దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు | BJP MP GVL Narasimha Rao Slams CM Ramesh And Chandrababu | Sakshi
Sakshi News home page

దొంగ దీక్షలు..తప్పుడు వ్యాపారాలు

Published Fri, Oct 19 2018 12:40 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి బినామీ సీఎం రమేష్‌ అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ దిగజారుడు మనిషని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్‌ను రాజ్యసభకు పంపినందుకు చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెంటనే రాజ్యసభ సభ్యత్వం నుంచి తొలగించాలని కోరారు. జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలపై సీఎం రమేశ్‌ ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మీసం మెలేసిన సీఎం రమేష్‌ జాతీయ స్థాయిలో వచ్చిన కథనాలతో మీసం తీయించుకుంటారా అని సవాల్‌ విసిరారు. ఒక అవినీతి పరుడైన సీఎం రమేష్‌ని పబ్లిక్‌ కమిటీలో స్థానం కల్పించాలని సీఎం ఎలా రికమెండేషన్‌ చేస్తారని అడిగారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement