AIMIM
-
Delhi poll: జైలు నుంచే ‘పతంగి’ ఆట!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోనూ తన అస్థిత్వాన్ని బలంగా చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న ఎంఐఎం పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న రెండు స్థానాల్లో తన పార్టీ చిహ్నమైన పతంగిని ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తులే చేస్తోంది. ఆ పార్టీ పోటీ చేస్తున్న ఓఖ్లా, ముస్తఫాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ ఢిల్లీ అల్లర్ల కేసులో జైలు నుంచే తమమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, వారి తరఫున అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నీతానే ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. జైలు నుంచే పార్టీ అభ్యర్థులు తమ వ్యూహాలను అమలు చేస్తుంటే, ప్రచార క్షేత్రంలో ఒవైసీ తన పదునైన మాటలతో ప్రచారం చేస్తున్నారు. గెలుస్తారా..చీలుస్తారా? ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా 3.35 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో 1.78 లక్షలు (52.5)శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఇక ముస్తఫాబాద్ నియోజకవర్గంలోనూ 2.63 లక్షల ఓటర్లలో 1.03 లక్షలు (40శాతం) ముస్లిం ఓటర్లు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకునే ఎంఐఎం ఈ రెండు స్థానాల్లో పోటీకి దిగింది. రెండు నియోజకవర్గాలోనూ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ముద్దాయిలుగా ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించింది. ఓఖ్లా నుంచి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ను పోటీలో పెట్టగా, ముస్తఫాబాద్ నుంచి షిఫా ఉర్ రెహా్మన్ పోటీలో ఉన్నారు. వీరిద్దరు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ద్వారా హింసను ప్రేరేపించిన ఆరోపణలతో జైళ్లో ఉన్నారు. కోర్టు నుంచి పెరోల్లో బయటకు వచ్చిన ఇద్దరు, నామినేషన్ల అనంతరం తిరిగి జైలుకు వెళ్లారు.అక్కడి నుంచే తమ అనుచరల ద్వారా ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఓఖ్లాలో 2015, 2020 ఎన్నికల్లో ఆప్కు చెందిన అమానతుల్లా ఖాన్ 50 వేలకు పైగా భారీ ఆధిక్యంతో గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఇటీవల మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్ట్ను ఎదుర్కొని బయటకు వచ్చి తిరిగి పోటీలో ఉన్నారు. ఆయన్ను తట్టుకోవడం ఎంఐఎంకు అంత సులువు కాకున్నా, ఆప్ ఓట్లను చీల్చడంలో ఎంఐఎం కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. గడిచిన రెండ్రోజులుగా పార్టీ అధినేత ఒవైసీ ఇక్కడ పర్యటిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక ముస్తఫాబాద్లో సైతం 2015లో బీజేపీ, 2020లో ఆప్ విజయపతాకం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఆప్ తరఫున హాజీ హుస్సేన్ 53 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న షిఫా ఉర్ రెహా్మన్కు స్థానికంగా గట్టి పట్టుంది. ఒకవేళ ఆయన 5–8 శాతం ఓట్లను ప్రభావితం చేసినా బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. ఈ స్థానంలో ఓట్ల చీలిక జరిగితే బీజేపీ తిరిగి గెలిచే అవకాశాలున్నాయి. ఇక రెండు స్థానాల్లో ప్రచారం చేస్తున్న ఓవైసీ సైతం ప్రధానంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘గత ఐదేళ్లుగా తాహిర్ హుస్సేన్, షిఫా ఉర్ రెహా్మన్ జైలు లోపలే ఉండగా, లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి ఎలా బెయిల్ వచి్చంది?, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్తో సహా ఆప్ నాయకులందరూ బెయిల్ పొందారు, ఈ ఇద్దరు ఇంకా లోపలే ఎందుకు ఉన్నారు’అని ఓవైసీ ప్రశి్నస్తున్నారు. లిక్కర్ పాలసీలో అరెస్టయి బెయిల్పై బయటికొచి్చన కేజ్రీవాల్ గెలువగలిగితే, తమ ఇద్దరు అభ్యర్థులు ఎందుకు గెలవరని అడుగుతున్నారు. -
అసదుద్దీన్ ప్రమాణస్వీకారం పై లోక్ సభ లో దుమారం
-
మహారాష్ట్ర ఎంఐఎం నేతపై కాల్పులు
ముంబై: మహారాష్ట్రలోని ఏఐఎంఐఎం నేతపై కాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు మాజీ మాలెగావ్ మేయర్ అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనస్ ఇసాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు సార్లు కాల్చడంతో మాలిక్ శరీరంపై మూడు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మాలిక్ శరీరంపై ఎడమవైపు ఛాతి, ఎడమ తొడ, కుడి చెతిపై బెల్లెట్ గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీలో మాలిక్ చాలా కీలకమైన నేత వ్యవహరిస్తున్నారు. మాలెగాల్ పోలీసుల ప్రకారం..సోమవారం తెల్లవారుజన 1.20 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్ ఒవైసీ
-
పల్లవి పటేల్తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్లోని 80 లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ
న్యూఢిల్లీ: కేంద్రం వైఖరిపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం ఒక వర్గానికో, మతానికో చెందిన ప్రభుత్వమా లేక యావద్దేశానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి బాబా మోదీ ప్రభుత్వం అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణంపై శనివారం సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామ మందిర ప్రారంభం ద్వారా ఒక మతంపై మరో మతం విజయం సాధించినట్లు సందేశం ఇవ్వదలిచారా? దేశంలోని 17 కోట్ల ముస్లింలకు ఏం సందేశమిస్తున్నారు? నేను బాబర్, జిన్నా, ఔరంగజేబ్ తరఫున మాట్లాడటం లేదు. రాముడిని గౌరవిస్తా. కానీ గాడ్సేను ద్వేషిస్తా. ‘బాబ్రీ మసీదు జిందాబాద్, బాబ్రీ మసీదు ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ముగించారు. -
‘బీజేపీకి ఆప్కు మధ్య తేడా ఎంటీ?’
అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు. ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు. ఆప్లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు. చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’ -
హంగ్ కోసం బీజేపీ యత్నం
‘రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పసిగట్టింది. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చూస్తోంది. దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో సంకీర్ణంతో బలోపేతం కావాలనుకుంటోంది. ప్రజలు మజ్లిస్కు 9, బీఆర్ఎస్కు 110 సీట్లలో సంపూర్ణ మద్దతు ఇచ్చి.. కేసీఆర్ మామకు అధికారం కట్టబెట్టాలి’ అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. బధవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ కాంగ్రెస్తోనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. కేంద్రంలో వరుసగా గెలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఎంపీల బలం 50కి పడిపోయింది. మోదీ ప్రధాని కావడానికి ఆయనే కారణం. తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కోపమంతా మజ్లిస్పై ప్రదర్శిస్తున్నారు. ఓట్లు చీల్చుతున్నామని అపవాదు అంటకడుతున్నారు. అమేథీలో మజ్లిస్ పోటీ చేయకపోయినా స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. తాత ముత్తాత, నానమ్మ సీట్లను కూడా కాపాడుకోలేకపోయారు. కేరళలోని వయనాడ్లో ముస్లిం లీగ్ సహకారంతో 30 శాతం ముస్లిం ఓట్లతో రాహుల్ గెలిచారు. శివసేనతో అధికారం పంచుకున్నప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది. ఎంఐఎం, బీఆర్ఎస్ కోసం తలుపులు మూసేశామని రాహుల్ చెబుతున్నారు. ఇండియా కూటమిలో మేము ఎలా భాగస్వాములం అవుతాం. అజహరుద్దీన్.. అసమర్థ రాజకీయవాది అజహరుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడు. యూపీలోని మొరాదాబాద్ లోక్సభ స్థానం నుంచి ప్రజలు గెలిపిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాజస్తాన్కు పంపిస్తే అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ముఖం చూపించలేదు. సొంతగడ్డపై కేటీఆర్ ఆయనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఆయన అవినీతిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్ అభ్యర్థిని రంగంలోకి దింపాం. కాంగ్రెస్ చీఫ్ పక్కా ఆర్ఎస్ఎస్వాది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశారు. కార్వాన్లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా గుడిమల్కాపూర్లో ప్రచారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆయనను టీడీపీకి పంపిస్తే ఆ పార్టీ అడ్రస్ తెలంగాణలో గల్లంతైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనతో కాంగ్రెస్లో చేరారు. మోహ¯న్ భగవత్ రిమోట్ కంట్రోల్తోనే గాంధీభవన్ పనిచేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. హైదరాబాద్లో మజ్లిస్ బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్గడ్లలో ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలి? అక్కడ ముస్లింలు లేరా..? లేక వారి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదా? బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులేదు బీఆర్ఎస్తో మజ్లిస్కు ఎలాంటి పొత్తు లేదు. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమే. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం ఉంది. మేము ఎవరికీ బీ–టీమ్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంది కాబట్టి సమర్థిస్తున్నాం. బీజేపీతో కేసీఆర్కు సంబంధం ఉంటే.. తొమ్మిదిన్నరేళ్లలో మైనారిటీల కోసం పెద్దఎత్తున బడ్జెట్ కేటాయింపు జరిగేదా? 201 మైనార్టీ గురుకులాల ఏర్పాటు చేసేవారా? ఓవర్సీస్ స్కాలర్షిప్తోపాటు ఏటా రూ.650 కోట్లు ముస్లింల విద్య కోసం ఖర్చు పెట్టేవారా? కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. భైంసా ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మతఘర్షణలు జరుగుతాయి. మత సామరస్యం దెబ్బతీంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల. మతప్రాతిపదిక రిజర్వేషన్ కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన చేసినవి కావు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. అదీ పీఎస్ కృష్ణన్, మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ అమలవుతోంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటి? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీ ప్రభుత్వానికి పంపితే మంజూరు చేయలేదు. బీజేపీ ఇప్పుడు దీన్ని రద్దు చేస్తామని చెబుతోంది. పాఠ్యపుస్తకాల్లో గాం«దీని అవమానపర్చి.. గాంధీని చంపిన గాడ్సే గురించి చదివిస్తున్నారు. -
మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రత్యేక డిక్లరేషన్
-
రేవంత్ రెడ్డి RSS నుంచి వచ్చిన వ్యక్తి : ఒవైసీ
-
మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ ప్రకటించింది. నగరంలోని పాత బస్తీలోని ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట స్థానానికి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్పేట స్థానానికి అహ్మద్ బలాల, కార్వాన్కు కౌసర్ మోహియుద్దీన్, నాంపల్లికి మాజీద్ హుస్సేన్, చార్మినార్కు జుల్ఫీకర్, యాకుత్పురాకు జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. త్వరలో బహదూర్పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. ఉద్దండులకు మొండిచేయి.. రాజకీయ ఉద్దండులు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ పార్టీ మొండిచేయి చూపించింది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, యాకుత్పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీలకు సీటు కేటాయించ లేదు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం యాకుత్పురా స్థానానికి మారింది. ఈసారి కొత్తగా ఇద్దరు మాజీ మేయర్లకు అవకాశశం లభించింది. నాంపల్లి సిట్టింగ్ స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్కు, చార్మినార్ సిట్టింగ్ స్థానాన్ని జుల్ఫీకర్లకు కేటాయించారు. 2018 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు ఎన్నికల బరి నుంచి తప్పించి పార్టీలో వారి సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. కొత్తగా జూబ్లీహిల్లో.. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పక్షాన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండగా.. ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఈసారి పోటీ నిర్ణయం వెనుక మతలబు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సంపన్నలున్న ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన నవీన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి మాగంటికి ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మజ్లిస్ పోటీకి దూరం పాటించి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి తిరిగి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. డబుల్ హ్యాట్రిక్.. 'ఓటమి ఎరగని నేతగా యాకుత్పురా నుంచి ఐదుసార్లు, చార్మినార్ నుంచి ఒకసారి వరుసగా విజయంసాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనంతరం ముంతాజ్ ఖాన్కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదన మేరకు రిటైర్మెంట్కు సిద్ధమంటూనే తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని మెలికపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా టికెట్ ఇవ్వకున్నా బరిలో దిగుతానని అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎంబీటీలు సంప్రదింపులు చేస్తూ పార్టీ పక్షాన రెండు సీట్ల బంపర్ ఆఫర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా చార్మినార్ అసెంబ్లీ స్థానానికి మాజీ మేయర్ జుల్ఫీకర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండటమా? లేక బరిలో దిగడమా? ముంతాజ్ ఖాన్ ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. ఇవి చదవండి: అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు! -
TS: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్లతోపాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లో పోటీ చేయనున్నట్టుగా ఓవైసీ పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసేపనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం రెండు విడదతల్లోనూ 100 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. రెండు పార్టీలో మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చదవండి: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రాసేదెవరు? -
మేనిఫెస్టో లేని మజ్లిస్
ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో కీలకమైనది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ. దాన్ని బట్టే ఆ పార్టీ గెలుపుపోటములు కూడా ఆధారపడి ఉంటాయి. స్వతంత్రులు సైతం తమను గెలిస్తే చేసే పనులను ప్రకటించి ఓట్లను అభ్యర్థిస్తారు. కానీ, అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికల బరిలో దిగే ఏకైక రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్– ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా, వరసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం మాత్రం ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా.. ఓటర్లకు జవాబుదారీగా ఉండేందుకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండానే ఓటర్లను ఆకర్షిస్తోంది. ఆరున్నర దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ మేనిఫెస్టో పత్రాన్ని విడుదల చేయలేదు. తాజాగా కూడా తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మేనిఫెస్టో లేకుండానే బరిలో దిగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏఐఎంఐఎం మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా రికార్డుకెక్కింది. పాతబస్తీ నుంచి దేశస్థాయికి ‘‘మా పనితీరు.. మా గుర్తింపు’’ అనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలో దిగే ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీ నుంచి జాతీయ స్థాయికి పార్టీని విస్తరించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బిహార్ శాసనసభల్లో సైతం పార్టీ ప్రాతినిధ్యం కలిగి ఉంది. అదేవిధంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలో స్థానిక స్థంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. పార్లమెంటులోనూ హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ నుంచి ఇంతీయాజ్ జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారంలో ఆరు రోజులు... ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజూ ప్రజా గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీల వరకు అందుబాటులో ఉంటారు. వివిధ పనులపై వచ్చే ప్రజలు నేరుగా కార్పొరేటర్నో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలిసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇక్కడ ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గం కంటే హిందుసామాజిక వర్గం తాకిడి దారుస్సలాంకు అధికంగా ఉండటం విశేషం. అయితే ఇక్కడ అంతా క్యూ పాటించాల్సిందే. పాతబస్తీలో కింగ్ మేకర్ హైదరాబాద్ రాజకీయాలలో మజ్లిస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తోంది. హైదరాబాద్ పాతనగరం రాజకీయ పరిస్థితికి కొత్త నగరం భిన్నంగా ఉంటుంది. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్సైడ్గా ఉంటోంది. ఇదీ చరిత్ర 96 ఏళ్ల కిందట నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్లో 1927లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’గా ఆవిర్భవించిన ధార్మిక సంస్ధ క్రమంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. 1948లో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో చేరిన తర్వాత ఈ సంస్థ నిషేధానికి గురైంది. అసదుద్దీన్ ఒవైసీ తాత అప్పటి ప్రసిద్ధ న్యాయవాది మౌలానా అబ్దుల్ వాహిద్ ఒవైసీ 1958లో రాజ్యాంగంలో పొందుపరిచిన మైనారిటీల హక్కుల కోసం పోరాడేందుకు ఆ సంస్థనే రాజకీయ పార్టీగా మార్చారు. 1959లోనే హైదరాబాద్లో జరిగిన రెండు మున్సిపల్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. 1960లో హైదరాబాద్ బల్డియాలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. వరసగా అబ్దుల్ వాహెద్ ఒవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టి ముస్లిం మైనారిటీ గొంతుకగా బలమైన రాజకీయ శక్తిగా మార్చుతూ వచ్చారు. మభ్యపెట్టడానికే మేనిఫెస్టో ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి మేనిఫెస్టో ఒక ప్రచారసాధనం. ఓట్లు రాబట్టుకునేందుకు ఒక ఆయుధం. అందుకే మేం ఎన్నడూ ఆ ఊసెత్తం. హామీలు ఇవ్వం. పని చేసి గుర్తింపు తెచ్చుకుంటాం. ప్రజల మధ్యనే ఉంటాం. ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇలాంటప్పుడు ఇక మేనిఫెస్టో అవసరం ఏముంది. అమలు కాని హామీలిచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా తిరగడం మజ్లిస్ పార్టీ పద్ధతి కాదు. – అసదుద్దీన్ ఒవైసీ ,అధినేత, ఏఐఎంఐఎం - మహమ్మద్ హమీద్ ఖాన్ -
కేసీఆర్కు మా సంపూర్ణ మద్దతు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారాయన. ‘‘పేదల కోసం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారు.కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. కేసీఆర్ తెలంగాణకు హ్యాట్రిక్ సీఎం అవుతారు’’ అని ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత ఇంతకు ముందు కూడా కేసీఆర్కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. వారం కిందట హైదరాబాద్లో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్ను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. అయితే తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆ సందర్భంలో ఆయన ప్రకటించారు. -
మజ్లిస్... పాతబస్తీ దాటేనా?
హైదరాబాద్: పదేళ్లుగా దేశ వ్యాప్తంగా ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయతి్నస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సొంత గడ్డపై మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా స్థానాలపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దోస్తీ కోసం కేవలం పాతబస్తీకే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాత పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా నగరంలో 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లోపార్టీకి గట్టి పట్టుంది. సిట్టింగ్ స్థానాలైన చార్మినార్, యాకుత్పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, బహద్దూర్పురా, కార్వాన్, మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, అంబర్పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలో ముస్లింల ప్రాబల్యం అధికంగానే ఉంది. గతంలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్లో పోటీ చేసి ఓటమి చవిచూసినా గణనీయమైన ఓట్లను దక్కించుకోగలిగింది. నిజామాబాద్ అర్బన్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈసారి పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఏకంగా స్థానిక శాఖలు తీర్మానాలు చేస్తున్న అధినేత నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. ఇతర రాష్ట్రాలకు ఓకే.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పదుల సంఖ్యలో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు మజ్లిస్ పార్టీ వెనుకాడటం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్లలో పోటీ చేసిన మజ్లిస్.. తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైంది. అక్కడ మూడు స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో ఏడుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, బిహార్లో ఒకరు. (మజ్లిస్ నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు) ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలను కొనసాగిస్తూనే, తెలంగాణలో బీజేపీ జోరుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్తో కలిసి వెళ్తున్నామని ఆ పారీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేసీఆర్ను గెలిపించడానికే మోదీ పర్యటనలు.. బాంబు పేల్చిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల ఫెలికాల్ బంధాన్ని గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారు. మోదీనే ఒప్పుకున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పునరాలోచించుకోవాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్ది ఫెవికాల్ బంధం. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది?. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్ఎస్తోనా?. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా?. ఇదంతా నాణేనికి ఒకవైపే.. కేసీఆర్కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము.. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి?. బీఆర్ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ అధిష్టానం నరేంద్ర మోదీ అని స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆర్ఎస్, 7 బీజేపీకి, 1 ఎంఐఎంకు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్పై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కాంగ్రెస్ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండండి’ -
ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: రాజాసింగ్
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే గో షామహల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ పార్టీని పాముకు పాలుపోసి పెంచినట్లు పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్ బంధుత్వాన్ని ఒవైసీ అప్పుడే మరిచిపోయారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అసదుద్దీన్ కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కానీ తనపై పోటీచేస్తే ప్రజలు వారిని చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు కరీంనగర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇతర పార్టీల నేతలనే కా కుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నా రని మండిపడ్డారు. పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమ వారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్ మొక్క నాటారు. అనంతరం బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే వాళ్లంతా కేసీఆర్కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఖాయమన్నారు. -
ఇది యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు: ఎంపీ అసుదుద్దీన్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నేత, ఎంపీ అసుదుద్దీన్ పేర్కొన్నారు. ఆ బిల్లులో కొన్ని ప్రధాన లోపాలున్నాయని అన్నారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. కాగా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై దిగువసభలో బుధవారం చర్చ సాగింది.ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని విమర్శించారు. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందన్నారు. కేవలం ధనవంతులే చట్టసభల్లో ఉండేలా ఈ బిల్లు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని ఆరోపించారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును 15 ఏళ్లకే పరిమితం చేయొద్దు: ఎంపీ సత్యవతి -
TS Election 2023: బోధన్ నియోజక వర్గం.. ఆసక్తికర అంశాలు!
సాక్షి, నిజామాబాద్: బోధన్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్య ప్రభావితం చేస్తోంది. నవీపేట మండలంలోని మాటు కాలువ 12 కిలో మీటర్ల పొడవున ఐదు గ్రామాల శివారులో జన్నెపల్లి, సిరన్పల్లి, లింగాపూర్, నిజాంపూర్, తుంగిని ఆయకట్టు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఈ కాలువ గండిపడి రైతులు ఏళ్లకాలంగా నష్టపోతున్నారు. ఈ సమస్య ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. బోధన్లో మూతపడి ఉన్న నిజాం షుగర్స్ ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారబోతుంది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల ముందు ప్రకటించింది.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తాజా హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్ హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపేందుకు అవకాశాలున్నాయి. అతి పెద్ద మండలం, ప్రభావితం చూపే పంచాయతీ.. అతి పెద్ద మండలం: నవీపేట ప్రభావితం చేసే పంచాయతీలు: నవీపేట, ఎడపల్లి, సాలూర నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య.. మొత్తం ఓటర్ల సంఖ్య: 2,04218 మహిళలు: 1,06226 పురుషులు: 97,989 ఇతరులు: 03 కొత్త ఓటర్లు: 12,300 వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజక వర్గంలో రైతులు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు? బీసీ ఓటర్లు: 1 లక్ష వరకు ఎస్సీ,ఎస్టీలు: 30 వేలు క్రిస్టియన్లు: 8500 ముస్లీం మైనార్టీలు: 50 వేలు ఇతరులు, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణులు: 18500 (మున్నూర్కాపు, పద్మశాలి, లింగాయత్లు, గూండ్ల, గొల్లకుర్మలు, ముదిరాజ్ సంఖ్య అధికంగా ఉంటుంది.) నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజక వర్గం అంచున మంజీర, గోదావరినదులు ఉంటాయి. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే గోదావరి నది రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద తెలుగు నేలపై అడుగు పెడుతోంది. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెగ్డెవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి (రెంజల్ మండలం) నవీపేట మండలానికి నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సమీపంలో ఉంటుంది. బోధన్లో ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మూతపడింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపే – ఠానాకలాన్ గ్రామాల మధ్య అలీసాగర్ రిజర్వాయర్, ఉద్యావనం పర్యాటక కేంద్రంగా ఉంది. నవీపేట మండలంలోని కోస్లీవద్ద గోదావరి నదిపై అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్మించారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది.. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో ఉంటుంది. బోధన్లో ప్రముఖ ఏకచక్రేశ్వరాలయం ఉంది. నియోజక వర్గానికి మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. ఆసక్తికర అంశాలు.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలంగాణలోనే ఏకైక ముస్లిం ఎమ్మెల్యే.. వరుసగా రెండుసార్లు గెలిచారు.. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మిమ్ పార్టీ సహకారం ముస్లింల సహకారం ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది.. కానీ మిమ్ నేతలకు ఎమ్మెల్యే షకీల్కు మధ్య సంబంధాలు చెడి పోయాయి.. ఆ పార్టీ నేతలు ఎనిమిది మందిపై ఎమ్మెల్యే హత్యాయత్నం కేసు పెట్టారు.. దాంతో నేతలు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.. వారిని మిమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జైలుకు వెళ్లి పరామర్శించి బోధన్ లో యుద్ధం ప్రకటించారు.. ఇటీవల జరిగిన ఈ పరిణామంతో మిమ్ బోధన్ లో బీఆర్ఎస్కు సహకరించే పరిస్తితి లేదు. షకీల్ను మారిస్తే మనసు మారొచ్చు. ఇతర రాజకీయ అంశాలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ భర్త శరత్రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ మధ్య అంతర్గత విబేదాలు రచ్చకెక్కాయి. శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ , ఎంఐఎం పార్టీ ముఖ్య నాయకులతో టచ్లో ఉన్నారు. బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నారు. ఎమ్మెల్సీకవిత, జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే షకీల్కు మళ్లీ టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని ,ఓడిస్తామని తూము శరత్రెడ్డి తేల్చి చెప్పారు. మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యేను అడ్డగించిన ఎంఐఎం ఇద్దరు నాయకులను హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. -
కేసీఆర్ నాయకత్వానికి మేం మద్దతిస్తాం: ఓవైసీ
-
ఎంఐఎంలో వారసులకు చాన్స్?.. రేసులో అక్బరుద్దీన్ కుమారుడు!
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెల్యేల వారసులతో పాటు యువతరానికి పెద్దపీట వేయాలని మజ్లిస్ పార్టీ యోచిస్తోంది. సిట్టింగ్ స్థానాలతో అదనపు స్థానాలను సైతం తమ ఖాతాల్లో పడే విధంగా వ్యూహ రచన చేస్తోంది. నగరంలో పార్టీకి కంచుకోట లాంటి ఏడు సిట్టింగ్ స్థానాలుండగా కొత్తగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలు వయోభారం దృష్ట్యా అభ్యర్థిత్వాలు మార్పు అనివార్యం కాగా, మరో స్థానంలో సైతం రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థి మార్పు జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఖాళీ అయ్యే స్థానాల్లో సిట్టింగ్ల వారసులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతుంది. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్లకు అవకాశం లభించగా, అందులో అప్పటి యాకుత్పురా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం చార్మినార్ స్థానానికి, చార్మినార్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం యాకుత్పురా స్థానాలకు మార్చి అవకాశం కల్పించారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ముగ్గురు నుంచి నలుగురు సిట్టింగుల అభ్యర్థిత్వాలే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారసుల అరంగేట్రం? కొత్తగా పార్టీ సీనియర్ నేతల వారసుల పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీ ద్వితీయ అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్ల కుమారులు కూడా ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్, యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రిలు వయోభారం దృష్ట్యా పోటీపై పెద్దగా అసక్తి కనబర్చడం లేదు. అధిష్టానం మాత్రం మరో పర్యాయం వారి సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ముంతాజ్ఖాన్ మాత్రం తన కుమారుడికి అవకాశం కల్పించాలని అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నాలుగు స్థానాల్లో.. మజ్లిస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన ఏడింటిలో నాలుగింటిలో మార్పులు చేయాలని భావిస్తోంది. చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈసారి కూడా పోటీ చేస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు. సిట్టింగ్లున్న మలక్పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మోయినుద్దీన్లు పోటీలో ఉండటం ఖాయమే. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం మార్పు జరిగితే ఆ స్థానంలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక బహదూర్పురా ఎమ్మెల్యే మోజంఖాన్ వయోభారం దృష్ట్యా ఆయనను తప్పిస్తే ఆ స్థానం నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ పేరు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మోజంఖాన్ బరిలో ఉంటే నూరుద్దీన్ ఒవైసీని చార్మినార్ లేదా యాకుత్పురా నుంచి పోటీలోకి దింపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది. ఆ రెండింటిపై కూడా పాత నగరంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పురా, బహదూర్పురాతోపాటు కార్వాన్, నాంపల్లి, మలక్పేట నియోజకవర్గాల్లో వరుస విజయాలతో కై వసం చేసుకుంటూ వస్తున్న మజ్లిస్ ఈసారి రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్పై కన్నేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధిలో పార్టీ అధినేత అసదుద్దీన్ నివాసం ఉండటంతో ఆ స్థానం కూడా పార్టీ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ రచన సాగుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో గట్టి పట్టు ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తోంది. -
చైనా ముందు మోకరిల్లిన మోదీ సర్కారు: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: చైనా ముందు మోదీ సర్కార్ మోకరిల్లుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లద్దాఖ్ సరిహద్దులో ఏం జరుగుతుందో దేశప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ భారత వీర సైనికులు 40 నెలలుగా సరిహద్దులో చైనీయులకు భయపడకుండా నిలబడ్డారన్నారు. మరి మోదీ ఎందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ఎదురొడ్డి నిలబడలేకపోతున్నారని ప్రశ్నించారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం అవార్డుకు ఎంపిక చేయడం పట్ల అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆర్ మళ్లీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. తమ ప్రయాణం బీఆర్ఎస్తోనేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై అక్బరుద్దీన్ ఒవైసీ లఘుచర్చను ప్రారంభించారు. జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇందుకు రాష్ట్ర సర్కారుకు, కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని వారి ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి పథకాలు చేపట్టారని వెల్లడించారు. రెండో హజ్ హౌస్కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని చెప్పారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. -
మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం
ఢిల్లీ: బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో ఏకమైన 26 పార్టీల విపక్ష కూటమి.. ఇండియా(I.N.D.I.A) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంఘటితంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే రెండు రోజల బెంగళూరు విపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడాన్ని ఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. రాజకీయంగా మేం అంటరానివాళ్లమని భావించారు గనుకే మమ్మల్ని విపక్ష భేటీకి పిలవలేదేమో అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మజ్లిస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పథాన్. ‘‘లౌకిక పార్టీలని చెప్పుకునే వాళ్లు.. ఎందుకనో మమ్మల్ని ఆహ్వానించలేదు. బహుశా రాజకీయ అంటరానితనమే అందుకు కారణం కాబోలు. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నితీశ్ కుమార్, ఉద్దవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీలను సైతం వాళ్లు పిలిచారు. అంతెందుకు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తిట్టిపోసిన అరవింద్ కేజ్రీవాల్ సైతం వాళ్లతో బెంగళూరులో కూర్చున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మేం కృష్టి చేస్తున్నాం. కానీ, మా పార్టీని, పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని వాళ్లు పట్టించుకోలేదు అని వారిస్ వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయన్స్ పేరుతో విపక్ష కూటమి.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాయి. ఇదీ చదవండి: ఇండియాపై యుద్ధానికి దిగితే గెలుపెవరిదంటే.. -
విపక్షాల కూటమికి ఒవైసీ పంచ్.. ‘చౌదరీ’ల క్లబ్లా తయారైందంటూ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, యూసీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యూసీసీని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక, తాజాగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, యూసీసీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు.. భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో విపక్ష పార్టీల కూటమికి సెటైరికల్ పంచ్ ఇచ్చారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #WATCH | Our party will oppose UCC...If you (opposition parties) want to defeat BJP then you have to show the difference that you will not follow the agenda set by BJP. They (opposition parties) are a club of big 'Chaudharis'. You have not invited our Telangana CM to the meeting.… pic.twitter.com/ABGOvfPbVV — ANI (@ANI) July 15, 2023 ఇదిలా ఉండగా, అంతకుముందకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం వ్యాపారుల వల్లనే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని శర్మ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారైంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి ముస్లింలు(అసోంలో మియాలు) కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. ఇదే క్రమంలో మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. क्या Assam के CM Himanta Sarma UCC Bill को अदिवासियों पर लागू करेंगे, वह सिर्फ एक आंख से देख रहे हैं बस और उस आंख में मुसलमानों को लेकर Hatred (नफ़रत) भरी हुई है : Barrister Asaduddin Owaisi#ucc #ManipurBurning #UCCDividesIndia #IndiaAgainstUCC #aimim #owaisi pic.twitter.com/3OJHPYO2Sg — Mohammad shahnshah (@shahnshah_aimim) July 15, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్లో మరో ట్విస్ట్? -
మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT — Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023 ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -
భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. దీంతో, ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా, బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనుక నుండి కాదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద ముమ్మాటికీ హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయి. దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నాయి. బోధన్ బీఆర్ఎస్ రాజకీయ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అరెస్ట్ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ -
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త టెన్షన్.. రేవంత్ ప్లాన్?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ చేసిన ప్రకటనపై ఇప్పుడు కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాంగ్రెస్కు సంప్రదాయకంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కాంగ్రెస్పై పడే ప్రభావం ఎలా ఉంటుంది, దీనిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలపై ఆలోచన చేస్తోంది. ఈ మేరకు వ్యూహాలను సిద్ధం చేయాలని రాష్ట్ర నేతలకు రాహుల్గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్టు సమాచారం. ముస్లిం ఓటర్లు 15% నుంచి 40% వరకున్న 49 నియోజకవర్గాల పరిధిలో కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఎంఐఎంను అడ్డుకోవాల్సిందే.. రాష్ట్రంలో సుమారు 44 లక్షల ముస్లిం జనాభా ఉంది. ఇందులో 20 వేలకన్నా ఎక్కువ ముస్లిం ఓటర్లున్న నియోజకవర్గాలు 49 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యేలున్న స్థానాలతోపాటు కొత్తగా జహీరాబాద్, సంగారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, కరీంనగర్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, వరంగల్ ఈస్ట్, మహబూబ్నగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో మజ్లిస్ పోటీచేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేసినట్టు తెలిసింది. ఇందులో మెజార్టీ స్థానాలు ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నవేనని.. కేవలం ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే ఎంఐఎం ఆ స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఎంఐఎం ప్రాబల్యాన్ని అడ్డుకోకుంటే.. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. కర్ణాటకలో కలసిరావడంతోనే.. కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లడం విజయానికి బాటలు వేసిందని.. బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన 4% రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామన్న ప్రకటన కాంగ్రెస్కు కలసి వచి్చందని నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ హామీఇచ్చి అమలు చేయలేకపోయిన ముస్లింలకు 12% రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. ముస్లింలలో ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఆ మార్పుల ప్రచారం కేసీఆర్ కుట్ర -
తెలంగాణ పాలిటిక్స్లో ట్విస్ట్.. బిగ్ బాంబ్ పేల్చిన ఒవైసీ!
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం నేతలతో ములాఖత్ అయ్యారు. అయితే, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైలు ములాఖత్ అనంతరం ఒవైసీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్కు ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్ గెలుపు కోసం పనిచేశారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కవగానే ఉన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాము. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు. ఆ మసీదులు వెంటనే కట్టాలి అని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఎంఐఎం బలపడటం కోసం ముందుగా పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీలో కోల్డ్వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు? -
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్ఫ్రంట్లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
అమిత్ షా విమర్శలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్
-
శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్కు నమస్కారం పెట్టండి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్ఖాన్ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు. భారతదేశానికి చాయ్వాలా, చౌకీదార్ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ మద్దతు ప్రకటన.. పోటీకి బీజేపీ సై?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై బీజేపీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్నికకు దూరంగా ఉండాలని భావించింది కమలం పార్టీ. అయితే.. తాజాగా ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది బీఆర్ఎస్. దీంతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127 కాగా ఇందులో 9 ఖాళీగా ఉన్నాయి. ఎల్లుండితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా, ఎంఐఎం 52, బీఆర్ఎస్ 41, బిజెపికి 25 ఓట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఓట్లలో 60 ఓట్లు వస్తే గెలిచినట్లు లెక్క. అంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి ఉందన్నమాట. ఇక బీఆర్ఎస్-ఎంఐఎంల మద్దతు నేపథ్యంలో.. బీజేపీ గనుక బరిలోకి దిగితే ఓటింగ్ తప్పనిసరి కానుంది. ఇప్పటికే స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై బీజేపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
MLC Elections: ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్
సాక్షి,హైదరాబాద్: నగర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్ను ఎంపిక చేసింది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బేగ్ పేరును ఖరారు చేశారు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీకి.. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంతకాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓ ట్వీట్ చేశారు ఒవైసీ. ఇదిలా ఉంటే.. 2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రహమత్ బేగ్. Happy to announce that Mirza Rahmath Baig @_MirzaRahmath will be @aimim_national’s MLC candidate. I’d also like to thank outgoing MLC Syed Amin Ul Hasan Jafri sb for his valuable services to AIMIM. Inshallah, we’ll continue to benefit from his experience & wisdom in future too — Asaduddin Owaisi (@asadowaisi) February 21, 2023 -
హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జాఫ్రీ
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీటుకు జరుగుతున్న ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగేందుకు ఎంఐఎం సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ మరోమారు పోటీ చేస్తున్నారు. ఈ నెల 23న జాఫ్రీ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం తరఫున బరిలోకి దిగుతున్నారు. పాత్రికేయుడిగా పనిచేసిన జాఫ్రీ తొలిసారిగా 2010లో స్థానిక సంస్థల కోటాలో హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండుసార్లు..2011, 2017లో మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది మే 1న ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఆయన వరుసగా నాలుగోసారి ఇదే కోటాలో పోటీ చేసేందుకు ఎంఐఎం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ స్థానిక ఓటర్లు 117 హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 మంది ఓటర్లు (పాత ఎంసీహెచ్ పరిధి) ఉండగా, ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో 8 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఈ ఏడాది జనవరిలో మరణించడంతో ఓటర్ల సంఖ్య 118గా ఎన్నికల సంఘం నిర్ధారించింది. అయితే ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న రెండురోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఓటర్ల సంఖ్య 117కు చేరింది. ఇందులో 83 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాగా దివంగత ఎమ్మెల్యే సాయన్నను మినహాయిస్తే మరో 34 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరిలో లోక్సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), జి.కిషన్రెడ్డి (సికింద్రాబాద్)తో పాటు ఐదుగురు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, దామోదర్రావు, సురేశ్ రెడ్డి, సంతోష్కుమార్, బండి పార్థసారధి రెడ్డి, మరో 12 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు (నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని) శాసనమండలి హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటు హక్కును కలిగి ఉన్నారు. 117 మంది ఓటర్లలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు 94 మంది ఓటర్ల బలం ఉంది. బీజేపీ సంఖ్యా బలం 23 బీజేపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు కిషన్రెడ్డి (ఎంపీ), రాజాసింగ్ (ఎమ్మెల్యే) ఓట్లు కలుపుకుని హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో 23 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉంది. అయితే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడం, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డి.వెంకటేశ్, అడిక్మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్గౌడ్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో ఆయా పార్టీల వాస్తవ బలాబలాల్లో కొంత మార్పు ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు భారీగా ఓటర్లు ఉండటంతో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ దూరంగా ఉంటే జాఫ్రీ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశముంది. -
అక్బర్ పోటీ చేస్తామన్న 50 స్థానాల్లో కరీంనగర్.. అసెంబ్లీ జంగ్లో పతంగ్!
సాక్షి, కరీంనగర్: ‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అంటూ హైదరాబాద్ పాతబస్తీలో మొదలైన ముస్లిం ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రస్థానం క్రమంగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. గతవారం అసెంబ్లీలో మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రవ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మజ్లిస్ పాతబస్తీ పార్టీగానే అందరికీ తెలుసు. పాత హైదరాబాద్లోని గుల్బర్గా (కర్ణాటక), మరాఠ్వాడా (మహారాష్ట్ర) తెలంగాణ లోకల్ బాడీస్కే పరిమితమైంది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత ఉత్తర్ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో పోటీ చేసింది. అయితే, సొంతరాష్ట్రంలో మాత్రం పార్టీని విస్తరించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ దాటికి బయటికి రావాలని మజ్లిస్ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరీంనగర్లో 60 వేల ఓట్లు..! ప్రస్తుతం కరీంనగర్ ఓటర్ల సంఖ్య 3.30 లక్షల పైమాటే. అందులో 59,270 వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మజ్లిస్ ప్రకటన ఆకస్మికంగా చేసింది కాదు. దీని వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు తమకు బ లం ఉన్న 50 స్థానాల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచి్చంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉన్నాయని సమాచారం. ఇందుకోసం కరీంనగరంలోని ఓటర్ల సమాచారం మొత్తం సేకరించారు. దారుస్సలాం ఆదేశాల మేరకు.. ప్రత్యేక యాప్లో మొత్తం ఓటర్ల సమాచారం నిక్షిప్తం చేశారు. మొత్తం దాదాపు 390 పోలింగ్ బూత్ల వారీగా.. హిందూ, ముస్లింలు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పురుషులుగా విభజించారు. కరీంనగర్లో 30 వేలకుపైగా ఉన్న ఎస్సీలు తమతో కలిసి వస్తారన్న ధీమాతో మజ్లిస్ ఉంది. కొత్త ఓట్ల నమోదుకే డివిజన్ల పర్యటన.. కరీంనగర్లో 60 వేలకుపైగా ఓటర్ల బలం ఉన్న నేపథ్యంలో పోటీ చేసే పరిస్థితి వచ్చినా.. మద్దతిచ్చే నిర్ణయం తీసుకున్నా.. దేనికైనా సిద్ధంగా ఉండాలని దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. అందుకే.. ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వారం రోజులుగా డివిజన్ల పర్యటనకు ఎంఐఎం శ్రీకారం చుట్టింది. తమ ఓటర్లు ఉన్న 35 డివిజన్లలో కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నది దీని వెనక అసలు ఉద్దేశం. ఇప్పుడున్న ఓటర్లకు కనీసం నాలుగైదు వేలు యువ ఓటర్లు ఉంటారని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం వెంట ఎస్సీలు నడుస్తారా? మొత్తం కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ను మజ్లిస్ కులం, మతం అనే అంశాల ఆధారంగా డేటా వర్గీకరించింది. 81.5% హిందూ జనాభా, 18.5% ముస్లిం జనాభా అని రెండు రకాలుగా విభజించింది. అందులో హిందువుల్లో 81.5% మందిలో మరో 14.5% వరకు అంటే దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు ఎస్సీలు కూడా ఉన్నారని.. మొత్తం తమకు 80 వేలమంది మద్దతు దొరుకుతుందని ఎంఐఎం ధీమాగా ఉంది. అదే సమయంలో నగరంలో ఉన్న ముస్లింలలో ఎందరు ఎంఐఎం వెంట నిలుస్తారు? రూ.10 లక్షల ఆర్థిక సాయంతో దళితబంధులాంటి భారీ సంక్షేమ పథకాలు అమలువుతున్న నేపథ్యంలో ఎస్సీలు మజ్లిస్కు మద్దతిస్తారా? అన్న సవాళ్లు మజ్లిస్ను వేధిసూ్తనే ఉన్నాయి. అందుకే.. అసలు మజ్లిస్ కరీంనగర్లో పోటీ చేస్తుందా? లేక మిత్రపక్షం బీఆర్ఎస్తోనే కలిసి నడుస్తుందా? అన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది. -
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో సభకు వస్తామని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభలో తాము ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నామనే ప్రస్తావన, ఇతరులు ఎత్తిచూపడం కొంత బాధ కలిగిస్తోందన్నారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి సభలో గంట సమయం ఎందుకు కేటాయించాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అందువల్ల ఈ విషయమై ఎంఐఎం అధ్యక్షుడితో చర్చిస్తామని, కనీసం 50 సీట్లలో పోటీచేసి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము రాజకీయంగా బీఆర్ఎస్తోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగంలో తనను ఉద్దేశించి ప్రతిపక్ష నేత అని సంబోధించడంపై సభాపతి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేత అనేది లేదని ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వివరణ ఇచ్చారు. 12% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలి.. గతంలో హామీ ఇచ్చిన విధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పన దిశగా చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త రిక్రూట్మెంట్లో 4 శాతం రిజర్వేషన్లు పాటించడం లేదని, రోస్టర్ ప్రకారం 3 శాతమే వర్తింపజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు డీఏ 6.8 శాతం చెల్లింపుతోపాటు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అక్బరుద్దీన్ సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత అని ప్రస్తావించానే తప్ప తనకు అంత కచ్చితంగా తెలియదన్నారు. పాతబస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సోమవారం (6న) అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏను ఇటీవల ప్రకటించిందని, పీఆర్సీ ఏర్పాటు విషయం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్ -
పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లలిత్బాగ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో హత్య జరిగింది. లలిత్బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు ముర్తుజా అనస్పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్ను ఉస్మానియా అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని ఓ ప్రైవేటు కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఇప్పటికే కొడుకు, కూతురు, భార్య మృతి -
Gujarat: కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బ
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ప్రభంజనం ధాటికి.. ప్రభావం చూపెడుతుందనుకున్న ఆప్.. సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారీ దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీకే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏకంగా 60 దాకా సిట్టింగ్ స్థానాలకు కోల్పోయింది ఆ పార్టీ. కాంగ్రెస్ ఓట్లను ఆప్, ఎంఐఎం పార్టీలు భారీగా చీల్చాయి. మరోవైపు ఆదివాసి ఓట్లు కూడా కోల్పోవడం కాంగ్రెస్కు మరో మైనస్గా మారాయి. 2017 ఎన్నికల్లో యూపీఏ కూటమికి 80 సీట్లు దక్కాయి. ఇందులో కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదహారు సీట్లు అధికంగా గెల్చుకోవడం గమనార్హం. తాజా ట్రెండ్స్ చూస్తుంటే పాతిక సీట్లు లోపే కాంగ్రెస్ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. -
గుజరాత్ అల్లర్లపై అమిత్ షా కామెంట్స్.. ఒవైసీ షాకింగ్ కౌంటర్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా.. 2002 గుజరాత్లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై కౌంటర్ అటాక్ చేశారు. కాగా, ఒవైసీ మాట్లాడుతూ.. అమిత్ షా మీరు చెప్పిన ఎన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ, బిల్కిస్ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధికార బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు. ఏదో ఒకరోజు అధికారం మారుతుంది. అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్ షా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం పార్టీ దిగుతోంది. తమ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా స్పష్టం చేశారు. .@AmitShah aapne kaunsa sabaq sikhaya? - Barrister @asadowaisi pic.twitter.com/aAuEIhukTm — AIMIM (@aimim_national) November 26, 2022 -
Gujarat Assembly Election 2022: కాంగ్రెస్కు ‘మైనారిటీ’ బెంగ!
అహ్మదాబాద్: గుజరాత్లో కీలకమైన మైనారిటీల ఓట్లను ఒడిసిపట్టేందుకు బీజేపీ మినహా పార్టీలన్నీ ఈసారి సర్వ శక్తియుక్తులూ కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి వాళ్ల ఓట్లను గంపగుత్తగా పొందుతూ వచ్చిన కాంగ్రెస్కు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ రూపంలో సెగ తగులుతోంది. కొత్తగా రాష్ట్ర బరిలో దిగిన ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు ఈ రెండు పార్టీల రాకతో ఓటర్లకు కూడా చాయిస్ పెరిగిపోయడం ఆసక్తికరంగా మారింది...! 6.5 కోట్ల గుజరాత్ జనాభాలో ముస్లింలు దాదాపు 11 శాతం దాకా ఉంటారు. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యముంది. జమ్లాపూర్–ఖడియా అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లు ఏకంగా 65 శాతమున్నారు. మిగతా చోట్ల అంతగా కాకున్నా వీరి ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి! రాష్ట్ర ముస్లింలు పాలక బీజేపీకి ఎప్పుడూ పెద్దగా ఓటేసింది లేదు. అందుకు తగ్గట్టే గత రెండు దశాబ్దాల పై చిలుకు కాలంలో ముస్లింలకు బీజేపీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు! 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలకు టికెట్లివ్వగా కేవలం ముగ్గురే నెగ్గారు. 2012లో ఏడుగురికి టికెట్లిస్తే ఇద్దరే గెలిచారు! ఈసారి తన ముస్లిం ఓటు బ్యాంకుకు ఆప్, మజ్లిస్ గండి కొట్టేలా కన్పిస్తుండటంతో దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పలు చర్యలు చేపట్టింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎమ్మెల్యే మొహమ్మద్ పిర్జాదాను నియమించింది. దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కుండాలంటూ అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మైనారిటీల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం మైనారిటీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడేనంటూ ఇతర పార్టీలు ఎంతగా విమర్శించినా లెక్క చేయడం లేదు. కేజ్రీవాల్, అసద్ పర్యటనలు మరోవైపు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈసారి 30 స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ ఇప్పటికే పేర్కొంది. ఆరు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్, మజ్లిస్లకు భిన్నంగా ఆప్ మాత్రం మైనారిటీల్లోకి చొచ్చుకుపోయేందుకు నిశ్శబ్దంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ముస్లింలకు టికెట్లిచ్చింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేజ్రీవాల్తో పాటు ఆప్ పాలనలోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తరచూ పర్యటిస్తూ వారి నమ్మకాన్ని చూరగొనేందుకు శ్రమిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర మైనారిటీలకు మంచి శకునాలేనంటున్నారు మైనారిటీ కో ఆర్డినేషన్ కమిటీ అనే ముస్లిం స్వచ్చంద సంస్థ కన్వీనర్ ముజాహిద్ నఫీస్. ‘‘గత ఎన్నికల దాకా గుజరాత్ ముస్లింలకు కాంగ్రెస్ మినహా పెద్దగా చాయిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడలా లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మజ్లిస్, ఆప్లను ముస్లిం ఓటర్లు పెద్దగా పట్టించుకోరని, ఎప్పట్లాగే కాంగ్రెస్కే దన్నుగా నిలుస్తారని ఆ పార్టీకి చెందిన దరియాపూర్ ఎమ్మెల్యే గయాజుద్దీన్ షేక్ ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని మించిన హిందూత్వవాదినని పదేపదే రుజువు చేసుకుంటున్నారు. కనుక ముస్లింలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. మజ్లిస్కు రాష్ట్రంలో పెద్దగా ఆదరణే లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆప్ నేతలు మాత్రం ఢిల్లీ, పంజాబ్ ప్రదర్శనను గుజరాత్లో పునరావృతం చేస్తామని, మైనారిటీలు కూడా తమనే నమ్ముతున్నారని చెబుతున్నారు. -
అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి?
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్ ఇండియా మజ్లిజ్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రైను సూరత్కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. గుజరాత్లోని సూరత్లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్ ఓవైసీ సాబ్, సబిర్ కబ్లివాలా సర్, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్ నుంచి సూరత్కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్ పఠాన్. ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం ఇదీ చదవండి: సౌత్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్.. ట్రయల్ రన్ సక్సెస్ -
మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్కు భారత్ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీగిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది. ఈ విషయంపై స్పందిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా.. ఏది కరెక్ట్, ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా అని నిలదీశారు. ఐరాస ఓటింగ్లో భారత్ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Will the PM Modi saheb explain the reason for India’s decision to help China out in the UNHRC on the Uighur issue by choosing to abstain from an important vote? Is he so scared of offending Xi Jingping, whom he met 18 times, that India can’t speak for what is right? https://t.co/TJNy3Ffn2w — Asaduddin Owaisi (@asadowaisi) October 7, 2022 కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామ మహమద్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. మన భూమిని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలకు ఖండించడానికి గానీ మోదీ సిద్ధంగా లేరు, చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. India abstains on draft resolution at UNHRC for a debate on human rights violations of Uyghurs in China Far from holding China accountable for stealing our land, PM Modi can't even bring himself to condemn China on human right violations. Why is @narendramodi so scared of China! — Dr. Shama Mohamed (@drshamamohd) October 6, 2022 ఐరాస మానవహక్కుల కమిషన్ తీర్మానంపై జరిగిన ఓటింగ్ ఫలితం చైనాకు అనుకూలంగా వచ్చింది. 19 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
17 జాతీయ సమైక్యతా దినం
-
సెప్టెంబర్ 17.. మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ గేమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలను సెప్టెంబర్ 17.. ఒక్క సారిగా మార్చేసింది. వాడీవేడిని రగిల్చింది. ఎత్తుకు పైఎత్తులు వేసేలా శనివారం రాజకీయాలు కొనసాగాయి. మూడు పార్టీల మధ్య గేమ్గా మారింది. తెలంగాణ విలీన దినాన్ని ఎనిమిదేళ్లుగా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉత్సవాల నిర్వహణకు పోటాపోటీగా రంగంలోకి దిగాయి. పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తుందని, అందులో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలకు లేఖలు రాశారు. హైదరాబాద్ సంస్థానం నుంచి విముక్తి పొందిన మూడు రాష్ట్రాలను కలిపి విమోచన దినోత్సవం హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా హాజరై కేంద్రబలగాల గౌరవ వందనం స్వీకరిస్తారని అందులో వెల్లడించారు. గౌరవ అతిథులుగా హాజరుకావాలని ముగ్గురు ముఖ్యమంత్రులను కోరారు. మరోౖ వెపు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’గా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, మజ్లిస్ పార్టీ సైతం ఉత్సవాలను ఆహ్వానిస్తూనే.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్షాకు, సీఎం కేసీఆర్కు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు. పాతబస్తీలో తిరంగా యాత్రతోపాటు బహిరంగ సభ నిర్వహిస్తామని, కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అసదుద్దీన్.. తమ సూచనను పరిగణనలోకి తీసుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహణకు ముందుకొచ్చినందుకు కేసీఆర్కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేయడం కొసమెరుపు. కాగా ఈ ఉత్సవాల గురించి ఎనిమిదేళ్లుగా ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పుడు నిర్వహిస్తామని చెప్పడం అవకాశవాద రాజకీయమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించడం గమనార్హం. -
మజ్లీస్కోటలో పాగా వేసేది ఎవరు? అక్బరుద్దీన్తో పోటీ అంత కఠినమా?
హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాలు మారుతాయా? మజ్లీస్కోటను ఎవరైనా ఢీకొట్టగలరా? మజ్లీస్కు దూరమైన కాంగ్రెస్ వ్యూహమేంటి? మిత్రపక్షానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్అభ్యర్థులు బరిలో దిగుతారా? కమలదళం చార్మినార్ పై జెండా ఎగురవేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఒరిజినల్ హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు పాతబస్తీ అని పిలుస్తున్నారు. నలు దిక్కులా విస్తరించిన మహా నగరానికి గుండెకాయలాంటి పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లీస్పార్టీ పాగా వేసింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏడు లేదా 8 స్థానాలు మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడా అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం రెడీగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలున్న ఏడు స్థానాలు మావే అంటున్నారు ఎంఐఎం నేతలు. చార్మినార్, యాకుత్పుర , చంద్రాయణ గుట్ట, నాంపల్లి, కార్వాన్, బహదూర్ పుర, మలక్ పేట్ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలు. ఈ సెగ్మెంట్లలో మరో పార్టీ గెలవాలంటే బాగా శ్రమించాల్సిందే. ఈ సారి ఎలాగైనా తమ బలాన్ని చూపాలని బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . నాంపల్లిలో టీఆర్ఎస్ నుంచి ఎవరంటే! నాంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ది ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎం అభ్యర్ది జాఫర్ హుస్సేన్ 9 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఈ సారి నాంపల్లి నుంచి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపి నుంచి దేవర కరుణాకర్ మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తుంది. టిఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ పోటీలో ఉండొచ్చని సమాచారం. చార్మినార్లో టీఆర్ఎస్ నుంచి లోధి చార్మినార్నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఉమా మహేంద్రపై ఎంఐఎం అభ్యర్ధి ముంతాజ్ అహ్మద్ ఖాన్ 32 వేల మెజారిటితో గెలుపోందారు. ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, టిఆర్ఎస్నుంచి మహ్మద్ సలాహుద్దీన్ లోధి, కాంగ్రేస్ నుంచి టీ పిసీసీ సెక్రటరి షేక్ ముజబ్, బీజేపి నుంచి ఉమా మహేంద్రలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చాంద్రాయణ గుట్టలో అది అసాధ్యమా? చాంద్రాయణ గుట్ట సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది సయ్యద్ షాహెజాదిపై ఎంఐఎం అభ్యర్ది అక్బరుద్దిన్ ఓవైసీ 80 వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎంఐఎం నుంచి అక్బరుద్దిన్ ఓవైసీ, బీజేపి నుంచి షాహెజాది, టిఆర్ఏస్ నుంచి సీతారామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బినోబైద్ మిస్త్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎంబీటీకి పట్టున్న చాంద్రాయణగుట్టలో కూడా ఎంఐఎం పాతుకుపోయింది. ఇక్కడ అక్బరుద్దీన్ను ఓడించడం అసాధ్యమనే వాదన కూడా ఉంది. హజరి, యూసఫ్లలో ఒకరు పోటీలో పక్కా! కార్వాన్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది అమర్ సింగ్ పై ఎంఐఎం అభ్యర్ది కౌసర్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి కౌసర్, బీజేపి నుంచి అమర్ సింగ్, టీఆర్ఎస్ నుంచి మహ్మద్ అల్ హజరి, అప్సర్ యూసఫ్ జాహిలలో ఓకరు పోటీ చేసే అవకాశం ఉది. (చదవండి: సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్) సంతోష్ కుమార్కు మరో అవకాశం? మలక్ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బలాల 30 వేల మెజారిటితో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బలాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి సంగిరెడ్డి , చెక్కిలోకర్ శ్రీనివాస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఏస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చావా సంతోష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. యాకుత్ పురలో ఖాద్రితో పోటీకి దిగేది ఎవరో? యాకుత్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్అభ్యర్ది సామ సుందర్ రావు పై 47 వేల ఓట్ల మెజారిటితో ఎంఐఎం అభ్యర్ది పాషా ఖాద్రి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ, టిఆర్ఎస్ నుంచి సుందర్ రావు , బీజేపి నుంచి రూప్ రాజ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రాజు, కోట్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు . బహదూర్ పుర భారీ మెజారిటీతో ఎంఐఎం బహదూర్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది అలీ బక్రీ పై ఎంఐఎం అభ్యర్ది మోజం ఖాన్ 80 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి మోజం ఖాన్, టిఆర్ఏస్ నుంచి అలీ బక్రీ , కాంగ్రెస్నుంచి కలీం బాబ, బీజేపి నుంచి అనీఫ్ అలీ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. పాతబస్తీలోని 7 అసెంబ్లీ సీట్లపై బీజేపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు పెద్దగా ఆశలు లేనప్పటికి అక్కడ గట్టి పోటీ ఇవ్వటం ద్వారా... ఇతర సీట్లపై దృష్టి పెట్టకుండా మజ్లిస్ను పాతబస్తికే పరిమితం చేయొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాత బస్తిలో బోణీ కోట్టాలనే పట్టుదలనుకూడా ప్రదర్శిస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ 7 సీట్లతో పాటు రాజేంద్రనగర్ , జూబ్లిహిల్స్ సీట్లలో కూడా గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. దీంతో పాతబస్తీ రాజకీయం రసకందాయంలో పడింది. (చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’) -
హైదరాబాద్పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్పై బీజేపీ కుట్ర చేసిందని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేపట్టిందని మండిపడ్డారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్ను హైదరాబాదీలు భగ్నం చేశారని అన్నారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని, అందులో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని స్పష్టం చేశారు. కొందరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను విడిపిస్తే తప్పేముందని నిలదీశారు. రాజాసింగ్కు ఇప్పటికీ బీజేపీ పెద్దల మద్దతు ఉందన్నారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పీడీయాక్ట్పై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు శుక్రవారం ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ సూచించారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇళ్లలోకి వెళ్లాలని తెలిపారు. ఓవైసీ, మత పెద్దల పిలుపుతో ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి. చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా -
రాజాసింగ్ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్యే: అసదుద్దీన్ ఒవైసీ
-
బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే హైదరాబాద్లో అలజడి: ఎంపీ అసదుద్దీన్
-
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
‘తాజ్మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం
సాక్షి, ముంబై: ఔరంగాబాద్ పేరు మారుస్తూ మహా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తప్పుబట్టారు. అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఔరంగాబాద్కో చరిత్ర ఉందని, దాన్నెవరూ చెరపలేరని అన్నారు. ఎంవీఏ నేతలు... ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరును తమ రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉందన్న ఇంతియాజ్, నిర్ణయానికి వ్యతిరేకంగా అవసరమైతే తాము వీధుల్లోకొస్తామని స్పష్టం చేశారు. పేరు మార్చడానికి ముందు ఔరంగాబాద్ను అభివృద్ధి చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని, కానీ అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఔరంగాబాద్ శివసేన, మహానవనిర్మాణ్ సేన, బీజే పీ నేతలు స్వాగతించారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమో దించాలని ఎమ్మెల్సీ అంబదాస్ అన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తన తండ్రి బాల్ ఠాక్రే హామీ ఉద్ధవ్ నెరవేర్చారని, ఇక ఆమో దం విషయంలో బీజేపీ ఎంత చిత్తశుద్ధి చూపుతుందో తెలుస్తుందని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని ఇంకాస్త ముందు తీసుకు ని ఉంటే బాగుండేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతుల్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఎమ్మెల్యేలను వదులుకున్నారు.. ఎన్సీపీని వదలలేరా? -
Bihar-RJD: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం! అసదుద్దీన్కు షాక్!
పట్నా: మహారాష్ట్ర పరిణామాలతో ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాల్లో మరింత వేడి పెంచే సంఘటన చోటుచేసుకుంది. బిహార్లో ఇప్పటివరకు అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వెనక్కినెట్టింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి షాకిస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఈమేరకు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఏఐఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మొహమ్మద్ అంజార్ నైమీ, ముహమ్మద్ ఐజర్ అస్ఫీ, సయ్యద్ రుక్నూద్దీన్, షానవాజ్ తమ పార్టీలో చేరినట్టు ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ బుధవారం ప్రకటించారు. కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం బిహార్లో 5 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి👉🏻ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ తాజా చేరికలతో ఆర్జేడీ మరింత బలం పుంజుకుంది. 79 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో 77 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఉంది. 243 సీట్లున్న బిహార్లో జేడీ (యూ), బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జేడీయూ 45 సీట్లు సాధించగా.. బీజేపీ 74 సాధించింది. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు కాషాయ పార్టీలో చేరడంతో వారి బలం 77కు పెరిగింది. ఇక కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 90 చోట్ల పోటీ చేస్తే ఫలితాలు శూన్యం! 2020 బిహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలుపొంది దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారిన ఏఐఎంఐఎం పార్టీ... 2021 ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. 90 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ భవిష్యత్ అయోమయంలో పడుతుందనే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా దాదాపు 20 చోట్ల ఆర్జేడీ విజయావకాశాలను అసదుద్దీన్ పార్టీ దెబ్బకొట్టడం గమనార్హం!| చదవండి👉🏻మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే! -
అగ్నిపథ్ స్కీమ్పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ స్కీమ్ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్పవార్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే పవార్ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర తక్కువ అంచనా వేయొద్దు అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చదవండి: (ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?) -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్పై కేసు నమోదు
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్ సెల్లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాగా ఇప్పటికే మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8 — ANI (@ANI) June 9, 2022 -
ఎంఐఎంతో జట్టు కట్టం: శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్.. కాస్త కటువుగానే స్పందించారు. ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్ జలీల్ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్. అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో ఎక్కువచోట్ల పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం తమకున్న స్థానాల కంటే ఎక్కువ చోట్ల పోటీచేసే అవకాశముందని మజ్లిస్ (ఏఐఎంఐఎం) పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల వస్తాయా అన్నదానిపై తనకు సమాచారం లేదని చెప్పారు. శనివారం అసెంబ్లీ వద్దకు వచ్చిన అసదుద్దీన్ అక్కడ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. యూపీ, ఇతర రాష్ట్రాల్లో విజయాల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే ఆలోచనలో ఉందని మీడియా ప్రస్తావించగా.. ఇక్కడ చురుకైన ముఖ్యమంత్రి ఉన్నారని అసద్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారో తమకు తెలియదని, ఫ్రంట్లో తాము ఎలాంటి పాత్ర పోషిస్తామో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఒంటరిగా తెలంగాణ సాధించిన కేసీఆర్ను తక్కువగా అంచనా వేయలేమని, ఆయన మొండి మనిషి అని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏడాది మొత్తం కష్టపడిన వారికే ఫలితం ఉంటుందని నిరూపణ అయిందని అసదుద్దీన్ పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఓడించడమే దశలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరుకుంటామని చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. జాతీయస్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేకపోతోందని.. కాంగ్రెస్ వైఫల్యంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను ప్రాంతీయ పార్టీలు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ పార్టీలు కీలకమన్నారు. బీజేపీ గులాం నబీ ఆజాద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపినా.. ఆ పార్టీని శత్రువుగానే చూస్తామన్నారు. -
‘జెడ్’ భద్రత వద్దన్న ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ‘‘నాకు జెడ్ కేటగిరీ రక్షణ వద్దు. మీ అందరితో సమానంగా ఎ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నేను పుట్టింది ఈ భూమ్మీదే. చచ్చినా ఔరంగాబాద్ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను. బుల్లెట్ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా. నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే’’ అన్నారు. దేశ ప్రధాని భద్రతలో వైఫల్యం తలెత్తినప్పుడు ఇతర విపక్షాల కంటే ముందు తానే దాన్ని తప్పుపట్టానని గుర్తు చేశారు.‘‘నాపై దాడి చేసిన వారికి బుల్లెట్పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్బుక్లో ఎవరైనా ఒక క్రికెట్ జట్టును అభినందిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగిస్తున్నారు. నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరు’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్ కోరారు. గురువారం ఉత్తర యూపీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరగడం తెలిసిందే. ‘‘ఈ నేపథ్యంలోనే ఒవైసీకి ఉన్న ముప్పు స్థాయిని పునఃసమీక్షించి, జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించాం. సీఆర్పీఎఫ్ అధికారులు ఒవైసీ నివాసానికి వెళ్లి ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తారు’’ అని కేంద్ర హోం శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇద్దరి అరెస్టు ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్కు చెందిన సచిన్గా, మరొకరిని సహరన్పూర్కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని పట్టుకున్నాం. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాం. పలు పోలీసు బృందాలు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి’’ అని వివరించారు. కాల్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం లోక్సభలో ప్రకటన చేస్తారని మరో మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అసద్పై కాల్పులను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపందల మతిలేని చర్య. అసద్ భాయ్! మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం’’ అని ట్వీట్ చేశారు. జెడ్ కేటగిరీ అంటే... ► ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీని పక్కన పెడితే జెడ్ ప్లస్ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్ కేటగిరీ ► అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది ► సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు ► 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు ► రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో పైలట్ వాహనం సమకూరుస్తారు ► ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది చదవండి: ఒవైసీపై దాడి.. కేంద్రం కీలక నిర్ణయం చదవండి: (అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్పై కాల్పులు) -
యూపీలో అధికారంలోకి వస్తే.. ఇద్దరు సీఎంలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొత్తులు, సీట్ల కేటాయింపులపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని శనివారం ప్రకటించారు. తమ భాగస్వామ్య కూటమి అధికారంలోకి వస్తే.. ఇద్దరిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తామని తెలిపారు. ఒకరు ఓబీసీ సామాజికవర్గం నుంచి మరోకరిని దళిత సామాజికవర్గం నుంచి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ముస్లిం కమ్యూనిటీతో పాటు ముగ్గురిని డిప్యూటీ సీఎంలను ఎంపిక చేస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. గతంలో ఓం ప్రకాష్ రాజ్భర్కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఒవైసీ ప్రకటించారు. రాజ్భర్ ఆ కూటమిని విడిచిపెట్టి.. సమాజ్వాదీ పార్టీలో కలిశారు. రాజ్భర్ పార్టీ తమ కూటమి నుంచి విడిపోయిందని, అయినప్పటికీ 100 సీట్లలో తమ కొత్త కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్లో ఏ రాజకీయపార్టీ ముస్లింల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ముస్లింకు ఉత్తరప్రదేశ్లో అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి పాటుపడటంలేదని తెలిపారు. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని, మార్పు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని, తమకు ఎవరు మంచి చేస్తారో వారినే ఎన్నుకుంటారని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. -
ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు
సాక్షి, దూద్బౌలి(హైదరాబాద్): తనకు సలాం చేయలేదంటూ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన చెంపపై కొట్టారని ఓ వ్యక్తి హుస్సేనీఆలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం...పంచ్ మొహల్లా ప్రాంతానికి చెందిన గులాం గౌస్ జిలానీ (45) శనివారం రాత్రి తన ఇంటి వద్ద ఉండగా... తన ఇంట్లోకి వెళుతున్న ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తనను చూసి సలాం చేయలేదంటూ తన చెంపపై కొట్టాడని హుస్సేనీఆలం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా.. -
ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు దిక్కులు
సాక్షి, ముంబై(మహరాష్ట్ర): బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు దిక్కుల వంటివని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. శనివారం తిరంగా యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం కోటా గురించి ఎంఐఎం ఎందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కోటా గురించి బాంబే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. అప్పుడు తాము కోటా గురించి పోరాడుతుంటే ఎంఐఎం చడీ చప్పుడు లేకుండా ఉందన్నారు. తమ పార్టీ నాయకులు శాసన సభలో తమ గళాన్ని వినిపించినప్పుడు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. అప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి సహకరించారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడు బీజేపీకి మద్దతుగా ఉండేందుకే పనిచేస్తుందని ఆరోపించిన నసీమ్ ఖాన్.. అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే ముస్లిం రిజర్వేషన్ల అంశం గుర్తుకు వస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వచ్చినందునే వారికి ఈ అంశం గుర్తుకు వచ్చిందన్నారు. ముస్లింలకు కోటా కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం నిజ స్వరూపమేంటో ముస్లింలు అందరికీ తెలుసని పేర్కొన్న నసీమ్ ఖాన్.. ముస్లింల కోసం ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మిస్ యూనివర్స్గా భారత యువతి -
యూపీ బరిలో ఒవైసీ అలజడి
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల అసెంబ్లీ కదనరంగంలోకి తొలిసారిగా దిగుతున్న అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పలు పారీ్టలకు సవాల్ విసురుతోంది. రాష్ట్రంలో ముస్లిం నాయకత్వం లేదని, దాని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమంటూ ఎన్నికల బరిలో దిగిన హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తారన్న చర్చ మొదలైంది. మజ్లిస్ పోటీ ఇన్నాళ్లూ మైనార్టీ ఓటు బ్యాంకుని నమ్ముకున్న పార్టీల్లో ఆందోళన రేపుతోంది. రాష్ట్ర జనాభాలో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ సరైన నాయకులు లేని కొరత వారిని వెంటాడుతూనే ఉంది. యాదవులు, రాజ్బహర్లు, నిషాద్లు, జాటవులు వంటి తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ఎంతో కొంత పేరు పొందిన నేతలు ఉన్నారు. ముస్లింలో ఆ నాయకత్వ లేమి సమస్యనే ఒవైసీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. సమాజ్వాది (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల్లో నలిగిపోతున్న ముస్లింలను సంఘటితం చేసి నాయకుల్ని తయారు చేస్తానన్న ఒవైసీ మాటలు ఆ పారీ్టల గుండెల్లో తూటాలై పేలుతున్నాయి. 403 లోక్సభ స్థానాలున్న యూపీలో 82 స్థానాల్లో ముస్లింలు గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో అయిదు సీట్లు దక్కించుకొని ఆర్జేడీ, కాంగ్రెస్ ఓట్లను ఎంఐఎం భారీగా చీలి్చంది. ఆ విజయం ఇచి్చన ధీమాతో యూపీలో 100 సీట్లలో భాగదారి మోర్చా కూటమితో చేతులు కలిపి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం సమర్థులైన నాయకుల్ని ఎదగనివ్వడమే తమ లక్ష్యమని ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్ వెల్లడించారు. ఇన్నాళ్లూ ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచి్చన పారీ్టలేవీ ఆ వర్గానికి చెందిన నాయకుల్ని ఎదగనివ్వలేదని, సచార్ కమిటీ నివేదిక కూడా అదే చెబుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీలు ఒవైసీ అధికార బీజేపీ చెప్పినట్టుగా ఆడుతున్నారని, ఓట్లు చీల్చడానికి యూపీలో పోటీకి వచ్చారని ఆరోపిస్తున్నాయి. ఎస్పీ విజయావకాశాలను గండి కొట్టడానికే బీజేపీ అడుగులకి మడుగులొత్తుతూ ఒవైసీ నడుచుకుంటున్నారని సీనియర్ ఎస్పీ నేత అబూ అజ్మీ ఆరోపించారు. సత్తా చాటగలరా? అయోధ్యలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఒవైసీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఒవైసీ తాను అనుకున్నది సాధిస్తారా లేదా అన్నదానిపై రాజకీయ పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్లో గెలిచినంత సులభంగా యూపీ రాజకీయాల్లో ఒవైసీ నెగ్గలేరని, కానీ ఓట్లు భారీగా చీల్చి విజయావకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ వంటి పారీ్టలు ముస్లిం ఓట్లతో నెగ్గినా వారి సమస్యలపై ఎప్పుడూ మౌనం వహిస్తున్నాయని, అందుకే ఒవైసీ ప్రభావం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ‘‘ముస్లింలకు నాయకత్వం లేకపోతే వారిపై అరాచకాలు కొనసాగుతాయన్న భావన వారిలో మొదలైంది. ఎన్నికల నాటికి ఇది బలోపేతమై ఒవైసీకి కలిసొస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకుడు పర్వేజ్ అహ్మద్ అన్నారు. యూపీలో ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముస్లింలలో నాయకత్వం అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుందని... అయినప్పటికీ వారు దానిని పెద్దగా పట్టించుకోకుండా ఎస్పీ, బీఎస్పీకి ఓటు వేస్తూ వచ్చారని ఎన్నికల విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అన్నారు. ► జనాభాలో ముస్లింల శాతం: 19.26% ► నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థానాలు: 82 ► రామ్పూర్లో ముస్లిం జనాభా: 50.57% ► మొరాదాబాద్: 47.12% n బిజ్నార్: 43.04% n ► n ముజఫర్నగర్: 41.3% n అమ్రోహ్: 40.78% ► బలరామ్పూర్, అజమ్గఢ్, బరేలి, మీరట్, బహ్రెయిచ్, గోండా, శ్రావస్తిలలో: 30%పైగా -
Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!
సాక్షి, హైదరాబాద్: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్సాగర్) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్టీఎల్ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిపై 2019లో హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్ విడుదల చేశాయి. గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం గండిపేట, హిమాయత్సాగర్ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్డ్యామ్లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు. ఆక్రమణలే శాపం ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్హౌస్లు కూడా శాపంగా పరిణమించాయి. సమగ్ర విచారణ చేపట్టాలి గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్సాగర్ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి. – లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త -
తల్లిదండ్రుల్ని చంపి అనాథ అన్నట్లుగా ఉంది: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్లో ఆదిలాబాద్లో తుపాకీ కాల్పులు జరిపి ఒకరు మృతి, మరో ఇద్దరు గాయపడటానికి కారణమైన ఎంఐఎం నేత ఫరూఖ్ అహ్మద్ బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సవాల్చేస్తూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ వినీత్ శరణ్తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వీకే శుక్లా వాదనలు వినిపిస్తూ అనారోగ్యం దృష్ట్యా ఫరూఖ్కు బెయిలివ్వాలని అభ్యర్థించారు. ‘‘పిటిషనర్పై 302, 307, 324, ఆయుధాల చట్టానికి సంబంధించిన అన్ని సెక్షన్లు ఉన్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తూ క్రూరంగా కాల్పులు జరిపారు. బెయిలు కోరడమంటే తల్లిదండ్రులను చంపి అనాథను అన్నట్లుగా ఉంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఆరోగ్యం సరిగాలేదని జైలులో ఆత్మహత్యకు యత్నించారని వీకే శుక్లా తెలిపారు. ‘ఓ వ్యక్తిని చంపారు. మరొకరు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. అరెస్టు తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. ఇన్ని ఆధారాలున్నా బెయిలు కోరుతున్నారా’ అని వీకే శుక్లాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అనంతరం బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు -
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ముస్లింలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషం హిందుత్వ నుంచి వచ్చిందని, తీవ్రమైన భావాజాలం ఉన్న కొంతమంది వల్ల వ్యాపిస్తోందని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న కొంతమంది నేరస్తులకు హిందుత్వ ప్రభుత్వం మద్ధతు పలుకుతోందని ట్విటర్లో విమర్శలు గుప్పించారు. ఆదివారం యూపీలోని ఘజియాబాద్లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న వారు హిందుత్వ వ్యతిరేకులని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఒవైసీ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న నేరస్తులకు అధికారపార్టీ అండగా ఉంటోందని తీవ్రంగా ఆరోపించారు. భారత గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని, భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం కార్యక్రమంలో మోహన్ భాగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఎంఐఎం కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. యూపీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ ప్రారంభించిందన్నారు. ఓంప్రకాశ్ రాజ్భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ)తో కలిసి ఎంఐఎం యూపీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. భగీదరి సంకల్ప్ మోర్చా పేరుతో ఇతర పార్టీలని ఏకం చేస్తున్న ఓం ప్రకాశ్ నేతృత్వంలో ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అంతేకాక, ఎన్నికలు, పొత్తులపై ఇతర రాజకీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చించలేదని అసదుద్దీన్ తెలిపారు. ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు. उ.प्र. चुनाव को लेकर मैं कुछ बातें आपके सामने रख देना चाहता हूँ:- 1) हमने फैसला लिया है कि हम 100 सीटों पर अपना उम्मीदवार खड़ा करेंगे, पार्टी ने उम्मीदवारों को चुनने का प्रक्रिया शुरू कर दी है और हमने उम्मीदवार आवेदन पत्र भी जारी कर दिया है।1/2 — Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2021 గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం, ఐదు స్థానాల్లో గెలుపొందింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. అంతకుముందు 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలపైనా కన్నేసింది. అయితే, ఈ మధ్యే జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడులో మాత్రం ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చదవండి: ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు -
గాలిపటం ఆశలు ఆవిరి: అసదుద్దీన్కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: తపరమైన పార్టీగా ముద్ర పడిన ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇతెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర ఫలితాల పొందింది. 30 శాతం ముస్లిం ఓటర్లు ఉండే పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన దృష్టి సారించింది. అయితే ఎంఐఎం పోటీపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంఐఎం తీరుపై విరుచుకుపడింది. బీజేపీ ఇచ్చే మూటల కోసం ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోందని.. హైదరాబాద్ పార్టీకి బెంగాల్లో ఏం పని పశ్నిస్తూ ఇరుకున పెట్టింది. మత రాజకీయాలకు బెంగాల్లో చోటు లేదని మమతా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా ఎన్నార్సీ, సీఏఏ వంటి వాటిపై మమతా బెనర్జీ మొదటి నుంచి పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా ఆ ఓట్లన్నింటిని మమతా సొంతం చేసుకుంది. దీంతో ఎంఐఎం పార్టీకి ఘోర ఫలితాలు వచ్చాయి. దాదాపు పది లోపు స్థానాలు సొంతం చేసుకుంటామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆశలు అడియాశలయ్యాయి. గాలిపటం ఎక్కడా ఎగరలేదు. బీజేపీతో ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ప్రచారం బలంగా వీచింది. ఆ వాదన బెంగాల్లో బలపడడంతో ముస్లింలంతా ఎంఐఎం పార్టీకి ఓట్లు వేయలేదు. తమ ఓట్లన్నీ మమతా పార్టీకి వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్నో ఆశలు పెట్టి బెంగాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. హైదరాబాద్ పార్టీగా ముద్రపడిన ఎంఐఎంను ఆదరించలేదు. కేవలం 0.02 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడ్డాయి. అయితే ఎంఐఎం ఒక్క బెంగాల్ మినహా కేరళ, అసోం, తమిళనాడులో పోటీపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ రాష్ట్రాల్లో పోటీ కూడా చేయలేదు. చదవండి: కాంగ్రెస్కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' చదవండి: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం -
గుజరాత్లో బీజేపీ ఘన విజయం
అహ్మదాబాద్: గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అధికారం నిలుపుకుంది. అహ్మదాబాద్, రాజ్కోట్, సూరత్, జామ్నగర్, వడోదర, భావ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. వాటిలో 483 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 55 సీట్లు మాత్రమే గెలుపొందింది. తొలి సారి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రశంసనీయ స్థాయిలో ఫలితాలు సాధించింది. సూరత్లో ఆ పార్టీ 27 స్థానాలు గెలుచుకుని, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. మొత్తం ఆరు కార్పొరేషన్లలో 470 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను నిలిపింది. జామ్నగర్లో బహుజన్ సమాజ్ పార్టీ మూడు సీట్లలో విజయం సాధించింది. అహ్మదాబాద్లో 192, రాజ్కోట్లో 72, జామ్నగర్లో 64, భావ్నగర్లో 52, వదోదరలో 76, సూరత్లో 120 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అహ్మదాబాద్లో 159, రాజ్కోట్లో 68, జామ్నగర్లో 50, భావ్ నగర్లో 44, వడోదరలో 69, సూరత్లో 93 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అహ్మదాబాద్లో 25, రాజ్కోట్లో 4, జామ్నగర్లో 11, భావ్నగర్లో 8, వడోదరలో 7 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ విజయం ప్రత్యేకం ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రత్యేక విజయమని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. బీజేపీని విశ్వసించినందుకు రాష్ట్రప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇది ప్రజా విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి పథకాల ఫలితం ఇదని ట్వీట్ చేశారు. గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు లేదన్న విషయంపై ఇక రాజకీయ విశ్లేషకులు అధ్యయనం ప్రారంభించవచ్చని వ్యాఖ్యానించారు. ఎంఐఎం విజయం: అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏఐఎంఐఎం బోణీ కొట్టింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జమల్పూర్, మక్తమ్పురా ప్రాంతాల్లోని 7 స్థానాల్లో గెలిచింది. -
అసెంబ్లీ ఎన్నికలు.. రంగంలోకి ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ : బెంగాల్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వ్యూహా లకు పదును పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ మరోసారి బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 25 తేదీన కోల్కతాకు చేరుకున్న తర్వాత ముస్లింల ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న మాటియాబుర్జ్ ప్రాంతంలో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా, పాదయాత్ర చేయాలనే యోచనలోనూ ఉన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అంశంపై ఒవైసీ చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఒవైసీ బెంగాల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరి మొదటివారంలో బెంగాల్లో పర్యటించిన ఒవైసీ, హుగ్లీ జిల్లాలోని ఫుర్ఫురా షరీఫ్ దర్గాలో పిర్జాదా అబ్బాస్ సిద్దిఖీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పిర్జాదా అబ్బాస్ నాయకత్వంలో ఎంఐఎం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. అయితే అబ్బాస్ సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితం సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి, ప్రస్తుతం కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమాన్ బసు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఇటీవల జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో అబ్బాస్ సిద్దిఖీ తమ కూటమిలో చేరబోతున్నారని ప్రకటించారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర– దక్షిణ దినజ్పూర్, దక్షిణ–ఉత్తర 24 పరగణాలు, హూగ్లీ, కోల్కతాలో ముస్లింల ఆధిపత్య స్థానాలపై ఒవైసీ, అబ్బాస్ సిద్ధిఖీ దృష్టి సారించారు. -
గ్రేటర్ మేయర్: వాకౌటా.. గైర్హాజరా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమస్యగా పరిణమించింది. మజ్లిస్కు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలపై పెద్దగా ఆశలు లేకపోవడంతో పాటు అందుకు తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అధికార టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ప్రభావంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీకి మజ్లిస్ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్ఎస్కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్ చేయడమా? మొత్తానికే గైర్హాజర్ కావడమా అనే అంశాలపై చర్చించనుంది. మజ్లిస్ సంఖ్యాబలం 54.. బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54. ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్ఎస్ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్ పాత్ర కీలకంగా మారింది. దూరం పాటించడమే.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు దూరం పాటించాలని మజ్లిస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణ అనంతరం మేయర్ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న ఉదయం జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే అధినేత అసదుద్దీన్ ఒవైసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అవలంబించే వ్యూహంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ను జారీచేసింది. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ను ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11న ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12న (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ) ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదైన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీకల్లా తెలియజేస్తారు. గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. -
మాజీ సీఎంపై ఒవైసీ ఘాటు విమర్శలు
లక్నో: రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ)తో కలిసి పోటీ చేస్తామని ఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్తో కలిసి భాగీధరి సంకల్్ప మోర్చా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రతి జిల్లాను సందర్శించి క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం వేచి చూస్తున్నారన్న ఒవైసీ... సమాజ్వాదీ వంటి పార్టీలు సోషల్ మీడియా, టీవీకే పరిమితమవుతాయంటూ ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ఏజెంట్గా తనపై చౌకబారు ఆరోపణలు చేసే వారికి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాయన్నారు. అక్కడ తాము సెక్యులర్ డెమొక్రటిక్ ఫ్రంట్లో భాగంగా బరిలోకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆజంఘర్, జాన్పూర్ నియోజకవర్గాల్లో ఒవైసీ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఎస్ఎమ్ అధినేత రాజ్భర్ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. ఎంఐఎం, బీఎస్ఎంలో అంతర్భాగమే. శాసన సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తైన తర్వాత సమావేశాలు ఏర్పాటు చేస్తాం. నాకు ఇంతటి సాదర స్వాగతం లభించడం ఆనందంగా ఉంది’’ అంటూ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!) 12 సార్లు అడ్డుకున్నారు: ఒవైసీ ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్పై విమర్శలు ఎక్కుపెట్టిన ఒవైసీ.. ‘‘అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో నన్ను రాష్ట్రానికి రానివ్వకుండా 12 సార్లు అడ్డుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. 28 సార్లు అనుమతి నిరాకరించారు. ఆయన పార్టీకి క్షేత్రస్థాయిలో అసలు కార్యకర్తలే లేరు. కేవలం సామాజిక మాధ్యమాలు, టెలివిజన్లలో మాత్రమే ఆ పార్టీ నేతలు కనిపిస్తారు. మేమెవరికీ ఏజెంట్లం కాదు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా దేశ వ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనేందుకు ఎంఐఎం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్లోని పాతబస్తీకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటేందుకు పతంగి పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు శాసన సభ ఎన్నికలు, 2022లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒవైసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు.(చదవండి: మజ్లిస్ విస్తరణ వ్యూహం) -
జమీర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, ఆదిలాబాద్: కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ జమీర్ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు ఫారూఖ్ అహ్మద్, అతనికి సహాయపడినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి వారం గుడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని జమీర్ బామ్మర్ధి సయ్యద్ మీర్జా ఆరోపించారు. కాల్పులకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమీర్ మృతదేహానికి అంత్యక్రియల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉండగా.. పోస్టుమార్టం నిమిత్తం జమీర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ ఈ నెల 18న సయ్యద్ జమీర్పై కాల్పులు జరపడంతో.. నిమ్స్లో చికిత్స పొందుతూ అతను శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన మోతేషాన్, ఫారుఖ్ కత్తిగాటుకు గురైన సయ్యద్ మన్నన్ ప్రాణాలతో బయటపడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే కాల్పుల ఘటన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఫారుఖ్ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. (చదవండి: అయ్యో జమీర్!) -
అయ్యో జమీర్!
సాక్షి, ఆదిలాబాద్: ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ ఫారూఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ జమీర్ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారంక్రితం ఆదిలాబాద్ తాటిగూడలో పిల్లల క్రికెట్ విషయమై గొడవ చెలరేగగా.. ఫారుఖ్ తుపాకీ, తల్వార్తో వీరంగం సృష్టించాడు. పాత కక్షలతో ప్రత్యర్థి వర్గానికి చెందిన సయ్యద్ మన్నన్పై తల్వార్తో దాడిచేశాడు. మోతేషాన్పై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా అడ్డుగా వచ్చిన సయ్యద్ జమీర్పైనా కాల్పులకు దిగడంతో అతని శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే సయ్యద్ జమీర్ పరిస్థితి సీరియస్గా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్లోని నిమ్స్కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జమీర్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం ఫారుఖ్ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. (చదవండి: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు) క్రికెట్ పంచాయితీ ప్రాణం తీసింది జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్, తల్వార్తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్పై తల్వార్తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) -
బాధితుల శరీరాల్లో తూటాల తొలగింపు
పంజగుట్ట (హైదరాబాద్): ఆదిలాబాద్లో శుక్రవారం చిన్నపిల్లల ఆట కాస్తా మాటా మాట పెరిగి కాల్పుల వరకు దారితీసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొతేషీన్ నడుము భాగంలో ఉన్న ఒక తూటా, సయ్యద్ జమీర్ శరీరంలో రెండు తూటాలను శనివారం నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం న్యూరోసర్జన్ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల నుంచి వారు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఆదిలాబాద్ ఏఐఎంఐఎం శాఖ రద్దు ఏఐఏంఐఎం ఆదిలాబాద్ శాఖను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆదిలాబాద్ ఘటన దురదృష్టకరమని, త్వరలోనే నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు
సాక్షి, హైదరాబాద్ : కాల్పుల ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్ శాఖ రద్దు అయింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. త్వరలో నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా కాల్పుల ఘటనలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి : తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత) -
మజ్లిస్ విస్తరణ వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనే దిశగా ఆలిండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పావులు కదుపుతోంది. హైదరాబాద్లోని పాతబస్తీకే పరిమితం అనుకున్న ఆ పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతున్నారు. తమిళనాడులో కమల్ పార్టీతో పొత్తు! పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనాభాలో 30 శాతం మంది ముస్లింలున్నారు. 110 శాసనసభ స్థానాల్లో మైనార్టీలే నిర్ణయాత్మక శక్తి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ ఎంఐఎం నాయకులతో భేటీ అయ్యారు. బెంగాల్లో ఇప్పటిదాకా 22 జిల్లాల్లో పార్టీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బిహార్లో బీజేపీ బి–టీం ఎంఐఎం అనే విమర్శలు వెల్లువెత్తాయి. తమ రాష్ట్రంలో ముస్లింలను విభజించడానికి రూ.కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సినీ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకోనుందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. దళిత–ముస్లిం ఫార్ములా 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 34 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కరు కూడా నెగ్గలేదు. ఇటీవల బిహార్ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సుహల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్భర్ నేతృత్వంలోని కూటమిలో తాము చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రగతిశీల సమాజ్వాదీ పార్టీ(లోహియా) అధ్యక్షుడు శివపాల్ సైతం ఎంఐఎంతో పొత్తు దిశగా సంకేతాలిస్తున్నారు. బిహార్లో 5 సీట్లు గెలిచేందుకు సహకరించిన బీఎస్పీ నేత మాయావతితో యూపీ లోనూ ఒవైసీ జట్టుకట్టే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. బిహార్లో కలిసొచ్చిన దళిత–ముస్లిం ఫార్ములాను యూపీలోనూ వాడుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి
సాక్షి హైదరాబాద్ : తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. బిహార్ అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మక్క ల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జట్టుగా, కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పో టీ చేయనున్నారని, ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ సోమవారం ప్రకటించారు. అయితేతా ము పోటీ చేసే నియోజకవర్గాలపై త్వరలోనే స్పష్టతనిస్తావన్నారు. జనవరి మా సాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని, ఈ స్థానాల్లో కమల్తో పొత్తు పెట్టుకోవాలని అసద్ నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ మజ్లిస్ పాగా వేసేనా? ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అసద్ ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్కు చెంది న నేతలతో హైదరాబాద్లో శనివారం భేటీ అయిన ఒవైసీ ఫలవంతమైన చ ర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తమిళనాట మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలు స్తోంది. ‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు’ అని మజ్లిస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!
చెన్నై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్ నేతలతో హైదరాబాద్లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ, తమిళనాడు ఆఫీస్ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ హాసన్ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం.(చదవండి: బెంగాల్లో ఎగరనున్న గాలిపటం!) కాగా 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తోహీద్ జమాత్ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ గత నెలలో ఓ వెబ్సైట్తో మాట్లాడుతూ.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) జనరల్ సెక్రటరీ దురైమురుగన్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టుకట్టే అంశం గురించి ప్రస్తావించామని, అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏఐడీఎంకే పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు బదులుగా బీజేపీకి మద్దతు పలికే పార్టీతో తాము కలిసి నడిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే కమల్హాసన్తో ఒవైసీ జట్టుకట్టనున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక సూపర్స్టార్ రజనీకాంత్ సైతం జనవరిలో రాజకీయ పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ నేతలతో శనివారం హైదరాబాద్లో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చే ఏడు జరగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలైంది. తమ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి ఎంఐఎం ఏ విధంగా చేటు చేస్తుందోనని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం దెబ్బతో బిహార్లో మహాఘట్ బంధన్ను అధికారానికి దూరం చేసింది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. ఇదిలాఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పాడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎంఐఎం కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. జాతీయ స్థాయిలో విస్తరణ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం.. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చి అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సై అంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన కేడర్ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది.