ఈ 21 ఏళ్ల కరేబియన్ ఆటగాడు తన విధ్వంసకర బ్యాటింగ్తో సత్తా చాటాడు. గువాహటి వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ సాధించి తమ జట్టు భారీ స్కోర్ చేసేలా చేశాడు. ఇక రెండో వన్డే వైజాగ్లో దాదాపు భారత్ను ఓడించినంత పనిచేశాడు. తనదైన బ్యాటింగ్తో 7 సిక్సర్లతో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అనవసర షాట్కు ప్రయత్నించి హెట్మైర్ శతకం వృథా చేసుకున్నాడు.. కానీ అతని సెంచరీ అయ్యుంటే ఈ మ్యాచ్లో భారత్ ఖచ్చితంగా ఓడిపోయిది. మిలియన్ డాలర్ బేబీ.. హెట్మైర్ ఈ తరహా ప్రదర్శనకు భారత మాజీ, సీనియర్ క్రికెటర్లతో పాటు అభిమానులు ఫిదా అయ్యారు. దీంతో అతను ఐపీఎల్-2019 సీజన్కు హాట్కేకని.. భారీ ధరనే పలకబోతున్నాడని అంచనా వేస్తున్నారు. ఇక భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అయితే వచ్చే సీజన్కు హెట్మైర్ మిలియన్ డాలర్ బేబీ అని పేర్కొన్నాడు. హెట్మైర్ కోసం ముఖ్యంగా మూడు ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయని క్రీడా ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్.. గత సీజన్ ఐపీఎల్లో ఫైనల్కు చేరి తృటిలో టైటిల్ చేజార్చుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ హెట్మైర్ కోసం పోటిపడనున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కీలక బ్యాట్స్మన్, కెప్టెన్ డేవిడ్ వార్నర్ దూరంతో బాధ్యతలు చేపట్టిన కన్నె విలియమ్సన్ జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే బ్యాటింగ్ బాధ్యతలను పూర్తిగా తన భుజాలపైనే మోసిన విలియమ్సన్కు మిడిలార్డర్ నుంచి సహాకారం దూరమైంది. దీంతో ఆ జట్టు ఫైనల్కు చేరిన టైటిల్ కొట్టలేక పోయింది. వచ్చే సీజన్లో వార్నర్ పునరాగమనంతో జట్టుకు బలం చేకూరనుంది. ఈ పరిస్థితుల్లో హెట్మైర్తో మిడిలార్డర్ను పటిష్టం చేయాలని ఆ జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. ఇక ఆ జట్టు ప్రధాన కోచ్ టామ్ మూడీకి కరేబియన్ ప్రీమియర్ లీగ్తో సంబంధం ఉండటం.. హెట్మైర్పై పూర్తి అవగాహన ఉండటం కూడా కలిసొచ్చె అంశం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం హెట్మైర్ కోసం పోటీ పడనుంది. అన్ని ఉన్నా అల్లుడి నోట్ల శని అన్నట్లు ఈ జట్టు పరిస్థితి. దిగ్గజ ఆటగాళ్లు కోహ్లి, డివిలియర్స్ ఉన్నప్పటికి ఆ జట్టు ఇప్పటి వరకు టైటిల్ కొట్టలేకపోయింది. 2019 సీజన్లో టైటిల్ లక్ష్యంగా భావిస్తున్న ఆర్సీబీ ఇప్పటికే ఆదిశగా కసరత్తులు మొదలు పెట్టింది. గ్యారీ కిరిస్టెన్కు పూర్తి స్థాయి కోచ్ బాధ్యతలు అప్పజెప్పింది. అలాగే ఆటగాళ్ల మార్పుపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తన హిట్టింగ్తో ఆకట్టుకున్న హెట్మైర్ను తీసుకోవాలని యోచిస్తోంది. గత సీజన్లో యువమంత్రం జపించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ సైతం హెట్మైర్ కోసం పోటీపడనుంది. ఇప్పటికే ఆ జట్టులో పృథ్వీ షా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్లు టాపార్డర్లో నిలకడగా రాణిస్తున్నారు. అయితే ఆ జట్టుకు మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే బ్యాట్స్మన్ లేరు. దీంతో ఆ స్థానాన్ని హెట్మైర్తో భర్తీ చేయాలని భావిస్తోంది. తన ప్రదర్శనతో అందిరి దృష్టిలో పడ్డ హెట్మైర్ ఎవరి సొంతం అవుతాడో.. ఎంత పలుకుతాడో తెలియాలంటే వచ్చే సీజన్ వేలం వరకు ఆగాల్సిందే. -
గ్రౌండ్లో భర్త.. ఫ్లయింగ్ కిస్సెస్ విసిరిన నటి!
బెంగళూరు: ఐపీఎల్లో భాగంగా హోమ్గ్రౌండ్లో ఆడుతున్న బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టును బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్ మ్యాచ్కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్ కిస్సెస్ పంపించారు. దీంతో గ్రౌండ్లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. మ్యాచ్లోని ఓ దశలో కోహ్లి క్యాచ్ అందుకోవడంతో ఆనంద డొలికల్లో తేలిపోయిన అనుష్క గాలిలో తన భర్తకు ముద్దులు పంపించారు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ను ఓడించి.. హోమ్గ్రౌండ్లో విజయంతో ఐపీఎల్లో బెంగళూరు జట్టు బోణీ కొట్టింది. ఐపీఎల్లో భాగంగా సొంత మైదానంలో బెంగళూరు మ్యాచ్లు జరిగినప్పుడు అనుష్క హాజరవ్వడం పరిపాటే. గతంలోనూ బెంగళూరు మ్యాచ్ల సందర్భంగా స్టేడియంలోని స్టాండ్స్లో ఆమె దర్శనమిచ్చారు. బెంగళూరు జట్టును, ముఖ్యంగా కోహ్లిని ఉత్సాహపరిచేందుకు ఐపీఎల్ మ్యాచ్లకు హాజరవుతున్న అనుష్క పంజాబ్ తో మ్యాచ్ సందర్భంగా ప్రీతి జింతాతో కలిసి మ్యాచ్ను వీక్షించారు. -
‘డేర్ డెవిల్స్’ను పంచుకున్నారు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ ఆరంభానికి నెల రోజుల ముందు ఫ్రాంచైజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఎంఆర్ గ్రూప్కు చెందిన ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టులో 50 శాతం వాటాను జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్డబ్ల్యూ) స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని జీఎంఆర్, జేఎల్డబ్ల్యూ సంయుక్తంగా ప్రకటించాయి. అయితే ఈ 50–50 ఒప్పందాన్ని బీసీసీఐ అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నెల 16న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే కావచ్చు. కొందరు వ్యక్తులు, సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి రాజస్థాన్, పంజాబ్, కొచ్చి వంటి ఐపీఎల్ జట్లను కొనుగోలు చేయడం గతంలో జరిగినా... ఒక యాజమాన్యం మరొకరికి తమ జట్టులో వాటా అమ్మడం మాత్రం ఇదే తొలిసారి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందానికి ముందు ప్రస్తుతం ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టు విలువను రూ. 1100 కోట్లుగా నిర్ధారించారు. జేఎస్డబ్ల్యూ ఈ డీల్ కోసం రూ. 550 కోట్లను చెల్లించనుంది. తొలి ఐపీఎల్నుంచి పదేళ్ల పాటు లీగ్లో ఉన్నా డేర్డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. 2008లో ఆ జట్టు సెమీఫైనల్ చేరింది. 2012లో మూడో స్థానంలో నిలవడమే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన. -
ఐపీఎల్ నిర్వాహకులకు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆరంభ వేడుకలను అట్టహాసంగా జరుపడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా వేదికగా ఏప్రిల్ 6 న అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు బీసీసీఐ భావించింది. అయితే తాజాగా ప్రారంభ వేడుకలపై సుప్రీంకోర్టు నియమిత పాలక కమిటీ(సీవోఏ) తీసుకున్న నిర్ణయం బీసీసీఐను షాక్కు గురి చేసింది. అయితే ఏప్రిల్ 7న ఓపెనింగ్ మ్యాచ్ జరిగే రోజున వాంఖేడే స్టేడియంలో వేడుకలు నిర్వహించాలని సీవోఏ తాజాగా నిర్ణయించింది. అంతే కాకుండా రూ. 50 కోట్లతో ప్రారంభ వేడుకులు జరపాలన్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయానికి సీవోఏ బ్రేక్ వేస్తూ.. ఆ బడ్జెట్ మొత్తాన్ని రూ. 30 కోట్లకు కుదించింది. బడ్జెట్లో కోత, వేడుకల తేదీలో మార్పుతో లీగ్లో తొలి మ్యాచ్ (ఏప్రిల్ 7) ఆరంభానికి కొన్ని గంటల ముందే వేడుకలు నిర్వహించడానికి బీసీసీఐ ప్రస్తుతం సన్నాహాలు చేస్తోందని ఓ అధికారి తెలిపారు. కాగా ఐపీఎల్-11 సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల మధ్య జరుగనుంది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న సీఎస్కే సీజన్ తొలి మ్యాచ్లోనే సత్తాచాటేందుకు కసరత్తులు చేస్తోంది. -
ఐపీఎల్ వేళలపై మల్లగుల్లాలు..
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్కు సంబంధించి ఒకే రోజు రెండేసి జరిగే మ్యాచ్ల సమయాల్లో మార్పులు లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ సీజన్లో రాత్రి 8 గం.లకు 48 మ్యాచ్లు, సాయంత్ర 4 గం.లకు 12 మ్యాచ్లను షెడ్యూల్ చేశారు. ఈ మేరకు మ్యాచ్ వేళల్ని మార్చాలన్న టోర్నీ ప్రసారుదారు స్టార్ స్పోర్ట్స్ గత నెలలో ఐపీఎల్ పాలక మండలికి విజ్ఞప్తి చేసింది. రోజూ వారీ షెడ్యూల్ ప్రకారం రెండో మ్యాచ్ను రాత్రి 7.00 గంటలకు ఆరంభించాలని, వేసవి వేడి దృష్ట్యా తొలి మ్యాచ్ను సాయంత్రం 5.30 ని.లకు ప్రారంభించాలని స్టార్ స్పోర్ట్స్ ప్రతిపాదించింది. దీనికి పాలకమండలి అంగీకారం కూడా తెలిపింది. రాత్రి మ్యాచ్లు త్వరగా ఆరంభమై.. త్వరగా ముగిస్తే కవరేజ్ కూడా బాగా వస్తుందని స్టార్స్పోర్ట్స్ భావించింది.కానీ ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటించే క్రమంలో షెడ్యూల్లో ఎటువంటి మార్పులు లేకుంగా గతంలో మాదిరిగానే విడుదల చేసింది. ఇందుకు కారణం తమను సంప్రదించకుండానే ఐపీఎల్ పాలకమండలి.. స్టార్ స్పోర్ట్స్ నిర్ణయయానికి ఆమోదం తెలపడంతో ఐపీఎల్ రెవెన్యూ మోడల్లో వాటాదారులుగా ఉన్న సగం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎందుకు మార్చాలనుకున్నారంటే.. మ్యాచ్ ముగిశాక ప్రేక్షకులు ఇళ్లకు, ఆటగాళ్లు హోటళ్లకు రాత్రి పూట ఆలస్యంగా చేరుకునే సమస్య తీరుతుందని స్టార్ స్పోర్ట్స్ ఆశించింది. అదే సమయంలో రెండో మ్యాచ్ త్వరగా ఆరంభిస్తే ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంటుందనేది మరొక కారణం. ఒక రకంగా దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందనే వచ్చింది. మ్యాచ్ కోసం అర్ధ రాత్రి వరకూ మెలకువగా ఉండడం, స్టేడియాలకు వెళ్లిన వారు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు పడే ఇబ్బందులు తొలుగుతాయని భావించారు. అయితే, ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బీసీసీఐ పాత వేళలకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ షెడ్యూల్పై పలు ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. -
ఏప్రిల్ 9 నుంచి హైదరాబాద్లో ఐపీఎల్ షో
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఐపీఎల్ 11వ సీజన్ పోటీలు ఏప్రిల్ 9 నుంచి జరుగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూలును లీగ్ పాలకమండలి బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ 7న డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)ల మధ్య పోరుతో ఈ సీజన్ మొదలవుతుంది. వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. సీఎస్కేలాగే పునరాగమనం చేసిన రాజస్తాన్ రాయల్స్ తమ తొలి పోరులో సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో ఏప్రిల్ 9న ఈ మ్యాచ్ జరుగుతుంది. ముంబైలోని వాంఖెడేలో ఆరంభ మ్యాచ్తో పాటు తొలి క్వాలిఫయర్ (మే 22), టైటిల్ పోరు (27న) కూడా జరుగనుంది. అయితే మ్యాచ్ల టైమింగ్లో ఏమార్పూ లేదు. ఒక మ్యాచ్ ఉంటే రాత్రి 8 గంటలకు, రెండు మ్యాచ్లుంటే మొదటి మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్లన్నీ స్టార్ స్పోర్ట్స్ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఇంతకుముందు సాయంత్రం మ్యాచ్ను 5 గంటల నుంచి, రాత్రి మ్యాచ్ను 7 గంటల నుంచి నిర్వహించాలనే ప్రతిపాదనలువచ్చాయి. కానీ విజయవంతమైన పది సీజన్లలాగే మ్యాచ్ టైమింగ్ను ఖరారు చేశారు. హైదరాబాద్లో ఐపీఎల్ షెడ్యూలు ఏప్రిల్ 9 రాజస్తాన్ రాయల్స్ రా.గం. 8 ఏప్రిల్ 12 ముంబై ఇండియన్స్ రా.గం. 8 ఏప్రిల్ 22 చెన్నై సూపర్కింగ్స్ సా.గం. 4 ఏప్రిల్ 26 కింగ్స్పంజాబ్ రా.గం. 8 మే 5 ఢిల్లీ డేర్డెవిల్స్ రా.గం. 8 మే 7 బెంగళూరు రా.గం.8 మే 19 కోల్కతా నైట్రైడర్స్ రా.గం.8 -
కోచ్గా కనిపించనున్న మలింగా!
ముంబై: శ్రీలంక పేస్ బౌలర్ లసిత్ మలింగా ఐపీఎల్-11 సీజన్లో కోచ్గా కనిపించనున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఏ ఫ్రాంచైజీ ఈ సీనియర్ బౌలర్పై ఆసక్తి కనబర్చలేదు. దీంతో అన్సోల్డ్గా మిగిలిపోయిన విషయం తెలిసిందే. అయితే 2009 నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్లాడి 157 వికెట్లు పడగొట్టాడు. తమ జట్టులో ఇంతకాలం ఆటగాడిగా కొనసాగిన మలింగాను బౌలింగ్ కోచ్గా నియమిస్తున్నట్లు ముంబై జట్టు ప్రకటించింది. ఇప్పటికే ముంబై హెడ్ కోచ్గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం జయవర్ధనే, బౌలింగ్ కోచ్గా షేన్ బాండ్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరితోపాటు సహాక సిబ్బంది టీంలో మలింగా చేరనున్నాడు. తనను బౌలింగ్ కోచ్గా నియమించడంపై మలింగా స్పందిస్తూ.. ‘‘ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగడం గొప్ప అవకాశం. ముంబై గత దశాబ్ధంగా నా సొంత జట్టుగా ఉంది. ఇంతకాలం జట్టులో ఆటగాడిగా ఉండటం ఎంతో అనందంగా ఉంది. ఇప్పుడు మెంటర్గా ఉండటం కూడా సంతోషమే. నేను ఇప్పుడు మెంటర్గా కొత్త పని చేబట్టపోతున్నాను’’ అని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది. -
క్రికెటర్లు సంతలో పశువులా?
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ వేలంతో క్రికెటర్లను సంతలో పశువుల్లా మార్చారని అసోసియేషన్ అధ్యక్షుడు హీత్ మిల్స్ మండిపడ్డారు. స్థానిక హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘ఐపీఎల్ వేలం పద్దతి ఆటగాళ్లందరినీ ఘోరంగా అవమానపరిచింది. ప్రపంచం ముందు సంతలో పశువుల్లా నిలబెట్టింది. ఐపీఎల్ వల్ల చాలా లాభాలున్నాయి. కానీ వేలం నిర్వహించే పద్దతి ఇది కాదు. అనైతిక చర్య’ అని మిల్స్ అభిప్రాయపడ్డారు. వేలం వల్ల ఏ జట్టుకు ఆడుతామో తెలియదని, యజమాని, కెప్టెన్ ఎవరో కూడా తెలియదని, కోచ్లతో సత్సంబంధాలు కూడా ఉండవని ఇది క్రికెట్కు మంచిది కాదని ఈ న్యూజిలాండ్ క్రికెటర్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో కొంతమంది ప్లేయర్లు అయితే ఏకంగా ఐదు, ఆరు జట్లకు ఆడటం చూశామని, ఇలా ఏ క్రీడాలీగ్లో జరగదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఈ పద్దతి మారేలా చూడాలని కోరారు. ఐపీఎల్తో ఫిక్సింగ్, బెట్టింగ్లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్తో క్రికెట్ ఆటకు ఒరిగిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఇక భారత దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ సైతం ఐపీఎల్ వేదికను మనీ ల్యాండరింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. -
గంభీర్ చేజేతులా చేసుకున్నాడు!: కేకేఆర్
సాక్షి, కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అనగానే గుర్తొచ్చే ఆటగాళ్లలో గౌతం గంభీర్ కచ్చితంగా ఉంటాడు. అయితే తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని సొంతజట్టు కోల్కతా నైట్రైడర్స్ ( కేకేఆర్) తీసుకోక పోవడంపై తీవ్ర విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో రెండు సీజన్లలో కేకేఆర్కు ఐపీఎల్ టైటిల్స్ అందించిన క్రికెటర్కు అవమానం జరిగిందంటూ కొందరు కేకేఆర్ ఫ్యాన్స్ ట్వీట్లు చేశారు. అయితే దీనిపై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ వివరణ ఇచ్చుకున్నారు. గంభీర్కు సారీ చెబుతూ కేకేఆర్ టీమ్ వదులుకోవడానికి ఆ క్రికెటరే కారణమని అది ఎలాగో వివరించాడు. సోషల్ మీడియాలో ఈ విషయాలు వైరల్ అవుతున్నాయి. ‘ఈ వేలంలో స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ గంభీర్ను తీసుకోవాలని ముందుగానే కేకేఆర్ యాజమాన్యం ప్లాన్ చేసుకుంది. అతడిపై మాకు ఎప్పటికీ నమ్మకం ఉంది. కానీ వేలానికి ముందు గంభీర్ తమకు కొన్ని విషయాలు చెప్పాడు. తన కోసం వేలంలో ఆసక్తి చూపించవద్దని, ఆర్టీఎం (రైట్ టు మ్యాచ్) ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించవద్దన్నాడు. గంభీర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో.. అతడు దేని కోసం ఎదురుచూస్తున్నాడో మాకు తెలియదు. దీంతో గౌతీకి ఏ విధంగా సాయం చేయలేకపోయామని, సారీ గంభీర్ అంటూ’ కేకేఆర్తో తమ ఏడేళ్ల అనుబంధాన్ని సీఈఓ గుర్తుచేసుకున్నాడు. కేకేఆర్ ఫ్యాన్స్ గంభీర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌతీని ఢిల్లీ డేర్డెవిల్స్ రూ.2.8 కోట్లతో సొంతం చేసుకుంది. దీంతో గంభీర్ తిరిగి సొంతగూటికి చేరినట్లయింది. -
ఈసారి ఐపీఎల్ ట్రోఫీ మాదే: ఖరీదైన క్రికెటర్
సాక్షి, రాజ్కోట్: ఐపీఎల్-11 సీజన్ నేపథ్యంలో ఇటీవల జరిగిన వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రెండోవాడు జయదేవ్ ఉనాద్కట్. పంజాబ్కే ఖాయం అనిపించిన దశలో అనూహ్యంగా రాజస్తాన్ రాయల్స్ ఏకంగా 11.5 కోట్లతో ఉనాద్కట్ను సొంతం చేసుకోవడంతో భారత్ నుంచి వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్గా నిలిచాడు. భారీ ప్యాకేజీతో తనను కొనుగోలు చేయడంపై టీమిండియా క్రికెటర్ ఉనాద్కట్ హర్షం వ్యక్తం చేశాడు. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగుతున్న తమ జట్టు రాజస్తాన్ ఐపీఎల్-11 సీజన్ ట్రోఫీ నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు సాధ్యమైనన్ని విజయాలు అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. తొలిరోజు వేలంలో రూ.11 కోట్ల ధర పలికిన మనీశ్ పాండే, కేఎల్ రాహుల్లను రెండోరోజు జరిగిన ఐపీఎల్ వేలంలో అధిగమించాడు ఈ సౌరాష్ట్ర ప్లేయర్. రూ.11.5 కోట్ల ధరతో ఈ సీజన్ వేలంలో బెన్ స్టోక్స్ (రూ.12.5 కోట్లు) తర్వాత అత్యంత ఖరీదైన క్రికెటర్గా రికార్డులు తిరగరాశాడు ఉనాద్కట్. గత ఏడాది పుణే తరఫున ఆడిన ఉనాద్కట్ హ్యాట్రిక్ సహా 7.02 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ (26) తర్వాత రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుత వేలం ధరతో ఈ ఆటగాడిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
‘ఆ ఇద్దరితో ఆడాలనే నాకల నిజమైంది’
చెన్నై : గత ఐపీఎల్లో రైజింగ్ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్ ధోని, కెప్టెన్ స్టీవ్స్మిత్లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్ఛాలెంజర్స్ బెంగళూరు సుంధర్ను సొంతం చేసుకుంది. ఈ తరుణంలో కెప్టెన్ విరాట్ కోహ్లి, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలయర్స్తో కలిసి ఆడాలనే తన కల నేరవేరిందని ఈ యంగ్ క్రికెటర్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘నన్ను ఆర్సీబీ ఎంచుకోవడం ఆనందం కలిగించింది. నేను విరాట్ కోహ్లికి, ఏబీ డివిలియర్స్కు పెద్ద అభిమానిని. గతేడాది రైజింగ్పుణే తరుపున ధోనితో కలిసి ఆడటం ఇప్పుడు ఈ లెజెండ్స్తో ఆడే అవకాశం రావడం వెలకట్టలేని అనుభవమని’ వాషింగ్టన్ సుందర్ తెలిపాడు. ధోని దగ్గర నేర్చుకున్న మెళుకువలు ఆర్సీబీ జట్టుకు ఎంపిక చేశాయని, ఈ జట్టులో సైతం సీనియర్ ప్లేయర్ల ఆటను దగ్గర నుంచి చూసి మరింత నేర్చుకుంటున్నాని ఈ 18 ఏళ్ల యువస్పిన్నర్ చెప్పుకొచ్చాడు. తన లక్ష్యం మాత్రం భారత జట్టులో చోటు సంపాదించుకోవడమేనని, ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానన్నాడు. ఇక సుంధర్ అత్యధిక ధర పలకడంపై అతని తండ్రి ఆనందం వ్యక్తం చేశారు. యువక్రికెటర్లకు ఐపీఎల్ చక్కని వేదికని, సుంధర్లాంటి క్రికెటర్లకు తమ టాలెంట్ నిరూపించుకోవాడనికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
ఐపీఎల్ వేలం: ఆటగాళ్ల ధర ఎంతంటే..!