ఉగ్రవాదులకు భారత్‌ గట్టి జవాబు ఇచ్చింది | Asaduddin Owaisi Praises Indian Air Force Over Surgical Stricke 2 | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకు భారత్‌ గట్టి జవాబు ఇచ్చింది

Feb 26 2019 4:20 PM | Updated on Mar 22 2024 11:16 AM

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్‌ భారత్‌ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్‌ స్ట్రైక్‌-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు.. ప్రతి ఒక్కరు ఈ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకారక దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement