భారతదేశం ప్రతిరోజు ఆశగా నిద్ర లేచింది. కానీ స్వర్ణం కల సాకారం కాకుండానే ఒలింపిక్స్ ముగిశాయి. అయితే అదే వేదికలో ఒలింపిక్స్ ముగిసిన 20 రోజుల తర్వాత భారత్కు బంగారు కల నెరవేరింది. రియోలోనే జరుగుతున్న పారాలింపిక్స్లో భారత అథ్లెట్ తంగవేలు హైజంప్లో స్వర్ణం సాధించి మువ్వన్నెలు రెపరెపలాడించాడు. ఇదే ఈవెంట్లో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించడంతో ఆనందం రెట్టింపయిది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్లో పతకాలు సాధించిన ఈ ఇద్దరికీ భారత్ జేజేలు పలుకుతోంది.