కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్ఆర్సీపీ, వామపక్ష నేతలు ఆర్టీసీ బస్టాండ్ల వద్ద ఆందోళలనలు చేపట్టి ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలబడి బంద్ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.