చంద్రబాబుకు సీఎం వైఎస్ జగన్ సవాల్రైతులకు వడ్డీ లేని రుణాలకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల కష్టాలపై చర్చ సందర్భంగా శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. 2014-19 వరకు రైతులకు సున్నా వడ్డీ కింద చంద్రబాబు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.