నిజామాబాద్‌లో కాలి బూడిదైన సెల్‌ టవర్‌ | Cell tower catches fire in Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో కాలి బూడిదైన సెల్‌ టవర్‌

Dec 21 2019 4:27 PM | Updated on Mar 22 2024 10:49 AM

ఓ భవనంపై ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి దగ్ధమైన సంఘటన నిజామాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. గాజులుపేటకు చెందిన నరసింహారావు నివాసంపై సెల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం నుంచి కరెంట్‌ లేకపోవడంతో సిబ్బంది జనరేటర్‌ వేశారు. అయితే  షార్ట్ సర్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సెల్‌టవర్‌ కోసం ఏర్పాటు చేసిన గదిలోని సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో చుట్టుపక్కల దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement