Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Fires On TDP Chandrababu Govt Rule1
ఎన్నికల హామీలు.. మేనిఫెస్టో అమలే హీరోయిజం: వైఎస్‌ జగన్‌

మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు పైగా కోవిడ్‌తో ఇబ్బందులు ఎదురైనా సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ⇒ మా పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశాం.. అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది ⇒ ఇవాళ్టికీ ప్రతి గడపకూ మా కార్యకర్తలు, నేతలు తలెత్తుకుని గర్వంగా వెళ్లగలరు.. ప్రజల ఆశీర్వాదం పొందగలరు ⇒ కోవిడ్‌ విపత్తులోనూ సాకులు వెతుక్కోకుండా ప్రతి హామీని నెరవేర్చాం.. ⇒ ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకే రెడ్‌బుక్‌ బెదిరింపులు.. జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంసాక్షి, అమరావతి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీ (టీడీపీ) కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడులో సీఎం చంద్రబాబు ఫోజులిస్తూ.. బిల్డప్‌ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హీరోయిజం అంటే.. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం కాదు..! హీరోయిజం అంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం అని చంద్రబాబుకు చురకలంటించారు. ‘‘సత్తా అంటే కడపలో మహానాడు నిర్వహించడం కాదు.. ఆ కార్యక్రమంలో జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది?’’ అని నిలదీశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో.. వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా చంద్రబాబూ? గడప గడపకూ తిరిగే సాహసం చేయగలరా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా మాకు ఇవ్వాల్సిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని చిన్న పిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లోనూ సాకులు వెతుక్కోకుండా చిత్తశుద్ధితో 99 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఇవాళ్టికీ తమ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి మేం వైఎస్సార్‌సీపీ వాళ్లం అని తలెత్తుకుని గర్వంగా చెప్పే ధైర్యం ఉందని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే.. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది..ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి బతికే ఉంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. చిన్న హామీలనూ ఎగ్గొట్టారు..చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతారా..! విశాఖ వెళ్లి వద్దామా..! అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్‌. కనీసం ఆ గ్యాస్‌ సిలిండర్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు..ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాక్షులుగా ఉన్న మీరే నా కన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి. విశ్వసనీయతకు అర్ధం తెలుసుండాలి. అప్పుడే రాజకీయ వ్యవస్ధలో తులసి మొక్కలా నిలబడతాం. చంద్రబాబు తన పాలనలో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా.. వారంతా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులని తెలిసినా.. ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా.. తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం.కోవిడ్‌ ఇబ్బందుల్లోనూ..అప్పుడు మన ప్రభుత్వం జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తే.. కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్‌ను చూశాం. రాష్ట్ర చరిత్రలో అలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. మరోవైపు అనుకోని ఖర్చులు పెరిగాయి. అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులున్నా ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. సీఎంవో మొదలు ప్రతి కార్యాలయంలోనూ హామీలను డిస్‌ప్లే చేశాం. ప్రతి రోజూ వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకున్నాం. అలా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం హామీలను అమలు చేసిన పాలన వైఎస్సార్‌సీపీ హయాంలోనే జరిగింది. పాలన ఎలా ఉండాలో చూపాం..అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం కాబట్టే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం. 86 నుంచి 88 శాతం స్ధానాలను మనమే గెలిచాం. దాదాపు 120 చోట్ల క్లీన్‌ స్వీప్‌ చేయగా తాడిపత్రి, దర్శి రెండు చోట్ల మాత్రమే మనకు తక్కువ వచ్చాయి. తాడిపత్రిలో వాళ్లకు 18, మనకు 16 రావడంతో మన ఎమ్మెల్యే వాళ్లను లాగుదా­మన్నారు. కానీ నేను స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్టు చేయించి అక్కడ ఎన్నిక సవ్యంగా జరిపించా. వైఎస్సార్‌ సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డాం. ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి పాలన ఎలా చేయాలో చూపించాం. మీ అందరికీ హ్యాట్సాఫ్‌..ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజా­స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే చేయమని తన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో.. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెబుతూ మన పార్టీలో చిన్న పదవుల్లో ఉన్నవారైనా.. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి గట్టి గుణపాఠం నేర్పారు. రాజకీయాలంటే నీ మాదిరిగా కాదు.. మమ్మల్ని చూసి నేర్చుకో..! అని చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. అందుకు మీ అందరికీ నా హ్యాట్సాఫ్‌.విద్య, వైద్యం, వ్యవసాయం నిర్వీర్యం...⇒ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లీషు మీడియం పడకేసింది. గోరుముద్ద నాసిరకంగా మారి తినలేని పరిస్థితిలో ఉంది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్‌ శిక్షణ ఇప్పిస్తూ ఒక పీరియడ్‌గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్‌ఈ, నాడు–నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు.. అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు. ఏడాది కావస్తోంది. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చాం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాథుడు లేడు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు మానిపిస్తున్న దుస్థితి నెలకొంది. ⇒ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 1,000 ప్రొసీజర్లను మన హయాంలో 3,000కు తీసుకుని పోయి ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాం. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అందుబాటులోకి తెచ్చాం. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అలాంటి పాలన మనం అందిస్తే.. ఇవాళ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాదిగా దాదాపు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడటం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారు.⇒ ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్బీకేలు, ఈ–క్రాపింగ్, ఉచిత పంటల బీమాను గాలికి వదిలేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సీజన్‌ ముగిసేలోగా రైతులకు తోడుగా నిలిచి సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాదిగా రైతు భరోసా ఎగ్గొట్టారు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు లభించడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతుల కష్టం దళారీల పాలవుతోంది.వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా నిలదీస్తారు..ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ఇవాళ్టికీ ప్రజలకు గుర్తున్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. చిన్న పిల్లల నుంచి ప్రశ్నించడం మొ­దలవుతుంది. తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగు­తారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి ఆడబిడ్డ నిధి కింద నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లకు పెన్షన్‌ అన్నావ్‌.. మరి మా రూ.48 వేల సంగతేంటని ఆ తల్లుల అమ్మలు, అత్తలు నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు మాకు అన్నదాతా సుఖీభవ కింద రూ.26 వేలు ఇస్తానన్నావ్‌.. వాటి సంగతేంటని ప్రశ్నిస్తారు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నిరుద్యోగ భృతి కింద నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏమిటని నిలదీస్తాడు.వడ్డీతో సహా చెల్లిస్తాం...మన హయాంలో నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా సమస్యలు చెప్పి ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వారే! నాడు ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. స్పందనలో అత్యధికంగా ఫిర్యాదులు చేసిందీ వాళ్లే. కానీ ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. రాష్ట్రం కూడా బాగు పడుతుంది.జగన్‌ 2.0లో కార్యకర్తలకు పెద్దపీటఈసారి జగన్‌ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్‌ వచ్చింది. రెండేళ్లు పూర్తిగా ప్రజల ఆరోగ్యం, వారికి మంచి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈసారి జగన్‌ 2.0లో అలా ఉండదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు.. కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా వారి బాగోగులన్నీ చూసుకుంటాం.వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం..ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నా. మీ అందరికీ ఒకటే చెబుతున్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు... వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్‌ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికే యూనిఫాం ఇచ్చారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే అక్రమ కేసులు..రాష్ట్రంలో లా ఆండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు.. ఆ గొంతు వినపడకుండా భయోత్పాతం సృష్టిస్తూ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు. చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపు తగాదాలే దీనికి కారణమని ఎస్పీ స్వయంగా చెప్పారు. కానీ రెండు రోజుల తర్వాత మన పార్టీ ఇన్‌ఛార్జ్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏ మాత్రం బేస్‌లేని పాత కేసు బయటకు తీశారు. గతంలో ఇల్లీగల్‌ మైనింగ్‌ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే అదే అధికారులతో తప్పుడు ఫిర్యాదు చేయించి, తప్పుడు సెక్షన్లతో కేసు పెట్టి అరెస్టు చేశారు. 2023లో టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో ఇప్పుడు 127వ ముద్దాయి కింద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కేసు పెట్టారు. ఇలా చట్టం, రాజ్యాంగం దారుణ ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో జరిగిన ఘటనల్లో మనవాళ్లను ఇరికించి జైల్లో పెట్టే కార్యక్రమం రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో జరుగుతోంది.3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారుఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తిగా లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాకపోగా ఉన్న వాటినే ఊడగొడుతు­న్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే 2.6 లక్షల మంది వలంటీర్లు, 15 వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యో­గులు, 9,800 రేషన్‌ వాహ­నాల (ఎండీయూ) మీద ఆధారపడ్డ 20 వేల మందితో కలిపి మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారు. మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగస్తుల్లో విషం నింపి, ఇవాళ వారినీ మోసం చేశాడు. వారికి మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్‌సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్‌. అందుకే ఇవాళ ఉద్యోగులు చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామా అని తల పట్టుకుంటున్నారు.విచ్చలవిడిగా అవినీతిమరోవైపు ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, లిక్కర్‌ మాఫియా, సిలికా, క్వార్జ్ట్‌ అక్రమ తవ్వకాలు, రాజధాని పనులు.. ఇలా దేన్నీ వదల కుండా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో స్కామ్‌లు చేస్తున్నారు. ఇలాంటివి మన హయాం­లో లేవు కాబట్టే బటన్‌ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)తో రూ.2.73 లక్షల కోట్లు ప్రజలకు పారదర్శకంగా అందించాం. ఆరోజు జగన్‌ చేశాడు... ఇప్పుడు చంద్ర­బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే కారణం ఇదే! నేను ఆశపడింది ఒక్కటే... నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డా. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నా. ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్‌ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం చేస్తున్నాడు కాబట్టే. అందుకే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 13 శాతం ఆదాయాలు పెరిగితే.. మనకు కేవలం 3 శాతమే పెరిగాయి. అలా ఎందుకు జరుగుతోందంటే.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం టీడీపీ గజదొంగల ముఠా జేబుల్లోకి పోతోంది. ఏ మంచి చేయని, అన్నీ అబద్ధాలు, మోసాలు చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి డిపాజిట్లు రాని పరిస్థితులు ఖాయం.

TDP Atrocities: Mid Night High Drama in Pulivendula After TDP Flags Removed2
పులివెందుల: అర్ధరాత్రంతా హైడ్రామా

సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో.. పులివెందుల, వేములలో గత అర్ధరాత్రంతా హైడ్రామా నడిచింది. మహానాడు నేపథ్యంతో ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్ విగ్రహాలకు టీడీపీ తోరణాలు కడితే.. వాటిని తొలగించారంటూ వైఎస్సార్సీపీ నేతలపై అరెస్ట్‌ చేసి రాత్రంతా పోలీస్‌ స్టేషన్‌లోనే ఉంచారు. నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి బుధవారం రాత్రి మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్‌ సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై పులివెందుల నుంచి వేముల పీఎస్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పీఎస్‌కు చేరుకుని పోలీసులను నిలదీశారు. ‘‘ మా పార్టీ నేతలను అరెస్ట్‌ చేయం దారుణం. వైఎస్సార్ విగ్రహానికి కట్టిన టీడీపీ జెండాలు తొలగించమంటే పోలీసులు స్పందించలేదు. తమ మనోభావాలు దెబ్బ తినడంతో తోరణాలు తొలగించారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నేతలపై కేసులు పెట్టడం దారుణం’’ అని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు.ఇదీ చదవండి: వైఎస్సార్‌.. ఓ ఎమోషన్‌

CM Chandrababu Politics In Mahanadu Over Nara Lokesh3
పదే పదే లోకేశ్‌ పాట!

సాక్షి, అమరావతి: కడప టీడీపీ మహానాడు ఆద్యంతం తన కుమారుడు లోకేశ్‌ని తన వారసుడిగా చూపించేందుకు చంద్రబాబు తాపత్రయపడ్డారు. లోకేశ్‌ బాగా చదువుకున్నవాడని, అన్ని విషయాలు తెలిసినవాడంటూ ఆయన గురించే తన ప్రతి ప్రసంగంలోనూ చెప్పి పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయనే భవిష్యత్తు నాయకుడని పరోక్షంగా చెప్పారు.మాములుగా అయితే మహానాడులో ఎప్పుడూ వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి వాటిపై చర్చించడం ఆనవాయితీగా జరిగేది. కానీ, ఈ మహానాడులో తీర్మానాలు దాదాపు పక్కకుపోయాయి. లోకేశ్‌ని గొప్పవాడిగా చూపించే క్రమంలో సూపర్‌ సిక్స్‌ హామీల తరహాలో సూపర్‌ సిక్స్‌ శాసనాలంటూ పాత అంశాలకే కొత్త పేర్లు పెట్టి ఆయనతో చెప్పించారు. మొదటి రోజు చర్చంతా ఆయన చెప్పిన అంశాలపైనే జరిగేలా చూశారు. ఈ శాసనాలు లోకేశ్‌ ఆలోచనలని, వీటి ద్వారా టీడీపీకి వచ్చే 40 ఏళ్ల వరకూ రూట్‌ మ్యాప్‌ రూపొందించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు తాను మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ ఈ శాసనాలు లోకేశ్‌ రూపొందించాడని, ఇవి అతని ఘనతేనని, వాటిని అందరూ పాటించాలని చెప్పుకొచ్చారు.నిజానికి ఈ శాసనాల్లో ఏమాత్రం కొత్తదనంలేదు. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తలకు మేలు చేయడం, తెలుగుజాతిని గొప్పగా నిలబెట్టడమే ఈ శాసనాలు. ఏ రాజకీయ పార్టీ అయినా వీటి గురించే చెప్పడం సాధారణమైన విషయం. ఎందుకంటే సమాజంలో ఉన్నది ఈ వర్గాలే. ఏం చేసినా ఆ వర్గాల కోసమే చేయాలి. అలాంటప్పుడు ఇందులో లోకేశ్‌ గొప్పదనం ఏమిటో పార్టీ శ్రేణులెవరికీ అర్థంకాలేదు. ఏదో ఒక కొత్త పదం వాడాలి కాబట్టి శాసనాలు అనే పదం వాడినట్లు కనబడుతోంది తప్ప అందులో కొత్త అర్థంకానీ, కొత్త విషయం కానీ లేదని వారంటున్నారు. లోకేశ్‌ కోసం డిమాండ్ల డ్రామా.. మరోవైపు.. లోకేశ్‌ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేయాలని పలువురు నేతలు అదే పనిగా డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వంలో అర్జెంటుగా తనకు ఉన్నత పదవి కావాలని కోరుకుంటున్న లోకేశ్‌ అది కుదరకపోవడంతో తెలంగాణలో కేటీఆర్‌ తరహాలో ఇక్కడ తాను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి తీసుకుంటారని సీనియర్‌ నేతలు చెబుతున్నారు. అంటే.. ఆయన పదవి వ్యవహారం ఎప్పుడో నిర్ణయమైపోయింది. కానీ, ఇప్పుడు అందరి ఆమోదంతో దాన్ని ఇచ్చినట్లు చూపించాలి కనుక సీనియర్‌ నాయకులతో ఆయనకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఇవ్వాలని డిమాండ్లు చేయించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్‌ వంటి వారిని లోకేశ్‌ దూరం పెట్టడంతో వారు ఆయన్ను ఎలాగైనా ప్రసన్నం చేసుకునేందుకు మహానాడులో ఆయనకు అనుకూలంగా డిమాండ్లు చేసినట్లు కనబడుతోంది. మరోవైపు.. మహానాడులో అడుగడుగునా లోకేశ్‌ ఫొటోలను అత్యంత ప్రాధాన్యంగా ముద్రించారు. రామ్మోహన్‌తో రాజకీయ తీర్మానం.. యనమలకు ఝలక్‌.. చివరిగా.. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడితో రాజకీయ తీర్మానం చేయించారు. రాజకీయ తీర్మానాన్ని ఎప్పుడూ సీనియర్‌ నేతతో చేయించడం ఆనవాయితీ. గతంలో యనమల రామకృష్ణుడు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించే వారు. కానీ, ఇప్పుడు రామ్మోహన్‌తో ఈ తీర్మానం చేయించి సీనియర్ల అవసరంలేదని చెప్పకనే చెప్పారు.తేలిపోయిన తీర్మానాలు.. ఇక రెండో రోజు రాజకీయ తీర్మానం సహా 15 అంశాలపై తీర్మానాలు చేసినా వాటిలో ఏమాత్రం పస లేకుండాపోయింది. వీటిలో ఒక్క­టి తెలంగాణ తీర్మానం ఉండగా మిగిలినవన్నీ ఏపీకి సంబంధించినవే. తెలుగుజాతి–విశ్వఖ్యాతి, రాష్ట్రం–విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులు, రాష్ట్రాభివృద్ధి కేంద్ర సహకారం, అభివృద్ధి వికేంద్రకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి–రాయలసీమ డిక్లరేషన్, అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ, యోగాంధ్రప్రదేశ్, మౌలిక సదుపాయాల కల్పనతో మారనున్న రాష్ట్ర ముఖచిత్రం, రహ­దా­రులు, పోర్టులు, ఎయిర్‌పోర్టు అభివృద్ధి, విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక మార్పులు, సమ­గ్ర సాగనీటి ప్రణాళికతో ఉజ్వల ప్రగతి వంటి తీర్మా­నాలు చేసి వాటిపై అసత్యాలు, మాయమా­టలు చెబుతూ నేతలు ప్రసంగించారు.

Rasi Phalalu: Daily Horoscope On 29-05-2025 In Telugu4
ఈ రాశి వారికి రుణాలు తీరతాయి.. ఆప్తులతో సఖ్యత

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.తదియ రా.2.53 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఆరుద్ర రా.2.18 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: ఉ.11.19 నుండి 12.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: సా.4.46 నుండి 6.30 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.29, సూర్యాస్తమయం: 6.26. మేషం.... శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త పరిచయాలు. వస్తులాభాలు. ఇంటర్వూ లు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.వృషభం... పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.మిథునం... కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు నూతనోత్సాహం.కర్కాటకం.. ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.సింహం... ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.కన్య.. శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యక్తుల పరిచయం. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సమస్యల నుంచి విముక్తి.తుల.... కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.వృశ్చికం... కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.ధనుస్సు... రుణాలు తీరతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.మకరం...... అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.కుంభం... ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. బం«ధువులతో తగాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.మీనం... ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తుల వివాదాలతో ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువర్గంతో కలహాలు. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా నడుస్తాయి.

ocean color is changing as a consequence of climate change5
కాటుక రంగులోకి కడలి! 

ఆ చల్లని సముద్రగర్భం.. అంటూ సాగే దాశరథి పాట వినే ఉంటారు. ఇప్పుడు ఆ నల్లని సముద్రం అని కూడా పాడుకోవాలేమో. ప్రపంచవ్యాప్తంగా భూమినంతటినీ చుట్టేసిన సాగరజలం నెమ్మదిగా నీలి రంగు నుంచి నలుపు వర్ణంలోకి మారిపోతోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ధరణిపై దాదాపు 71 శాతం ఉపరితలాన్ని సముద్రజలాలే కప్పేస్తున్నాయి. అంటే భూమిపై దాదాపు 36.1 కోట్ల చదరపు కిలోమీటర్ల మేర సముద్రనీరే ఉంది. ఇందులో 21 శాతం అంటే 7 కోట్ల చదరపు కిలోమీటర్ల సముద్రజలాలు గతంలో ఎన్నడూలేనంతగా కొత్తగా నల్లగా మారిపోయాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ మార్పు కేవలం గత 20 సంవత్సరాల్లో జరిగిందని గణాంకాలు స్పష్టంచేశాయి. సంబంధిత వివరాలు గ్లోబల్‌ చేంజ్‌ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సముద్రజలాలు నలుపు రంగులోకి మారడంతో సూర్యరశ్శి సాగర జలాల్లోకి సులభంగా చొచ్చుకెళ్లడం సాధ్యపడట్లేదు. దీంతో సముద్ర ఉపరితల జలాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. కాంతిమయ పరిస్థితులే 90 శాతం సముద్రజీవుల మనుగడకు ప్రాణాధారం. సూర్యరశ్శి సముద్ర ఉపరితల జలాలపై కొంతమేరకే పరిమితమైతే ఎన్నో రకాల సముద్రజీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఇంగ్లండ్‌లోని ప్లైమౌత్‌ విశ్వవిద్యాలయం, ప్లైమౌత్‌ మెరైన్‌ లేబొరేటరీలోని అధ్యయనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 2003 ఏడాది నుంచి 2022 ఏడాది దాకా అంతర్జాతీయంగా పలు ఉపగ్రహాల నుంచి సేకరించిన డేటాను సంఖ్యాశాస్త్ర నమూనాలతో సరిపోల్చి ఈ విపరిణామాన్ని కనుగొన్నారు. వేడినిచ్చే సూర్యకాంతితోపాటు చల్లని వెలుతురునిచ్చే చంద్రకాంతి సైతం పరోక్షంగా సముద్రజీవుల జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. లోతైన సముద్రజలాలతోపాటు తీరం వెంట జీవుల ఉనికికీ ఈ రెండు కాంతులూ ముఖ్యమే. భారీగా తగ్గిన కాంతి లోతు అలజడులు లేని, ప్రశాంతంగా ఉన్న సముద్రజలాల్లో తేటగా ఉన్న సందర్భాల్లో సూర్యకాంతి చాలాలోతుదాకా వెళ్లగలదు. కానీ గత 20 ఏళ్లలో గమనిస్తే ఆఫ్రికా ఖండం అంత పరిమాణంలో అంటే 9 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి చొచ్చుకెళ్లే ప్రాంతాలు బాగా తగ్గిపోయాయి. ఇక్కడ గతంతో పోలిస్తే సూర్యకాంతి 50 మీటర్లు తక్కువలోతుకే వెళ్లగల్గుతోంది. మరో 2.6 శాతం సముద్రజలాల్లో సూర్యకాంతి వెళ్లగలిగే లోతు ఏకంగా 100 మీటర్లు తగ్గిపోయింది. అయితే ఒక 10 శాతం సముద్రజలాల్లో మాత్రం గతంలో కంటే ఎక్కువ లోతులకు సూర్యకాంతి చొరబడగల్గుతోంది. సూర్యకాంతిలోనే మనగలిగే సముద్రజీవులు చాలా ఉంటాయి. ఎన్నో రకాల జలచరాల ఉనికి, పునరుత్పత్తి, ఆహారానికి ప్రత్యక్షంగా సూర్యకాంతి అత్యావశ్యకం. ‘‘కొన్ని చోట్ల సూర్యకాంతి లభ్యత తగ్గిపోవడంతో వేరే చోట్లకు జీవులు వలసపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఆయా జీవావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది’’అని ప్లైమౌత్‌ విశ్వవిద్యాలయంలోని సముద్ర సంరక్షణ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ థామస్‌ డెవిస్‌ చెప్పారు.నల్లగా ఎందుకు మారుతోంది?పర్యావరణానికి సంబంధించి ఎన్ని దేశాల్లో ఎన్నెన్నో కఠిన చట్టాలున్నా అవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను ఆయా సంస్థలు గుట్టుచప్పుడుకాకుండా నేరుగా నదుల్లో పారబోస్తున్నాయి. గరళంగా మారిన నదీజలాలు నేరుగా సముద్రాల్లో కలుస్తున్నాయి. వీటికి వ్యవసాయ వ్యర్థాలూ తోడవుతున్నాయి. వీటితో పోషణ సంబంధ మూలకాలు సముద్రంలోకి పోటెత్తుతున్నాయి. ఈ పోషకాలను సంగ్రహించిన నాచు వంటి అతిసూక్ష్మ మొక్కలు సముద్ర ఉపరితల జలాలపై ఏపుగా పెరుగుతున్నాయి. గనుల తవ్వకం తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను వర్షపు నీరు నదుల ద్వారా సముద్రాల్లోకి కొట్టుకొచ్చేలా చేస్తోంది. ఇవికాక సూర్యకిరణాలను అడ్డుకునే జీవజాలం సముద్రఉపరితలంపై మరింతగా పేరుకుపోతోంది. ఇవన్నీ కలగలిసి సాగరాలను కాంతిహీనం చేస్తున్నాయి. అలా అవి నల్లరంగులోకి మారిపోతున్నాయి. శైశవాల పెరుగుదల, భూతాపోన్నతి కారణంగా అధికమవుతున్న సముద్రజలాల ఉపరితల ఉష్ణోగ్రత సైతం తమ వంతుగా ఈ దుష్ప్రభావానికి ఆజ్యం పోస్తున్నాయి.మత్స్య పరిశ్రమకూ పెనుముప్పు లోతైన సముద్రాల వద్ద సూర్యకాంతి తగ్గిపోయి ఆహార లభ్యత కృశించిపోవడంతో దిక్కులేక పలు రకాల జలచరాలు తీరాలకు చేరి అక్కడి జీవులతో కలిసి ఆహారం కోసం పోటీపడుతున్నాయి. దీంతో ఆయా జీవుల ఆహార వనరుల కొరత ఏర్పడుతుంది. సముద్రచేపలు, రొయ్యలు, ఇతర జలచరాల లభ్యత తగ్గిపోయే వీలుంది. దీని ప్రభావం భవిష్యత్తులో అన్ని సముద్రతీర దేశాల మత్స్య పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ‘‘లోతైన సముద్ర ప్రాంతాల్లో సూర్యకాంతి చొచ్చుకుపోయే సామర్థ్యం మరో 50 మీటర్లు తగ్గిపోతే అక్కడి జీవులు తమ ఆవాసాలను సముద్రతీరాలకు మార్చుకుంటాయి. అప్పుడు యావత్‌ సాగర జీవావరణ వ్యవస్థలో శాశ్వత మార్పులు సంభవించే ప్రమాదం దాపురిస్తుంది’’అని ప్లైమౌత్‌ మెరైన్‌ లే»ొరేటరీలో ప్రొఫెసర్‌ టిమ్‌ స్మిత్‌ విశ్లేíÙంచారు. ‘‘సముద్రాల్లో సూర్యకిరణాలు లోపలికి వెళ్లలేకపోతే మనకొచ్చే నష్టమేమీ లేదని నింపాదిగా కూర్చునే కాలం కాదిది. ప్రభుత్వాలు తక్షణం మేల్కొనాలి. సముద్రాల్లోకి చేరే నదీజలాలు వీలైనంత వరకు పారిశ్రామిక వ్యర్థాలకు ఆవాసంగా మారకుండా చూసుకోవాలి. మురుగునీటి శుద్ధి కర్మాగారాల వ్యవస్థను మరింత పటిష్టంగా అమలుచేయాలి. వ్యర్థాల పారబోతపై పరిశ్రమలపై భారీ జరిమానాలు విధించాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Student visas for Indian students temporarily suspended by USA6
యూఎస్ కల.. వీసా ఎలా?

వీసా వస్తుందో లేదో..?నాకు అమెరికా యూనివర్సిటీలో సీటు ఖరారైంది. అప్పులు చేసి అన్ని విధాలుగా సిద్ధమయ్యా. ఆగస్టులో వెళ్లాలి. కానీ ఇంతవరకూ వీసా ఇంటర్వ్యూకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో మొదటి సెమిస్టర్‌కు వెళ్లగలనా? లేదా అనే భయం వెంటాడుతోంది. – శశాంక్‌ ఇరుకుపాటి (అమెరికా వెళ్లేందుకు సిద్ధమైన మహబూబ్‌నగర్‌ విద్యార్థి)సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు భారతీయ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలవర పెడుతున్నాయి. స్టూడెంట్‌ వీసాలకు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేయాలని కాన్సులేట్‌ అధికారులను అగ్రదేశం ఆదేశించడం ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్న వారిని గందరగోళానికి గురి చేస్తోంది. తమ దేశంలోని కొన్ని యూనివర్సిటీల్లో ఉగ్రవాద సమర్థనీయ చర్యలున్నాయని అమెరికా ప్రభుత్వం అనుమానిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణమని అంటున్నారు. అమెరికా రావాలనుకునే ప్రతి విద్యార్థి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించాలని అధికారులకు అమెరికా ఆదేశాలు ఇచ్చింది. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయోనని అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేసి మరీ వీసా కోసం సిద్ధమైతే అమెరికా ప్రభుత్వం నుంచి రోజుకో నిర్ణయం వెలువడుతోందని కంగారు పడుతున్నారు. అయితే అమెరికా నిర్ణయాలు భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది కల్గించవని ప్రవాస భారతీయులు అంటున్నారు. కానీ అమెరికా ఈ ఏడాది 41 శాతం విద్యార్థి వీసాలను తిరస్కరించింది. ఇందులో భారతీయుల వీసాలు 38 శాతం ఉండటం గమనార్హం. కాగా ఇప్పటికే వీసా ఇంటర్వ్యూకు తేదీ ఖరారైన వారిని అనుమతించాలని అమెరికా సూచించడం ఆయా విద్యార్థులకు ఊరటనిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికి 6 వేల మందికి తిరస్కరణ: భారత్‌ నుంచి ప్రతి ఏటా 7 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. ఇందులో 3 లక్షల మంది అమెరికా దేశానికే వెళ్తున్నారు. చదువు కోసం ఆ దేశానికి మన విద్యార్థులు ప్రతి ఏటా రూ.లక్ష కోట్లు చెల్లిస్తున్నారని భారత విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికన్‌ యూనివర్సిటీలు ఆగస్టు–డిసెంబర్, జనవరి–మే సెమిస్టర్లకు రెండుసార్లు ప్రవేశాలు కల్పిస్తాయి. మనవారు మొదటి సెమిస్టరే ఎంపిక చేసుకుంటారు. దీంతో ఆరు నెలల ముందు నుంచే వీసా కోసం ప్రయత్నిస్తారు. విద్యార్థులకు ఎఫ్‌1 వీసా ఇస్తారు. దీన్ని నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా అంటారు. అమెరికాలో ఫుల్‌ టైం విద్యకు ఇది అవకాశం కల్పిస్తుంది. కాగా 2023లో 1.03 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇచ్చినట్టు బ్యూరో ఆఫ్‌ కాన్సులేట్‌ అఫైర్స్‌ నెలవారీ నివేదిక పేర్కొంది. అయితే 2023–24లో ఎఫ్‌1 వీసాలను భారీగా తగ్గించారు. ప్రపంచ వ్యాప్తంగా 6.79 లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇందులో 2.79 లక్షలు అప్లికేషన్లను అమెరికన్‌ కాన్సులేట్‌లు తిరస్కరించాయి. 2024 తొలి 9 నెలల్లోనే భారతీయ విద్యార్థులు 38 శాతం మందికి అమెరికా వీసాలు తిరస్కరించింది. ఈ ఏడాది తొలి సెమిస్టర్‌ కోసం దాదాపు 78 వేల మంది వీసా కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు 24 వేల మందికి ఇంటర్వ్యూ తేదీలు వచ్చాయి. కొందరి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 6 వేల మంది వివిధ కారణాల వల్ల తిరస్కరణకు గురయ్యారు. ఇక 54 వేలమంది ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారిని అడ్డుకునేందుకే.. అమెరికన్‌ కాన్సులేట్‌ వర్గాలు, కన్సల్టెన్సీ సంస్థలు, ప్రవాస భారతీయుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. వీసాల విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నదే అమెరికా ఆలోచన. ఉద్రిక్తతతలు, అసాంఘిక కార్యకలాపాలు, సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలున్న వారిని తమ దేశంలోకి రాకుండా చేయాలని ఆ దేశం భావిస్తోంది. ఈ క్రమంలోనే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలిస్తోంది. అమెరికా వెళ్ళే ముందు వారు ఎవరిని సంప్రదిస్తున్నారు? వారి నేపథ్యం ఏమిటి? ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? ఎవరితో ఉండాలనే ఆలోచనలో ఉన్నారు? ఏ కన్సల్టెన్సీని ఎంపిక చేసుకుంటున్నారు? ఆ కన్సల్టెన్సీ ద్వారా గతంలో ఎంతమందిని పంపారు? వాళ్ళ నేపథ్యం ఏమిటి? ఇలాంటి వివరాలు అమెరికా కన్సల్టెన్సీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉన్న తమ స్నేహితులు, బంధువులకు..అనుమానించదగ్గ వ్యక్తులు, రెడ్‌ లిస్ట్‌లో ఉన్న దేశాల వారితో సంబంధం ఉంటే మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంది. భారతీయ విద్యార్థులకు ఇబ్బంది లేదు! ప్రస్తుతానికి భారతీయ విద్యార్థులకు పెద్దగా ఇబ్బందులెదురయ్యే అవకాశం లేదని కన్సల్టెన్సీల ప్రతినిధులు, విదేశీ విద్యకు సంబంధించిన నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అమెరికా కొన్ని దేశాలపైనే దృష్టి పెట్టిందని అంటున్నారు. తమ దేశానికి వస్తున్న 41 దేశాల విద్యార్థులను కేటగిరీలుగా విభజించింది. రెడ్‌ కేటగిరీలో అమెరికాకు అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న దేశాలను చేర్చారు. ఇంకా చెప్పాలంటే ఇస్లాం వాదంతో అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న ఆప్ఘనిస్తాన్, ఇరాన్, లిబియాతో పాటు భూటాన్, క్యూబా సహా 11 దేశాలున్నాయి. ఉగ్రవాద ప్రేరేపిత, ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాలతో వాణిజ్య మైత్రి కొనసాగిస్తున్న 10 దేశాలను ఆరంజ్‌ కేటగిరీలో చేర్చారు. ఈ కేటగిరీలో పాకిస్తాన్, రష్యా సహా పది దేశాలున్నాయి. వీటిపై కొంత సమయం తీసుకుని ఆంక్షలు విధిస్తారు. వైరి పక్ష దేశాలతో సంబంధాలున్నప్పటికీ, హెచ్చరికలు, చర్చల ద్వారా దారికొచ్చే 22 దేశాలను ఎల్లో కేటగిరీలో చేర్చారు. వీటిపై దశల వారీగా ఆంక్షలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక భారత్‌ మిత్ర పక్షంలోనే ఉండటం వల్ల..ఇతరత్రా కారణాలతో తప్ప ఇక్కడి విద్యార్థులకు ఈ తరహా ఇబ్బందులేవీ లేనట్టేనని అంటున్నారు. అమెరికా స్నేహితులతో జాగ్రత్త అమెరికా రావాలనుకునే వాళ్ళు ముందుగా సోషల్‌ మీడియా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో అక్కౌంట్స్‌ ఉన్నాయనేది చూసుకోవాలి. అనుమానం ఉన్న వ్యక్తులతో ఎలాంటి సామాజిక సంబంధం ఉన్నా, వీసా విషయంలో ఇబ్బందులు తప్పవు. సాధారణంగా అమెరికాలో ఉండే స్నేహితులను మనవాళ్ళు నమ్ముతారు. అయితే వాళ్ళ నేపథ్యం, వాళ్ళు అమెరికాలో ఎలా ఉంటున్నారనేది కూడా ముఖ్యమే. – సిరిమళ్ళ వీరేంద్ర (అమెరికాలో ఎంఎస్‌ చేస్తున్న భారతీయ విద్యార్థి) తప్పుడు సర్టిఫికెట్లు, పార్ట్‌టైమ్‌తోనే ఇబ్బంది వీసాలు పూర్తిగా ఆపేయలేదు. వ్యక్తిగత వివరాలు, వెళ్ళే వర్సిటీ గురించి వాకబు చేయమని మాత్రమే అమెరికా ఆదేశించింది. భారతీయుల పట్ల అమెరికాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. కాకపోతే తప్పుడు ధ్రువపత్రాలతో వెళ్ళాలనుకున్నా,అక్కడికెళ్ళి పార్ట్‌టైం ఉద్యోగం చేస్తామన్నా, ఆ దిశగా లావాదేవీలున్నా వీసాకు ఇబ్బందులెదురవుతాయి. – జయవర్థన్‌ ఏకాటి (కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు)

Inspection of movie theaters in several areas on government orders7
సీజ్‌ ద థియేటర్‌.. అంటారేమో!

సాక్షి నెట్‌వర్క్‌: సినిమా థియేటర్ల విషయంలో ‘అత్త మీద కోపం దుత్త మీద చూపిందన్నట్లు’ తయారైంది కూటమి ప్రభుత్వ పరిస్థితి. సినిమా థియేటర్ల బంద్‌.. ఆపై విరమణ ప్రకటనల నేపథ్యంలో ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఎక్కడ ‘సీజ్‌ ద థియేటర్‌..’ అంటారోనని థియేటర్ల యజమానులు వణికిపోతున్నారు. జూన్‌ 12న తాను నటించిన హరి హర వీరమల్లు చిత్రం విడుదలవుతున్నందున ఇప్పుడు థియేటర్లు బంద్‌ చేస్తారా.. సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది.. దీని వెనుక ఎవరున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తీరా దీని వెనుక జనసేన నేత ఉన్నారని తెలిసి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంది ప్రభుత్వం. ఇంత హంగామా చేసి మిన్నకుండిపోతే బావుండదని భావించి రాష్ట్రవ్యాప్తంగా థియేట­ర్లను తనిఖీ చేయాలని ఆదేశించింది. ఆయా థియేటర్లలో ఉన్న లోపాలన్నింటిపై నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో బుధవారం పలు నగరాలు, పట్టణాల్లో పోలీస్, రెవెన్యూ, ఆహార కల్తీ నిరోధక శాఖ, మున్సిపల్‌ శాఖ, తూనికలు, కొలతలు తదితర శాఖల అధికారులు థియేటర్‌లలో తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నంలో ఆర్డీవో కె స్వాతి మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను తనిఖీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు అరవింద్‌కు చెందిన గీతా అన్నపూర్ణ థియేటర్‌తో పాటు అడబాల, కోడి రామకృష్ణకు చెందిన మారుతి థియేటర్లను తనిఖీ చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని అల్లు అరవింద్‌ గీతా ఆర్ట్స్‌కు చెందిన మూడు థియేటర్లలో ఆర్డీవో కె.మధులత ఆ­ధ్వ­ర్యంలో తనిఖీలు చేపట్టారు. లైసెన్స్‌లు, టికెట్ల ధరలు, తినుబండారాలు, శీతల పానీ­యా­ల ధరలు, మరుగుదొడ్లు, ఫైర్‌ సేఫ్టీ.. తదితరాలను పరిశీలించారు. నరసరావుపేట డివిజన్‌లో 22 థియేటర్‌లు ఉన్నాయని, వాటన్నింటిలో తనిఖీలు చేయాలని ఆయా మండలాల తహసీల్దార్‌లను ఆదేశించామని ఆర్డీవో తెలిపారు. రాజమహేంద్రవరంలోని గీతా అప్సర, శ్యామల, స్వామి థియేటర్‌లను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు తనిఖీ చేశారు. విజయవాడ గాందీనగ­ర్‌­లోని శైలజ, రాజ్‌ యువరాజ్, ఐనాక్స్, అలంకార్‌ థియేటర్లలో తనిఖీలు నిర్వ­హించారు. గుంటూరు జిల్లా పొన్నూరు, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల, వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, అమలాపురం, అన్నమయ్య జిల్లా రాయచోటి, రైల్వేకోడూరు తదితర పట్టణాల్లోనూ థియేటర్ల తనిఖీలు కొనసాగాయి. ఉన్నట్లుండి ఈ తనిఖీలేంటి? తనిఖీల సమయంలో థియేటర్ల యజమానులు అధికారులతో వారి కష్టాలు చెప్పుకున్నారు. ఇప్పటికే అరకొర ఆదాయాలతో నష్టపోతున్నామని, చిన్నచిన్న లోపాలను సాకుగా తీసుకుని ‘సీజ్‌ ద థియేటర్‌’ అంటే తమ గతి ఏం కావాలని వాపోయారు. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో కొంతమంది ప్రేక్షకులు కలుగజేసుకుంటూ విజయవాడ తదితర నగరాల్లోని మల్టీఫ్లెక్స్‌లలో తినుబండారాలు, మంచినీటి బాటిల్‌ ధర ఆకాశాన్నంటుతున్నాయని.. చిత్తశుద్ధి ఉంటే అక్క­డి నుంచి మొదలు పెట్టండని ఆగ్ర­హం వ్యక్తం చేశా­రు. మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో కళ్లెదుటే అధిక ధరలతో తినుబండారాలు విక్రయిస్తుంటే ఏమీ చేయలేకపోతున్నారని వాపోయారు.ఇదీ సంగతి మల్టీఫ్లెక్స్‌ థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తే మొదటి వారం రెవెన్యూలో 53 శాతం మల్టీప్లెక్స్‌ యజమానికి, 47 శాతం డిస్ట్రిబ్యూటర్‌ తీసుకునే విధంగా నిర్ణయించారు. రెండో వారం కూడా అదే సినిమా ప్రదర్శిస్తే మల్టీప్లెక్స్‌ యజమానికి 50 శాతం, డిస్ట్రిబ్యూటర్‌ 50 శాతం తీసుకుంటున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో కేవలం షోల ఆధారంగానే అద్దెలు చెల్లిస్తున్నారు. ఒక షో ప్రదర్శనలో హాల్‌ ఫుల్‌ అయితేనే అద్దె వస్తోందని, ఫుల్‌ కాకపోతే రెవెన్యూలో 40 శాతం మాత్రమే చెల్లిస్తున్నారని.. అలా కాకుండా మల్టీప్లెక్స్‌ల మాదిరిగా తమకు కూడా పర్సంటేజీలు ఇవ్వాలని థియేటర్‌ యజమానులు డిమాండ్‌ చేస్తున్నారు.

Punjab Kings vs Royal Challengers Bangalore in Qualifier 18
ఫైనల్‌ వేటలో...

ముల్లాన్‌పూర్‌: ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి ట్రోఫీ కోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్న రెండు జట్లు... 18వ సీజన్‌ ఫైనల్‌ చేరేందుకు పోటీపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్‌ కింగ్స్, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) గురువారం క్వాలిఫయర్‌–1లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్‌ ఆరంభం నుంచి ఆడుతున్న ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయిన ఇరు జట్లు... ఈ సారి నిలకడైన ప్రదర్శనతో ‘ప్లే ఆఫ్స్‌’కు చేరాయి. లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లాడిన పంజాబ్‌ కింగ్స్‌ 9 విజయాలు, 4 పరాజయాలు, ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో అగ్రస్థానం దక్కించుకుంది. 2014 తర్వాత పంజాబ్‌ జట్టు ‘ప్లే ఆఫ్స్‌’కు చేరడం ఇదే తొలిసారి కాగా... అప్పుడు కూడా పట్టికలో అగ్ర స్థానంలో నిలిచిన పంజాబ్‌... తుదిపోరులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక మరోవైపు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 4 పరాజయాలు ఒక ఫలితం తేలని మ్యాచ్‌తో 19 పాయింట్లు సాధించిన బెంగళూరు రన్‌రేట్‌లో కాస్త వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్ల మధ్య ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు జరగగా... చెరొకటి గెలిచాయి. బెంగళూరులో జరిగిన పోరులో పంజాబ్‌ గెలవగా... ముల్లాన్‌పూర్‌లో జరిగిన పోరులో బెంగళూరు పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా... ఓడిన జట్టుకు క్వాలిఫయర్‌–2 రూపంలో మరో అవకాశం ఉండనుంది. టాప్‌–3పైనే ఆశలు... ఇప్పటికే మూడు వేర్వేరు జట్లను ఐపీఎల్‌ ‘ప్లే ఆఫ్స్‌’కు చేర్చిన కెప్టెన్‌గా ఘనత సాధించిన శ్రేయస్‌ అయ్యర్‌... పంజాబ్‌కు ప్రధాన బలం కానున్నాడు. మైదానం బయటి నుంచి రికీ పాంటింగ్‌ సలహాలు... లోపల శ్రేయస్‌ వ్యూహాలతో ఇప్పటికే పంజాబ్‌ కింగ్స్‌ అభిమానుల మనసులు గెలుచుకుంది. ముందుండి నడిపించే వాడే నాయకుడు అనే విధంగా శ్రేయస్‌ బ్యాట్‌తోనూ దుమ్మురేపుతున్నాడు. 14 మ్యాచ్‌ల్లో 51.40 సగటుతో అతడు 514 పరుగులు చేసి జట్టు తరఫున టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ వస్తున్న శ్రేయస్‌ 171.90 స్ట్రయిక్‌రేట్‌తో ఈ పరుగులు చేయడం విశేషం. ఇక యువ ఓపెనర్లు ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్‌ 499 పరుగులు, ప్రియాన్ష్ ఆర్య 424 పరుగులతో సత్తా చాటారు. ఈ ఇద్దరు అందిస్తున్న శుభారంభాలతోనే పంజాబ్‌ భారీ స్కోర్లు చేయగలిగింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ నిలకడైన విజయాలకు ఈ ముగ్గురి ఫామే ప్రధాన కారణం. ఇన్‌గ్లిస్‌ మంచి టచ్‌లో ఉండగా... నేహల్‌ వధేరా, శశాంక్, స్టొయినిస్‌ అవసరమైన సమయంలో సత్తా చాటుతున్నారు. బౌలింగ్‌లో అర్ష్ దీప్ సింగ్, కైల్‌ జేమీసన్, అజు్మతుల్లా కీలకం కానున్నారు. జాతీయ జట్టు అవసరాల నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో యాన్సెన్‌ స్వదేశానికి తిరిగి వెళ్లడం జట్టుకు కాస్త ఇబ్బంది కాగా... గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు అందుబాటులో లేని చాహల్‌ రాకతో స్పిన్‌ విభాగం పటిష్టమైంది. విరాట్‌పై పెను భారం లీగ్‌ ఆరంభమైనప్పటి నుంచి ఒకే ఫ్రాంచైజీకి ఆడుతున్న ఏకైక ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కిన విరాట్‌ కోహ్లి... 18వ సీజన్‌లో అయినా ట్రోఫీని ముద్దాడాలని తహతహలాడుతున్నాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నా... అనధికారిక కెపె్టన్‌గా కోహ్లిపైనే జట్టు అధికంగా ఆధారపడుతోంది. అందుకు తగ్గట్లే ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన విరాట్‌... 13 మ్యాచ్‌ల్లో 60.20 సగటుతో 602 పరుగులు చేశాడు. 147.91 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టిన కోహ్లి... 8 అర్ధ శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. తన వికెట్‌ విలువ అర్థం చేసుకొని ఆడుతున్న కోహ్లి... ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు ముల్లాన్‌పూర్‌లోనే పంజాబ్‌పై నమోదు చేసుకోవడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. కోహ్లి, సాల్ట్‌ జట్టుకు శుభారంభాలు అందిస్తుండగా... మయాంక్‌ అగర్వాల్, రజత్‌ పాటీదార్, జితేశ్‌ శర్మ చక్కటి ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆశలే లేని స్థితిలో అద్భుత ప్రదర్శన చేసిన జితేశ్‌ శర్మ నుంచి ఫ్రాంఛైజీ అలాంటి ప్రదర్శనే ఆశిస్తోంది. గాయం కారణంగా టిమ్‌ డేవిడ్‌ అందుబాటులో లేకపోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారగా... అతడి స్థానంలో లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఫినిషర్‌ పాత్ర పోషించనున్నాడు. ఫిట్‌నెస్‌ సాధించిన జోష్‌ హాజల్‌వుడ్‌ తిరిగి రావడం జట్టుకు కొండంత బలాన్నిస్తోంది. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఎలాంటి బ్యాటర్‌నైనా ఇబ్బంది పెట్టగల హాజల్‌వుడ్‌ ఈ మ్యాచ్‌లో కీలకం కానున్నాడు. భువనేశ్వర్, యశ్‌ దయాళ్‌తో కలిసి అతడు పేస్‌ భారాన్ని మోయనుండగా... సుయాశ్‌ శర్మ, కృనాల్‌ పాండ్యా స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నారు. తుది జట్లు (అంచనా) పంజాబ్‌ కింగ్స్‌: శ్రేయస్‌ (కెప్టెన్ ), ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్‌ సింగ్, ఇన్‌గ్లిస్, నేహల్‌ వధేరా, శశాంక్, స్టొయినిస్, అజ్మతుల్లా, జెమీసన్, హర్‌ప్రీత్, అర్ష్ దీప్, చాహల్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు: రజత్‌ పాటీదార్‌ (కెప్టెన్ ), కోహ్లి, సాల్ట్, మయాంక్‌ అగర్వాల్, జితేశ్, కృనాల్‌ పాండ్యా, లివింగ్‌స్టోన్, షెఫర్డ్, భువనేశ్వర్, యశ్‌ దయాళ్, హజల్‌వుడ్, సుయాశ్‌ శర్మ. పిచ్, వాతావరణం ముల్లాన్‌పూర్‌ మైదానంలో ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగగా... అందులో మూడు ఇన్నింగ్స్‌ల్లో స్కోర్లు 200 దాటాయి. మిగిలిన ఐదు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. బుధవారం పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది కీలకం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఐపీఎల్‌లో నేడు (క్వాలిఫయర్‌ –1)పంజాబ్‌ X బెంగళూరువేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

Monsoons moving actively in Telangana9
రాష్ట్రమంతా నైరుతి!

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు అత్యంత చురుకుగా కదులుతున్నాయి. ఈనెల 26న రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించగా... బుధవారం సాయంత్రానికి తెలంగాణ అంతటా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించిన నాలుగు నుంచి ఆరు రోజుల వ్యవధిలో రాష్ట్ర భూభాగం అంతటా విస్తరించేవి. కానీ ఈసారి కేవలం రెండున్నర రోజుల వ్యవధిలోనే విస్తరించడం గమనార్హం.ప్రస్తుతం రుతుపవనాల కదలికలు చురుకుగా ఉండటంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించిన వాతావరణ శాఖ... ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జూన్‌ నెలలో విస్తారంగా వర్షాలు... కాగా, జూన్‌ నెలలో రుతుపవనాల గమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. దీంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనాలు విడుదల చేసింది. నైరుతి సీజన్‌లో జూన్‌ నెలలో రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 12.94 సెంటీమీటర్లు. ఐఎండీ అంచనాల ప్రకారం జూన్‌ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని.. సగటున 111 శా­తం వర్షపాతం నమోదు కావొచ్చని వివరించింది.గతేడాది జూన్‌ నెలలో 15.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణంకంటే 23 శాతం అధికంగా వర్షపాతం నమోదు కాగా... ఈసారి అంతకుమించి వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా ఉట్కూర్‌లో 4.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో 3.0 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 2.75 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా గుండ్లపల్లెలో 2.28 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Vidya Balan to work with Rajinikanth Jailer 210
జైలర్‌తో విద్య?

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌ ’(2023) చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్‌ జైలర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీకాంత్‌ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్‌ కాంబినేషన్‌లోనే ‘జైలర్‌’కి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ చిత్రం రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. ఇదిలా ఉంటే.. ‘జైలర్‌ 2’లో విద్యా బాలన్‌ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ టాక్‌. ఇటీవల విద్యా బాలన్‌ని కలిసి, ‘జైలర్‌ 2’ కథ చె΄్పారట నెల్సన్‌. చిత్రకథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ‘జైలర్‌ 2’లోనూ ఆమె అదే పాత్రలో కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో విద్యా బాలన్‌ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ‘జైలర్‌ 2’లో హీరో బాలకృష్ణ నటించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో నాగార్జున కూడా ఈ చిత్రంలో నటించనున్నారనే టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్‌ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించారు. మరి... ‘జైలర్‌ 2’లో కూడా నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement