Strike
-
వెటర్నరీ జూడాలు.. తగ్గేదేలే!
సాక్షి, తిరుపతి సిటీ/చీపురుపల్లి/గన్నవరం: బ్యాచ్లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇంటర్న్షిప్ చేస్తున్న తాము కూడా మెడికోలతో సమానమేనని, వారికి ఇస్తున్నట్లుగానే తమకు రూ.25 వేలు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా గరివిడి, ప్రొద్దుటూరు, గన్నవరంలలో ఫిబ్రవరి 3 నుంచి తరగతులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టిన బీవీఎస్ విద్యార్థులు, బుధవారం తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. హాస్టళ్లను మూసివేయాలన్న అధికారుల నిర్ణయం వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకునేలా చేసింది. హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటి, ఆకలి బాధల్లోకి నెట్టినా తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు. వర్సిటీ దిగ్బంధం తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్క్యులర్కు అనుగుణంగా ఉదయం ఒక్కసారిగా విద్యార్థుల హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, వర్సిటీలోకి అధికారులను, అధ్యాపకులను, ఉద్యోగులను ప్రవేశించకుండా దిగ్బంధం చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. కాగా బుధవారం రాత్రి తాజాగా వెటర్నరీ జూనియర్ డాక్టర్లతో అధికారులు, పోలీసులు జరిపిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విద్యార్థుల వసతి గృహాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సుముఖతను వ్యక్తం చేశారు. దీంతో వైద్య విద్యార్థులు వర్సిటీ దిగ్బంధ ఆందోళనను విరమించుకున్నారు. అయితే గౌరవ వేతనాన్ని పెంచేంతవరకూ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని వెటర్నరీ జూడాలు తేల్చిచెప్పడం గమనార్హం. ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి?కాగా, హాస్టల్ మూసివేస్తే తామంతా ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి.. అంటూ విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో ఉన్న యూనివర్సిటీ ప్రధాన గేటుకు అడ్డంగా బైఠాయించారు. యూనివర్సిటీలోకి అధ్యాపకులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్సిటీ అసోసియేట్ డీన్ ఎం.శ్రీనివాసరావు పలుమార్లు విద్యార్థులతో మాట్లాడగా 11 గంటలకు అధ్యాపకులు, సిబ్బందిని లోపలకు వెళ్లేందుకు అంగీకరించారు. ఖాళీ కంచాలు, గరిటెలతో వినూత్న నిరసన మరోవైపు కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం కళాశాల ప్రధాన గేట్లను మూసివేసి బోధన, బోధనేతర సిబ్బందిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. -
‘కోడ్’ ముగిశాక ఆర్టీసీలో సమ్మె
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సంస్థ యాజమాన్యంపై పోరుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఒక కార్మిక జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వాలని మరో జేఏసీ తాజాగా నిర్ణయించింది. మొదటి జేఏసీ నిరవధిక సమ్మెకు మొగ్గు చూపుతుండగా, రెండో జేఏసీ మాత్రం ఐదారు రోజులపాటు సమ్మె చేయాలని భావిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసేలోపు తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో సమ్మె అనివార్యమని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. అయితే, కార్మికుల్లో సమ్మెపై ఒకింత భయం కనిపిస్తుండగా, సంఘాల నాయకులు మాత్రం సమ్మెకు సిద్ధమని ప్రకటిస్తున్నారు. ప్రైవేటు సంస్థల పెత్తనంతో..ఇటీవల ఆర్టీసీ పెద్ద సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. అవన్నీ గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ప్రైవేటు సంస్థ నుంచి అద్దెకు తీసుకుంటోంది. ఆ బస్సుల నిర్వహణ కోసం కొన్ని డిపోలను సదరు సంస్థకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేయటంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇది ఆర్టీసీలో ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయటమేనని మండిపడుతున్నారు. దీంతో అధికారులు వెనక్కు తగ్గి డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులతోపాటు సాధారణ సొంత బస్సులు కూడా కొనసాగుతాయని స్పష్టత ఇచ్చారు. అయినా ఉద్యోగుల్లో అనుమానాలు తొలగిపోలేదు. ఈ అంశంతోపాటు చాలా కాలంగా పెండింగులో ఉన్న ఇతర సమస్యలను తెరపైకి తెచ్చి కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. విలీనం, పీఆర్సీనే ప్రధాన ఎజెండాగా..గత ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించింది. అంతలోనే ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పెండింగులో పెట్టింది. 2017 వేతన సవరణ బకాయిలు కూడా చెల్లించలేదు. 2021 వేతన సవరణపై ప్రభుత్వం స్పందించటంలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన గుర్తింపు యూనియన్ల పునరుద్ధరణ జరగలేదు. సీసీఎస్, పీఎఫ్లకు భారీగా బకాయిలు పేరుకుపోయాయి. వీటి సాధనే లక్ష్యంగా కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఎవరికి వారే..ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ చీలికవర్గం, బీడబ్ల్యూయూ, బీకేయూ, ఎన్ఎంయూ చీలిక వర్గం, కేపీ సంఘాలతో కూడిన తొలి జేఏసీ గత నెల 27న యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చింది. ఫిబ్రవరి 3న ఆ యూనియన్ల ప్రతినిధులను కార్మిక శాఖ చర్చలకు పిలిచి, తర్వాత ఎన్నికల కోడ్ కారణం చూపి సమావేశం రద్దు చేసింది. దీంతో, ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ఆర్టీసీ సమ్మెకు మినహాయింపు ఇవ్వాలని ఆయా సంఘాల నేతలు ఎన్నికల కమిషనర్కు విన్నవించారు. టీఎంయూ, ఎన్ఎంయూ వర్గాలు, బీఎంఎస్, ఎస్టీ ఎంయూలతో కూడిన మరో జేఏసీ తదుపరి సమావేశం ఏర్పాటు చేసుకుని, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ప్రభు త్వానికి గడువు ఇస్తున్నట్టు ప్రకటించింది. కోడ్ ముగిసిన తర్వాత సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మార్చి 7 వరకు కోడ్ అమలులో ఉంటుంది. ఐదారు రోజులపాటు సమ్మె చేసి, కొద్ది రోజుల గడువు ఇచ్చి మళ్లీ సమ్మె చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు ఆర్టీసీ కార్మికుల్లో 10 వేల మంది మాత్రమే సమ్మెకు సిద్ధంగా ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. -
కేరళలో సినిమా షూటింగులు బంద్
తిరువనంతపురం: మలయాళ సినీ పరిశ్రమ (Mollywood)లో సమ్మె సైరన్ మోగింది. జూన్ ఒకటి నుంచి షూటింగులు ఆపివేయడంతో పాటు థియేటర్ల ప్రదర్శనలు సైతం నిలిపివేస్తున్నామని ఫిలిం ఎంప్లాయూస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రకటించింది. మలయాళ సినిమా బడ్జెట్లు మితిమీరిపోతుండగా వాటి సక్సెస్ రేటు మాత్రం తగ్గిపోతూ వస్తున్నాయి. నటీనటులతో పాటు టెక్నీషియన్లు పారితోషికం పెంచడంతో బడ్జెట్ తడిసిమోపెడవుతోంది. దీంతో నిర్మాతలపై భారం పెరిగిపోతోంది. వీటన్నింటినీ పరిష్కరించుకునేందుకే మాలీవుడ్ సమ్మె బాట పట్టింది. అయితే దీని ప్రభావం ఇతర ఇండస్ట్రీల మీద పడనుంది. మలయాళంలో డబ్ అయ్యే ఇతర సినిమాల పరిస్థితి గందరగోళంగా మారనుంది.చదవండి: జాలిరెడ్డిపై బెంగ పెట్టుకున్న తల్లి.. ఐదేళ్ల ఎదురుచూపులకు బ్రేక్.. -
Bangladesh: సమ్మెకు దిగిన రైల్వే సిబ్బంది.. కదలని రైళ్లు
ఢాకా: బంగ్లాదేశ్లో రైల్వే సిబ్బంది సమ్మెతో ఈరోజు (మంగళవారం) రైళ్లు నిలిచిపోయాయి. రైల్వే ఉద్యోగులు ఓవర్ టైం పనికి తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ, దేశవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగారు. రైల్వే సిబ్బంది సమ్మె ప్రభావం లక్షలాది మంది ప్రయాణికులపై పడింది.పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని, ఓవర్ టైం పనికి ప్రయోజనాలు కల్పించాలని కోరూతూ బంగ్లాదేశ్ రైల్వే రన్నింగ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సమ్మెకు దిగింది. ఈ సమ్మె దాదాపు 400 ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. బంగ్లాదేశ్ రైల్వే రోజుకు దాదాపు 2,50,000 మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరుస్తుంటుంది. బంగ్లాదేశ్లో గత కొన్ని నెలలుగా హింస కొనసాగుతోంది. ఇప్పుడు రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగడంతో యూనస్ ప్రభుత్వానికి ఇబ్బందులు మరింతగా పెరిగాయి.ఇది కూడా చదవండి: అడవి మధ్యలో రహస్య గుహ.. లోపల కళ్లు బైర్లు కమ్మే దృశ్యం -
TGSRTC: ఆర్టీసీలో సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ యాజమాన్యానికి కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇచ్చాయి. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు.కాగా, నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో మరోసారి ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. 21 డిమాండ్లతో కార్మిక సంఘాలు.. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశాయి. ఈ సందర్భంగా కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, రెండు పీఆర్సీలు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. ఇక, 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వారి డిమాండ్లపై ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
TG: ఆర్టీసీలో సమ్మె సైరన్.. నేడు యాజమాన్యానికి నోటీసులు
సాక్షి,హైదరాబాద్:నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. తాజాగా ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మెబాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ (Tgsrtc) యాజమాన్యానికి సమ్మె నోటీసు ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నాయి. ఈ మేరకు కార్మిక సంఘాల నేతలు సోమవారం(జనవరి27) ఆర్టీసీ ఎండీని కలిసి సమ్మె నోటీసు అందజేయనున్నారు. కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కార్మికులు సుదీర్ఘ సమ్మె నిర్వహించారు. అప్పటి ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. అయితే సమ్మె సమయంలో పలువురు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సంచలనమైంది. 2023 చివర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ను ఓడించడంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతుండడం చర్చనీయాంశమవుతోంది. ఇదీ చదవండి: నేడు ఇండోర్కు సీఎం, డిప్యూటీ సీఎం -
శ్రమదోపిడీకి గురవుతున్నాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: విద్యాభివృద్ధి కోసం ఏళ్ల తరబడి సేవలందిస్తున్న తాము శ్రమదోపిడీకి గురవుతున్నామని సర్వశిక్ష ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస వేత నం కూడా లేకుండా పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయా లని డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన సమ్మె బాట పట్టా రు. రాష్ట్రవ్యాప్తంగా 19,325 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకమైనప్పటి కీ మెరిట్, రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానంలోనే నియమితులయ్యామని ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీంతో తాము ఉద్యోగ భద్రతకు అర్హత కలిగి ఉన్నామని, వెంటనే తమ ఉద్యోగాలను క్రమబదీ్ధకరించాలని కోరుతున్నారు. కనీస వేతనాలు సైతం కరువు.. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తమకు ఇవ్వాల్సిన కనీస వేతనాలు సైతం అమలు చేయడంలేదని సర్వశిక్ష ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఏపీవోలు, సిస్టమ్ అనలిస్ట్లు, టెక్నికల్ పర్సన్స్, ఆపరేటర్స్, డీఎల్ఎంటీ, మెసెంజర్స్, మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఐఈఆర్పీఎస్, మెసెంజర్స్, సీజీవీలు, స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్స్, కేజీబీవీ, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో స్పెషల్ ఆఫీసర్లు (పీజీ హెచ్ఎం హోదా), కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్ (స్కూల్ అసిస్టెంట్ హోదా), పీఈటీలు, ఏఎన్ఎంలు, అకౌంటెంట్స్, క్రాఫ్ట్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, కుక్స్, వాచ్ఉమెన్స్, స్వీపర్లు, స్కావెంజర్లు, పాఠశాల స్థాయిలో పార్ట్టైం ఇన్స్ట్రక్టర్స్(ఆర్ట్, పీఈటీ, వర్క్ ఎడ్యుకేషన్), భవిత కేంద్రాల్లో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ టీచర్లుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న వీరికి కేవలం రెగ్యులర్ ఉద్యోగుల వేతనాల్లో నాలుగోవంతు జీతం మాత్రమే ఇస్తున్నారు. మెసెంజర్లకు రూ.11వేలు, సీఆర్పీలకు రూ.19,350 (ఏపీలో మాత్రం రూ.26వేలు), పీజీ హెచ్ఎం స్థాయిలో ఉన్న స్పెషల్ ఆఫీసర్లకు రూ.32 వేలు వేతనంగా ఇస్తున్నారు. టీఏ, డీఏలు ఇవ్వడంలేదు. పైగా ఏడాదిలో 10 నెలలు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. సర్వ శిక్షలో ఇప్పటివరకు 119 మంది మరణిస్తే కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. తమను రెగ్యులరైజ్ చేయాలని, రూ.10 లక్షల బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యాలు కల్పించాలని, మహి ళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 ప్రసూతి సెలవులు, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం, 61 ఏళ్లు నిండిన ఉద్యోగులకు రూ. 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నారు. -
108 ఉద్యోగుల సమ్మె బాట
సాక్షి, అమరావతి: అత్యవసర విభాగమైన 108 అంబులెన్స్ సేవలను ప్రభుత్వమే నిర్వహించడం సహా 15 డిమాండ్ల సాధన కోసం సిబ్బంది సమ్మె బాట పట్టారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఒక రోజు రిలే దీక్షలు చేశారు. ప్రభుత్వం నిర్వహణ సంస్థలను పదేపదే మార్చడంతో తాము గ్రాట్యుటీ, ఎర్న్డ్ లీవులు, వార్షిక సెలవులను కోల్పోతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం ఈ నెల 25లోగా సానుకూలంగా స్పందించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే శాపాలు సీఎం చంద్రబాబు ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు చిరుద్యోగుల పాలిట శాపాలుగా మారాయి. అస్మదీయులకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు 108, 104 నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందోను ప్రభుత్వం తప్పిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని, ఉన్నఫళంగా నిర్వహణ సంస్థను వెళ్లగొడితే ఆరి్థకంగా నష్టపోతామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగి ఒక సంస్థలో ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పనిచేస్తే గ్రాట్యుటీ పొందేందుకు అర్హత ఉంటుంది. అరబిందో సంస్థ నిర్వహణ బాధ్యతలను 2020 జూలై 1నుంచి ప్రారంభించింది. 2027 వరకూ కాంట్రాక్ట్ కాలపరిమితి ఉంది. వచ్చే ఏడాది జూలై 1 నాటికి ఐదేళ్లు పూర్తి అవుతుంది. ఇంతలోనే ప్రభుత్వం ఆ సంస్థను వెళ్లగొట్టే చర్యలకు పూనుకుంటోందని, అలా జరిగితే 108లో పనిచేసే డ్రైవర్, ఈఎంటీ రూ.30 వేలు చొప్పున, 104లో పనిచేసే డ్రైవర్, డీఈవోలు రూ.15 వేల వరకూ గ్రాట్యుటీ నష్టపోతామని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రభుత్వమే అందరికీ గ్రాట్యుటీ చెల్లించాలి కాంట్రాక్ట్ దక్కించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు సేవలను సక్రమంగా నిర్వహించడం లేదని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే సేవలను నిర్వహించాలి. ఇదే ప్రధాన డిమాండ్గా సమ్మె నోటీసు ఇచ్చాం. ఈ నెల 25లోగా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. ఐదేళ్లు తిరగకుండానే నిర్వహణ సంస్థను మారిస్తే మేం ఆర్థికంగా చాలా నష్టపోతాం. ఒక్క గ్రాట్యుటీ రూపంలోనే 108 ఉద్యోగులే రూ.30 వేల చొప్పున రూ.10 కోట్ల వరకూ నష్టపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఐదేళ్లలోపే నిర్వహణ సంస్థ మారితే ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలి. – బి.కిరణ్కుమార్, ప్రెసిడెంట్, ఏపీ 108 సరీ్వసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ -
ఆపద్భాంధవులకే ఆపద.. సమ్మె బాటలో 108 ఉద్యోగులు
సాక్షి, విజయనగరం జిల్లా : అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడే 108 ఉద్యోగులకు ఇప్పుడు పుట్టెడు కష్టాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 108 ఉద్యోగులు తరచూ వేతనాలు సకాలంలో అందక నానా అవస్థలు పడుతున్నారు. కుటుంబ భారాన్ని మోయలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ తరుణంలో తమ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 108 ఉద్యోగులు రోడ్డెక్కనున్నారు. నవంబర్ 25 నుంచి సమ్మె చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించారు. జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి. 108లను ప్రభుత్వమే నిర్వహించాలి. ఉద్యోగులను ఆరోగ్య శాఖ సిబ్బందిగా గుర్తించడంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. -
సోమవారం... వలంటీర్ల నిరసన వారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం వలంటీర్ల నిరసన వారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడంలో కీలకపాత్ర పోషించిన లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు గత 16 వారాలుగా రోడ్డెక్కి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు పెండింగ్లో పెట్టిన గౌరవ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ వారం కూడా రాష్ట్రంలోని పలు మండలాల్లో వలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగరం కలెక్టరేట్ ముందు వలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలు చెల్లించాలని నినదించారు. ఐదు నెలలుగా తేల్చని కూటమి సర్కారుఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది జూన్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎన్నికల ముందు వరకు వలంటీర్లు నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ సహా అన్ని విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. జూలై, ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒక్కరికి కూడా చెల్లించలేదని వలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా వలంటీర్లకు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలని వారు కోరారు. -
జూడాల సమ్మె విరమణ
కోల్కతా: పశ్చిమబెంగాల్ జూని యర్ డాక్టర్లు తమ సమ్మె ను విరమించారు. ము ఖ్యమంత్రి మమతా బెనర్జీతో సోమవారం చర్చల అనంతరం 16 రోజులు గా చేస్తున్న దీక్షను విరమించుకున్నారు. ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచారం నేపథ్యంలో డిమాండ్ల సాధన కోసం బెంగాల్ జూనియర్ డాక్టర్లు గత 16 రోజులు గా నిరాహారదీక్ష చేస్తున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన సంపూర్ణ విధుల బహిష్కరణను కూడా విరమిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఈ రోజు సీఎంతో భేటీలో కొన్ని హామీలు లభించాయి. అయితే ప్రభుత్వ వ్యవహార శైలి సరిగా లేదు. ప్రజలు, మా దివంగత సోదరి కుటుంబీకులు దీక్షను విరమించుకోవాలని కోరారు. విషమిస్తు న్న మా ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టు కొని నిరాహారదీక్ష ముగించాలని విజ్ఞప్తి చేశారు. అందుకే దీక్షను ముగిస్తున్నాం అని జూనియర్ డాక్టర్ దెవాశిష్ హల్దర్ వెల్లడించారు. -
ఉద్యోగం పోతుందని హెచ్చరిక!
చెన్నైలోని సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండియా పరిధిలో నిరసనకు దిగిన ఉద్యోగులకు కంపెనీ హెచ్చరికలు జారీ చేసింది. సమ్మె కొనసాగిస్తున్న ఉద్యోగులకు వేతనాలు అందజేయమని, ఉద్యోగంలో నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. చెన్నై ప్లాంట్లోని సామ్సంగ్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని, తమ యూనియన్కు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9 నుంచి నిరసన చేస్తున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా కంపెనీ స్పందించింది.‘నో వర్క్..నోపే ప్రాతిపదికనను కంపెనీ పాటిస్తుంది. సమ్మె ప్రారంభమైన సెప్టెంబర్ 9 నుంచి నిరసనలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనాలు ఉండవు. వెంటనే సమ్మెను విరమించి విధుల్లో చేరాలి. నిరసన కొనసాగిస్తే ఉద్యోగాల నుంచి కూడా తొలగించే ప్రమాదం ఉంది. నాలుగు రోజుల్లోగా ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరకపోతే, వారిని సర్వీస్ నుంచి ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాలి’ అని కంపెనీ హెచ్ఆర్ విభాగం అధికారులు ఈమెయిల్ పంపించారు.ఇదీ చదవండి: రెండేళ్లలో 9000 మంది నియామకంభారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఉద్యోగులు వేతనాలు పెంచాలని, తమ యూనియన్ను కంపెనీ గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కార్మికులను సమీకరించడంలో సహాయపడిన సీఐటీయూ వివరాల ప్రకారం సామ్సంగ్ ఉద్యోగులు నెలకు సగటున రూ.25,000 వేతనం అందుకుంటున్నారు. మూడేళ్లలో రూ.36,000కు పెంచాలని డిమాండ్ ఉంది. -
సమ్మె విరమించేది లేదు
సాక్షి, అమరావతి: పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ కోటా కుదిస్తూ జారీ చేసిన జీవో 85ను రద్దు చేసే వరకూ సమ్మె విరమించబోమని పీహెచ్సీ వైద్యులు తేల్చిచెప్పారు. బుధవారం మంత్రి సత్యకుమార్తో చర్చల్లో సమ్మెల విరమణకు అంగీకరించిన పీహెచ్సీ వైద్యుల సంఘం ప్రతినిధులపై వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ప్రధాన డిమాండ్ అయిన జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకరించకుండా సమ్మె విరమిస్తామని ప్రభుత్వానికి ఎలా చెబుతారని నిలదీశారు.సచివాలయంలో జరిగిన ఈ చర్చల్లో మంత్రితో పాటు వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చల్లో జీవో 85 రద్దు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు సహా పలు అంశాలను వైద్యుల సంఘం నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జీవో రద్దుకు ప్రభుత్వం అంగీకారం తెలపలేదు. జీవో సవరణ చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు ప్రకటన విడుదల చేశారు. ఎంపిక చేసిన కోర్సుల్లోనే కాకుండా అన్ని క్లినికల్ కోర్సుల్లోనూ అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. చర్చల అనంతరం విజయవాడ మాకినేని బసవ పున్నయ్య ఫంక్షన్ హాల్లో సుమారు 1500 మంది వైద్యులతో సంఘం నేతలు సమావేశమయ్యారు. మరోమారు ప్రభుత్వం సోమ, మంగళవారాల్లో చర్చలకు పిలుస్తుందని, ఈ క్రమంలో సమ్మె విరమిస్తామని ఒప్పుకున్నట్టు వెల్లడించారు. జీవో రద్దు చేయకుండా సమ్మె ఎలా విరమిస్తామంటూ వైద్యులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె కొనసాగించాల్సిందేనని చెప్పారు. వైద్యులను అవమానించిన పోలీసులుధర్నా చౌక్లో నిరసన తెలుపుతున్న వైద్యులను పోలీసులు అవమానించారు. ఇన్సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్లో నిరసనకు పోలీస్ శాఖను వైద్యులు అనుమతి కోరారు. మంగళ, బుధవారాల్లో నిరసన తెలపడానికి పోలీస్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. బుధవారం ప్రభుత్వం చర్చలకు పిలిచినందున ధర్నాచౌక్లో అనుమతి రద్దు చేశామంటూ వైద్యులను పోలీసులు అడ్డుకున్నారు. నిల్చోడానికి కూడా వీల్లేకుండా వెళ్లిపోవాలంటూ బలవంతంగా పంపేశారు. చేసేదేమీ లేక బసవపున్నయ్య ఫంక్షన్ హాల్ అద్దెకు తీసుకుని అక్కడ సమావేశమయ్యారు. పోలీసుల చర్య తమను అవమానించడమేనని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు -
150 మంది సామ్సంగ్ ఉద్యోగులు అరెస్టు
వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన 150 మంది సామ్సంగ్ ఉద్యోగులను సోమవారం అరెస్టు చేశారు. తమిళనాడులోని కాంచీపురంలో కార్మికులు ర్యాలీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు. ఆదివారం రాత్రి మంజూరైన అనుమతులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దాంతో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేసేందుకు దాదాపు 400కుపైగా కార్మికులు సోమవారం కాంచీపురం కలెక్టరేట్కు బయలుదేరారు. కలెక్టరేట్లోకి దూసుకెళ్లిన 150 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన ఇండియా వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు, సీఐటీయూ నాయకుడు ముత్తు కుమార్ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు కార్మికులు తెలిపారు.సామ్సంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు వేతన సవరణ కోరుతూ సమ్మెకు దిగారు. ఇప్పటికే సమ్మె ప్రారంభించి ఎనిమిది రోజులు అయింది. అయినా సంస్థ యాజమాన్యం స్పందించకపోవడంతో ర్యాలీ నిర్వహించాలని భావించి కలెక్టర్ అనుమతి కోరారు. చివరి నిమిషంలో అనుమతులు రద్దు చేశారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం..‘కాంచీపురంలోని సామ్సంగ్ ప్లాంట్ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే తొలి సమ్మె. స్థానికంగా ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ఉత్పత్తి జరుగుతోంది. ఈ ప్లాంట్లో దాదాపు 1,700 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారి వేతనాలు ఇతర సంస్థల్లోని అదే స్థాయి ఉద్యోగుల కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 16 సంవత్సరాలుగా ఈ కార్మికులకు ఎలాంటి రిజిస్టర్డ్ యూనియన్ లేదు. వేతనాలు సవరించాలని సంస్థకు ఎన్నిసార్లు లేఖలు రాసినా లాభం లేకుండాపోయింది. సంస్థ వేతనాలపై స్పందించకపోగా కార్మికులపై పనిభారం మోపుతోంది. సామసంగ్ ఇండియా వర్కర్స్ యూనియన్ పేరుతో సమ్మెకు దిగాం. సంస్థలో 25 శాతం మంది అప్రెంటిస్ కార్మికులున్నారు’ అని తెలిపారు.ఇదీ చదవండి: భారత్లో సర్వీసులు పెంచనున్న ఎయిర్లైన్స్భారత్లో కార్యకలాపాలకు తమిళనాడులోని కాంచీపురం సామ్సంగ్ ప్లాంట్ కీలకం. ఈ ప్లాంట్ కాంచీపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్లో ఉంది. ఇందులో 16 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఎయిర్ కండిషనర్లతో సహా వివిధ రకాల ఎలక్ట్రానిక్ వస్తువులను ఇందులో తయారు చేస్తున్నారు. దాదాపు 1,700 మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. వారిలో 60 మందే మహిళలు ఉండడం గమనార్హం. భారతదేశంలో కంపెనీ వార్షిక ఆదాయంలో 20-30% వరకు ఈ ప్లాంట్ నుంచే సమకూరుతోంది. ఇటీవల ఈ ప్లాంట్లో కొత్త కంప్రెషర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడానికి సంస్థ రూ.1,588 కోట్ల పెట్టుబడి పెట్టింది. 22 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కొత్త ఫ్యాక్టరీ ఏటా 80 లక్షల కంప్రెషర్ యూనిట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. -
సమ్మెకు వెనుకాడబోం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలైన జెన్కో, ట్రాన్స్కో, టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పిడీసీఎల్లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇ చ్చిన పదోన్నతుల్లో చోటుచేసుకున్న అవకతవకతలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతుల్లో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, లేనిపక్షంలో ఉద్యోగులు సమ్మె చేయడానికి వెనకాడబోరని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులతో పాటు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా గత కొంత కాలంగా తాత్కాలికం (అడ్హక్) పేరుతో షరతులతో కూడిన పదోన్నతులు కల్పిస్తూ బీసీ, ఓసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగించారని ఆందోళన వ్యక్తం చేసింది. 35 వేల మందికి పైగా ఉన్న బీసీ, ఓసీ విద్యుత్ ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎన్నోసార్లు కోరినా యాజమాన్యాలు పట్టించుకోకపోవడంతో ఆందోళనబాట పట్టక తప్పడం లేదని తెలిపింది. విద్యుత్ సంస్థల్లో పదోన్నతులను పునఃసమీక్షించి బీసీ, ఓసీ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్లోని విద్యుత్ సౌధలో మహాధర్నా జరిగింది.యాజమాన్యాలకు నోటీసులు అందజేసిన తర్వాత కూడా 3,830 మందికి మళ్లీ అడ్హక్ పదోన్నతులు కల్పి0చారని జేఏసీ చైర్మన్ కోడెపాక కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో విధించిన షరతులను పక్కనబెట్టి ఇప్పుడు కొత్త షరతులతో పదోన్నతులు ఇస్తున్నారని, ఇప్పుడు గత ప్రభుత్వం విధించిన షరతులు ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ సెలవులో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి ఆదేశాల పేరుతో పదోన్నతులు కల్పి0చడం బీసీ, ఓసీ ఉద్యోగులకు విస్మయాన్ని కలిగించిందన్నారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎండీ రోనాల్డ్ రాస్ ప్రత్యేక చొరవ తీసుకుని బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.మాది ఉద్యోగ సానుకూల ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి భట్టి సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని, వారి సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) ప్రతినిధులు భట్టిని కలిసి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన 39 డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ నేతలు దేవరకొండ సైదులు, శ్యాంసుందర్, కస్తూరి వెంకట్ తదితరులున్నారు. యశోద గ్రూప్ రూ.కోటి విరాళం వరద బాధితుల సహాయార్థం యశోద గ్రూప్ హాస్పిటల్స్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన ఆసుపత్రి చీఫ్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి రూ.కోటి చెక్కును అందజేశారు. ఆపద సమయంలో దాతృత్వాన్ని చాటుకున్న యశోద ఆసుపత్రి చైర్మన్ రవీందర్రావు, డైరెక్టర్లు సురేందర్రావు, దేవేందర్రావులను ఈ సందర్భంగా భట్టి అభినందించారు. -
ఉద్యోగ సంఘాల ఉద్యమ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు కాకపోవడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పోరాట ప్రణాళికను రచిస్తున్నారు. ఇప్పటివరకు వేర్వేరుగా ప్రభుత్వానికి తమ డిమాండ్లను ముందుంచిన ఉద్యోగ సంఘాల నేతలు ఒకే వేదికపైకి వచ్చారు. సోమవారం నాంపల్లిలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం కేంద్ర కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి కార్యాచరణ సమితి(జేఏ సీ) ఏర్పాటుకు సంఘాల నేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ)గా ఏర్పాటైన ఈ కమిటీకి చైర్మన్గా టీఎన్జీఓ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ వ్యవహరిస్తారు. జేఏసీ సెక్రటరీ జనరల్గా ఏలూరి శ్రీనివాసరావు కొనసాగుతారు. ఈ కమిటీలో తెలంగాణ ఎంప్లాయిస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ సంఘాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్దన్రెడ్డి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న పీఆర్టీయూ టీజీ సైతం ఇదే జేఏసీలో భాగస్వామ్యమైంది. ప్రస్తుతం 15 మందితో స్టీరింగ్ కమిటీని వేసినప్పటికీ వారం, పది రోజుల్లో అన్ని సంఘాలను సంప్రదించి వారి ఆమోదంతో పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందించాలనీ, అప్పటికీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుంటే 15 రోజుల్లో తమ కార్యాచరణను ప్రకటించాలని సోమవారం నాటి సమావేశంలో వివిధ సంఘాల నేతలు కమిటీ ముందు స్పష్టం చేయగా... ఆమేరకు తీర్మానించాయి. తర్వాత జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కార్యాచరణకు సంబంధించి వివరాలు వెల్లడించారు. హక్కుల కోసం కొట్లాడతాం:మారం జగదీశ్వర్ ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ప్రస్తుతం ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందించడం ఎంతో సంతోషకరం. ఆర్థిక స్థితిని ఆగం చేసి అప్పులపాలు చేసిన గత ప్రభుత్వ తీరును పరిగణించి కొంత సమయం ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి పలు సందర్భాల్లో సూచించారు. ప్రస్తుతం వేచి చూసే పరిస్థితి దాటింది. సీఎం నుంచి ఇప్పటివరకు ఎలాంటి పిలుపు రాలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. రాష్ట్రానికి వచ్చిన తర్వాత జేఏసీ తరపున కలిసి పరిస్థితిని వివ రిస్తాం. ఆయన నుంచి వచ్చే స్పందన బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. నాలుగు డీఏ బకాయిలు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ఖరారు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ, జీవో 317 సమస్యల పరిష్కారం ప్రధాన సమస్యలుగా గుర్తించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. గచి్చ»ౌలి, భాగ్యనగర్ సొసైటీ స్థలాలనూ ఉద్యోగులకు అప్పగించాలి.’ జేఏసీ నిర్ణయంతోనే పోరాడుతాం: ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వ శాఖల్లో దాదాపు 53 సంఘాల ప్రతినిధులతో చర్చించి జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఉద్యోగుల సమస్యలను జేఏసీ ద్వారానే ప్రభుత్వానికి వివరిస్తాం. సమస్యలు వందల్లో ఉన్నప్పటికీ 36 అంశాలను ప్రాధాన్యత క్రమంలో కూర్పు చేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో ఆర్థిక పరమైన భారం లేనివి కూడా ఉన్నాయి. ఇలాంటి సమస్యలను వేగవంతంగా పరిష్కరించే అవకాశం ఉంది. వీటన్నింటినీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం. 010 పద్దు కింద లేని ఉద్యోగులకు, మోడల్ స్కూల్, కేజీబీవీలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారికి వేతనాలు ఆలస్యంగా అందుతున్నాయి. ముందుగా ఈ–కుబేర్ అనేది రద్దు చేయాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించాలి. తీర్మానించిన వాటిలో ప్రధానాంశాలు.. » సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి » మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు » పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి » ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వి సు నిబంధనల అమలు » ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపు » జీవో 317 సమస్యల సత్వర పరిష్కారం »కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్దీకరణ -
సర్కారు తీరుపై చిరుద్యోగుల కన్నెర్ర
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చిరుద్యోగులు కన్నెర్ర చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్కీమ్ వర్కర్లు, కారి్మకులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కదం తొక్కారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలనే నినాదాలు ఎక్కడికక్కడ మార్మోగాయి. వారి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది.సాక్షి నెట్వర్క్: బలవంతపు తొలగింపులు, రాజకీయ వేధింపులకు నిరసనగా ఐకేపీ, వీఓఏలు, మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్య కార్మికులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, అంగన్వాడీ, ఆశా వర్కర్లతోపాటు వివిధ రంగాలకు చెందిన చిరుద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ధర్నాలు నిర్వహించారు. చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులను తక్షణమే మానుకోవాలని, బలవంతంగా తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఎనీ్టఆర్ జిల్లాలో చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు నిలిపివేయాలని కోరుతూ విజయవాడలో సోమవారం ధర్నా జరిగింది. ప్రభుత్వ విభాగాలకు చెందిన చిరుద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు.చిరుద్యోగుల తొలగింపు, రాజకీయ వేధింపులు ఆపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఆర్వోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. బాపట్ల కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లోని చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు ఆపకపోతే ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన చిరుద్యోగులంతా పుట్టపర్తి చేరుకుని అధికార పార్టీ నాయకుల వేధింపులకు నిరసనగా కదం తొక్కారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని ధర్నా నిర్వహించారు. ఓడీచెరువు మండలం వీరప్పగారిపల్లి అంగన్వాడీ కార్యకర్త నాగమణి ఆత్మహత్యాయత్నం, మరో కార్యకర్త సుహాసినిపై దాడికి కారణమైన టీడీపీ కార్యకర్త ఆంజనేయులు కుటుంబంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని నినదించారు. ఖాళీ ప్లేట్లతో నిరసన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో చిరుద్యోగులు ధర్నాలు నిర్వహించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపును నిరసిస్తూ.. చేసిన పనులకు వేతనాలు చెల్లించాలంటూ ఖాళీ ప్లేట్లతో ఉపాధి కూలీలు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు.స్కీమ్ వర్కర్లు, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు, అక్రమ తొలగింపులు తక్షణం నిలుపుదల చేయాలని, ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించరాదని డిమాండ్ చేస్తూ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కాకినాడలో అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన వర్కర్లు, యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లపై కూటమి నేతల రాజకీయ వేధింపులను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పార్వతీపురంలోని కలెక్టరేట్ ఎదుట చిరుద్యోగులు ధర్నా చేపట్టారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించి స్కీమ్ వర్కర్లపై రాజకీయ వేధింపులు ఆపాలంటూ నినాదాలు చేశారు. మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి ‘మా ఉద్యోగం మమ్మల్ని చేసుకోనివ్వండి.. మాకు రాజకీయ మరకలు పూయకండి’ అంటూ చిరుద్యోగులు తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ పొట్టగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చిరుద్యోగులను తొలగిస్తున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, వీఓఏలు, అంగన్వాడీ హెల్పర్లు ఒంగోలులో కదం తొక్కారు. లేనిపోని కారణాలు చూపుతూ చిరుద్యోగులను బలవంతంగా తొలగించడం, స్థానిక నాయకులు జోక్యం చేసుకుని వేధింపులకు గురిచేయడం ఆపకపోతే నిరవధిక ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్కు చేరుకుని భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమాల్లో సీఐటీయూ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. -
దారి ఇలా.. పాఠశాలకు వెళ్లేది ఎలా?
జనగామ జిల్లా, చిల్పూరు: దారి ఇలా ఉంటే తాము పాఠశాలకు ఎలా వెళ్లేదంటూ విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టగా తల్లిదండ్రులు, నాయకులు సహకరించారు. మండలంలోని ఫత్తేపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు వెళ్లే రహదారిలో గ్రామంలోని మురుగు నీరు పాఠశాల సమీపంలో నిలుస్తోంది.చిరుజల్లులకే కుంటలా మారుతోంది. గతంలో గ్రామ ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే పాఠశాల వద్ద ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదుగతంలో ఎన్నో సార్లు అధికారులకు విన్నవించాం. అయినా పట్టించుకోవడం లేదు. మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాల అంటూ పనులు చేస్తున్నారే తప్ప పాఠశాలకు పిల్లలు వచ్చే రోడ్డు ఎందుకు పట్టించుకోరు. త్వరగా సమస్య తీర్చాలి.– బానోత్ బాలరాజు, గ్రామస్తుడుబురదలోనే నడుస్తున్నాంప్రతీ రోజు చెప్పులు చేతపట్టుకుని బురదలో నడిచి పాఠశాలకు వెళ్తున్నాం. మధ్యాహ్న భోజనం తినే సమయంలో వాసన భరించలేక పోతున్నాం. అధికారులు స్పందించాలి.– హరిప్రసాద్, విద్యార్థిఒక్కోసారి బురదలో జారిపడుతున్నాం..పుస్తకాల బ్యాగుతో నడిచి వస్తుంటే ఒక్కోసారి జారి బురదలో పడుతున్నాం. దీంతో తిరిగి ఇంటికి వెళ్తుంటే ఆ వాసన భరించలేక వాంతులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. మా బడి వరకు రోడ్డు నిర్మించాలి.– సాత్విక, విద్యార్థిని -
గాజా: స్కూల్పై ఇజ్రాయెల్ దాడి.. 15 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజా పట్టణంలో ఉన్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఆదివారం(జులై 15) సెంట్రల్ గాజాలోని అబు అరబన్ ప్రాంతంలోని ఓ స్కూల్పై ఇజ్రాయెల్ బాంబులు వేసింది. ఈ దాడిలో స్కూలులో ఆశ్రయం పొందుతున్న గాజా వాసులు 15 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. యుద్ధం కారణంగా నిరాశ్రయులైన గాజా వాసులు వేలాది మంది అబు అరబన్ స్కూల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్నారు. గడిచిన ఎనిమిది రోజుల్లో గాజా వాసులు ఆశ్రయం పొందుతున్న స్కూళ్లపై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇది ఐదోసారి. ఈ దాడిపై ఇజ్రాయెల్ స్పందించింది. అబు అరబన్ స్కూల్ కేంద్రంగా ఇజ్రాయెల్ సైన్యంపై దాడులు జరుగుతున్నందునే తాము టార్గెట్ చేశామని తెలిపింది. గతేడాది అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై మెరుపుదాడికి దిగి వందలాదిమందిని చంపింది. అప్పటి నుంచి గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. -
శాంసంగ్ చరిత్రలో భారీ సమ్మె!!
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం చరిత్రలో ఇది అతిపెద్ద వ్యవస్థీకృత కార్మిక చర్య. వేతన పెంపు, సెలవుల విషయంలో గత నెలలో చర్చలు విఫలం కావడంతో కంపెనీలోని అతిపెద్ద యూనియన్ గత కొన్ని వారాలుగా మూడు రోజుల వాకౌట్ కు సిద్ధమవుతోంది.శాంసంగ్ 55 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా గత జూన్ ఆరంభంలో ఒక్క రోజు సమ్మె జరిగింది. తాజాగా జూలై 8న భారీ సమ్మెను కార్మికులు చేపట్టారు. కంపెనీకి చెందిన అత్యాధునిక చిప్ ప్లాంట్లలో ఉత్పత్తికి అంతరాయం కలిగించడం ద్వారా యాజమాన్యానికి సందేశాన్ని పంపడానికి దీన్ని ఉద్దేశించినట్లుగా యూనియన్ నాయకులు చెబుతున్నారు.సియోల్ కు 38 కిలోమీటర్ల దూరంలోని హ్వాసియోంగ్ లోని శాంసంగ్ సెమీకండక్టర్ ప్లాంట్ల వెలుపల సోమవారం ఉదయం 11 గంటలకు ర్యాలీలకు 5,000 మందిని సమీకరించాలని కార్మిక సంఘం లక్ష్యంగా పెట్టుకుందని యూనియన్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ లీ హ్యూన్ కుక్ బ్లూమ్ బర్గ్ న్యూస్ కు తెలిపారు. వాస్తవానికి ఎంత మంది కార్మికులు విధులను పక్కన పెడతారో స్పష్టంగా తెలియదు. ఉత్పత్తికి అంతరాయం కలిగించడమే ఈ వాకౌట్ లక్ష్యమని యూనియన్ నేత సన్ వూ మోక్ తెలిపారు.3% వార్షిక మూలవేతనం పెంపునకు అంగీకరించని సుమారు 855 మంది సిబ్బందికి పెద్ద వేతన పెంపును కోరుతున్నట్లు మొదట చెప్పిన యూనియన్ నాయకులు తమ డిమాండ్లను మార్చారు. ఇప్పడు మొత్తం 28,000 మందికి పైగా యూనియన్ సభ్యులకు అధిక వేతనాలు, అదనపు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.సెమీకండక్టర్ సిబ్బందికి ప్రథమార్ధం పనితీరు సంబంధిత బోనస్ లను ప్రకటించడం ద్వారా కార్మికుల సమ్మె ప్రయత్నాన్ని భగ్నం చేయడానికి శాంసంగ్ ప్రయత్నించింది. కాని వారు వాగ్దానం చేసిన నెలవారీ జీతాలలో గరిష్టంగా 75% గతంలో సాధారణమైన పూర్తి నెల చెల్లింపు కంటే తక్కువగా ఉంది.కొరియాలోని అనేక ప్రముఖ కంపెనీలను పీడిస్తున్న గ్రౌండ్ అప్ కల్లోలాన్ని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎప్పుడో నివారించింది. శాంసంగ్ దివంగత చైర్మన్, ప్రస్తుత అధినేత జే వై లీ తండ్రి లీ కున్ హీ యూనియన్లు ఏర్పడకుండా నిరోధించడానికి ఎంతగానో ప్రయత్నించారు. ఇప్పుడు నేషనల్ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ అనేది సుమారు 28,000 మందికి పైగా కార్మికులతో కంపెనీ యూనియన్లలో కెల్లా అతి పెద్దది. -
తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు
-
TG: తాత్కాలికంగా సమ్మె విరమించిన జూడాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను విరమించారు. ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇది తాత్కాలిక విరమణ మాత్రమే తెలుస్తోంది. కొన్ని అంశాలపై జీవో విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీతోనే జూడాలు సమ్మెను ప్రస్తుతానికి విరమించినట్లు తెలుస్తోంది. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో గత అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. బోధనాసుపత్రుల్లో జూడాలకు వసతి భవనాల కోసం నిధుల విడుదల, కాకతీయ యూనివర్సిటీలో రహదారుల మరమ్మతులకు నిధుల మంజూరు.. ఈ రెండు జీవోల విడుదలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. వీటికి సంబంధించిన జీవోలు తక్షణమే విడుదల చేస్తామని ప్రభుత్వం జూడా సంఘానికి హామీ ఇచ్చింది. అయితే ఈ సాయంత్రంలోపు జీవోలు విడుదల కాకుంటే.. రేపటి నుంచి మళ్లీ సమ్మె చేపడతామని జూడాలు స్పష్టం చేశారు.మరోవైపు ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో.. సమ్మె కొనసాగించాలని అక్కడి జూనియర్ డాక్టర్లు నిర్ణయించారు. ఇంకోవైపు ఇవాళ అన్ని జిల్లాల ప్యానెల్స్ను చర్చలకు ఆరోగ్య శాఖ మంత్రి ఆహ్వానించారు. స్టైఫండ్స్, విద్యార్థుల సమస్యలతో పాటు ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం వెంటనే చేపట్టాలనే ఎనిమిది ప్రధాన డిమాండ్లతో జూన్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జూడాలు సమ్మె ప్రారంభించారు. ఈ క్రమంలో విధులకు దూరంగా ఉంటూనే.. ఆస్పత్రుల వద్ద తమ డిమాండ్లను పరిష్కరించాలని ఫ్లకార్డులు పట్టుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. -
క్షీణించిన మంత్రి ఆతిషి ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు
దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని నివారించాలని కోరుతూ నిరాహార దీక్షకు దిగిన ఆప్ మంత్రి ఆతిషి ఆరోగ్యం సోమవారం అర్దరాత్రి క్షీణించింది. దీంతో ఆప్ నేత సంజయ్ సింగ్, ఇతర నేతలు, కార్యకర్తలు ఆమెను లోక్ నాయక్ జైప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్ఎన్జేపీ)కి తరలించారు.ఈ సందర్భంగా ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ మీడియాతో మాట్లాడుతూ ఆతిషి రక్తంలో షుగర్ లెవెల్స్ పడిపోయి 36కు చేరాయని అన్నారు. ప్రస్తుతం ఆమె వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారన్నారు. ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ ఆతిషి ఆరోగ్యం క్షీణించిందని, వెంటనే ఆస్పత్రికి తరలించకపోతే ఆమె పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందని వైద్యులు తెలియజేయంతో, తాము ఆమెను ఆస్పత్రిలో చేర్చామని అన్నారు. ఆతిషి ఢిల్లీ ప్రజల కోసం పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీ ప్రజలకు హర్యానా నుంచి నీరు అందేలా చూడాలని జూన్ 21 నుంచి జలమండలి మంత్రి ఆతిషి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. జూన్ 21న ఉపవాస దీక్షకు ముందు ఆమె బరువు 65.8 కిలోలు. నిరాహార దీక్ష నాలుగో రోజుకు ఆమె బరువు 63.6 కిలోలకు తగ్గింది. నాలుగు రోజుల్లో రక్తంలో చక్కెర స్థాయి 28 యూనిట్లు తగ్గింది. రక్తపోటు స్థాయి కూడా తగ్గింది. ఇది ప్రమాదకరమని వైద్యులు చెప్పడంతో ఆమెను పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. #WATCH | Delhi Water Minister Atishi being taken to LNJP hospital due to deteriorating health. Atishi has been on an indefinite hunger strike since the last four days claiming that Haryana is not releasing Delhi's share of water. pic.twitter.com/BZtG4o9ThS— ANI (@ANI) June 24, 2024 -
టీజీలో కొనసాగుతున్న జూడాల సమ్మె..రోగుల ఇక్కట్లు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. ఉపకార వేతనాలు చెల్లించి.. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదురోజుల క్రితం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయితే ప్రభుత్వం తరుపున ఎలాంటి స్పందన రాకపోవడంతో జూడాలు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో రోజులు గడుస్తున్నా ప్రభుత్వం చలించకపోవడంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఓపీ సేవల్ని బహిష్కరించి సమ్మె బాట పట్టారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. జూడాల నిర్ణయంతో పలు ఆస్పత్రులలో రోగులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించిన తమ సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.మరో వైపు వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఉపకార వేతనాల పెంపు, ఆస్పత్రులలో అసౌకర్యాలు, పలు సందర్భాలలో వైద్యులపై జరుగుతున్న దాడుల్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా 4వేలకు మందికి పైగా జూనియర్ డాక్టర్లు నిరవదిక సమ్మెను కొనసాగిస్తున్నారు.ఈ తరుణంలో సోమవారం మంత్రి దామోదర రాజనర్సింహంతో జూనియర్ డాక్టర్లు చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరారు. అందుకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ పలు అంశాలపై స్పష్టత రాలేదు. దీంతో జూడాలు తమ సమ్మెను యధాతథంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. -
నేటి నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్ల సమ్మె
-
రేపట్నుంచి జూనియర్ డాక్టర్ల సమ్మె
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: జూనియర్ డాక్లర్లు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈనెల 24 నుంచి అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఏడు ప్రధాన డిమాండ్ల సాధనలో భాగంగా సమ్మె చేపడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్జీ సాయిశ్రీహర్ష, ఐజక్ న్యూటన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో సమ్మెకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. శనివారం గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో భోజ న విరామ సమయంలో జూనియర్ డాక్టర్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. 24 నుంచి తలపెట్టే సమ్మెలో అత్యవసర సేవలు, ఐసీయూ సేవలు మినహా మిగతా అన్ని రకాల సర్వీసులు నిలిపివేయనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం స్పష్టం చేసింది. సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో ఔట్ పేషెంట్, వార్డు సర్వీసులు, ఎలక్టివ్ సేవలు మాత్రం నిలిచిపోనున్నాయి. కార్యక్రమంలో టీ–జూడా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహర్ష, గాంధీ యూనిట్ అధ్యక్షుడు వంశీకృష్ణ, సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హరీశ్లతోపాటు పీజీలు, హౌస్సర్జన్లు, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇవీ డిమాండ్లు » ఎలాంటి జాప్యం లేకుండా ప్రతి నెలా స్టైపెండ్ నిధులు విడుదల చేయాలి » సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్కు రూ.1.25 లక్షలు గౌరవ వేతనం చెల్లించాలి » ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనాన్ని నిర్మించాలి ళీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు 15 శాతం కోటా తొలగించాలి ళీ నూతన మెడికల్ కాలేజీల్లో వసతిగృహాలు, రవాణా, పరిశోధనశాల సదుపాయాలు కల్పించాలి » బోధనాస్పత్రులు, కాలేజీల్లో సెక్యూరిటీ ఔట్పోస్టు బలోపేతం చేయాలి » సెక్యూరి టీ ఔట్పోస్టు లేనిచోట కొత్తగా ఏర్పాటు చేయాలి -
ఢిల్లీ నీటి సమస్య పరిష్కరించకపోతే.. ప్రధానికి ఆప్ మంత్రి లేఖ
ఢిల్లీ: ఢిల్లీలో నీటి సంక్షోభం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీలో తాగునీటి సంక్షోభ పరిస్థితులు మెరుగుపడకపోతే సత్యాగ్రహ దీక్ష చేపడతామని జలనరుల శాఖ మంత్రి అతిశీ అన్నారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశాను. ఢిల్లీ నీటి సంక్షోభం సమస్యను తర్వగా పరిష్కరించాలని కోరాను. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించకపోతే జూన్ 21 నుంచి సత్యాగ్రహ దీక్ష చేపడతామని తెలిపాను. ఢిల్లీకి రావల్సిన నీటి వాటాను హర్యానా రాష్ట్రం విడుదల చేయటం లేదు. హర్యానా వ్యవహరిస్తున్న తీరుతో ఢిల్లీ ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.#WATCH | Delhi Water Minister Atishi says, "Today I have written a letter to the Prime Minister saying that 28 lakh people in Delhi are not getting water. I have requested that he should help provide water as soon as possible...If the people of Delhi do not get their rightful… pic.twitter.com/25aoBprKeN— ANI (@ANI) June 19, 2024 .. నిన్న హర్యానా ఢిల్లీకి రావాల్సిన 613 ఎంజీడీ నీటికి కేవలం 513 ఎంజీడీ నీరు విడుదల చేసింది. ఒక్క ఎంజీడీ నీరు 28, 500 మందికి సరిపోతాయి. అంటే హర్యానా విడుదల చేసిన నీరు కేవలం 28 లక్షల మందికి మాత్రమే సరిపోతాయి. ఇక నీటీ సమస్య అనేకసార్లు హర్యానా ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాను’’ అని మంత్రి అతిశీ తెలిపారు. -
మళ్లీ సోనమ్ వాంగ్చుక్ దీక్ష.. కారణమిదే!
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ దేశంలోని లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరవ షెడ్యూల్ను వెంటనే అమలు చేయాలని కోరుతూ లేహ్లో 21 రోజుల నిరాహార దీక్షకు దిగారు. మార్చి 7న ప్రారంభమైన ఈ నిరాహార దీక్ష 21 రోజుల పాటు కొనసాగనుంది. సోనమ్ వాంగ్చుక్ ఎవరు? సోనమ్ వాంగ్చుక్ వృత్తిరీత్యా ఇంజనీర్, ఆవిష్కర్తగా, వాతావరణ పరిరక్షణకు పాటుపడే వ్యక్తిగా పేరొందారు. లడఖ్లోని విద్యా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తూ ‘స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఆఫ్ లడఖ్’ను స్థాపించారు. కృత్రిమ హిమానీనదాలను సృష్టించే మంచు స్థూప సాంకేతికతను రూపొందించారు. ఇందుకోసం ఆయన 2018లో రామన్ మెగసెసే అవార్డు, 2017లో గ్లోబల్ అవార్డ్ ఫర్ సస్టైనబుల్ ఆర్కిటెక్చర్ అవార్డులను అందుకున్నారు. లడఖ్కు రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్ అమలు డిమాండ్తో వాంగ్చుక్ మరోసారి నిరాహారదీక్షకు దిగారు. ఇవే డిమాండ్లతో గత ఏడాది జనవరిలో ఐదు రోజుల పాటునిరాహార దీక్ష చేశారు. అది కూడా 18 వేల అడుగుల ఎత్తులో -40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మధ్య నిరాహార దీక్షకు దిగారు. లడఖ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని వాంగ్చుక్ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. హిమాలయాల్లో పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పిన ఆయన, ఈ అంశానికి ప్రభుత్వం తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. వాంగ్చుక్ తన దీక్షతో యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. త్రీ ఈడియట్స్ సినిమాలో.. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్లు నటించిన ‘త్రీ ఇడియట్స్’లో అమీర్ ఖాన్ పోషించిన రాంచో పాత్ర వాంగ్చుక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రం 2009లో విడుదలైంది. అప్పుడు వాంగ్చుక్ గురించి దేశంలోని అందరికీ తెలిసింది. అయితే ఈ సినిమా తన బయోపిక్ కాదని, వినోదం కోసం తన జీవితం నుండి ప్రేరణ పొందారని పలు సందర్భాల్లో వాంగ్చుక్ స్పష్టం చేశారు. #SAVELADAKH #SAVEHIMALAYAS Sonam Wangchuk appeals to the world to live simply, starts #ClimateFast of 21 days (extendable till death) Please watch full video in English here:https://t.co/XHkcIdQQ7b#ILiveSimply #MissionLiFE #ClimateActionNow pic.twitter.com/KQi5EMro9X — Sonam Wangchuk (@Wangchuk66) March 6, 2024 -
సమ్మెకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సైరన్?
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రైల్వేతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. 2024, మే ఒకటి నుంచి చేపట్టబోయే ఈ సమ్మెలో 28 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మూడు కోట్లకుపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాలు పాల్గొననున్నట్లు తెలిపాయి. ప్రస్తుతం అమవుతున్న జాతీయ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) స్థానంలో పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని పునరుద్ధరించాలని ఈ ఉద్యోగులంతా డిమాండ్ చేస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ జాయింట్ ఫోరమ్(జేఎఫ్ఆర్ఓపీఎస్) ఢిల్లీలో నిర్వహించిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో మార్చి 19న ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇవ్వాలని ఫోరమ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ అంశంపై కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయించినట్లు ఫోరమ్ కన్వీనర్, ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) ప్రధాన కార్యదర్శి శివ గోపాల్ మిశ్రా తెలిపారు. -
కోల్ ఇండియాలో 16న సమ్మె సైరన్
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా నిలిచిన కోల్ ఇండియాలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16న ఒకరోజుపాటు మెరుపు సమ్మె చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దేశీయ బొగ్గు ఉత్పత్తిలో 80 శాతం వాటా కలిగిన కోల్ ఇండియా సిబ్బంది సమ్మె బాటపడుతుండటంతో బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపనుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సమ్మె చేయడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఈ సమ్మెలో హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ, ఐఎన్ఎంఎఫ్, సీఐటీయూ యూనియన్లు పాల్గొంటున్నాయి. ఇదీ చదవండి: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. -
'వాలెంటైన్స్ డే' రోజు షాకివ్వనున్న డ్రైవర్లు, డెలివరీ బాయ్స్!
మెరుగైన వేతనం, మెరుగైన పరిస్థితుల కోసం వాలెంటైన్స్ డే సందర్భంగా టేక్అవే డెలివరీ డ్రైవర్లు సమ్మె (స్ట్రైక్) చేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే డెలివరూ, ఉబెర్ ఈట్స్తో సహా నాలుగు ఫుడ్ యాప్ల డ్రైవర్లు, రైడర్లు ఈ స్ట్రైక్లో పాల్గొంటారని సమాచారం. రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫుడ్-ఆర్డరింగ్ యాప్లలో పనిచేసే వేలమంది డెలివరీ వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. దీనికి సంబంధించి 'డెలివరీజాబ్ యూకే' ఇన్స్టాగ్రామ్ పేజీలో ఓకే పోస్ట్ చేశారు. ఇందులో చాలీచాలని వేతనాలకు నిరంతరాయంగా పని చేయడం కంటే మా హక్కుల కోసం కొన్ని గంటలు త్యాగం చేయడం చాలా అవసరమని వెల్లడించారు. స్ట్రైక్ చేయడానికి కారణం, 'ప్రతి రోజూ దోపిడీకి గురవుతూ, మా జీవితాలను పణంగా పెట్టి అలసిపోయాము. ఇది మా గొంతులను వినిపించాల్సిన సమయం వచ్చింది. మేము చేసే పనికి మాకు న్యాయమైన పరిహారం కావాలి' అని చెప్పడమే. డెలివరీ జాబ్ చేసే యూకే డ్రైవర్లు ప్రతి డెలివరీకి 2.80 పౌండ్స్ నుంచి 3.15 పౌండ్స్ మధ్య సంపాదిస్తారు. ఈ చెల్లింపు కనీసం 5 పౌండ్స్కు పెరగాలని కోరుకుంటున్నారు. యూకేలో మాత్రమే కాకుండా యూఎస్లో దాదాపు 1,30,000 మంది డ్రైవర్లు ఈ సమ్మెకు మద్దతు తెలియజేయనున్నట్లు జస్టిస్ ఫర్ యాప్ వర్కర్స్ తెలిపింది. ఇదీ చదవండి: ఈ స్కిల్ మీలో ఉంటే చాలు.. ఉద్యోగం రెడీ! View this post on Instagram A post shared by Delivery Job UK (@deliveryjobuk) -
అంగన్వాడీల సమస్యలపై సర్కారు సానుభూతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి అంగన్వాడీల సమస్యలపై సానుభూతితో వ్యవహరిస్తోందనీ, ఆయన ఆదేశాలతో ఇప్పటి వరకు మూడు సార్లు చర్చలు జరిపామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారికి వీలైనంతవరకూ మేలు చేసేందుకే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని చెప్పారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అంగన్వాడీ యూనియన్ ప్రతినిధులతో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాత్రి చర్చలు జరిపారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ అంగన్వాడీల కోర్కెలు అన్యాయమని అనడంలేదని, ప్రభుత్వ ఇబ్బందులను కూడా వారు గుర్తించాలని కోరామని చెప్పారు. నెల రోజులుగా సమ్మె చేస్తున్నా వారిపై ఎటువంటి ఇబ్బందికర చర్యలు చేపట్టలేదన్న విషయాన్ని గమనించాలని తెలిపారు. రాష్ట్రంలో ఏడు లక్షల మంది పిల్లలకు ఆహారం, గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీకి నెల రోజులుగా ఇబ్బంది ఏర్పడిందనీ, వారికి సేవలు అందకపోవడంవల్ల పేద వర్గాలే ఇబ్బంది పడుతున్నాయనీ, పరిస్థితిని అర్థం చేసుకుని సమ్మెను విరమించాలని కోరుతున్నామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... అడిగినవన్నీ ఆమోదించాం.. ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణ యం తీసుకున్నాం. దానిపై వారు మరోసారి ప్రతిపా దించడంతో వర్కర్లకు రూ.1.20లక్షలకు, హెల్పర్లకు రూ.50 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. సర్వీసులో ఉండగా చనిపోతే గతంలో రూ.3వేలే ఇచ్చే వారు. దాన్ని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రూ.25 వేలు ఇవ్వాలని కోరగా రూ.20 వేలు ఇస్తామన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు, పదోన్నతుల వయో పరిమితి 40 నుంచి 50 ఏళ్లకు అంగీకరించాం. టీఏ, డీఏలు, హౌస్ రెంట్ అలవెన్స్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఇచ్చేలా ఆమోదించాం. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చేందుకు అంగీకారం తెలిపాం. మిగిలిన డిమాండ్లు కూడా సమ్మె విరమిస్తే ప్రాధాన్యత క్రమంలో తీరుస్తాం. వేతనం పెంపుపై పట్టు తగదు.. చంద్రబాబు హయాంలో అంగన్వాడీలకు ఇచ్చిన వేతనం ఎంత? వైఎస్ జగన్ ఇస్తున్న వేతనం ఎంత? అనేది అంగన్వాడీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2014లో అంగన్వాడీ వర్కర్లకు రూ.4,200, హెల్పర్లకు రూ.2,200, అదే 2016లో రూ.7 వేలు, రూ.4,500 ఇచ్చారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనం పెంచుతామని పాదయాత్రలో జగన్ హామీ ఇవ్వడంతో ఎన్నికల ఆర్నెల్ల ముందు చంద్రబాబు వేతనాలు పెంచినా... సక్రమంగా అందించలేదు. ఇచ్చిన మాట ప్రకారం జగన్ అధికారం చేపట్టిన వెంటనే జూలైలో వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7వేలకు వేతనాలు పెంచారు. చంద్రబాబు హయాంలో వర్కర్లకు సగటున నెలకు రూ.6,100 మాత్రమే వస్తే... జగన్ పాలనలో నాలుగున్నరేళ్లుగా రూ.11,500 ఇస్తున్నారు. వేతనాల పెంపునకు గడువు కోరాం ప్రభుత్వానికి ఆర్థిక పరమైన అంశాలను అంచనా వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరం వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చాం. 2019 జూలైలో వేతనాలు పెంచాం. కనీసం ఐదేళ్లు గడువు ఇవ్వాలని చెప్పాం. వచ్చే జూలైలో ఆమోదయోగ్యమైన విధంగా వేతనాలు పెంచుతామనీ, సమ్మె విరమించాలని కోరాం. యూనియన్లు ఇప్పటికైనా ఆలోచించాలి. రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, పిల్లలు నెల రోజులుగా ఇబ్బందులు పడుతున్నా అంగన్వాడీల సమ్మె విషయంలో సంయమనం పాటించాం. ఎస్మా విషయంలో రాజకీయ పార్టీలు, అంగన్వాడీలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక రాజకీయ అజెండాతో రెచ్చగొడుతున్న ప్రతిపక్షాల డైరెక్షన్లో అంగన్వాడీలు వెళితే నష్టపోక తప్పదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఇందుకోసం గురువారం నుంచి నోటీసులు ఇస్తోంది. పది రోజుల గడువు ఇచ్చి కొత్త వారిని నియమించుకుంటాం. తెగే వరకు సమస్యను సాగదీయకుండా అంగన్వాడీలు అర్థం చేసుకుని సమ్మె విరమించాలి. -
అంగన్వాడీలు మెట్టు దిగడం లేదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ప్రభుత్వం మూడు దఫాలుగా అంగన్వాడీలతో చర్చించిందని.. సమస్యలు పరిష్కరించే ఉద్దేశం ఉంది కాబట్టే చర్చలు జరిపామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మూడో దఫాలో మంత్రి వర్గంతో అంగన్వాడీ కార్మికులు, సంఘాలు చర్చలు జరిపాయి. చర్చల అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘‘వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని చెప్పాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్ నెరవేర్చారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే జీతాలు పెంచాం. వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని చెప్పాం. అంగన్వాడీల టీఏ, డీఏలు కూడా ఫిక్స్ చేస్తున్నాం. ప్రభుత్వం వైపు నుంచి సానుకూలంగా వ్యవహరించాం. వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది’’ అని సజ్జల అన్నారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల ఎప్పుడూ పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని, గర్భిణీలు, పసిబిడ్డలకు ఇబ్బంది కలగకూడదనే ఎస్మాన పరిధిలోకి తెచ్చామని సజ్జల స్పష్టం చేశారు. ఈ సమ్మె కాలంలో.. అంగన్వాడీ కేంద్రాల్లో ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశాం. అంగన్వాడీలు విధుల్లో చేరాలని ప్రభుత్వం తరఫున కోరారాయన. ఈ సమ్మె వెనుక పొలిటికల్ ఎజెండా ఉంది. ఈ పోలిటికల్ ఎజెండాతో అంగన్వాడీలు నష్టపోతారు. వారు విధుల్లో చేరకుంటే నిబంధనలు ప్రకారం కొత్తవారిని రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది అని సజ్జల పేర్కొన్నారు. -
పపువా న్యూగినీలో అల్లర్లు..
పోర్ట్ మోర్స్బీ: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూగినీ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేతనాల్లో కోతకు నిరసనగా పోలీసులు సమ్మెకు దిగడంతో జనం దుకాణాలు, కార్లకు నిప్పుపెట్టారు. సూపర్మార్కెట్లను దోచుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగం, అధిక ధరలు ఆకాశాన్నంటడంతో అసంతృప్తితో జనం రగిలిపోతున్నారు. బుధవారం పోలీ సులు, ఇతర విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు పార్లమెంట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాల్లో 50 శాతం వరకు కోతపెట్టడాన్ని నిరసించారు. అయితే, కంప్యూటర్లో పొర పాటు కారణంగానే వేతనంలో కోత పడిన ట్లు ప్రధాని చెప్పారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని ఆందోళనకారులు పార్లమెంట్ భవనం లోపలికి చొచ్చుకెళ్లారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆవరణలోని కారుకు నిప్పుపెట్టారు. గేటును విరగ్గొట్టారు. అనంతరం సాధారణ ప్రజానీకం వారికి తోడైంది. అందరూ కలిసి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి యథేచ్ఛగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణల్లో రాజధానిలో 8 మంది, దేశంలోని రెండో అతిపెద్ద లే నగరంలో ఏడుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. రాజధాని పోర్ట్ మోర్స్బీలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అదనంగా బలగాలను రప్పించారు. 14 రోజుల పాటు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని ప్రధానమంత్రి జేమ్స్ మరపీ ప్రకటించారు. బుధవారం సాయంత్రానికే పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నట్లు ప్రధాని చెప్పారు. సోషల్ మీడియా లో అసత్యాల ప్రచారమే పరిస్థితికి కారణ మని నిందించారు. పోలీసులు లేకపో వడంతో అవకాశవాదులు రెచ్చిపోయారన్నారు. -
అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదనే..
సాక్షి, అమరావతి: బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలకు అందాల్సిన అత్యవసర సేవల్లో ఇబ్బంది లేకుండా ఉండేందుకు అంగన్వాడీల సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ఈ చర్యను సమర్థించిన రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు.. ఎన్నికల ముందు బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో అంగన్వాడీలు సమ్మెకు దిగడాన్ని తప్పుబట్టాయి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నాయి. వాస్తవానికి దేశంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనాలు ఇచ్చే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని, వీరి వేతనాల నిమిత్తం కేంద్రం కేవలం రూ. 1,800 మాత్రమే ఇస్తున్నా మిగతా భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపాయి. చాలా రాష్ట్రాల్లో వారికి ఇచ్చే వేతనం రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకు మాత్రమే ఉందని చెప్పాయి. కాగా, ఇప్పుడు అంగన్వాడీలను ఇష్టమొచ్చిన మాటలతో రెచ్చగొడుతున్న విపక్ష నేత చంద్రబాబు.. తాను అధికారంలో ఉన్న 2000వ సంవత్సరంలో ఉద్యోగులను గుర్రాలతో తొక్కించాడన్నది పచ్చి నిజం. మళ్లీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్ల పాటు వారికి కేవలం రూ. 4 వేలు మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత రెండున్నరేళ్లు రూ. 7 వేలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల వేతనాన్ని తెలంగాణతో సమానంగా పెంచుతామని 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయే కొద్ది నెలల ముందు హడావుడిగా వారి వేతనాన్ని రూ. 10,500కు పెంచి దానిని అమలు చేయలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అంగన్వాడీల వేతనాన్ని రూ. 11,500కు పెంచి చెల్లిస్తోంది. రెండేళ్ల పాటు కోవిడ్ సంక్షోభంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది తలెత్తినా ఎప్పుడూ ప్రభుత్వం వెనకడుగు వేయని ప్రభుత్వ పరిస్థితిని అంగన్వాడీలు అర్థం చేసుకోకపోవడం ఏంటని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకే ఎస్మా.. అత్యంత బలహీనులకు పౌష్టికాహార పంపిణీ తదితర సేవలకు విఘాతం కలగకుండా ఉండేందుకు అంగన్వాడీలు ఆరు నెలల పాటు సమ్మె చేయకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నెలలో 25 రోజుల చొప్పున ఏడాదిలో 300 రోజులపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తోంది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గత నెల 12 నుంచి సమ్మెకు దిగడంతో ప్రజల్లో అత్యంత బలహీనులైన వారికి పౌష్టికాహార పంపిణీలో అవరోధం ఏర్పడింది. ఇప్పటికే పలుమార్లు వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం వారి 11 డిమాండ్లలో 10 ఆమోదించి అమలుకు చర్యలు చేపట్టింది. అయినప్పటికీ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఆరేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార పంపిణీ నిలిచిపోయింది. పిల్లల గ్రోత్ మోనిటరింగ్ నిర్వహణ, ఇమ్యూనైజేషన్, ఆరోగ్య పరీక్షలు, వైద్య సేవలు ఆగిపోయాయి. సమ్మె కారణంగా 7.5 లక్షల ప్రీ స్కూల్ పిల్లలు అంగన్వాడీలకు రావడం తగ్గిపోయి ప్రస్తుతం రెండు లక్షలే వస్తున్నారు. కొత్తగా పిల్లల నమోదు కూడా ఆగిపోయింది. ప్రతి నెల సుమారు 45 వేల మంది గర్భిణులు, బాలింతలకు సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజల ప్రయోజనార్థం తప్పనిసరి పరిస్థితుల్లో ‘ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్విసెస్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్–1971(ఎస్మా)’ను ప్రయోగిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరు నెలలపాటు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. ప్రోత్సాహకాలిస్తున్న ప్రభుత్వం ఇది.. ♦ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోని ఐదేళ్ల కాలంలో అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ. 6,950, అంగన్వాడీ సహాయకులకు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున (నెలకు) రూ.3,900 మాత్రమే చెల్లించింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలున్నగురేళ్లుగా వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7 వేలు చొప్పున పెంచిన వేతనాలు అందిస్తోంది. అంతేగాక మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ. 500 చొప్పున ఇస్తోంది. ఏడాదికి సుమారు రూ. 27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. -
సమ్మె విరమించండి.. సమస్యలు పరిష్కరిస్తాం
సాక్షి, అమరావతి: మున్సిపల్ కార్మికులు కోరిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కార్మికులు సమ్మె విరమిస్తే పది రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించి ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పురపాలక సంఘాలు, కార్పొరేషన్ల పరిధిలో సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సంఘాల ప్రతినిధులతో శనివారం రాష్ట్ర సచివాలయంలో మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. ఈ సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, సీడీఎంఏ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్మిక సంఘాల నుంచి రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు వి.రవి కుమార్ (వైఎస్సార్టీయూసీ), ఎ.రంగనాయకులు (ఏఐటీయూసీ), కె. ఉమామహేశ్వరరావు (ఏపీసీఐటీయూ), జి.రఘురామరాజు (టీఎన్టీయూసీ), బాబా ఫకృద్దీన్ (ఏపీఎంఈడబ్లు్యయూ), జీవీఆర్కేహెచ్ వరప్రసాద్, కె.శ్రీనివాసరావు (ఏఐసీటీయూ), ఆర్.సత్యం (జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్), ఇ.మధుబాబు (ఏపీ ఇంజినీరింగ్ టౌన్ ప్లానింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్) హాజరయ్యారు. చర్చల అనంతరం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్డ్, అన్ స్కిల్డ్ వర్కర్లకు ఒకే తరహా వేతనాలు మినహా, మిగిలిన అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరించి పది రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు. ఆ హామీలు ఇవీ.. ♦ సీవరేజీ మరణాలకు సుప్రీం కోర్టు ఆదేశానుసారం రూ.30 లక్షలు పరిహారం చెల్లించాలని కార్మికులు కోరారు. సుప్రీం తీర్పును అమలు చేస్తాం. ♦ సరండర్ లీవ్ బిల్లులు విడుదల చేస్తాం ♦ రెగ్యులర్ కార్మికులకు పీఎఫ్ అకౌంట్ చెల్లింపులు చేస్తాం ♦ పారిశుద్ధ్య కార్మికులు కాని వారి కేటగిరీల మార్పుపై ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలపై సత్వరమే చర్యలు తీసుకుంటాం ♦ గతంలో చనిపోయిన కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచడానికి అంగీకారం ♦ కోవిడ్ మరణాల ఎక్స్గ్రేషియా చెల్లింపునకు మరోసారి దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తాం ♦ కాల్వలు, బాత్రూం క్లీనర్స్, సీవరేజ్, గార్బేజ్ సిబ్బంది, మలేరియా వర్కర్స్ వంటి 10 కేటగిరీల సిబ్బందికి వేతనం, అలవెన్స్ కలిపి రూ.21 వేల వేతనాన్ని ఒకేసారి అందిస్తాం. ప్రస్తుతం ఇస్తున్న 15 వేలు, రూ.6 అలవెన్స్ స్థానంలో మొత్తం కలిపి జీతంగా పరిగణించాలని కార్మికులు కోరారు. అందుకు అంగీకరించాం. ♦ వాటర్ సప్లైలో పని చేస్తున్న నైపుణ్యం గల పొరుగు సేవల కార్మికులకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ నిచ్చి సర్టిఫికెట్లు అందజేస్తాం ♦ మరణించిన పొరుగు సేవల కార్మికుల దహన సంస్కారాలకు ఇస్తున్న ఖర్చులను పెంచుతాం ♦ నాన్ పబ్లిక్ హెల్త్ వర్కర్ల కేటగిరీ సమస్యలను అన్నింటినీ పది రోజుల్లో పరిష్కరిస్తాం. ♦ పొరుగు సేవల నుంచి రిటైర్ అయిన కార్మికులకు రూ.50 వేలు ఇస్తాం. అయితే, వారు సర్వీసును కనీసం 10 ఏళ్లు పూర్తి చేయాలి. ఆపై సర్విసు పూర్తి చేసిన వారికి ఏడాదికి రూ.2 వేల చొప్పున అదనంగా చెల్లిస్తాం ♦ అన్ స్కిల్డ్ వర్కర్లకు కూడా స్కిల్డ్ వర్కర్లతో సమానంగా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది నిబంధనలకు విరుద్ధం. అన్ స్కిల్డ్ వర్కర్లు కూడా చదువుకుని ఐటీఐ వంటి స్కిల్ సర్టిఫికెట్ సాధిస్తే వారికీ స్కిల్డ్ వేతనం అందిస్తాం. ఇందుకోసం వారికి చదువుకునే అవకాశం కూడా కల్పిస్తాం. -
అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు నీచ రాజకీయాలు
సాక్షి అమరావతి: అంగన్వాడీల సమ్మెపై చంద్రబాబు, లోకేశ్ నీచ రాజకీయాలు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సమ్మె విరమించాలని అంగన్వాడీలకు విజ్ఞప్తి చేశామన్నారు. వారు అత్యవసర సర్విసుల కిందకు వస్తారని, అందుకే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాలింతలు, గర్భిణిలకు సేవల్లో ఇబ్బంది రాకూడదనే ఎస్మా తీసుకొచ్చామని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ‘గర్భిణిలు, బాలింతలు, పిల్లలకు ఆహారం ఇవ్వడం అత్యవసర సేవ కాదా? అందుకే అలా చేశాం. వారి డిమాండ్లలో 90 శాతం నెరవేర్చాం. ఒకటి రెండు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్పింది అధికారంలోకి రాగానే అమలు చేశాం. ఇప్పుడు ఎన్నికల తర్వాత మిగతా డిమాండ్లు కూడా కచ్చితంగా అమలుచేస్తామనే చెప్పాం. ఇప్పుడే కావాలని వారు అంటున్నారు. ఆ బరువు ఇప్పుడు ప్రభుత్వం మోయలేదు. ముందు సమ్మె విరమించండి అని రిక్వెస్ట్ చేశాం. ఇంతకంటే పొలైట్గా గతంలో ఏ ప్రభుత్వం అయినా ఉందా?. చంద్రబాబు ఏనాడైనా ఇంత సంయమనంతో ఉన్నాడా? తుపాకులతో కాల్పులు జరిపింది ఎవరు. గుర్రాలతో తొక్కించింది ఎవరు అంటే చంద్రబాబే కనిపిస్తారు. చంద్రబాబు నైజాన్ని పుణికి పుచ్చుకున్న లోకేశ్ మా గురించి సీఎం జగన్ గురించి విమర్శలు చేయడం విడ్డూరం. ఇక అంబటి రాయుడు కొద్దిరోజుల క్రితమే పార్టీలో చేరారు. ఆయన ఏ రీజన్తో వచ్చారో, దేనికి రాజీనామా చేశారో అనేది తెలియదు. కొద్దికాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ట్వీట్లో తెలిపారు. పూర్తి వివరాలు తెలిశాక స్పందిస్తాం. -
ఇప్పటికైనా గ్రహిస్తారా?!
సదుద్దేశమే ఉండొచ్చు... సత్సంకల్పమే కావొచ్చు... బాధిత వర్గాలకు బాసటగా నిలవాలన్నదే ధ్యేయం కావొచ్చు. కానీ చట్టాల రూపకల్పనలో, విధాన నిర్ణయాల్లో సంబంధిత వర్గాలను సంప్రదించటం అవసరమని మరోసారి రుజువైంది. ఎవరు పిలుపునిచ్చారో, వారి డిమాండ్లేమిటో స్పష్టత లేదు. కానీ చెదురుమదురుగా మొదలైన ట్రక్కు ఆపరేటర్ల మూడురోజుల సమ్మె 48 గంటలు గడవకుండానే దేశవ్యాప్తంగా తీవ్ర గందరగోళం సృష్టించింది. నిత్యావసరాలకు కొరత ఏర్పడి జనం అల్లాడారు. పలు రాష్ట్రాల్లో చేంతాడంత క్యూలు పుట్టుకొచ్చాయి. చివరకు ట్రక్కు ఆపరేటర్ల సంఘాలతో మాట్లాడాకే చట్టం అమలు చేస్తామని కేంద్ర హోమ్ శాఖ హామీ ఇవ్వటంతో మంగళవారం సాయంత్రానికి సమ్మె విరమించారు. వలసపాలనలోని చట్టాలన్నిటినీ ప్రక్షాళన చేసి, కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని ఆ మధ్య కేంద్రం ప్రకటించింది. మొన్న ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వాటి తాలూకు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా జరిగిన ట్రక్కు ఆపరేటర్ల మెరుపు సమ్మె భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని నిబంధనలపైనే! గతంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తున్నామంటూ కేంద్రం మూడు చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాలపై దాదాపు ఏడాదిన్నరపాటు రైతులు సాగించిన ఉద్యమంతో చివరకు ఆ చట్టాలను వెనక్కు తీసుకోకతప్పలేదు. దాన్నుంచి తెలుసుకున్న గుణపాఠాలేమిటో గానీ... పాత నేర చట్టాలకు పాతరేస్తున్నామంటూ తీసు కొచ్చిన కొత్త చట్టాల పైన కూడా అలాంటి వివాదమే బయల్దేరింది. తమ వాదనేమిటో తెలుసు కోకుండా ఈ నిబంధనలు పెట్టారని ట్రక్కు ఆపరేటర్లు అంటున్నారు. పార్లమెంటులో ఆ చట్టాలపై చర్చ జరిగింది. కానీ ఆ సమయంలో భిన్నస్వరం వినిపించగలిగిన విపక్షంలో అత్యధికులు సస్పెండయ్యారు. చట్టసభల్లో వుండే మెజారిటీతో అధికారపక్షాలు ఎలాంటి బిల్లులనైనా సులభంగా దాటించవచ్చు. కానీ అమలు సమయంలో సమస్యలు తలెత్తుతాయని గ్రహించలేనంత అమాయ కత్వంలో పాలకులుంటే ఎలా? మన రహదారులు తరచు రక్తసిక్తమవుతున్నాయి. ట్రక్కు ఆపరేటర్ల నిర్లక్ష్యమో, అజాగ్రత్తో కానీ ఏటా వేలాదిమంది ప్రాణాలు బలవుతున్నాయి. గత నెలలో విడుదలైన 2022 నాటి జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల ప్రకారం ఆ సంవత్సరం దేశంలో 47,806 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంటే సగటున రోజుకు 140 మంది, గంటకు ఆరుగురు చనిపోయారు. కేంద్రం విడుదల చేసిన రోడ్డు ప్రమాదాల నివేదిక గణాంకాలు మరోలా వున్నాయి. దానిప్రకారం 2022లో రోడ్డు ప్రమాదాల్లో 67,387 మంది మరణించారు. అంటే సగటున రోజుకు 85 మంది,గంటకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలకు అందని దుర్మరణాలు మరెన్ని వున్నాయో చెప్పలేం. వీటిని అరికట్టడం కోసం కఠిన చట్టం తీసుకురావాలని కేంద్రం చాన్నాళ్లుగా అనుకుంటోంది. 2019లో అందుకోసం మోటారు వాహనాల చట్టాన్ని సవరించారు కూడా! కానీ భారీ జరిమానాలు వసూలు చేయటం మొదలెట్టిన కొద్దిరోజులకే వెల్లువెత్తిన వ్యతిరేకత కారణంగా దాదాపు అన్ని రాష్ట్రాలూ ఆ చట్టాన్ని అటకెక్కించాయి. ఈసారి బీఎన్ఎస్ వంతు వచ్చింది. వాస్తవానికి అదింకా అమల్లోకి రాలేదు. కానీ అది అమలైతే వాహనాల డ్రైవర్లకు కఠిన శిక్షలుంటాయి. ప్రస్తుతం అమల్లోవున్న ఐపీసీలోని 304ఏ ప్రకారం ప్రమాదకారకులై, పరారీ అయిన డ్రైవర్లకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష, జరిమానా విధిస్తున్నారు. కానీ బీఎన్ఎస్లోని 106/2 ప్రకారం అలాంటి డ్రైవర్లకు పదేళ్ల వరకూ జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా ఉంటుంది. పరారీ కావటానికి ట్రక్కు ఆప రేటర్లు చెబుతున్న కారణాలు వేరే వున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు తప్పు ఎవరిదైనా స్థానికులు తమనే బాధ్యుల్ని చేసి కొట్టి చంపడానికి, వాహనాన్ని తగలబెట్టడానికి లేదా లూటీ చేయటానికి ప్రయత్నిస్తారని అందువల్లే అక్కడి నుంచి నిష్క్రమించడానికి ప్రయత్నిస్తామని వారి వాదన. అందుకే ట్రక్కు ఆపరేటర్లు సమ్మెకు దిగారు. ఒక బలమైన వర్గం దేన్నయినా వ్యతిరేకిస్తే ఏ చట్టమైనా ఆగి పోవాల్సిందేనని ఈ అనుభవం నిరూపిస్తోంది. బీఎన్ఎస్ ఇంకా అమల్లోకి రాలేదని, రోడ్డు ప్రమాదాల నిబంధనలపై అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్తో చర్చించాకే అమలు చేస్తామని తాజాగా కేంద్రం చెబుతోంది. వలసపాలకులు తెచ్చిన చట్టాల స్థానంలో ‘మనవైన’ చట్టాలుండాలని ఉబలాటపడటం మంచిదే! అందుకోసం సంబంధిత వర్గాలతో ముందే చర్చించివుంటే, కనీసం విపక్షాలతో సహా అందరూ తమ అభిప్రాయాలు తెలియజేసేవరకూ బిల్లుల ఆమోదాన్ని ఆపివుంటే వ్యవహారం వేరేగా ఉండేది. నిజానికి రోడ్డు ప్రమాదాల విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వుండటం లేదని సాధారణ ప్రజానీకం భావిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకో, ఇతరేతర ప్రలోభాలకో లొంగి పోలీసులు ప్రమాద కారకుల్ని తప్పిస్తున్న ఉదంతాలు సరే, నిబంధనలు కూడా సరిగా లేవని నిపుణుల వాదన. కనుక బీఎన్ఎస్లో నిర్దేశించిన శిక్షలు, జరిమానాలు సరైనవేనని వారి వాదన. కానీ చట్ట రూపకల్పన ప్రక్రియ సరిగా సాగకపోవటం వల్ల సమస్య తలెత్తింది. అమల్లోకి రాకముందే సవరణలు చేయక తప్పని స్థితి ఏర్పడింది. రహదారులు మన ఆర్థిక వ్యవస్థకు రక్తనాళాల వంటివి. అవి ఆరు లేన్లు, ఎనిమిది లేన్లుగా విస్తరించాయి. కానీ వాటి నిర్మాణం, నిర్వహణ, వాహనాల అదుపు సక్రమంగా లేకపోతే ప్రమాదాలు ముంచుకొస్తాయి. ఇందుకు ట్రక్కు ఆపరేటర్లను మాత్రమే బాధ్యుల్ని చేసి చేతులు దులుపుకునే కంటే మెరుగైన పరిష్కారాలు వెదకటం ఉత్తమం. -
రోజంతా అల్లాడించి...రోడ్డెక్కిన ట్రక్కులు
న్యూఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రతిపాదిత కఠిన చట్టాలను నిరసిస్తూ లారీలు, ట్రక్కుల డ్రైవర్లు చేపట్టిన సమ్మె మంగళవారం దేశవ్యాప్త గందరగోళానికి, అత్యవసర సేవల్లో తీవ్ర అంతరాయానికి దారి తీసింది. ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడింది. సమ్మె రోజుల పాటు కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో దేశమంతటా వాహనదారులంతా పెట్రోల్ బంకులకు పోటెత్తారు. దాంతో ఎక్కడ చూసినా బంకుల ముందు భారీ క్యూ లైన్లే దర్శనమిచ్చాయి. ఇది నగరాలు, పట్టణాల్లో భారీ ట్రాఫిక్ జామ్లకు దారితీసింది. అత్యధిక బంకుల్లో చూస్తుండగానే నిల్వలు అడుగంటి నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. వంట గ్యాస్ సిలిండర్లతో పాటు కాయగూరలు, ఇతర నిత్యావసరాల సరఫరా కూడా నిలిచిపోయి జనం తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. కేంద్రంతో ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రికి ఫలించాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా వారికి హామీ ఇచ్చారు. దానిపై ఏఐఎంటీసీతో లోతుగా చర్చించాకే నిర్ణయం తీసుకునేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సర్వత్రా నో స్టాక్...! రోడ్డు ప్రమాద మృతికి బాధ్యుడైన వాహనదారు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుండటం తెలిసిందే. వాటి రద్దు డిమాండ్తో మహారాష్ట్ర తదితర చోట్ల సోమవారం నుంచే మూడు రోజుల సమ్మెకు దిగారు. అది మంగళవారాకల్లా దేశమంతటా విస్తరించింది. దాంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటింది. పెట్రోల్ బంకులన్నీ జనంతో పోటెత్తి కన్పించాయి. కిలోమీటర్ల పొడవున వాహనదారులు బారులు తీరారు. నో స్టాక్ బోర్డు పెట్టి బంకులను మూసేయడం ఉద్రిక్తతకు, గొడవలకు దారి తీసింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. మరోవైపు డ్రైవర్లు కూడా తమ లారీలు, ట్రక్కులను హైవేలపై రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను కూడా అడ్డుకుంటూ కన్పించారు. -
సానుకూలంగానే మున్సిపల్ కార్మికులతో చర్చలు: మంత్రి ఆదిమూలపు
గుంటూరు, సాక్షి: పారిశుధ్య కార్మిక సంఘాల ప్రతినిధులతో మంత్రివర్గ ఉపసంఘం చర్చలు ముగిశాయి. అయితే చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ.. సానుకూలంగానే జరిగినట్లు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. పలు డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగానే స్పందించిందని పేర్కొంటూ.. చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించారు. ‘‘కార్మికుల డిమాండ్ మేరకు హెల్త్ అలవెన్స్ రూ.6 వేలు ఇచ్చాం. ఎక్స్గ్రేషియాపై సానుకూలంగా స్పందించాం. సమానపనికి సమాన వేతనంపై చర్చించాం. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చాం. దాని మేరకే చర్యలు తీసుకున్నాం. ఇవాళ్టి చర్చలు సానుకూలంగా సాగాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్మికులు సమ్మె విరమించాలని కోరుతున్నాం. మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో ఇతర సమస్యలపైనా చర్చిస్తాం’’ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. పారిశుద్ధ్య సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఝ చర్చలు జరిపింది. మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు బొత్స సత్యనారాయణతో పాటు ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ ఫే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు & శాశ్వత ఉద్యోగులుగా క్రమబద్దీకరించడం తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఝ చర్చలు జరిగాయి. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా సుదీర్ఝ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ, సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్), వై.వి.రమణ (YSRTUC ప్రధాన కార్యదర్శి), ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు), పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్), శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్), అంజినీయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు), కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. -
Truck Drivers Protest: రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ట్రక్కు డ్రైవర్ల సమ్మెపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పందించారు. రోడ్ యాక్సిడెంట్ల కేసుల్లో శిక్షను భారీగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత చట్ట సవరణ చేయడాన్ని షెహన్షాకా ఫర్మానాగా ఆయన అభివర్ణించారు. ఈ మేరకు మంగళవారం రాహుల్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు. ‘150 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షంతో చర్చించకుండా చట్టాలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడే. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి డ్రైవర్లకు వ్యతిరేకంగా చేసిన చట్ట సవరణ వల్ల తీవ్ర పరిణామాలుంటాయి. కష్టపడి పనిచేసుకుని జీవితాలు గడిపే డ్రైవర్ల జీవితాలను చట్టాల పేరు చెప్పి ఇబ్బందుల పాలు చేయడం సరికాదు. ఈ చట్టాన్ని కొన్ని వ్యవస్థలు దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడే అవకాశం ఉంది’అని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో సోమవారం(జనవరి 1) నుంచి దేశంలోని పలు నగరాల్లో బంకులకు పెట్రోల్, డిజిల్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆయా నగరాల్లో వాహనదారులు మంగళవారం ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెట్రోల్ కోసం ద్వి చక్ర వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. ఇదీచదవండి..ట్రక్కు డ్రైవర్ల ఆందోళనపై స్పందించిన కేంద్రం -
HYD: బంకుల్లో నో పెట్రోల్.. వాహనదారుల ఇబ్బందులు
సాక్షి,హైదరాబాద్: ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో సమ్మెతో రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. సోమవారం( జనవరి 1) నుంచి ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగడంతో బంకులకు పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంలో చాలా వరకు పెట్రోల్ బంకులు మంగళవారం మూసివేశారు. బంకుల ముందు నో స్టాక్ బోర్డులు పెట్టారు. అయితే తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు హైదరాబాద్లో వాహనదారులు పెట్రోల్ కోసం క్యూ కట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ పెట్రోల్ బంకుల్లో తీవ్ర ఇంధన కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా పెట్రోల్ బంకులు మూసివేయడం పట్ల వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో తెరచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యాన్లతో బారులు తీరడం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్లకు దారి తీసింది. కొన్ని చోట్ల పెట్రోల్ బంకులకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన తీసుకొచ్చిన మోటార్ వాహనాల చట్టసవరణ బిల్లుకు వ్యతిరేకంగా ట్యాంకర్ డ్రైవర్లు ఈ సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. రోడ్లపై ప్రమాదానికి పాల్పడి పారిపోతే వాహన యజమానులు, డ్రైవర్లకు పదిలక్షల జరిమానా, ఏడేళ్లు జైలు శిక్ష విదించేలా ఇటీవలే చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తీసుకువచ్చింది. అయితే అనుకోకుండా జరిగే ప్రమాదాల విషయంలోనూ ఇది వర్తింపు ఉంటుంది కాబట్టి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఆగ్రహానికి గురైన ట్యాంకర్ల యజమానులు చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. ఇదీచదవండి.. చలాన్ల చెల్లింపుపై వాహనదారులకు పోలీసుల హెచ్చరిక -
ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కారించకపోతే ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు స్పష్టం చేశారు. మంగళవారం టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు సాక్షి మీడియాతో మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకంతో ప్రయాణికులు సంఖ్య పెరిగిందని, రద్దీ పెరిగితే బస్సులు పాడవుతున్నాయన్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు ఎక్కడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించారు. ప్రమాదానికి ఇన్య్సూరెన్స్ రాకపోతే మాపై కేసులు పెడుతున్నారు. కొత్త బస్సులకు టెండర్లు పిలిస్తే కూడా ఎవరు టెండర్లు వేయలేదు. ఇందులో గిట్టుబాటు కావడం లేదు. టెండర్లు వేయొద్దని కోరుతున్నాం’’ అని అద్దె బస్సుల యజమానులు పేర్కొన్నారు. ఇదీ చదవండి: నేను ఎక్కడికి పారిపోలేదు: బైరి నరేష్ -
ప్రభుత్వం సానుకూలంగా ఉంది.. సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని, సమ్మె విరమించి బాలింతలు, తల్లులు, పిల్లలకు సేవలందించాలని ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేసింది. అంగన్వాడీల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్రెడ్డితో కూడిన అధికారుల బృందం మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మరోమారు చర్చించింది. ఈ చర్చల్లో మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ జవహర్రెడ్డి మాట్లాడుతూ.. అంగన్వాడీల సమ్మె కారణంగా బాలింతలు, తల్లులు ఇబ్బంది పడుతున్నారని, అర్థం చేసుకుని సమ్మె విరమించి సహకరించాలని అన్నారు. జనవరి 5 నుండి అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణిలు, బాలింతలు, చిన్నారులకు టేక్ హోం రేషన్ కిట్లు, ఇతర సరుకులు పంపిణీ చేయాల్సి ఉన్నందున సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేయాలని విజ్ణప్తి చేశారు. సంక్రాంతి తర్వాత మరలా కూర్చుని చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకుందామని కోరారు. అంగన్వాడీల 11 డిమాండ్లలో ఒక్కటి తప్ప 10 డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించిందని వివరించారు. వాటిని అమలు చేస్తూ జీవోలు కూడా జారీ చేశారని గుర్తు చేశారు. పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 ఏళ్ళకు, పదోన్నతి వయస్సు 45 నుండి 50 ఏళ్ళకు పెంపు, టీఏ, డీఏలు, అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చే సేవా ప్రయోజనం రూ.50 వేల నుంచి రూ. లక్షకు పెంపు, సహాయకులకు ఇచ్చే సేవా ప్రయోజనాన్ని రూ.20 వేల నుండి రూ.40 వేలకు పెంచడం వంటి వాటికి సంబంధించిన జీవోలు ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. మిగిలిన వాటిపై కూడా రెండు, మూడు రోజుల్లో జీవోలు జారీ చేస్తుందని తెలిపారు. గౌరవ వేతనం పెంపు అంశం ఒక్కటే మిగిలి ఉందని, దీనిపై సంక్రాంతి తర్వాత చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుందాని చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, వేతనాల పెంపునకు కొంత సమయం కావాలని అడిగారు. అంగన్వాడీల గ్రాట్యుటీ అంశం తమ పరిధిలో లేదని, దీనికి సంబంధించి కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పారు. తాము బెదిరించడం లేదని, సమ్మె విరమించాలని కోరుతున్నామని మంత్రి బొత్స వివరించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) చిరంజీవి చౌదరి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, డైరెక్టర్ విజయ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, వేతనాలు పెంచకపోతే ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీ యూనియన్ నేతలు ప్రకటించారు. చర్చల్లో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.సుబ్బరావమ్మ, రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, ఉపాధ్యక్షురాలు సుప్రజ, అంగన్వాడీ హెల్పర్ల సంఘం ఉపాధ్యక్షురాలు రమాదేవి, ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షురాలు గంగావతి, ఉపాధ్యక్షురాలు జి.భారతి, కార్యదర్శి వీఆర్.జ్యోతి, ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ప్రేమ, ఉపాధ్యక్షురాలు ఫ్లారెన్స్, ప్రధాన కార్యదర్శి జె.లలిత తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి
సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్ ఎంప్లాయి మెంట్ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలి డేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు. సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్ మల్టీ నేష నల్స్తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్లు వచ్చే పరిస్థితి లేదు. బొగ్గు బ్లాక్ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి. - ఎం.డి. మునీర్ - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం -
TS: ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె నిర్ణయంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని జూడా ప్రతినిధులు మీడియాకు తెలిపారు. టైం టు టైం స్టైఫండ్ రిలీజ్తో పాటు పలు డిమాండ్లతో సమ్మెకు వెళ్లాలని జూనియర్ డాక్టర్లు భావించారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాళ్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ వాళ్లతో చర్చించారు. డిమాండ్లకు ఆయన సానుకూలంగా స్పందించడంతో జూడాలు వెనక్కి తగ్గారు. స్టైఫండ్ కోసం గ్రీన్ఛానెల్ ఏర్పాటుతోపాటు ప్రతి నెలా 15వ తేదీ లోపు స్టైఫండ్ విడుదలయ్యేలా చూస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా జూడాలకు హామీ ఇచ్చారు. అలాగే హాస్టల్స్ వసతులతో పాటు కొత్త హాస్టల్స్ ఏర్పాటును పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రికి కొత్త భవనం నిర్మిస్తామని జూడాలతో మంత్రి చెప్పారు. అంతేకాదు.. జాతీయ వైద్య మండలి నిబంధనల ప్రకారమే అన్ని వసతులు కల్పిస్తామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని జూడాల ప్రతినిధులు తెలిపారు. సమ్మె నిర్ణయంపై జూనియర్ డాక్టర్లతో చర్చించి వీలైనంత త్వరగా తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. -
మానవతా దృక్పథంతో సమ్మె విరమించండి
సాక్షి, అమరావతి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రతిపాదించిన అనేక అంశాల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మానవతా దృక్పథంతో సమ్మెను విరమించాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లు, హెల్పర్లు పలు డిమాండ్లపై సమ్మెచేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమణ కోసం ప్రభుత్వం శుక్రవారం మరోదఫా సానుకూలంగా చర్చలు జరిపింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కె.వి.ఉషశ్రీ చరణ్, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి, మహిళా శిశుసంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలతో చర్చలు జరిపారు. యూనియన్ నేతలు ప్రస్తావించిన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రులు వివరించారు. ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు కూడా గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించిందన్నారు. కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ను ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.1 లక్షకు పెంచేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. హెల్పర్లకూ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయించిందన్నారు. సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్ కోసం గరిష్ట వయో పరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకరించిందని తెలిపారు. కార్యకర్తలకు టీఏ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని నిర్ణయించిందని తెలిపారు. గ్రాట్యుటీ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది కావడంతో లేఖరాశామని, దానిపైన కూడా కేంద్రం ఆమోదంతో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో మేలు గతంతో పోల్చుకుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక వేతనాన్ని అంగన్వాడీ కార్యకర్తలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. మంచి పనితీరు కనబర్చిన వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ఇస్తున్నామని, ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. 2013 నుంచి అంగన్వాడీలకు ప్రమోషన్లు ఇవ్వలేదని, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఈ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిందని చెప్పారు. 560 గ్రేడ్–2 సూపర్వైజర్ పోస్టులను భర్తీచేసిందన్నారు. సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 సంవత్సరాలకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలకు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి వారికి రూ.1,313 కోట్లు అందించిందని, నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతుభరోసా, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వర్తింపజేసిందని వివరించారు. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు అందించిందని, డేటా చార్జీల కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోందని తెలిపారు. ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు రూ.2 లక్షల జీవిత బీమాను వర్తింపజేస్తోందని, రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించిందని చెప్పారు. అంగన్వాడీల్లో కూడా మంచి వసతులు, సదుపాయాలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం నాడు–నేడు ద్వారా అనేక చర్యలు చేపట్టిందన్నారు. గతంతో పోలిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశతోపాటు వర్కర్లు, హెల్పర్లకు ఎంతో మేలు జరిగిందనే విషయాన్ని గుర్తించాలని కోరారు. తాజాగా ప్రతిపాదించిన అనేక అంశాలపైనా సానుకూలంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. అత్యంత అణగారిన వర్గాలకు చెందిన వారికి పౌష్టికాహార పంపిణీ సమ్మె కారణంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని అర్థం చేసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. అన్నీ అంగీకరించినప్పటికీ ఒక్క వేతనం పెంపు విషయంలోనే అంగన్వాడీ యూనియన్ నేతలు పట్టువీడకపోవడం గమనార్హం. -
అంగన్వాడీలపై సానుకూలం
సాక్షి, అమరావతి: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన దృష్టికి వచ్చిన వాటిని సంబంధిత శాఖ ద్వారా పరిశీలించి పలు అంశాల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంది. సంబంధిత యూనియన్లతో విస్తృతంగా చర్చించిన అనంతరం మేలు చేసేలా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్చల ద్వారా పలు అంశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా అత్యంత అణగారిన వర్గాలకు చెందిన బాలింతలు, పసిపిల్లలు, చిన్నారులు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారం నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున వెంటనే ఆందోళన విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. లేని పక్షంలో విధులకు గైర్హాజరైనట్లుగా భావించి సంబంధించిన జీవోల ప్రకారం కలెక్టర్లు చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఆమోదం తెలిపిన అంశాలివీ.. ♦ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచాలని నిర్ణయం. ♦ అంగన్వాడీ కార్యకర్తలకు తమ సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ ఇప్పుడున్న రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచేందుకు నిర్ణయం. ♦ హెల్పర్లకు సర్వీసు చివరి నాటికి బెనిఫిట్ రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ నిర్ణయం. ♦ సహాయకులకు అంగన్వాడీ కార్యకర్తలుగా అవకాశం కల్పించేందుకు గరిష్ట వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచేందుకు అంగీకారం. ♦ టీఏ, డీఏలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి విడుదల చేయడానికి ఆమోదం. ♦ రాష్ట్రంలో అవకాశం ఉన్న మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చేందుకు నిర్ణయం. మేలు చేసిన సీఎం జగన్ ♦ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు మేలు చేస్తూ పలు చర్యలు తీసుకుంది. అందులో కొన్ని ఇవీ.. గత అసెంబ్లీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు వరకూ టీడీపీ హయాంలో అంగన్వాడీల జీతం నెలకు రూ.7 వేలు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అంగన్వాడీల జీతాలను పెంచుతూ జీఓ 18 జారీ చేసింది. అంగన్వాడీల జీతాలను రూ.11,500కి పెంచుతూ 2019 జూన్ 26న జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేసింది. గత నాలుగేళ్లుగా పెంచిన వేతనం అమలవుతోంది. ♦ అంగన్వాడీ కార్యకర్తలతోపాటు మినీ అంగన్వాడీ వర్కర్లకు కూడా గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకూ రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. ♦ సహాయకులకు గత ఎన్నికలకు ముందు వరకు రూ.4,500 మాత్రమే ఉన్న జీతాన్ని సీఎం జగన్ రూ.7 వేలకు పెంచారు. వీటిని జీవో 18 ద్వారా ప్రభుత్వం వెంటనే అమల్లోకి తెచ్చింది. ♦ టీడీపీ హయాంలో 2019 వరకూ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.6,950, అంగన్వాడీ సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలకు సగటున రూ.3,900 మాత్రమే చెల్లించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి జీతాలు పెంచి అందించింది. ♦ మంచి పనితీరు కనబర్చిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు ప్రోత్సాహకంగా నెలకు రూ.500 చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.27.8 కోట్లు ప్రోత్సాహకాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. ♦ 2013 నుంచి అంగన్వాడీలకు పదోన్నతులు (ప్రమోషన్లు) ఇవ్వలేదు. గత సర్కారు దీన్ని పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చింది. 560 గ్రేడ్–2 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసింది. ♦ సూపర్వైజర్ పోస్టుల పరీక్షలు రాసే వారి వయోపరిమితిని 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతూ వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. తొమ్మిదేళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి వయో పరిమితి పెంపు ఎంతో ఉపయోగపడింది. ♦ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులను అర్హులుగా గుర్తించి రూ.1,313 కోట్లు అందించింది. జగనన్న విద్యాదీవెన, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ తదితర పథకాలను వారికీ వర్తింపజేసింది. రూ.85.47 కోట్లతో 56,984 స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి వారికి అందించింది. డేటా ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తూ అదనంగా డేటా కూడా ఇస్తోంది. 2023 జూలై 1 నుంచి ఇది అమలవుతోంది. డేటా కోసం ఏడాదికి రూ.12 కోట్లు చెల్లిస్తోంది. ♦ ఈ ఏడాది నుంచి వర్కర్లు, హెల్పర్లకు జీవిత బీమాను వర్తింపచేస్తూ ప్రమాద బీమాగా రూ.2 లక్షల వరకూ చెల్లిస్తోంది. ♦ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.16 కోట్ల విలువైన యూనిఫాం శారీలు అందించింది. నాడు–నేడు ద్వారా అంగన్వాడీల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ♦ గర్భిణులు, బాలింతలు, పిల్లలకు హోం రేషన్ పద్ధతిని అమలు చేస్తోంది. 2023 నుంచి డ్రై రేషన్ అందిస్తోంది. -
అలెర్ట్, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్ సేవలపై ఎఫెక్ట్!
బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్. డిసెంబర్, జనవరిలో అత్యవసరమైన బ్యాంక్ పనులున్నాయా? ఉంటే ఇప్పుడే చూసుకోండి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్ 4 నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆల్ ఇండియా బ్యాంక్ అసోసియేషన్కి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగులు డిసెంబర్ 4 నుంచి స్ట్రైక్ చేయనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘అన్ని బ్యాంకులలో తగినంత సిబ్బందిని నియమించాలి. బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాల ఔట్సోర్సింగ్ లేదా, అవుట్ సోర్సింగ్కు సంబంధించిన బీపీ సెటిల్మెంట్ నిబంధనల ఉల్లంఘనను ఆపాలి’ అని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సమ్మెలో ప్రైవేట్ బ్యాంకులు సైతం ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు సైతం సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11న సమ్మెకు దిగనుండగా.. జనవరి 19, 20 తేదీలలో స్ట్రైక్ చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం డిసెంబరు 4న ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ల సమ్మెలతో అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి. రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె అయితే, జనవరి 2 నుండి సమ్మె ఆయా రాష్ట్రాల వారీగా కొనసాగుతుంది. జనవరి 2తో ప్రారంభమైన ఈ స్ట్రైక్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, లక్ష్వదీప్లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మె నిర్వహించనున్నారు. యూపీ, ఢిల్లీ బ్యాంకుల సమ్మె ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు వరుసగా జనవరి 4, 5 తేదీలలో మూసివేయబడతాయి. రెండు రోజుల సమ్మెలో ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి. చదవండి👉 డొక్కు స్కూటర్పై సుబ్రతా రాయ్ జీవితం ఎలా మొదలైంది? చివరికి అనాధలా -
కస్టమర్లకు అలర్ట్: దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న ఉద్యోగులు
న్యూఢిల్లీ: డిసెంబరు నెలలో దేశవ్యాప్త సమ్మెకు దేశంలోని పలు బ్యాంకులు సిద్ద మవు తున్నాయి. దీంతో బ్యాంకింగ్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉంది. డిసెంబరు 4 నుంచి 11 వరకు బ్యాంకు ఉద్యోగుల సమ్మె జరగనుంది. ఈ మేరకు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండు లక్షల ఉద్యోగాలను భర్తి , బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ సిబ్బందికి స్వస్తి అనే ప్రధాన డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ రంగ పలు బ్యాంకులు సమ్మెలో భాగం కానున్నాయి. డిసెంబర్ 4 -11 వరకు బ్యాంకుల వారీగా సమ్మె కొనసాగుతుంది. బ్యాంకుల్లో తగినంత శాశ్వత సిబ్బందిఉండేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. బ్యాంకు ఉద్యోగాల అవుట్సోర్సింగ్ వల్ల దిగువ స్థాయిలో రిక్రూట్మెంట్ను తగ్గించడమే కాకుండా కస్టమర్ల గోప్యత , వారి డబ్బు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే బ్యాంకుల వివరాలను ఆయన ట్విటర్లో షేర్ చేశారు. డిసెంబరు 4న ఎస్బీఐ, పీఎన్బీ, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ సమ్మె చేయనున్నాయి. అలాగే డిసెంబరు 5న బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, డిసెంబరు 6న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ఉద్యోగులు సమ్మెను పాటిస్తారు.అలాగే డిసెంబరు 7న యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, డిసెంబరు 8న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, డిసెంబరు 11న ప్రైవేటు బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. #BankStrike#2lakhbankjobs #bankrecruitment #AIBEA pic.twitter.com/YkbNeE87kK — CH VENKATACHALAM (@ChVenkatachalam) November 14, 2023 -
మొదటికొచ్చిన ఏఎన్ఎంల పంచాయితీ
సాక్షి, హైదరాబాద్/సుల్తాన్ బజార్: రెండో ఏఎన్ఎంల ఆందోళన వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేసి అధికారుల హామీతో విరమించిన ఏఎన్ఎంలు... హామీలు నెరవేరకపోవడంతో తిరిగి సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ ప్రజారోగ్య సంచాలకుడి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. గత కొన్నాళ్లుగా ఏఎన్ఎంలు ఆందోళనలు, నిరసనలు చేస్తుండటం తెలిసిందే. అందులో భాగంగా ఆగస్టు 16 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవగా ప్రభుత్వం నాలుగుసార్లు వారితో చర్చలు జరిపింది. సెప్టెంబర్ ఒకటిన యూనియన్ నేతలతో జరిగిన చర్చల్లో ఏఎన్ఎంల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేయాలని నిర్ణయించింది. దీంతో ఒప్పందం ప్రకారం అదే నెల నాలుగో తేదీ నుంచి ఏఎన్ఎంలు సమ్మె విరమించారు. ఒప్పందంలో భాగంగా సెపె్టంబర్ నెల 15గా పీఆర్సీ బకాయిలతోపాటు సమ్మె కాలపు వేతనాన్ని ఈ నెల జీతంతో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. కానీ సమ్మె విరమించి నెల రోజులైనా ఇప్పటివరకు తమ డిమాండ్లను పరిష్కరించలేదని ఏఎన్ఎంలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ఆందోళనకు దిగారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ♦ నోటిఫికేషన్లో ఇచ్చిన బేసిక్ పేతో 100 శాతం గ్రాస్ శాలరీ ఇవ్వాలి. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. రూ. 10 లక్షల ఆరోగ్య బీమా, ఏఎన్ఎంలు దురదృష్టవశా త్తూ మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్గ్రేíÙయాను అందించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోగా కారుణ్య నియామకం కింద కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని ఇవ్వాలి. ♦ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పూర్తి కాలానికి గ్రాట్యుటీ చెల్లించాలి. ♦ సమ్మె కాలానికి సంబంధించిన జీతం విడుదల చేయాలి. ♦ కరోనాకాలంలో మరణించిన రెండో ఎఎస్ఎంలను గుర్తించి వారి కుటుంబాలకు రూ. 5 లక్ష ల ఎక్స్గ్రేíÙయా చెల్లించడంతోపాటు వారి కుటుంబంలో ఒకరికి అర్హతను బట్టి కాంట్రాక్ట్ బేసిక్ లోనైనా సరే కారుణ్య నియామకం చేపట్టాలి. ♦ యూపీహెచ్సీల్లో పనిచేసే వారికి కూడా íపీహెచ్సీ వాళ్లకు ఇచ్చినట్లే రెండు మార్కుల వెయిటేజీ ఇవ్వాలి. ♦ నవంబర్ 10న జరిగే పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు వేతనంతో కూడిన ప్రిపరేషన్ హాలిడేస్ ఇవ్వాలి. ♦ పీహెచ్సీల్లో ఫస్ట్ ఏఎస్ఎంలు లేని సబ్ సెంటర్లలో పనిచేస్తున్న రెండో ఏఎస్ఎంకు రూ. 10 వేల అదనపు వేతనాన్ని అందించాలి. ♦ 8 గంటల పని విధానాన్ని అమలు చేస్తూ సాయంత్రం 6 గంటల తర్వాత ఏదైనా రిపోర్టు పంపాలని ఒత్తిడి చేయకూడదు. ♦ యూనిఫాం అలవెన్స్ కింద రూ. 4,500 ఇవ్వాలి. ♦ లక్ష్యాలను నిర్దేశిస్తూ జీతాలను నిలిపే ప్రక్రియను ఆపాలి. ♦ సమ్మె సందర్భంగా ఇచ్చిన షోకాజ్ నోటీసులను ఉపసంహరించుకోవాలి. ♦ వివాహం కాకముందు ఉద్యోగంలో నియమితులైన ఏఎస్ఎంలను వారి భర్తల సొంత మండలాలకు బదిలీ చేయడానికి అవకాశం కల్పించాలి. ∙పరీక్షను ఆఫ్లైన్లోనే ఓఎంఆర్ షీట్తో నిర్వహించాలి. -
24 గంటలు కరెంటు ఇవ్వాలి
గరిడేపల్లి: 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ బుధవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, ప్రస్తుతం పంట పొట్టదశలో ఉందని విద్యుత్ కోతలు విధించడంతో పొలాలు తడవక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతోందని, సబ్ స్టేషన్ నుంచి మాత్రం విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు. కనీసం 12 గంటలు అయినా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సాగర్ కాల్వకు నీటి సరఫరా చేయకపోయినా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా కొనసాగితే 80 శాతం పంట రైతులకు దక్కుతుందన్నారు. ధర్నాలో రైతులు సప్పిడి లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె విరమించండి.. సమస్యలుంటే పరిష్కరిస్తాం
సాక్షి,హైదరాబాద్/ వెంగళరావునగర్: అంగన్వాడీటీచర్లు, హెల్పర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించి చర్చలతో వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సంబంధించిన పలు అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని, జీఓలు జారీ అయ్యాక సమ్మెకు దిగడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. శుక్రవారం అమీర్పేటలోని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టరేట్లో మంత్రి సత్యవతిరాథోడ్ మీడియాతో మాట్లాడారు. అంగన్వాడీల్లో నమోదయ్యే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ఎక్కువమంది బలహీనవర్గాలకు చెందినవారే ఉన్నారని, విధులు బహిష్కరించి సమ్మె చేయడంతో వారంతా ఇబ్బంది పడే అవకాశం ఉందని, వారి సేవలను తక్షణమే కొనసాగించాలన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయలబ్ధి కోసమే అంగన్వాడీలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీల క్రమబద్ధీకరణ అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిదని, దానిని రాష్ట్రప్రభుత్వం నెరవేర్చడం సాధ్యం కాదని చెప్పారు. అంగన్వాడీల తరపున డిమాండ్లు కేంద్రానికి నివేదిస్తామని, అవసరమైతే స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి భారతి హోలికేరి, జేడీ లక్ష్మీదేవీ తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/ కైలాస్నగర్ (ఆదిలాబాద్)/జగిత్యాల క్రైం/సుభాష్ నగర్ (నిజామాబాద్): అంగన్వాడీల్లోని టీచర్లు, హెల్పర్లు తలపెట్టిన సమ్మె పదోరోజూ ఉధృతంగా కొనసాగింది. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. టీచర్లు, హెల్పర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు పెన్షన్, ఆరోగ్య పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఆదిలాబాద్లో జుట్లు పట్టుకుని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో పలువురు అంగన్వాడీలు, పోలీసులకు గాయాలయ్యాయి. అంగన్వాడీలను నిలువరించే క్రమంలో తలమడుగు ఎస్సై ధనశ్రీ ఓ అంగన్వాడీ జుట్టు పట్టుకుని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు అంగన్వాడీలు ఎస్సై ధనశ్రీని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. కొంతమంది అంగన్వాడీలు స్టేషన్కు చేరుకుని బైఠాయించడంతో కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. వారంతా తిరిగి కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగించడంతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా సమ్మె శిబిరానికి చేరుకున్న తర్వాత బేల మండలం సదల్పూర్ అంగన్వాడీ టీచర్ ప్రగతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాలలో పోలీసులపై దాడి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ముట్టడి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పలువురు అంగన్ వాడీలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు తదితరులు అంగన్వాడీల ఆందో ళనకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్కు కూడా అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు సీఐటీయూ నాయకులు గేట్లు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. -
సర్జికల్ స్ట్రైక్ హీరోకి మణిపూర్ అల్లర్ల బాధ్యతలు
ఇంఫాల్:మణిపూర్లో హింసాత్మక ఘటనల తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. శాంతియుత పరిస్థితులు నెలకొల్పడానికి కావాల్సిన అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కీలక అధికారిని నియమించింది. 2015లో మయన్మార్పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ లో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ ఆర్మీ అధికారి నెక్టార్ సంజెన్బామ్ను నియమించింది. Kirti Chakra for Lt Col Nectar Sanjenbam. Part of the Army's Myanmar cross-border strike. #IDay2015 pic.twitter.com/rNqfgb9o1o — Shiv Aroor (@ShivAroor) August 14, 2015 మణిపూర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కల్నల్ నెక్టార్ సంజెన్బామ్ను సీనియర్ సూపరింటెండెంట్గా ప్రభుత్వం నియమించింది. ఐదేళ్ల పాటు పదవిలో ఆయన కొనసాగనున్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆగష్టు 24న నియమాక ఉత్తర్వుల్లో పేర్కొంది. కల్నల్ నెక్టార్ సంజెన్బామ్కు అత్యున్నత పురష్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో పాటు మూడో అత్యున్నత పురస్కారం శౌర్య చక్ర కూడా ఇప్పటికే లభించాయి. సహసోపేతమైన నిర్ణయాలతో ఎలాంటి పరిస్థితుల్నైన చక్కదిద్దే వ్యూహాలను రచించగలరనే పేరు ఆయనకు ఉంది. Lt Col (Now Col) Nectar Sanjenbam, Kirti Chakra, Shaurya Chakra of 21 PARA SF. On 8 June 2015, he led his team nd carried out cross-border raid on insurgents in Myanmar to revenge the ambush on the soldiers of 6 DOGRA. The operation resulted in the eliminating of 300+ insurgents. pic.twitter.com/kf4PHuLrxg — Guardians_of_the_Nation (@love_for_nation) January 23, 2021 ఈ మేరకు కేబినెట్ జూన్ 12న నిర్ణయం తీసుకుందని ఆగష్టు 24న మణిపూర్ హోం శాఖ తెలిపింది. మణిపూర్లో మెయితీ, కుకీ తెగల మధ్య ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే రాష్ట్రంలో 12 మంది మరణించారు. 30 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అల్లరి మూకలను అణిచివేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెయితీ తెగ ప్రజలకు గిరిజన హోదా ఇవ్వాలని హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాష్ట్రంలో అశాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి. మెయితీ, కుకీ తెగల మధ్య మే 3న మొదటిసారి ఘర్షణలు జరిగాయి. ఇప్పటివరకు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనల్లో 170 మందికి పైగా మరణించారు. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
104 కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా
సుల్తాన్బజార్: తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని కోరుతూ 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం కోఠిలోని డీఎంహెచ్ఎస్ క్యాంపస్లో ధర్నా చేపట్టారు. తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనలో వందలాది మంది 104 సిబ్బంది పాల్గొన్నారు. తమను వెంటనే రెగ్యులర్ చేయాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న సుల్తాన్బజార్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షుడు భూపాల్ మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యశాఖలో పనిచేస్తున్న 104 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. గత నాలుగు నెలలుగా 104 కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 15 ఏళ్లుగా 104 ఉద్యోగులకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా చాలీ చాలని వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ధర్నాలో 104 ఉద్యోగ నాయకులు సుభాష్చందర్, గాదె శ్రీనివాస్, వెంకన్న, నవీన్, రచ్చ రవీందర్, విద్యాసాగర్, సతీష్ కృష్ణప్రసాద్, ఎండీ మాజిద్ పాల్గొన్నారు. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఆ దేశంలో పెట్రోల్ బంకులు బంద్
ఇస్లామాబాద్: పెట్రోల్ అమ్మకాలపై పాకిస్తాన్ ప్రభుత్వం మార్జిన్ పెంచని కారణంగా జులై 22 నుండి జులై 24 వరకు రెండు రోజులు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకులకు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది పాకిస్తాన్ పెట్రోల్ డీలర్ల సంఘం. పాకిస్తాన్ దేశం గత కొన్నాళ్ళుగా తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పాకిస్తాన్లో లీటరు పెట్రోల్ రూ.253 కాగా డీజిల్ ధర రూ. 253.50 గా ఉంది. అసలే ధరలు మండిపోతుంటే దాంట్లో మార్జిన్ పెంచాలని పట్టుబట్టింది పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్. గత కొంతకాలంగా పాకిస్తాన్ పెట్రోలియం డీలర్ల అసోషియేషన్ వారు పాక్ ప్రభుత్వం పెట్రోల్ ధరలపై తాము కోరిన విధంగా 5%(రూ.12) మార్జిన్ ఇవ్వాలని కోరుతుండగా షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం కేవలం 2.4%(రూ.6) మాత్రమే మార్జిన్ దక్కుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కారణంగా జులై 22, శనివారం నుండి జులై 24,సోమవారం వరకు నిరవధిక సమ్మె నిర్వహించ తలపెట్టింది డీలర్ల సంఘం. ఈ మేరకు శనివారం సాయంత్రం నుండే దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 10 వేల పెట్రోల్ బంకులను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఈ సందర్బంగా అంబులెన్స్, పాల వ్యాన్, పోలీసు వాహనాలు వంటి ఎమెర్జెన్సీ సేవలకు కూడా సర్వీసు నిలిపివేస్తున్నట్లు తెలిపారు సంఘం అధ్యక్షులు సైముల్లా ఖాన్. ఇది కూడా చదవండి: తుపాకి పేలడంతో భార్య మృతి.. అతనేం చేశాడంటే.. -
సినీ కార్మికుల సమ్మె.. రిలీజ్కు సిద్ధమైన భారీ బడ్జెట్ మూవీ!
క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎపిక్ బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్హైమర్ . యూనివర్సల్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇంగ్లీష్లో మాత్రమే జులై 21న విడుదలవుతుంది. ఈ మూవీ 2005లో కై బర్డ్, మార్టిన్ జె. షెర్విన్ రచించిన అమెరికన్ ప్రోమేథియస్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించారు. (ఇది చదవండి: అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!) మాన్హట్టన్ ప్రాజెక్ట్లో మొదటి అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడిన సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్హైమర్ గురించి ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ టైటిల్ క్యారెక్టర్గా నటించగా.. ఎమిలీ బ్లంట్, మాట్ డామన్, రాబర్ట్ డౌనీ జూనియర్, ఫ్లోరెన్స్ పగ్, జోష్ హార్ట్నెట్, కేసీ అఫ్లెక్, రామి మాలెక్, కెన్నెత్ బ్రానాగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి లుడ్విగ్ గోరాన్సన్ సంగీతమందించారు. హాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె.. ప్రభావం ఉండదన్న మేకర్స్ ఇప్పటికే ఏఐ వల్ల వచ్చే ముప్పుపై సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. తమ వేతనాలు పెంచాలని రోడ్డెక్కారు. ఇప్పటికే హాలీవుడ్లో అన్ని రకాల షూటింగ్లు నిలిచిపోయాయి. అయినప్పటికీ సినిమా విడుదలకు ఎటువంటి ప్రభావం ఉండదని యూనివర్సల్ పిక్చర్స్ ప్రకటించింది. ఆందోళనల నడుమ ఓపెన్ హైమర్ రిలీజ్ కానుంది. క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఒళ్లు గగుర్పాటు కలిగించే సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి. (ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్.. తొలిసారి స్పందించిన నటుడు! ) -
ఎంత పని చేశావ్ ఏఐ.. నీ దెబ్బకు అన్నీ మూసేయాల్సి వచ్చింది!
ఇప్పుడు ఎవరి నోటా విన్న ఒకటే మాట ఏఐ. అదేనండీ ఆర్టిఫిషీయల్ ఇంటలిజెన్స్. ఇటీవలే యాంకరమ్మను కూడా పరిచయం చేశారు కదా. తాజాగా ఈ సెగ హాలీవుడ్కు తాకింది. ఏఐ వచ్చి హాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తమ భవిష్యత్తు భరోసా ఇవ్వాలంటూ హాలీవుడ్కు చెందిన ది స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఏఐ నుంచి తమను కాపాడాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెతో హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్లు మరింత ఆలస్యంగా విడుదల కానున్నాయి. (ఇది చదవండి: అలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. కల్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్ ) నిర్మాణ స్టూడియోలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో గురువారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. దాదాపు 1,60,000 మంది నటీనటులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఇవే డిమాండ్లతో గత 11 వారాలుగా రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా కూడా సమ్మెకు దిగింది. తాజాగా నటీనటులు ధర్నాకు దిగడంతో హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మూతపడింది. చివరిసారిగా 1980లో నటీనటుల సంఘం చేపట్టిన సమ్మె మూడు నెలలకు పైగా కొనసాగింది. ఈ సమ్మె ఇలాగే కొనసాగితే భారీ సినిమాలు సైతం రిలీజ్ వాయిదా పడనున్నాయి. (ఇది చదవండి: నువ్వు లేకుండా ఆ సినిమాను ఊహించలేం.. డైరెక్టర్ ఎమోషనల్ ట్వీట్!) -
జేపీఎస్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్/తొర్రూరు: జూనియర్/ ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్/ఓపీఎస్) నిరవధిక సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు 16 రోజులుగా నిర్వహిస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు శనివారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జేపీఎస్లను రెగ్యులరైజ్ చేస్తారనే సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆ ధీమాతోనే సమ్మెను విరమిస్తున్నట్లు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె శ్రీకాంత్గౌడ్, ఇతర జిల్లాల నాయకులతో కలిసి మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో వెల్లడించారు. అంతకుముందు వరంగల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ (టీపీఎస్ఎఫ్) అధ్యక్షుడు ఎ.శ్రీకాంత్గౌడ్ తదితరులు కలిశారు. ఈ క్రమంలో తొలుత సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరాలని వారికి మంత్రి సూచించినట్టు సమాచారం. ఆది లేదా సోమవారాల్లో టీపీఎస్ఎఫ్ ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చిస్తామని మంత్రి హామీనిచ్చిన మీదట సోమవారం నుంచి విధుల్లో చేరనున్నట్టు సంఘం ప్రకటించింది. – జేపీఎస్ల వ్యవస్థ సృష్టికర్త కేసీఆరే కాగా, జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్తో 16 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక, శాంతియుత సమ్మె నిర్వహించామని, జేపీఎస్ల వ్యవస్థను సృష్టించిందే సీఎం కేసీఆర్ అని సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్ అన్నారు. జేపీఎస్ల వల్లే తెలంగాణకు కేంద్రం నుంచి 73 అవార్డులు వచ్చాయని, మున్ముందు సైతం అదే రీతిన పనిచేసి మంచి ఫలితాలు రాబడుతామని తెలిపారు. ఈనెల 15వ తేదీ (సోమవారం) నుంచి యథావిధిగా విధుల్లో కొనసాగుతామని స్పష్టం చేశారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ కఠిన వైఖరి ప్రభావంతోనే విరమణ? ప్రభుత్వం కఠినచర్యలకు దిగనున్నట్టు చేసిన ప్రకటన సమ్మె విరమణను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. శనివారంలోగా విధుల్లో చేరకుండా గైర్హాజరైన జేపీఎస్, ఓపీఎస్ల తొలగింపుతో పాటు వారి స్థానాల్లో తాత్కాలిక పద్ధతుల్లో నియామకాలు చేపట్టాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి దాకా సమ్మె కొనసాగించాలా వద్దా, విరమిస్తే పరిస్థితి ఏమిటి, కొనసాగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందనే దానిపై టీపీఎస్ఎఫ్ రాష్ట్ర,జిల్లా కమిటీల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగింది. సమ్మెలో ఉన్న జేపీఎస్లలోనూ పునరాలోచన మొదలైంది. దీనికి తగ్గట్టే శనివారం సాయంత్రానికి పలుజిల్లాల్లో పెద్దసంఖ్యలోనే జేపీఎస్లు విధుల్లో చేరినట్టు పీఆర్ కమిషనరేట్కు నివేదికలు అందాయి. ఇది సమ్మె విరమణ దిశగా ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం కూడా సమ్మె చేసిన జేపీఎస్ల పట్ల కొంత చూసీచూడనట్టు వ్యవహరించాలని భావిస్తున్నట్టు సమాచారం. జేపీఎస్ల సమ్మె విరమణ నేపథ్యంలో.. వారి స్థానంలో గతంలో జేపీఎస్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి నియామకం, గ్రామాల్లో స్థానికంగా డిగ్రీ పాసై, కంప్యూటర్ పరిజ్ఞానమున్న వారిని నియమించే ప్రక్రియను కూడా నిలిపేసినట్టు తెలుస్తోంది. -
సమ్మెలో జీపీఎస్లు.. ప్రభుత్వం ఆఫర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలంటూ జేపీఎస్లు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జీపీఎస్లు ఇప్పటికైనా విధుల్లో చేరాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం మరోసారి ఆఫర్ ఇచ్చింది. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపింది. ఈ క్రమంలో వారిని వెంటనే విధుల్లో చేరాలని సూచించింది. జీపీఎస్ల పట్ల ప్రభుత్వం సానుకూలతతో ఉన్నట్టు స్పష్టం చేసింది. గ్రామ పంచాయతీలకు అవార్డులు రావటంలో కార్యదర్శుల కృషి ఉంది. కొంత మంది తమ స్వలాభం కోసం వారిని రెచ్చగొట్టడం వల్ల జీపీఎస్లు సమ్మె చేస్తున్నారు. సమ్మె అనేది చివరి అస్త్రం. కానీ.. ముందు దశలోనే జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెకు వెళ్ళారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులైనప్పటికీ రాష్ట్రపతి దగ్గర అవార్డులు తీసుకునే అవకాశం దక్కింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ఏర్పాటు చేసిన పోస్టు.. పంచాయతీ కార్యదర్శులు. అలాంటిది ప్రభుత్వం పై ఉద్యోగులు నమ్మకంతో ఉండాలి అని సూచించింది. ఇక, అంతకుముందు కూడా జీపీఎస్లు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: నా ప్రాణానికి ముప్పు.. మోదీ, అమిత్షాకు ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖలు -
తగ్గేదేలే.. డెడ్లైన్ దాటినా సమ్మెలోనే జీపీఎస్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీల సమ్మె కొనసాగుతోంది. కాగా, సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం విధించిన డెడ్లైన్ ముగిసినా జీపీఎస్లు విధుల్లో చేరలేదు. ప్రభుత్వం హెచ్చరించినా తగ్గేదేలే అన్నట్టుగా జీపీఎస్లు సమ్మెలో ఉన్నారు. అయితే, కేవలం 800 మంది ఉద్యోగులు మాత్రమే విధుల్లో చేరినట్టు తెలుస్తోంది. కాగా, ఉద్యోగులు సమ్మె విరమించకపోవడంతో ప్రభుత్వ ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జేపీఎస్లు తక్షణమే విధుల్లో చేరాలని ఆయన కోరారు. గతంలో సమర్పించిన ఒప్పందాన్ని ఉల్లఘించవద్దని ఉద్యోగులకు చెప్పారు. ఇదిలా ఉండగా.. సమ్మె విషయంలో వెనక్కి తగ్గేది లేదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. తమను రెగ్యులర్ చేసే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. ఇక, రేపటి నుంచి కుటుంబ సభ్యులతో సమ్మెలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు. -
TS: ‘జేపీఎస్ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైంది’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు వెంటనే విధుల్లో చేరాలని లేనిపక్షంలో ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తప్పిస్తామని ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. దీంతో, వారికి మంగళవారం సాయంత్రం 5గంటలలోపు విధుల్లోకి చేరాలని గడువు ఇచ్చింది. ఈ క్రమంలో జూనియర్ సెక్రటరీలకు ప్రతిపక్ష నేతలు మద్దతు తెలుపుతున్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. తాజాగా జేపీఎస్ల సమ్మెకు కరీంనగర్లో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తే నోటీసులివ్వడం దుర్మార్గం. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్ వేతనాలు ఎందుకు పెంచడం లేదు. వెంటనే జేపీఎస్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి’ అని సీరియస్ అయ్యారు. మరోవైపు, జేపీఎస్ల సమ్మెపై టీపీసీసీ రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జేపీఎస్ల పరిస్థితి బానిసల కంటే హీనంగా తయారైందన్నారు. జేపీఎస్లతో గొడ్డు చాకిరీ చేయించుకుని వారి హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇది కూడా చదవండి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి! -
జేపీఎస్లను రెగ్యులర్ చేయండి.. కేసీఆర్కు జీవన్ రెడ్డి బహిరంగ లేఖ..
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీర్కు బహిరంగ లేఖ రాశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిబంధనల ప్రకారమే వారి నియామకం జరిగిందని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విధులు నిర్వర్తించిన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వమే హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. రెగ్యులర్ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే పంచాయతీ సెక్రెటరీలు సమ్మెకు దిగారని జీవర్ రెడ్డి పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు వాళ్లను రెగ్యులర్ చేయాలని కోరారు. కాగా.. తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీలు ఏప్రిల్ 29 నుంచి నిరవదిక సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. తమను క్రమబద్దీకరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి సమ్మెపై ప్రభుత్వం ఆగ్రహ్యం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసులు కూడా పంపింది. మంగళవారం సాయంత్రం 5:00 గంటల్లోగా సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. విధుల్లో చేరిన తర్వాత రెగ్యులర్ చేసే విషయంపై చర్చలు జరుపుతామని హామీ ఇచ్చింది. చదవండి: హైదరాబాద్లో నీడ మాయం.. రెండు నిమిషాల పాటు కన్పించని షాడో.. -
TS: జేపీఎస్లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రేపు సాయంత్రం 5గంటలలోపు సమ్మె విరమించి విధుల్లో చేరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ విధుల్లో చేరకుంటే శాశ్వతంగా తప్పించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో సమ్మెకు దిగారు. ఈ క్రమంలో రెగ్యులర్ చేసే దాకా సమ్మె ఆపేది లేదని సెక్రటరీలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు.. జూనియర్ సెక్రటరీలకు రాజకీయ పార్టీలు, నేతల మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వారికి మద్దతు ప్రకటించారు. జేపీఎస్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావటంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్ అని అన్నారు. ఇది కూడా చదవండి: TSRTC: చరిత్రలో తొలిసారి.. లాభాల్లోకి 45 డిపోలు.. గట్టెక్కించిన శుభ ముహూర్తాలు -
ఆర్టిజన్ల సమ్మె విరమణ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో ఆర్టిజన్ల సమ్మె ముగిసింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అహ్మద్ బలాల మధ్యవర్తిత్వం వహించడంతో సమ్మెను బేషరతుగా విరమించుకున్నట్టు .. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్ 82), ఎంఐఎం అనుబంధ ఇతెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. తమ డిమాండ్ల సాధనకు ఈ రెండు యూనియన్లు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు పిలుపునివ్వగా, విద్యుత్ సంస్థలపై పాక్షిక ప్రభావం కనబడింది. సమ్మెలో పాల్గొన్న యూనియన్ల ముఖ్య నేతలతో సహా 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించినట్టు ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనియన్ల నాయకుల విజ్ఞప్తితో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బుధవారం సీఎండీతో ఫోన్లో మాట్లాడారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి చేర్చుకుంటాం.. తొలగించిన ఉద్యోగులను తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకోవాలని ఒవైసీ కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎండీ ..బేషరతుగా సమ్మె విరమిస్తే 10 రోజుల్లోగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఇతేహాద్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే అహమద్ బలాల రెండు యూనియన్ల నేతలతో కలిసి విద్యుత్ సౌధలో ప్రభాకర్ రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డిని కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్టు హెచ్–82 యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు, ఇతెహాద్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ హుసేన్లు తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు సమానంగా ఆర్టిజన్లకు రూ.16లక్షల గ్రాట్యుటీతో పాటు మెడికల్ అన్ఫిట్ పథకం కింద కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశం కల్పించాలని విజ్ఞప్తి చేయగా, ప్రభాకర్రావు సానుకూలంగా స్పందించారని సాయిలు వెల్లడించారు. సమ్మె తొలిరోజే 200 మంది ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించడంతో బుధవారం రెండోరోజు సమ్మెకు ఆర్టిజన్లు సుముఖత వ్యక్తం చేయలేదని, ఈ కారణంగానే విరమణ ప్రకటన చేయాల్సి వచ్చిందని యూనియన్ల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేటి నుంచి ఆర్టి‘జనుల’ సమ్మె
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర విద్యుత్ సంస్థల్లోని ‘ఆర్టిజన్లు’ మంగళవారం ఉదయం 8 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతారని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 23 వేల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను గతంలో విద్యుత్ సంస్థలు ఆర్టిజన్ల పేరుతో విలీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టిజన్ల సమస్యల పరిష్కారానికి దీర్ఘకాలంగా పోరాడుతున్నా ఫలితం లేకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెబాటపట్టాలని.. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ (హెచ్82), ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్లు పిలుపునిచ్చాయి. కాగా, విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని, ఎవరైనా సమ్మెకు దిగినా, విధులకు గైర్హాజరైనా అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) ప్రయోగించి ఉద్యోగం నుంచి తొలగించాలని అధికారులకు విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీచేశాయి. దీంతో సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేయాలి.. రెగ్యులర్ విద్యుత్ ఉద్యోగులకు ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్ను, ఆర్టిజన్ల కోసం ‘స్టాండింగ్ ఆర్డర్స్’ పేరుతో ప్రత్యేక సర్వీస్ రూల్స్ను అమలుచేస్తున్నారు. అయితే, తమకూ ఎలక్ట్రిసిటీ బోర్డు సర్వీస్ రూల్స్ను వర్తింపజేయాలని ఆర్టిజన్లు డిమా ండ్ చేస్తున్నారు. అలాగే, 7% ఫిట్మెంట్తో వేతన సవరణ అమలు, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ నెల 15న విద్యుత్ ఉద్యోగ సంఘాల ఉభయ జేఏసీలతో సంస్థల యాజమాన్యాలు వేతన సవరణ ఒ ప్పందం కుదుర్చుకోగా, దీన్ని ‘ఆర్టిజన్ల’ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యార్హతలు, నైపుణ్యం ఆధారంగా ఆర్టిజన్లను రెగ్యులర్ పోస్టులకు తీసు కుని పదోన్నతి కల్పించాలని, 50% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని, కనీసం రూ.25 వేలకు తగ్గకుండా మాస్టర్ స్కేల్ను ఖరారు చేయాలని ఈ సంఘాలు సమ్మె నోటీసుల్లో కోరాయి. నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రభావం ! నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగింపులో ఆర్టిజన్ల సేవలు కీలకం. ఎక్కడ చిన్న అంతరాయం కలిగినా రంగంలో దిగి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తా రు. మరమ్మతులు, నిర్వహణ విభాగాల్లో వీరి సంఖ్యే అధికం. దీంతో ఆర్టిజన్లు పాక్షికంగా సమ్మెకి దిగి నా నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. సమ్మెలో పాల్గొంటే కఠిన చర్యలు విద్యుత్ సంస్థల్లో ఎస్మా కింద సమ్మెలపై నిషేధం అమల్లో ఉన్నందున ఆర్టిజన్లు పిలుపునిచ్చిన సమ్మె పూర్తిగా చట్టవిరుద్ధమని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు స్పష్టం చేశారు. సమ్మెకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏప్రిల్ 15న అన్ని ఉద్యోగ సంఘాలతో పాటే ఆర్టిజన్లకు కూడా సహేతుకమైన వేతన సవరణ చేశామన్నారు. కాగా, ఆర్టిజన్ల సమ్మెతో తమకు సంబంధం లేదని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ, టీఈఈ 1104 యూనియన్, టీఎస్పీఈయూ–1535, బీఆర్వీకేఎస్, టీఎస్ఈఈయూ–327 యూనియన్లు ప్రకటించాయి. (చదవండి: నేటి నుంచి బడులకు వేసవి సెలవులు) -
జొమాటోకు మరో ఎదురు దెబ్బ!
ట్రాఫిక్ కష్టాల్ని దాటుకుని వన్.. టూ.. త్రీ.. రన్ అంటూ పది నిమిషాల్లో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని డెలివరీ చేసే ఉద్యోగులు బ్లింకిట్కు భారీ షాకిచ్చారు. వారం రోజుల పాటు డెలివరీ ఉద్యోగులు చేసిన స్ట్రైక్ దెబ్బకు సంస్థ స్పందించకపోవడంతో ఇతర సంస్థల్లో చేరినట్లు తెలుస్తోంది. గతంలో కస్టమర్లకు కావాల్సిన వస్తువుల్ని గంటల్లో డెలివరీ చేస్తాం’ అంటూ సంస్థలు ప్రచారం చేసేవి. కానీ ఇప్పుడు అలాంటి మాటలు వినిపించడం లేదు. ఆర్డర్ పెట్టడం ఆలస్యం పదే పదినిమిషాల్లో మీ కాలింగ్ బెల్ కొట్టేస్తాం.. అంటున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు. ఆ కోవకే చెందుతుంది జొమాటోకి చెందిన బ్లింకిట్ అనే గ్రోసరీ యాప్. స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, బిగ్బాస్కెట్కు పోటీగా బ్లింకిట్ క్విక్ కామర్స్ సేవల్ని అందిస్తుంది. పది నిమిషాల్లో ఆర్డర్స్ను డెలివరీ చేయడంలో మంచి పేరు సంపాదించింది. కానీ ఆర్డర్ తీసుకొని బయలుదేరిన మరుక్షణం నుంచి సరుకును చేరవేసే వరకూ.. ప్రతిక్షణం ఒత్తిడికి గురయ్యే డెలివరీ ఉద్యోగులకు శ్రమకు తగ్గ వేతనాలు ఇవ్వడం లేదనే కారణంతో ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఇదివరకు డెలివరీపై రూ.50 ఉండే చార్జీని రూ.25కు తగ్గించిందని, ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.15 చేయడం వల్ల తమ ఆదాయం చాలా తగ్గిపోతోందని, న్యాయం చేయాలని కోరుతూ ఢిల్లీ - ఎన్సీఆర్ ప్రాంతాల్లో కార్యకలాపాల్ని నిలిపి వేశారు. దీంతో బ్లింకిట్ ఆయా స్టోర్ల కార్యకలాపాల్ని నిలిపి వేసింది. ఈ తరుణంలో నోయిడా, గ్రేటర్ నోయిడా, ఢిల్లీ గురుగావ్, గజియాబాద్, ఫరీదాబాద్లలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ఇతర కంపెనీల్లో చేరారు. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. బ్లింకిట్కు చెందిన ఢిల్లీ -ఎన్సీఆర్లలో దాదాపు వందల స్టోర్లు మూత పడ్డాయి. సమ్మెకు ముందు బ్లింకిట్ తన ప్లాట్ఫారమ్లో ఢిల్లీ-ఎన్సిఆర్లో దాదాపు 3,000 మంది డెలివరీ ఎగ్జిక్యూటివ్లు ఉండగా.. వారిలో మూడింట ఒక వంతు మంది ఇతర ఫ్లాట్ఫారమ్లలో కార్యకలాపాలకు ఉపక్రమించారు. బ్లింకిట్లో పని చేసే ఉద్యోగులు తక్కువ వేతనం కారణంగా ఇతర సంస్థల్లో చేరాల్సి వచ్చింది. వేతనం విషయంలో బ్లింకిట్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందని ఉద్యోగులకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు స్ట్రైక్తో బ్లింకిట్ భారీగా నష్టపోవడంతో కొత్త చెల్లింపు పద్దతిని అమలు చేయనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఇది యాపారం?..విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్! -
సమ్మెకు దిగితే బర్తరఫ్
సాక్షి, హైదరాబాద్: సమ్మెకు దిగిన ఆర్టీ జన్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇతర ఆర్టీ జన్లను సమ్మెకు పురిగొల్పినా లేక సమ్మెకు ఆర్థిక సాయం అందించినా ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేయాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు ట్రాన్స్కో సీఎండీ డి. ప్రభాకర్రావు, ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఎ.గోపాల్రావు, జి. రఘుమారెడ్డి శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇతెహద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సమ్మెకు సమయం దగ్గర పడడంతో విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తీవ్ర చర్యలకు ఉపక్రమించాయి. విద్యుత్ ఉద్యోగుల తో పాటు ఆర్టీ జన్లకు7 శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీ అమలు తోపాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగ సంఘాల తో కార్మిక శాఖ సమక్షంలో పారిశ్రామిక వివాద పరిష్కార చట్టం లోని సెక్షన్ 12(3) కింద ఒప్పందం చేసుకున్నామని, దీనికి విరుద్ధంగా పైన పేర్కొన్న రెండు సంఘాలు సమ్మెకు వెళ్తుండడం చట్ట విరుద్ధమని యాజమాన్యాలు తేల్చి చెప్పాయి. అత్యవసర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా) కింద విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని స్పష్టం చేశాయి. -
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 7 శాతం ఫిట్మెంట్
-
కరెంట్ ఉద్యోగులకు 7% ఫిట్మెంట్
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ, ఇతర సమస్యల పరిష్కారంపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగుల జేఏసీల మధ్య చర్చలు సఫలమయ్యాయి. యాజమాన్యాలు ప్రతిపాదించిన 7 శాతం ఫిట్మెంట్తోపాటు ఇంక్రిమెంట్ల మంజూరు, పలు ఇతర ప్రతిపాదనలకు జేఏసీల ప్రతినిధులు అంగీకారం తెలిపారు. దీనితో సోమవారం నుంచి తలపెట్టిన సమ్మెను విరమించుకున్నట్టు పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించగా, అన్నిరకాల ఆందోళనలను విరమించుకుంటున్నట్టు ఎలక్ర్టీసిటీ ఎంప్లాయీస్ జేఏసీ తెలిపింది. పలు విడతల్లో జరిగిన చర్చలతో.. విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై వేసిన పీఆర్సీ కమిటీ తొలుత 5శాతం ఫిట్మెంట్ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దానిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీనితో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్రావు నేతృత్వంలోని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు.. తెలంగాణ స్టేట్ పవర్/ఎలక్ర్టీసిటీ ఎంప్లాయిస్ జేఏసీల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. తొలుత 6 శాతం, తర్వాత 7 శాతానికి ఫిట్మెంట్ను పెంచుతామని యాజమాన్యాలు ప్రతిపాదించగా జేఏసీలు తిరస్కరించాయి. అయితే శనివారం మరోసారి జరిగిన చర్చల్లో అనూహ్యంగా 7శాతం ఫిట్మెంటే ఫైనల్ కావడం గమనార్హం. చర్చల్లో అంగీకారం కుదిరిన అంశాలపై యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య రాతపూర్వక ఒప్పందం జరిగింది. చర్చల్లో ఉత్తర/దక్షిణ డిస్కంల సీఎండీలు ఎ.గోపాల్రావు, జి.రఘుమారెడ్డి, పవర్ జేఏసీ నేతలు జి.సాయిబాబు, రత్నాకర్రావు, ఎలక్ట్రిసిటీ జేఏసీ నేత ఎన్.శివాజీ పాల్గొన్నారు. ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవీ.. ♦ 7 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు. 2022 ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తున్న 24.992 శాతం డీఏ (కరువు భత్యం) వేతనంలో విలీనం. ♦ 2022 ఏప్రిల్ 1 నుంచి పీఆర్సీ వర్తింపు. బకాయిలను జీతం/పెన్షన్తో పాటు 12 నెలల సమ వాయిదాల్లో చెల్లిస్తారు. ♦ ఈపీఎఫ్కు బదులు జీపీఎఫ్ సదుపాయం కల్పనపై విద్యుత్ సంస్థల బోర్డుల్లో సానుకూల నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తారు. ♦ వర్క్మెన్, ఇతరులకు సింగిల్ మాస్టర్ స్కేలువర్తింపు. ♦ ఆర్టిజన్ల పర్సనల్ పేను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హెచ్ఆర్ఏ, సీసీఏ సదుపాయం. ఈ విషయంలో పరిమితులకు లోబడి రాష్ట్ర ప్రభుత్వ జీవోల అమలు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రూ.16 లక్షల గ్రాట్యూటీ, అదనపు పెన్షన్ సదుపాయం. ♦ జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.10లక్షలు, ఆర్టీజన్లకు రూ.2లక్షల పరిమితితో వైద్య సదుపాయం. ♦ పెద్ద జబ్బులకు జీవితకాలం పాటు ఉద్యోగులకు రూ.15లక్షల వరకు వైద్య సదుపాయం (ఒక విడతలో రూ.5లక్షల గరిష్ట పరిమితి). ♦ సెల్ఫ్ ఫండింగ్ వైద్య పథకం కింద నెలకు రూ.1,000 చెల్లిస్తే.. ఉద్యోగులు, ఆర్టీజన్లు, పెన్షనర్లకు రూ.12లక్షల వరకు వైద్య సదుపాయం. ♦ ఈఎన్టీ/డెంటల్/కంటి వైద్యానికి పరిమితి రూ.15వేల నుంచి రూ.50వేలకు పెంపు. ఆపై ఖర్చులను సెల్ఫ్ ఫండింగ్ పథకం నుంచి చెల్లిస్తారు. ♦ 5 ఏళ్లలోపు సర్విసు ఉంటే ఒక ఇంక్రిమెంట్, ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య సర్విసుంటే రెండు ఇంక్రిమెంట్లు, 15ఏళ్లకుపైగా సర్వీసు ఉంటే 3 ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ఆర్టిజన్లకు రెండు ఇంక్రిమెంట్లను వర్తింపజేస్తారు. ♦ ప్రస్తుత అలవెన్సులను ప్రస్తుత రేట్లతో యథాతథంగా కొనసాగిస్తారు. ♦ జెన్కో ఉద్యోగుల ప్రత్యేక అలవెన్సు కొనసాగింపు 25 నుంచి ఆర్టీజన్ల సమ్మె యథాతథం ఆర్టిజన్లకు 7శాతం ఫిట్మెంట్ను తిరస్కరిస్తున్నామని తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. విద్యుత్ సంస్థల్లో ఆర్టీజన్లుగా విలీనమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న ఉదయం 8 గంటల నుంచి తలపెట్టిన సమ్మె యథాతథంగా కొనసాగుతుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు తెలిపారు. తమను చర్చలకు ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు ఇప్పటికే హెచ్ఆర్ఏ తగ్గించారన్నారు. విధి నిర్వహణలో విద్యుత్ ప్రమాదాలకు గురై పెద్ద సంఖ్యలో ఆర్టిజన్లు మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ శ్రమకు తగినట్టుగా పీఆర్సీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. -
జూడాల సమ్మె బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం, పలు డిమాండ్లపై వినతులు ఇచ్చినా స్పందించకపోవడంతో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. వీటిని ఈనెల 10వ తేదీ నాటికి పరిష్కరించాలని, లేకుంటే ఈనెల 11వ తేదీ నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. మిగతా విధులను బహిష్కరించనున్నట్లు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేశ్రెడ్డికి తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కౌషిక్ కుమార్ పింజర్ల, డాక్టర్ ఆర్.కె.అనిల్ కుమార్ నోటీసులు అందించారు. ♦ జూనియర్ డాక్టర్లు, పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సు చేసే ప్రతి వైద్యుడు తప్పకుండా డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం(డీఆర్పీ) తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వంద పడకల ఆస్పత్రిలో కనీసం 3 నెలల పాటు సేవలందించాలి. వైద్య విధాన పరిషత్ అధికారులు జూనియర్ డాక్టర్లకు రొటేషన్ పద్ధతిలో అక్కడ డ్యూటీలు వేస్తారు. ఈ క్రమంలో జూడాలు నిర్దేశించిన ఆస్పత్రి పరిధిలోనే ఉండాలి. అయితే ఈ కార్యక్రమం అమలు లోటుపాట్లపై జూడాలు ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించి వసతి, భోజనం, భద్రత సౌకర్యా లు కల్పించాలని కోరుతున్నారు. ప్రభు త్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ♦ ఇక జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోంది. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదు. బిల్లులు ఆమోదించినప్పటికీ ఆర్థిక అనుమతులు లేకపోవడంతో నిధులు విడుదల కావడం లేదని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ♦ స్టైఫండ్ పెంపు ప్రతి రెండేళ్లకోసారి చేపట్టాలి. ఏళ్లు గడుస్తున్నా స్టైఫండ్ పెంపు లేకపో వడం పట్ల జూడా సంఘం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. -
పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!
డ్రైవర్ల సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్ సింగ్పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్ సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. (చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు) -
మరో గుర్తుతెలియని వస్తువును కూల్చేసిన అమెరికా.. వారంలో నాలుగోది!
వాషింగ్టన్: గగనతలంలో ఎగురుతున్న గుర్తు తెలియని వస్తువులు అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారాయి. గత వారం రోజులుగా అగ్రరాజ్యంలో వరుస గగనతల ఉల్లంఘన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆకాశంలో 20 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఓ వస్తువును అమెరికా కూల్చేసింది. మిచిగాన్ రాష్ట్రంలోని హురాన్ సరస్సుపై ఎగురుతున్న అనుమానస్పద వస్తువును యూఎస్ యుద్ద విమానం పేల్చేసింది. గతం వారం రోజుల్లో వింత వస్తువులను కూల్చేయడం ఇదే నాలుగోసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు ఈ వస్తువును పేల్చేశారు. ఎఫ్-16 యుద్ద విమానంతో కూల్చివేయాలని బైడెన్ ఆదేశించినట్లు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా గుర్తించిన వస్తువు అష్టభుజి ఆకారంలో తీగలు వేలాడుతూ కనిపించిందని అమెరికా తెలిపింది. ఇది ప్రమాదకరం కాదని, దాని వల్ల ఎలాంటి నష్టంలేదని అమెరికా తెలిపింది. నిఘా సామర్థ్యం, సైనిక ముప్పు కలిగించే శక్తి లేదని నిర్ధారించింది. అయితే ఇది సుమారు 20 వేల అడుగుల ఎత్తులో మిచిగాన్ మీదుగా ఎగురుతుండటం వల్ల పౌర విమానాల రాకపోకలకు విఘాతం కలుగుతుందన్న అనుమానంతో ఈ వస్తువును కూల్చేసినట్లు పేర్కొంది. కాగా ఫిబ్రవరి 4న చైనాకు భారీ బెలూన్ను అమెరికా కూల్చేసిన విషయం తెలిసిందే. దీని వెనక చైనా గూఢచర్యం ఉందని ఆరోపించింది. ఈ ఆరోపణను డ్రాగన్ దేశం కొట్టివేసింది. This footage was uploaded on Reddit by the user u/Grizz_fan12. The Video shows the Grant Park and the Lake Michigan at 12:10pm with a flying object which is the alleged #UFO that has been shot down a few moments ago. No confirmation yet but it‘s all we got. #ufo #usa #Michigan pic.twitter.com/HR9YpKTr2E — DustinsHotSauce (@HotSauceDustin) February 12, 2023 అది వాతావరణాన్ని పరిశీలించే బెలూన్ మాత్రమేననీ.. దారి తప్పి అమెరికా ఆకాశంలోకి వచ్చిందని చెప్పింది. ఈ వాదనను అమెరికా ఖండించింది. అనంతరం అలాస్కా తీరంలో కారు పరిమాణంలో అత్యంత ఎత్తులో ఎగురుతున్న ఒక వస్తువును కూల్చేశామని శుక్రవారం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తెలిపింది. తరువాత శనివారం కెనడాలోని యూకాన్ ప్రాంతంలో.. ఇప్పుడు మిచిగాన్లో మరో వస్తువును పేల్చేశారు. అయితే, ఈ మూడు వస్తువులు ఏంటీ? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నదానిపై ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం అమెరికా మిలిటరీ ఆ వస్తువుల శకలాలను స్వాధీనం చేసుకునే పనిలో ఉంది. తాజా పరిణామాలతో ఆందోళన చెందిన అమెరికన్లు.. ఇంకా ఎన్ని ఎగురుతాయోనని నిత్యం ఆకాశం వైపు చూస్తున్నారు. 🇺🇲 #Unknown #flyingobject in the #sky again #USA #spyballoon #MYSTERY #unexplained #video Connecting with the skies again 😊 pic.twitter.com/CHh6x0zO1S — Tasos Perte Tzortzis (@TasosPerte) February 12, 2023 -
హైదరాబాద్లో మెట్రో రైలుకు సమ్మెసెగ
-
హైదరాబాద్: సమ్మె బాటలో మెట్రో రైల్వే ఉద్యోగులు?!
సాక్షి, హైదరాబాద్: నగర మెట్రో ఉద్యోగులు సమ్మె బాట పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ(మంగళవారం) ఉద్యోగులు కొందరు విధులు బహిష్కరించారు. రెడ్లైన్ టికెటింగ్ ఉద్యోగులు దాదాపుగా విధులకు దూరంగా ఉన్నారు. అమీర్పేట వద్ద సిబ్బంధి ధర్నాకు దిగారు. దీంతో మియాపూర్-ఎల్బీనగర్ రూట్లో గందరగోళం నెలకొంది. టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు. గత ఐదేళ్లుగా జీతాలు పెంచలేదని వాపోతున్నారు వాళ్లు. కరోనా టైం తప్పిస్తే.. మిగతా రోజుల్లో విరామం లేకుండా పని చేస్తున్నప్పటికీ తమకు సరైన న్యాయం జరగట్లేదని అంటున్నారు వాళ్లు. కేవలం పదకొండు వేల జీతంతో నెట్టుకొస్తున్నామని చెబుతున్నారు. చాలీచాలని జీతాలతో బతుకు కష్టంగా మారిందని అందోళ వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామంపై హైదరాబాద్ మెట్రో స్పందించాల్సి ఉంది. ఆ స్పందన తర్వాత సమ్మె గురించి ఒక స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కొత్త ఏడాదిలో అలర్ట్ : దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థల్లో పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆయా కంపెనీల ఉద్యోగుల్లో కొన్ని వర్గాలు జనవరి 4న సమ్మెకు పిలుపునిచ్చాయి. ప్రతిపాదిత పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనం అవుతాయని జాయింట్ ఫోరం ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (జేఎఫ్టీయూ) ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల లాభాల్లో ఉన్న ఆఫీసులతో పాటు పలు కార్యాలయాలను విలీనం చేయడమో లేదా మూసివేయడమో జరుగుతుందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా దాదాపు 1,000 కార్యాలయాలు మూతబడ్డాయని జేఎఫ్టీయూ తెలిపింది. ఇవన్నీ ఎక్కువగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఉండేవని వివరించింది. ఫలితంగా పాలసీదారులపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొంది. ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ సౌరభ్ మిశ్రా ఇష్టా రీతిగా వ్యవహరిస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయని జేఎఫ్టీయూ తెలిపింది. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల్లోని 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు, అధికారులు జనవరి 4న ఒక రోజు సమ్మెకు దిగనున్నట్లు జేఎఫ్టీయూ తెలిపింది. -
'వారీసు' వివాదం.. ప్రొడ్యూసర్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు : నిర్మాత
‘‘ఈ మధ్య 30రోజులు షూటింగ్ ఆపడమనేది అట్టర్ ఫ్లాప్ షో. చిన్న చిత్రాల నిర్మాతలు రిలీజ్ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీటికి పరిష్కారం దొరుకుతుందని సమ్మెకి సమ్మతించా. అయితే సమ్మె వల్ల ఏం జరగదని నాలుగు మీటింగ్స్లోనే అర్థమైంది. కొన్ని సమస్యలు, లోపాలు గుర్తించినా వాటి పరిష్కారం జరగలేదు. సినిమా పరిశ్రమ బతికుందంటే కొత్తగా వచ్చే నిర్మాతల వల్లే’’ అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు, నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. నేడు (శుక్రవారం) తన పుట్టినరోజుని పురస్కరించుకుని సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘చెన్నైలో సహాయ దర్శకుడిగా నా కెరీర్ ప్రారంభమైంది. ఇప్పుడు అక్కడ దాదాపు 200 కోట్లతో ‘కల్యాణ్ అమ్యూజ్మెంట్ పార్క్’ ప్రాజెక్ట్ చేయడం తమిళనాడు ప్రభుత్వం, దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాను. సదరన్ ఇండస్ట్రీకి పెద్దపీట వేస్తూ గోవా ఫిల్మ్ ఫెస్టివల్కు మించి అవార్డ్స్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల సంక్రాంతి సినిమాల విడుదల విషయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వ్యాఖ్యలు సరికాదు. చిరంజీవిగారి సినిమా నిర్మాతలుగానీ, బాలకృష్ణగారి మూవీ నిర్మాతలుగానీ కౌన్సిల్కి ఫిర్యాదు చేయలేదు.. అలాంటప్పుడు రిలీజ్ విషయంలో కౌన్సిల్ మాట్లాడటం వంద శాతం తప్పు. థియేటర్లు రెంటల్ వ్యవస్థ నుండి పర్సంటేజ్లోకి మారిస్తే బాగుంటుంది. కానీ, కొందరు పెద్దవాళ్లు మారనివ్వరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లాబ్ సిస్టం తెస్తే కానీ ఇది మారదు. సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ రెండో ఊరు అయిపోయింది. ఏదైనా సమస్య వస్తే అక్కడికి నలుగురు మాత్రమే వెళుతున్నారు.. ఆ రకంగా ఒక దూరం వచ్చేసింది. పదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్లు ఇక్కడి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉండరని భావిస్తాను. గతంలో కృష్ణా నుండే పది మంది పరిశ్రమలోకి వచ్చి అందులో ఎవరో ఒకరు సక్సెస్ అయ్యేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి మాత్రం ఏపీలో చిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలని ఉంది. ప్రస్తుతం ఎస్వీ కృష్ణారెడ్డిగారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు’ సినిమా పూర్తయింది. అలాగే బాలకృష్ణగారితో ‘రామానుజాచార్య’ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించడానికి పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. -
జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు తపాలా సిబ్బంది..
లండన్: పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లుగా వేతనాలను పెంచాలని కోరుతూ యూకేలో వేల సంఖ్యలో పోస్టల్ సిబ్బంది, యూనివర్సిటీ లెక్చరర్లు, స్కూల్ టీచర్లు గురువారం సమ్మెకు దిగారు. ఇప్పటికే వివిధ రంగాల సిబ్బంది సమ్మెల్లో పాల్గొనడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయింది. ఇటీవల లాయర్లు, నర్సులు కూడా పలుమార్లు విధులను బహిష్కరించారు. గురువారం యూనివర్సిటీల్లో 70 వేల మంది లెక్చరర్లు బోధన విధులను బహిష్కరించారు. ఈ నెల 30వ తేదీన మరోసారి స్ట్రైక్ చేస్తామని తెలిపారు. సమ్మె ప్రభావం సుమారు 25 లక్షల మంది విద్యార్థులపై పడింది. స్కాట్లాండ్లో టీచర్ల సమ్మెతో దాదాపు సూళ్లన్నీ మూతబడ్డాయి. రాయల్ మెయిల్ ఉద్యోగులు గురు, శుక్రవారాలతోపాటు క్రిస్టమస్ రోజున కూడా సమ్మెకు దిగుతామన్నారు. చదవండి: మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతు ఇచ్చిన బద్ధ శత్రువు -
All India bank strike: 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల అవుట్సోర్సింగ్ను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగుల యూనియన్ ఏఐబీఈఏ ఈ నెల 19న (రేపు) సమ్మెకు పిలుపునిచ్చింది. అధికారులు ఇందులో పాల్గొనకపోయినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) కొన్ని కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. నగదు డిపాజిట్, విత్డ్రాయల్, చెక్కుల క్లియరింగ్ వంటి లావాదేవీలపై కొంత ప్రభావం ఉండవచ్చని అంచనా. సమ్మె జరిగితే పరిస్థితుల గురించి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మొదలైన పలు బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లకు సమాచారం అందించాయి. కొన్ని బ్యాంకులు ఉద్యోగాలను అవుట్సోర్స్ చేయడం వల్ల కస్టమర్ల ప్రైవసీకి, వారి సొమ్ముకు రిస్కులు పొంచి ఉండటంతో పాటు కింది స్థాయిలో రిక్రూట్మెంట్ తగ్గిపోతోందని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం తెలిపారు. కొన్ని బ్యాంకులు పారిశ్రామిక వివాదాల (సవరణ) చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం, సమ్మెలు జరపడం మినహా తమ ఆందోళనను వ్యక్తపర్చేందుకు మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన చెప్పారు. ప్రైవేట్ బ్యాంకులపై సమ్మె ప్రభావం ఉండదు. -
కస్టమర్లకు అలర్ట్ : ఉద్యోగుల స్ట్రైక్..ఆ రోజు పని చేయని బ్యాంకులు
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఇటీవల బ్యాంకు ఉద్యోగులపై పెరిగిపోతున్న దాడుల్ని నిరసిస్తూ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మె చేయనున్నారు. వచ్చే నెల 19న ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ) ఆధ్వర్యంలో స్ట్రైక్ జరగనుంది. ఆ రోజు బ్యాంకుల్లో కార్యకలాపాలకు విఘాతం కలగనుంది. ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్.వెంకటాచలం తెలిపిన వివరాల మేరకు..ఏఐబీఈఏ యూనియన్లో యాక్టీవ్గా ఉన్నారనే కారణంగా బ్యాంకు ఉద్యోగులపై వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. అందుకే ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ఊతం ఇచ్చేలా ఏఐబీఏ యూనియన్ నాయకులను సోనాలి బ్యాంక్, ఎంయూఎఫ్జీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సర్వీస్ నుండి తొలగించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకులు ట్రేడ్ యూనియన్ హక్కులను నిరాకరిస్తున్నాయని, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంకులు అనేక బ్యాంకింగ్ కార్యకలాపాలను ఔట్ సోర్సింగ్ చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం ఉద్యోగుల్ని విచక్షణారహితంగా బదిలీ చేస్తుందన్నారు. ద్వైపాక్షిక సెటిల్మెంట్, బ్యాంక్ లెవల్ సెటిల్మెంట్ను ఉల్లంఘిస్తూ 3,300 మందికి పైగా క్లరికల్ సిబ్బందిని ఒక స్టేషన్ నుండి మరో స్టేషన్కు బదిలీ చేశారన్నారని అన్నారు. పై వాటన్నింటిని తిప్పికొట్టడం లేదా ప్రతిఘటించాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం చెప్పారు. చదవండి👉 హెచ్డీఎఫ్సీ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త -
17 నుంచి వీఆర్ఏల నిరాహార దీక్ష
సాక్షి, హైదరాబాద్/వరంగల్: తమ సమస్యల పరిష్కారం కోసం 75 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) చివరి పోరాట అస్త్రంగా నిరవధిక నిరాహార దీక్షలకు దిగాలని నిర్ణయించుకున్నారు. రెండున్నర నెలలుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం, మంత్రి కేటీఆర్ ఓసారి చర్చలు జరిపి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో నిరవధిక దీక్షలే మార్గమని వీఆర్ఏల రాష్ట్ర జేఏసీ నిర్ణయించింది. హైదరాబాద్లో శుక్రవారం జరిగిన జేఏసీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో వీఆర్ఏ జేఏసీ నేతలు ఎం.రాజయ్య, రమేశ్ బహుదూర్, దాదేమియా, డి.సాయన్న, ఎం.డి.రఫీ, వెంకటేశ్ యాదవ్, గోవింద్, వంగూరు రాములు, మాధవ్ నాయుడు, కంది శిరీషారెడ్డి, సునీత, ఎల్.నర్సింహారావు పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసీ కన్వీనర్ సాయన్న మాట్లాడుతూ... న్యాయమైన తమ సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టింపులేకుండా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. శనివారం నుంచి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాల కార్యాచరణ రూపొందించినట్లు పేర్కొన్నారు. 17 నుంచి జరిగే నిరవధిక దీక్షల్లో ప్రతి జిల్లా నుంచి ఒకరు, జేఏసీ నుంచి నలుగురు, మొత్తం 37 మంది నేతలు పాల్గొనాలని, దీక్షల కంటే ముందు యాదాద్రి నుంచి ప్రగతిభవన్ వరకు పాదయాత్ర, భిక్షాటన, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందికిపైగా పైలట్ల నిరసన!
జర్మనీకి చెందిన ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థ లుప్థాన్సాకు ఉద్యోగుల సమ్మె మరింత ఉధృతం కానుంది. వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం కంటే అధికంగా వేతన చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తూ జర్మనీకి చెందిన జర్మన్ ఎయిర్ లైన్ పైలట్స్ అసోసియేషన్ వెరీనిగుంగ్ కాక్పిట్ (వీసీ)గురువారం రాత్రి నుంచి సమ్మెకు పిలుపు నిచ్చింది.ప్రస్తుతం సమ్మె కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 5వేల మంది పైలట్లు విధులకు గైర్హాజరైటన్లు తెలుస్తోంది. పైలట్ల సమ్మె పిలుపుతో ప్రపంచ వ్యాప్తంగా లుప్థాన్సాకు చెందిన 800 విమానాల రాకపోకపోకలు స్తంభించిపోయాయి. మరికొన్ని రోజుల్లో జర్మనీకి చెందిన పలు రాష్ట్రాల్లో సమ్మర్ సెలవులు ముగియనున్నాయి. దీంతో విదేశాల్లో ఉన్న జర్మన్ దేశస్తులకు ఉద్యోగుల సమ్మె మరింత ఆందోళన కలిగిస్తుండగా...ఆ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా లక్షా 30వేల మంది ప్రయాణికులపై పడింది. లుప్థాన్సా విమానాల సర్వీసులు రద్దుకావడంతో జర్మనీ ముఖ్య నగరాలైన ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిచ్లలో సైతం విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.దీంతో ప్రయాణికుల్లో గందరగోళం మొదలైంది. ప్రయాణాన్ని రీహెడ్యూల్ చేయడం, లేదంటే ట్రైన్ జర్నీ చేసేలా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పైలట్ల డిమాండ్ ఇదే గత ఆగస్ట్ నెల నుంచి జీత భత్యాల పెంపు విషయంలో జర్మన్ పైలట్ల యూనియన్ వెరీనిగుంగ్ కాక్పిట్ (వీసీ) లుప్థాన్సాతో చర్చలు జరుపుతుంది. 2023లో ముంచుకొస్తున్న ద్రవ్యోల్బణం నుంచి పైలెట్లు గట్టెక్కాలంటే 5వేల కంటే ఎక్కువ మందికి 5.5శాతం వేతన పెంపును వీసీ డిమాండ్ చేసింది. అయితే సీనియర్ పైలట్లకు 5శాతం, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి 18శాతం పెంచుతామని లుప్థాన్సా యాజమాన్యం ముందుకొచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పైలట్లు సమ్ముకు దిగిన విషయం తెలిసిందే. చదవండి👉 800 లుఫ్తాన్సా ఫ్లైట్స్ రద్దు: ప్రయాణీకులు గగ్గోలు -
ఉద్యోగ భద్రత లేదా
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)ల పరిస్థితి దయనీయంగా మారింది. కనీస వేతనం, ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య భద్రత, పింఛన్, పదోన్నతులకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో కొలువులు చేస్తున్నారు. పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చులు, పిల్లల విద్య, వైద్యం వ్యయాలను తాము భరించలేకపోతున్నామని, బతుకుబండి లాగాలంటే తమకు పేస్కేల్– ఉద్యోగ భద్రత కల్పించాలని వేడుకుంటున్నారు. డిమాండ్ల సాధనకు 28 రోజులుగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో కీలకం.. రాష్ట్రంలో మొత్తం 23,000 మంది వీఆర్ఏలు ఉన్నారు. అందులో 20,000 మంది ఇదే వృత్తిని సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. వీరిలో గరిష్టంగా 80 ఏళ్ల వయసు వారు కూడా వీఆర్ఏలుగా కొనసాగుతున్నారు. వీరంతా రూ.10,500 వేతనంతో బతుకుబండి నెట్టుకువస్తున్నారు. కాగా, 23,000 మందిలో 3,000 మంది 2012లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యారు. వీరిలో 60 శాతం మంది మహిళలు ఉన్నారు. పంటల నమోదు, గ్రామాల్లో చెరువులను, కుంటలను, కుంట శిఖాలను, ప్రభుత్వ భూములను పరిరక్షించడం వీరి విధుల్లో ముఖ్యమైనవి. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు గ్రామానికి వచ్చినప్పుడు వారికి క్షేత్రస్థాయిలో సహకారం అందింస్తుంటారు. గ్రామాల్లో కీలకంగా ఉన్నా.. వీరికి ఎలాంటి పేస్కేలు, పీఎఫ్, ఈఎస్ఐ, బీమా, పింఛన్ వంటి సదుపాయాల్లేవు. 24 గంటల్లో ఏ క్షణమైనా విధులకు వెళ్లాల్సి ఉంటుంది. పనిభారం పెరిగినా.. పదోన్నతుల్లేవు! కనీసం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారికి ఖాళీల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. 2017లో వీరిలో అర్హులకు ప్రమోషన్లు రావాల్సి ఉండగా.. జిల్లాల విభజన వీరికి శరాఘాతంగా మారింది. అదనపు జిల్లాలు, మండలాలు, రెవెన్యూడివిజన్లతో పనిభారం పెరిగింది. వాస్తవానికి సర్వీస్రూల్స్ ప్రకారం.. మూడేళ్ల తరువాత వీఆర్ఏలను అటెండర్, నైట్ వాచ్మన్, జీపు డ్రైవర్గా ప్రమోట్ చేయాలి. అయితే వీరిలో కొందరు ఏళ్లుగా పనిచేస్తున్నప్పటికీ కనీసం పింఛన్ సదుపాయం కూడా లేదు. ఇపుడున్న వీఆర్ఏలలో చాలామంది 40 ఏళ్లు సర్వీసు ఉన్న వారూ నామమాత్రం వేతనానికి పనిచేస్తున్నారు. పదోన్నతులు ఇవ్వాల్సిందే దశాబ్దాలుగా పనిచేస్తున్నా మాకు కనీస హక్కులు అమలు కావడం లేదు. 2017లో సీఎంతో వీఆర్ఏలు భేటీ అయిన సందర్భంలో అర్హతలు ఉన్న వారికి వివిధ దశల్లో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు. కారుణ్యనియామకాల ద్వారా వచ్చిన వీఆర్ఏలకు డబుల్ బెడ్రూం, అటెండర్ ఉద్యోగాలిస్తామన్న హామీలు ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. – కందుకూరి బాపుదేవ్, వీఆర్ఏ రాష్ట్ర సహాధ్యక్షుడు మెటర్నిటీ లీవులు కరువు దేశంలో మహిళలకు, అందులోనూ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మహిళలకు మెటర్నిటీ లీవులు విధిగా ఇవ్వాలి. కానీ, ఇంతవరకూ వీఆర్ఏలకు ఇది అమలు కావడం లేదు. గర్భిణులుగా ఉన్నా.. రాత్రీ పగలు లేకుండా.. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తున్నాం. బాలింతలు కూడా డ్యూటీలు చేయాల్సిన దుస్థితి ఉంది. – కంది శిరీషారెడ్డి, రాష్ట్ర జేఏసీ కో–కన్వీనర్ -
బెంగళూరులో చెత్త సంక్షోభం
బనశంకరి(బెంగళూరు): వివిధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పౌరకార్మికులు చేపట్టిన సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. సమ్మె ప్రభావం కారణంగా పౌరకార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో చెత్త సమస్య తలెత్తింది. బెంగళూరులో రోడ్లను స్వీపింగ్ యంత్రాలతో ఊడ్చారు. రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హమీ ఇచ్చేవరకు సమ్మె వదిలిపెట్టేది లేదని పౌర కార్మికులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో నగర రోడ్లలో చెత్త రాశులుగా పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. బెంగళూరులోని క్రీడా మైదానాలు, బస్టాండ్లు, బస్షెల్టర్లు, మార్కెట్లు ప్రాంతాల్లో చెత్తతో నిండిపోయి దర్శనమిస్తున్నాయి. గత శుక్రవారం నుంచి చెత్త తొలగింపు నిలిచిపోయింది. బెంగళూరులో 70 శాతం మంది సమ్మె బెంగళూరు నగరంలో 18 వేల మంది పౌర కార్మికులు ఉండగా 70 శాతం మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. వేతనాలు పెంపు, పర్మినెంట్ తదితరాలపై ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. రాష్ట్రంలో 54,512 మంది కాంట్రాక్టు పౌర కార్మికులు ఉండగా వీరిలో 10,755 మందిని పర్మినెంట్ చేశారు. మిగిలిన కార్మికులను కూడా పర్మినెంట్ చేయాలని సమ్మెకు దిగారు. పౌర కార్మికుల సంక్షేమానికి సమగ్ర చట్టం రూపొందించాలని కోరారు. సమ్మె వల్ల రాష్ట్రంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో చెత్త సమస్య తలెత్తింది. యంత్రాలతో చేయిస్తాం సమ్మె వల్ల చెత్త సమస్య తలెత్తిందని పాలికె పొడిచెత్త నిర్వహణ విభాగం ప్రత్యేక కమిషనర్ డాక్టర్ హరీశ్కుమార్ తెలిపారు. సోమవారం బీబీఎంపీలో మాట్లాడుతూ రెండు స్వీపింగ్ యంత్రాలతో రోడ్లను శుభ్రం చేస్తున్నట్లు చెప్పారు. మరిన్ని యంత్రాలను సమకూర్చుకుంటామని చెప్పారు. -
చర్చలు జరుగుతున్నాయి..త్వరలోనే నిర్ణయాలు తెలియజేస్తాం: దిల్ రాజు
సినీ కార్మికుల వేతనాల పెంపు విషయంపై ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. కార్మికుల వేతనాల సమస్యపై ఏర్పాటైన కమిటీకి అధ్యక్షత వహిస్తున్న దిల్ రాజు శుక్రవారం తెలుగు ఫిలించాంబర్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చర్చలు వరుసగా జరుగుతాయని, ఏ రోజుకారోజు చర్చల తర్వాత అన్నీ క్రోడికరించి చివరి రోజున మీడియా ద్వారా నిర్ణయాలను తెలియజేస్తామని చెప్పారు. శుక్రవారం నుంచి అని సినిమా షూటింగ్లు ప్రారంభమయ్యాయన్నారు. కార్మికుల ప్రతీ సమస్య గురించి చర్చిస్తామని ఆయన తెలిపారు. -
సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ
వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపైత తాజాగా నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఫిలిం చాంబర్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఇరువర్గాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం దిశగా మాట్లాడుకోని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన ఈ క్రమంలో చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు తాజాగా ఫిలిం చాంబర్లో భేటీ అయ్యి సినిమా కార్మికుల సమ్మె, సినిమా షూటింగ్స్, వేతనాల పెంపు వంటి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశానికి సి కల్యాణ్, ఎన్వీ ప్రసాద్, ప్రసన్న కుమార్, కిరణ్, సుప్రియ, కొల్లి రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు తదితరలు హజరయ్యారు. చదవండి: సినీకార్మికుల సమ్మె.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు -
సినీకార్మికుల సమ్మె.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బుధవారం ఫిలించాంబర్ ఎదుట ఆందోళన చేపట్టిన సినీ కార్మికులు షూటింగ్లను సైతం బహిష్కరించారు. దీంతో హైదరాబాద్లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్లు నిలిచిపోయాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మాట్లాడుతూ.. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరారని, కానీ ఆ గడువు ముగియడంతో వేతనాలు పెంచాలంటూ కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజులల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దని హితవు పలికారు. మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'సినీ కార్మికుల నిర్ణయం వల్ల నేడు చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. కానీ దానికంటే ముందే వేతనాలపై ఫిలిం ఛాంబర్ ఆలోచిస్తోంది. ఇంతలోనే ఫిలిం ఫెడరేషన్ ఇలా సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం చాలా తప్పు. షూటింగ్లు ఆపేదే లేదు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్కు హాజరుకావాలి. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం. మీకు ఐదు కండీషన్స్ పెడుతున్నాం. 1. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. 2. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. 3. అందరం కలిసి షూటింగ్స్ జరుపుకుందాం. 4. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. 5. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడడు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే తామే షూటింగ్ లు ఆపేస్తాం. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్ -
సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన
సినీ కార్మికుల సమ్మెపై తాజా సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేడు సినీ కార్మికులంతా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సినిమా షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నటుడు నరేశ్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూడేళ్లు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బుందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్తా మెరుగుపడుతున్న సమంయలో సమ్మెబాట పట్టడం సరికాదని అన్నాడు. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ‘తెలుగు సినిమా బిడ్డలందరి నమస్కారం. నిన్నటి నుంచి టీవీలన్ని కూడా మారుమోగిపోతున్నాయి. షూటింగ్లు ఆగిపోతాయని, ఒకటి, రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. మంచిదే. పెద్దలందరు కలిసి ఇండిస్ట్రీపై నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. అయితే అందరు ఒకటి గుర్తుంచుకోవాలి. గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకుపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట గడవ నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు వైద్య ఖర్చులు లేక చాలా మంది ప్రాణాలు కూడా కొల్పోయారు. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కాస్తా వెంటిలేటర్పై ప్రాణం పోసుకుని సినిమాలు రిలీజ్అవుతున్నాయి. మన సినీ పరిశ్రమకు మంచి పేరు కూడా వస్తుంది. మనందరికి బ్యాంకులు నిండకపోయిన కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో మనమందరం కూడా ఆలోచించాలి. అన్నింటికి పరిష్కారం ఉంటుంది. నిన్నటి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొత్తం మునిగిపోతామండి అంటూ నాకు దర్శక-నిర్మాతలు, కార్మికులు, నటీనటులు ఫోన్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే మరో ట్వీట్లో ‘నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేది ఒకటే. వేతనాలు ఎంతోకొంత పెంచాలి. అది వారి డిమాండ్. అయితే నిర్మాతలు కూడా కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి కోట్ల రూపాయలు నష్టపోయారు. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మెల్లిగా స్థిరపడుతున్నారు. The media is buzzing with news that a few unions have pressurised the federation of TFI to stop shootings with immediate effect. It is our right to ask for a raise in wages. (1/3) — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022 చదవండి: Film Employees Strike: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్ ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఓ వారం, పది రోజులు టైం తీసుకుని అటూ ఫెడరేషన్కి, ఇటూ నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం. కృష్ణానగర్కి, ఫిలింనగర్కి 3 కిమీ దూరమే ఉంది. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మనందరం కలిస్తేనే ఒక కుటుంబం. ఇండస్ట్రీ బిడ్డగా నావంతుగా నేరు ఏం చేయలో ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. పెద్దలు అందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమని మరొకసారి అంధకారంలోకి వెళ్లకుండ ఆపి ఈ యొక్క షూటింగ్లు ఇంకోన్ని రోజులు ముందుకు సాగేలా అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను’ అని నరేశ్ వ్యాఖ్యానించాడు. A knee-jerk stop will crush not only the producers but also the lower financial strata members who are the majority. As a son of the TFI it is my humble appeal to go slow on the lockdown & negotiate. Kindly cooperate with the federation & producers to avert a major crisis🙏 (3/3) pic.twitter.com/TwLa0iYvzW — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022 -
వేతనాల పెంపుపై స్పందించడం లేదు: సినీకార్మికులు
-
సినీ కార్మికుల సమ్మె: ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత
టాలీవుడ్లో నేటి(జూన్ 22)నుంచి సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతల మండలి స్పందించకోవడంతో సినీ కార్మికులు షూటింగ్స్కి హాజరు కాలేదు. ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉన్నప్పకీ.. నాలుగేళ్లు దాటినా వేతనాల ఊసే లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో 24 క్రాఫ్ట్స్ సభ్యుల సమావేశం జరగునుంది.ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మొహరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండాలని పోలీసలు స్పష్టం చేశారు. కార్మికులెవరు గుమిగూడవద్దని హెచ్చిరంచారు. -
Film Employees Strike: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్
సినీ కార్మికులు నేడు సమ్మెకు దిగారు. వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ 24 విభాగాలకు చెందిన కార్మికులు ఫిలిం చాంబర్ ఎదుట ఆందోలన చేపట్టారు. ఇందులో భాగంగా సినీ కార్మికులెవరకు షూటింగ్లో పాల్గొనలేదు. అంతేకాదు జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్లే బస్సులను సైతం ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. దీంతో హైదరాబాద్లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్లు నిలిచిపోయాయి. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి కాగా వేతనాల పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నిన్న(మంగళవారం) ఫిల్మ్ చాంబర్, నిర్మాత మండలిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ కామర్స్ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫడరేషన్ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటిసుల ఇవ్వాలని తెలిపారు. అయితే ఫేడరేషన్ ముందస్తు నోటిసులు ఇవ్వలేదు కాబట్టి బుధవారం యథావిధిగా నిర్మాతలు షూటింగ్లు చేసుకోవచ్చని రామకృష్ణ చెప్పారు. చదవండి: నా వయసున్నోళ్లు లవ్స్టోరీస్ కూడా చేస్తున్నారు ఇదిలా ఉంటే అధ్యక్షుడు రామకృష్ణ వ్యాఖ్యలను సినిమా కార్మికుల ఫెడరేషన్ ఖండిచింది. ఈ నెల 6వ తేదినే చాంబర్కు సమాచారం ఇచ్చామని చెబుతూ ఫెడరేషన్ సభ్యులు తాము ఇచ్చిన లేఖను మీడియాకు అందించారు. అందులో ఈ నెల 6వ దానిని ధృవీకరిస్తూ ఫిలిం చాంబర్కు లేఖ రాసినట్టుగా ఉంది. అంతేకాదు దానిని చాంబర్ స్వీకరించినట్లు కూడా ఉండటం గమనార్హం. వేతన సవరణ గుడువు కాలం పూర్తయి 13 నెలలు దాటిందని, వెంటనే వేతనాలను సవరించకపోతే 15 రోజుల తర్వాత కార్మికులు ఎవ్వరూ షూటింగ్స్ హజరు కాకుడదనే నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. అలాగే వెంటనే వేతన విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని కూడా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్పష్టం లేఖలో పేర్కొంది. -
Breaking News: టాలీవుడ్లో షూటింగ్లు బంద్..!
-
బ్యాంక్ ఉద్యోగ సంఘాల సమ్మె,వారానికి 5 రోజులే పనిచేస్తాం!
ప్రైవేట్ ఉద్యోగస్థుల తరహా పనివేళలు తమకు ఉండాలని జూన్ 27న 9 బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇదే విషయంపై గత కొన్నేళ్లుగా విన్నపాలు వినిపిస్తున్నా తమను ఎవరు పట్టించుకోవడం లేదని బ్యాంక్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగస్తులు సోమవారం నుంచి శుక్రవారం వరకు కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తారు. శనివారం, ఆదివారం కుటుంబ సభ్యులతో గడుపుతుంటుంటారు. ఇప్పుడీ ఈ పని విధానాన్ని బ్యాంక్ ఉద్యోగులకు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 7 ఏళ్లుగా వారానికి 5 రోజుల పనిదినాల్ని అమలు చేసేలా బ్యాంక్ స్టేక్ హోల్డర్స్తో చర్చలు జరుపుతున్నట్ల తెలిపారు. వర్కింగ్ డేస్ను కుదించడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంతోపాటు వారి వర్క్లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవచ్చన్నారు. అయితే ఆ చర్చలు విఫలమవుతున్నాయని, కానీ ఈనెల 27 జరిగే సమ్మెలో తమ డిమాండ్ను ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ (ఏఐబీఈఏ) సీహెచ్ వెంకటా చలం తెలిపారు. ఈ సందర్భంగా వెంకటా చలం మాట్లాడుతూ జూన్ 27న సుమారు 9 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రొటెస్ట్లో ఐదురోజుల పనిదినాల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్లను కేంద్రం ముందుంచుతామని పేర్కొన్నారు. బ్యాంక్ ఉద్యోగ సంఘాలు 2015 నుంచి వారానికి 5 రోజుల పని దినాల్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. శనివారం, ఆదివారం సెలవు కావాలని కోరుతున్నాయి. ఉద్యోగులు సెలవు దినాల్లో తప్ప శనివారం రోజు పనిచేస్తున్నారు. అరె ఇప్పటి వరకు మా విన్నపాన్ని ఎవరు పట్టించుకోలేని చెప్పారు. మేం ఏ పాపం చేశాం విదేశాల్లో బ్యాంక్ ఉద్యోగులు షిఫ్ట్లు వైజ్గా వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తున్నారు. కానీ మన దేశానికి చెందిన బ్యాంక్ ఉద్యోగులు వారానికి 6రోజులు పనిచేస్తున్నారని నేషనల్ కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయిస్ (ఎన్సీఈబీ) జనరల్ సెక్రటరీ బండ్లీష్ మేం ఏం పాపం చేశామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ సైతం 5 వర్కింగ్ డేస్ బ్యాంక్లు మినిహాయిస్తే ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్బీఐ, ఎల్ఐసీ సంస్థ ఉద్యోగులు సైతం వారానికి 5 రోజులే పనిచేస్తున్నారు. కానీ మేం (బ్యాంక్ ఉద్యోగులు) మాత్రం 6 రోజులు పనిచేస్తున్నాం. భారత్ను బలమైన ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు డిజిటల్ ఇండియా అందుబాటులోకి వచ్చింది. ఆ వ్యవస్థను ఆసరగా చేసుకొని వివిధ పద్దతుల్లో బ్యాంక్ కార్యకాలాపాల్ని అందించవచ్చు. అందుకే బ్యాంక్ ఉద్యోగులు వారానికి 5 రోజులకు పనిదినాల్ని కుదించాలని డిమాండ్ చేస్తున్నట్లు బండ్లీష్ తెలిపారు. -
30 నుంచి ఆ రెండు బ్యాంకుల సమ్మె
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పలు డిమాండ్ల సాధనలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా సమ్మెకు దిగనున్నాయి. ఒప్పందాలకు విరుద్ధంగా అధికారులు, సిబ్బందికి బదిలీలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సెంట్రల్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు ఈ నెల 30, 31 తేదీల్లో సమ్మె చేయనున్నారు. అలాగే, ఔట్ సోర్సింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది ఈ నెల 30న సమ్మెకు దిగనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అటెండర్ స్థాయి పోస్టులను శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడాన్ని సిబ్బంది వ్యతిరేకిస్తున్నారు. (చదవండి: రైలు ప్రయాణికులకు అలర్ట్; పలు రైళ్ల రద్దు) -
ఎల్లుండి నిర్మాణ పనులు బంద్
సాక్షి, హైదరాబాద్: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి. నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ చైర్మన్ సీహెచ్ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు. దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లపై ఇన్పుట్ ట్యాక్స్ తగ్గించడంతో పాటు జీఎస్టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ పీ రామకృష్ణారావు, జనరల్ సెక్రటరీ వీ రాజశేఖర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు. వీళ్లేమన్నారంటే.. ► తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) అధ్యక్షులు సునీల్ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు. ► తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్) అధ్యక్షులు సీ ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్టీ రేట్లను తగ్గించి ఇన్పుట్ క్రెడిట్ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్ డ్యూటీ తగ్గించాలన్నారు. ► తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ) ప్రెసిడెంట్ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్పుట్ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు. -
ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలి
సాక్షి, హైదరాబాద్/ సుల్తాన్బజార్: కార్మికుల రెండు రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రాష్ట్రంలో మొదటిరోజు సోమవారం పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. బ్యాంకుల్లోనూ కొంతమేరకు పని స్తంభించడంతో.. ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. సింగరేణిలో సమ్మె ప్రభావం బలంగా కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. సమ్మెలో సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ప్రజాపంథా, ఎంసీపీఐ (యు) తదితర పార్టీలు పాల్గొన్నాయి. సమ్మెకు మద్దతుగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహించారు. నారాయణగూడ చౌరస్తా నుంచి కాచిగూడ వరకు ఈ ర్యాలీ సాగింది. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకుల పరిరక్షణకు చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్మికులతో పెట్టుకుంటే మోదీ ప్రభుత్వం కూలిపోక తప్పదన్నారు. మోదీ ప్రజా వ్యతిరేక విధానాలకు అంతే లేకుండా పోయిందని, శిశుపాలుడి వంద తప్పుల మాదిరిగా ప్రజలు ఓపిక పడుతున్నారని, సహనం నశిస్తే కేంద్రాన్ని కూలదోస్తారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.జి.నర్సింహారావు చెప్పారు. అధికార టీఆర్ఎస్ శ్రేణులు పలుచోట్ల కేంద్రం అవలంబిస్తున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెలో సంఘీభావంగా పాల్గొన్నారు. రైతు సంఘాలు, మహిళా సమాఖ్య, విద్యార్థి, యువజన సంఘాలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు నిరసనలో పాల్గొన్నారు. కోఠిలో ధర్నా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు అఖిలభారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఏఐబీఇఏ), అఖిలభారత బ్యాంక్ అధికారుల అసోసియేషన్ (ఏఐబీఓఏ) సంయుక్త ఆధ్వర్యంలో కోఠిలోని సెంట్రల్ బ్యాంక్ ఇండియా ప్రాంగణంలో ధర్నా జరిగింది. వివిధ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు, అధికారులు విధులను బహిష్కరించి పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..!
మీకేమైనా బ్యాంకులో పనులు ఉంటే వెంటనే చేసి పెట్టుకోవడం ఉత్తమం. ఎందుకంటే వచ్చే ఆరు రోజుల్లో 4 రోజులకు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 మధ్య బ్యాంకులు నాలుగు రోజుల పాటే పనిచేయనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సమ్మె..! ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. మార్చి 28, 29 (సోమ, మంగళ ) వారాల్లో రెండు రోజుల సమ్మెను ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు ప్రకటించాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. కాగా సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కావచ్చని ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఎస్బీఐ తమ శాఖలు, కార్యాలయాల్లో పనులను సాధారణీకరించేందుకు ప్రయత్నిస్తామని, సమ్మె కారణంగా ఇక్కడి పనులపై కొంత మేర ప్రభావం ఉండవచ్చునని పేర్కొంది. బ్యాంకులు సమ్మెలో ఉన్నప్పుడు ఖాతాదారులకు బ్యాంకు బ్రాంచ్లో లభించే సేవలకు అంతరాయం కలుగుతుంది. మిగతా రోజుల్లో..! బ్యాంకు ఉద్యోగుల సమ్మె తరువాత కేవలం రెండు రోజుల పాటు మాత్రమే బ్యాంకులు నడవనున్నాయి. మార్చి 30, 31 రోజున బ్యాంకులు యథావిధిగా తమ కార్యకలాపాలను జరపనున్నాయి.ఏప్రిల్ 1 న అన్యువల్ క్లోజింగ్ కావడంతో బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 2 న తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా బ్యాంకులకు సెలవు. దీంతో ఆయా రోజుల్లో బ్యాంకు కార్యకలాపాలపై ప్రభావం పడనుంది. బ్యాంకులతో నేరుగా సంబంధం లేని లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్, యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లాంటి ట్రాన్సాక్షన్స్పై ఎలాంటి ప్రభావం ఉండదు. చదవండి: క్రెడిట్, డెబిట్ కార్డులు వాడుతున్నారా..! అయితే మీకో షాకింగ్ న్యూస్..! -
28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్లు ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్ యూనియన్లతో ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్హౌజ్లో తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ పీఎస్యూల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. లాభాలతో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కుట్ర పూరితంగా కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించిందన్నారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, టీఆర్ఎస్కేవీ, ఐఎఫ్టీయూ, రైల్వే, బ్యాంక్, బీడీఎల్, హెచ్ఏఎల్, పోస్టల్, బీఎస్ఎన్ఎల్ తదితర సంస్థల కార్మిక సంఘాల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. సదస్సులో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు యాదవ్, పీఎస్యూ కార్మిక సంఘాల రాష్ట్ర కన్వీనర్ వి.దానకర్ణాచారి, రాష్ట్ర కో–ఆర్డినేటర్ ఎల్.రూప్ సింగ్ పాల్గొన్నారు. -
భర్త ఇంటి ముందు యువతి ధర్నా
సాక్షి, తిరువణ్ణామలై(తమిళనాడు): పోలూరు సమీపంలో ప్రేమ వివాహం చేసుకున్న భర్త ఏడాదికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో బాధిత యువతి చంటి బిడ్డతో అత్తగారింటి ముందు ధర్నాకు దిగింది. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని పాపంబాడి గ్రామానికి చెందిన శంకర్ కుమారుడు పూఅరసన్(22), చెన్నైలో మినీ వ్యాన్ నడుపుతున్నాడు. ఆ సమయంలో కల్లకుర్చికి చెందిన అమ్ము(22) తో పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఏడాది క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా గత రెండు నెలల క్రితం పూఅరసన్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ సమయంలో గర్భవతిగా ఉన్న అమ్మును అమ్మగారింటికి పంపి వేశారు. అనంతరం భర్త కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో అమ్ము తన వివాహం సమయంలో వేసిన బంగారం, వస్తువులు, సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరింది. అయితే ఇందుకు అత్తగారింటిలో అంగీకరించక పోవడంతో ఆమె ఎస్పీ, డీజీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు చెన్నై హైకోర్టులోను ఫిటిషన్ దాఖలు చేసింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టేందుకు యత్నించగా ఇంటికి తాళం వేసి అత్తింటి వారు పరారయ్యారు. దీంతో అమ్ము శనివారం అత్తింటి ముందు చంటి బిడ్డతో ధర్నాకు దిగింది. పోలీసులు ఆమెతో చర్చించి ధర్నాను విరమింప జేశారు. చదవండి: నీ అశ్లీల వీడియో లీక్ చేస్తా.. మంత్రి కొడుక్కి బెదిరింపులు! -
బాయ్కాట్ నుంచి బాయికి..
సాక్షి, హైదరాబాద్/మంచిర్యాల: సింగరేణి సమ్మె సక్సెస్ అయింది. కార్మికులు, కార్మిక సంఘాలు సంఘటితమై సింగరేణి వ్యాప్తంగా మూడురోజులపాటు కార్యకలాపాలను స్తంభింపజేశారు. దీంతో గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయా లన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు గురువారం మొదలుపెట్టిన సమ్మె శనివారంరాత్రి షిఫ్టుతో ముగిసింది. సమ్మె వల్ల రోజుకు 1.5 లక్షల టన్నుల చొప్పున 4.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని, రూ.120 కోట్ల ఆదాయానికి గండిపడిందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. ఈ లోటును పూడ్చుకుంటూ నిర్దేశిత రోజువారీ లక్ష్యాలను సాధించేందుకు కార్మికులు, అధికారు లు కృషి చేయాలని పిలుపునిచ్చింది. ఆదివారం సెలవుదినం అయినప్పటికీ ఉపరితల గనుల నుంచి ఉత్పత్తి, రవాణాను కొనసాగించాలని నిర్ణయించింది. సెలవుదినానికి సంబంధించిన పని నిబంధనల్లో స్వల్ప మార్పులు చేస్తూ కార్మికులను విధులకు ఆహ్వానించింది. సెలవురోజు విధులకు అనుమతిస్తే రెండు మస్టర్ల జీతం లభిస్తుంది. అయితే సెలవు రోజు పనిచేయడానికి వారంలో కనీసం నాలుగు రోజులు విధులకు హాజరై ఉండాలి. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల నిబంధనను యాజమాన్యం రెండురోజులకు సవరించింది. కార్మిక శాఖ ఆధ్వర్యంలో చర్చలు.. జేవీఆర్ ఓసీ–3, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్–3, కేకే–6 ఇంక్లైన్ బొగ్గుబ్లాక్లను వేలం నుంచి తొలగించి, సింగరేణికే అప్పగించాలన్న కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్పై హైదరాబాద్లోని రీజినల్ లేబర్ కమిషనర్ వద్ద శనివారం సాయంత్రం మరోసారి చర్చలు జరిగాయి. ఈ అంశం కేం ద్రం పరిధిలోనిదని, కేంద్రం విధానపర నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుందని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై సంబంధిత శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇతర ప్రముఖులను కలసి నివేదిస్తామని కార్మిక సంఘాల జేఏసీ పేర్కొనగా, దానికి అవసరమైన సహకారం అందిస్తామని యాజమాన్యం పేర్కొంది. మిగతా డిమాండ్లను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కేంద్ర కార్మికశాఖ అధికారులు, రీజినల్ లేబర్ కమిషనర్ సూచించగా, వచ్చే నెల 20న మరోసారి సమావేశం కావాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. సింగరేణి ప్రధాన కార్యాలయం ముట్టడి సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లసూరీళ్లు ముట్టడించారు. ఉద్యోగులు, అధికారులు ప్రధా న గేటు ముందు బైఠాయించారు. కార్యాలయ ఆవరణలో వంటావార్పు చేపట్టి అక్కడే భోజనాలు చేశారు. దీంతో సిం గరేణి ప్రధాన కార్యాలయంలోని ఇతర కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బొగ్గుబ్లాకుల ప్రైవేటీకరణ రద్దు డిమాండ్పై కేంద్రం సానుకూలంగా స్పందించకపోతే 2022 జనవరి 20 తర్వాత నిరవధిక సమ్మె చేపడతామని ఏఐటీ యూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. -
కేంద్రవాటానూ రాష్ట్రం కొనాలి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ సంస్థ కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 132 ఏళ్లుగా దేశానికి నిబద్ధతతో కూడిన సేవలందిస్తోన్న సింగరేణి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు సెస్, డివిడెండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు సమకూరుతుందన్నారు. అలాంటి సంస్థలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం ఆ సంస్థకు ఉరి వేయడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. అపార బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో కానీ, పన్ను చెల్లింపుల్లో రాయితీలు ఇవ్వడంలో కానీ కేంద్రాన్ని ఏనాడూ సీఎం కేసీఆర్ ప్రశ్నించిన పాపాన పోలేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో మోదీతో ఒప్పందం కుదుర్చుకుని సభ జరగకుండా అడ్డుపడటానికి బదులు సింగరేణి సమస్య గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. గనుల వేలం సమీపించడంతో మొక్కుబడిగా కార్మికుల పక్షాన కేంద్రానికి లేఖ రాసిన కేసీఆర్ సింగరేణి కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సింగరేణికి బకాయి పడ్డ రూ.13వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. సింగరేణి సమ్మెకు సీపీఎం మద్దతు: తమ్మినేని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి, కార్మికుల సమ్మెను ఉపసంహరించేలా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేశారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. సమ్మెలో బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కూడా పాల్గొందంటే ఈ ప్రైవేటీకరణ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోందన్నారు. -
Singareni: ఆ‘గని’.. సమ్మె
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారం కూడా విజయవంతమైంది. విధులను బహిష్కరించిన కార్మికులు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులను ఆపి పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు తెలపాలని వేడుకున్నారు. సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భ గనులు బోసిపోయాయి. డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో గనులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,753 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా 29,300 మంది గైర్హాజరయ్యారు. భూగర్భ గనుల్లో పని చేసే అత్యవసర సేవల సిబ్బంది 4,709 మంది మాత్రమే విధులకు వచ్చారు. మరోవైపు 13,701 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,340 మంది గైర్హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. రెండు రోజుల సమ్మెతో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇటు కార్మికులు సైతం వేతన రూపంలో రూ.40 కోట్లు నష్టపోయారు. బొగ్గు రవాణాపై ఎఫెక్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, సిమెంట్, ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర నాన్ పవర్ కంపెనీలకు రవాణా అవుతుంది. తెలంగాణలోని ప్రతిరోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ప్రతి రోజూ 1.30 లక్షల టన్నుల బొగ్గు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. 70 వేల టన్నుల బొగ్గును రాష్ట్ర అవసరాలకు వాడుతుంటారు. రెండు రోజుల సమ్మెతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది. 15న కేంద్రమంత్రితో చర్చలు.. సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రీజినల్ లేబర్ కమిషనర్ సమ్మెకు ముందే పలుమార్లు కార్మిక సంఘ నేతలతో హైదరాబాద్లో భేటీ అయ్యారు. సమ్మె కొనసాగుతున్నా సంఘ నేతలతో చర్చలు జరిపారు. మొత్తం 12 డిమాండ్లతో సమ్మె చేపట్టగా, వాటిలో రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహా మిగిలిన డిమాండ్లను దశల వారీగా పరిష్కరించేందుకు సింగరేణి సిద్ధమైంది. ప్రధానమైన బ్లాకుల ప్రైవేటీకరణ డిమాండ్ విషయంలో యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో అధికారులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పడిన జేఏసీ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషితో చర్చించేందుకు ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ (పీఏడబ్ల్యూ) బలరాంనాయక్, జీఎం (పర్సనల్) ఆనందరావు, యూనియన్ నాయకులు వెంకట్రావ్ (టీబీజీకేఎస్), వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్ ప్రసాద్ (ఐఎన్టీయూసీ), రాజిరెడ్డి (సీఐటీయూ), రియాజ్ (హెచ్ఎంఎస్), మాధవన్నాయక్ (బీఎంఎస్) ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు. -
భగ్గుమన్న బొగ్గుబాయి.. నిర్మానుష్యంగా సింగరేణి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కరీంనగర్/మంచిర్యాల: బొగ్గుగనులు భగ్గుమన్నాయి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా గుర్తింపు సంఘం సైతం సమ్మెకు సై అంది. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ మొత్తం సింగరేణినే ‘బ్లాక్’చేశారు. సమ్మె తొలిరోజు గురువారం నల్లబంగారు లోకం నిర్మానుష్యమైంది. సింగరేణి కార్మికుల సమ్మె తొలిరోజు విజయవంతమైంది. గనులన్నీబోసిపోయాయి. దేశం లో 88 బొగ్గుగనులు, తెలంగాణలోని కోయగూడెం ఓసీ, సత్తుపల్లి ఓసీ– 3, శ్రావణపల్లి ఓసీ, కేకే– 6 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నల్లసూరీళ్లు 72 గంటల సమ్మెకు దిగారు. దీంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భగనుల్లో డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,777 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, వారిలో అత్యవసర సేవల సిబ్బంది 4,625 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా 29,247 మంది సమ్మెలో పాల్గొనగా, 905 మంది సెలవుపెట్టారు. 25 వేలమంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 10 శాతం మాత్రమే విధులకు హాజరయ్యారు. తొలిరోజు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సంస్థకు సుమారు రూ.80 కోట్ల మేర నష్టం వాటిల్లింది. కార్మికులు సైతం వేతనాల రూపంలో రూ.20 కోట్లు కోల్పోయారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్యాలయం ముందు టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, బీఎంఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు నాయకులు ధర్నా చేశారు. సమ్మెలో తొలిసారిగా గుర్తింపు సంఘం సింగరేణి గుర్తింపుసంఘం టీబీజీకేఎస్ కూడా సమ్మెలో భాగస్వామ్యమైంది. 20 12లో సింగరేణిలో జరిగిన ఎన్నికల్లో టీబీ జీకేఎస్ గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. అంతకుముందు గుర్తింపుపొందిన సంఘాలేవీ ఆయా సందర్భాల్లో జరిగిన సమ్మెల్లో పాల్గొనలేదు. ప్రతిపక్ష సంఘాల తో గుర్తింపు సంఘం కూడా సమ్మెకు దిగ డం సింగరేణి చరిత్రలో ఇదే తొలిసారి. చర్చలు విఫలం హైదరాబాద్లోని రీజినల్ లేబర్ కమిషనర్(ఆర్ఎల్సీ) వద్ద గురువారం కార్మిక సంఘాలకు, యాజమాన్యానికి మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. మొత్తం 12 డిమాండ్లలో ఏ ఒక్క దానినీ యాజమాన్యం అంగీకరించలేదని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వి.సీతారామయ్య తెలిపారు. శుక్రవారం కూడా చర్చలు కొనసాగనున్నాయి. సమ్మెకు మావోల మద్దతు..! సింగరేణి కార్మికుల సమ్మెకు మావోయిస్టు పార్టీ మద్దతు తెలిపింది. ఈ మేరకు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ అధికార ప్రతినిధి ప్రభాత్ పేరిట ఓ లేఖ విడుదలైంది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాడాలని పిలుపునిచ్చింది. -
బొగ్గు బావుల ప్రైవేటీకరణ సిగ్గుచేటు
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిని ప్రైవేట్పరం చేస్తూ వస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు సింగరేణిలో ఉన్న బొగ్గు బావులను ప్రైవేట్పరం చేయడానికి పూనుకొన్నది. ప్రైవేటీకరణ ఎన్నో ఏళ్లుగా తరతరాలుగా సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్న కార్మికుల జీవితాల మీద దెబ్బకొడుతుంది. ప్రస్తుతం నాలుగు బావులతో మొదలుపెట్టి ఆ తర్వాత సింగరేణి బావుల మొత్తాన్ని ప్రైవేట్పరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది. సింగరేణి బ్లాకులన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేట్పరం చేస్తారు. అప్పడు సింగరేణిలో కొత్త గనులు రావు. ప్రస్తుత కారుణ్య నియామకాల ద్వారా చేపడుతున్న వారసత్వ ఉద్యోగాలు ఉండవు. క్రమంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పుడు అమలు చేస్తున్న హక్కులు, బోనస్లు, అలవెన్స్లను తగ్గిస్తుంది. దీనితో కార్మికుల మీద భారం పడుతుంది. వారు ఆర్థికంగా దెబ్బతిని కుంగిపోతారు. వారి కుటుంబాలు రోడ్డున పడతాయి కాబట్టి బొగ్గు బావులు ప్రైవేటీకరణను వెంటనే ఉపసంహరించుకోవాలి. (చదవండి: ‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?) ముందు సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల హక్కులపై దృష్టి పెట్టండి. సమాన పనికి సమాన వేతనం చెల్లించండి. సింగరేణిలో పని చేస్తున్న అన్ని కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయండి. కరోనా వల్ల మరణించిన సింగరేణి కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించండి. సింగరేణిలో ఉన్న ఓపెన్కాస్ట్లో మట్టి తొలగింపు విధానం, అండర్గ్రౌండ్ గనుల్లో కాంట్రాక్ట్ పద్ధతిని నిలిపివేయండి. గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు వెంటనే సహాయం అందించండి. సింగరేణి కార్మికుల హక్కులను హరించి వేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న బొగ్గు బావుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగారు కావున సింగరేణిలో జరిగే 72 గంటల సమ్మెను విజయవంతం చేయాల్సిన బాధ్యత కార్మికులు కర్షకులు, మేధావులు, ప్రజలపై ఉంది. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – కనికరపు లక్ష్మీకాంతం, కార్మిక సంఘాల జేఏసీ -
సింగరేణి కార్మికుల మూడు రోజుల సమ్మె ప్రారంభం
సాక్షి, మంచిర్యాల/సాక్షి, ప్రతినిధి కరీంనగర్: సింగరేణిలో సమ్మె ఖాయమైంది. బొగ్గుబావుల్లో గురువారం (ఈ నెల 9) నుంచి 11 వరకు సమ్మె కొనసాగనుంది. బుధవారం రాత్రి హైదరాబాద్లో ప్రాం తీయ కార్మిక శాఖ కమిషనర్ నేతృత్వంలో డైరెక్టర్(పా) ఎన్.బలరాం, జీఎం(పర్సనల్) ఆనంద్రావుతో.. టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, ఏఐటీ యూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మధు, బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి మాధవ్నాయక్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సింగరేణిలోని నాలుగు బొగ్గు గనులను వేలం నుంచి తీసేయాలని, ప్రైవేటీకరణ ను ఆపాలనే ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం నుంచి స్పష్టమైన హామీ రాలేదు. సమ్మె కారణంగా గురువారం ఉదయం మొదటి షిఫ్టు నుంచే బొగ్గు బావుల్లో ఉత్పత్తి నిలిచిపోయే అవకాశముంది. ఖ మ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మం చిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల పరి«ధిలోని 11 ఏరియాల్లో 19 ఓపెన్ కాస్టులు, 23 భూగర్భ గనుల్లోని మొత్తం 42 వేల మంది కార్మికులు సమ్మెలో పాల్గొననున్నారు. వీరితోపాటు 25 వేలమంది కాంట్రాక్టు కార్మికులు విధులకు దూరంగా ఉండే అవకాశముంది.అత్యవసర సేవలు, సివిల్, కొన్నివిభాగాల్లో పనులు కొనసాగనున్నాయి. మొదట టీజీబీకేఎస్ ఈ నెల 25న సమ్మె నోటీసు ఇవ్వగా తర్వాత జాతీయ సంఘాలు జత కలిశాయి. నోటీసు అందినప్పటి నుంచి సమ్మె నిలుపుదలకు యాజమాన్యం విఫలప్రయత్నం చేసింది. ప్రైవేటీకరణే ప్రధానంగా... కేంద్రం దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణకు నోటిఫై చేసి 41 గనులను వేలానికి పెట్టింది. వీటిలో సింగరేణికి చెందిన కళ్యాణిఖని బ్లాక్–6, శ్రావణ్పల్లి, సత్తుపల్లి బ్లాక్–3, కోయగూడెం బ్లాక్–3 ఉన్నాయి. ఇప్పటికే ఈ నాలుగు గనుల భూ సేకరణ, ఇతర పెట్టుబడుల కోసం సింగరేణి రూ.750 కోట్లు ఖర్చు చేసింది. కేంద్రం 49, రాష్ట్రం 51 శాతం వాటాతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కూడా ప్రైవేటు పోటీదారులతో వేలంలో పాల్గొని బ్లాక్లు దక్కించుకోవాల్సి ఉంది. ఇది భవిష్యత్తులో కొత్త గనుల ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే కార్మికులు ఆందోళన బాటపట్టారు. సమ్మె డిమాండ్లు... ♦బొగ్గు బ్లాక్ల వేలం రద్దు చేయాలి ♦భూగర్భ, ఓపెన్ కాస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన కార్మికుల నియామకాలు చేపట్టవద్దు ♦ఎస్సార్పీ 3, మణుగూరు ఓసీపీ ప్రమాదంలో చనిపోయినవారికి రూ.కోటి ఎక్స్గ్రేషియా. ♦కోవిడ్తో చనిపోతే ఎక్స్గ్రేషియా రూ.15 లక్షలకు పెంచాలి ♦పెండింగ్లో ఉన్న వారసత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి ♦వారసుల వయస్సు 35 నుంచి 40కి పెంచాలి ♦ఆదాయ పన్ను మినహాయించాలి ప్రైవేటీకరణకు వ్యతిరేకం: అధికారుల సంఘం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్(సీఎంఓఏఐ) పూర్తిగా వ్యతిరేకమని అధ్యక్షుడు జక్కం రమేశ్, కార్యదర్శి రాజశేఖర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాకులను సంస్థకే కేటాయించాలని కోరారు. ప్రైవేటీకరణ వల్ల సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా.. రోజువారీ బొగ్గు ఉత్పత్తి: 2 లక్షల టన్నులు ఉత్పత్తి నష్టం : రూ.53 కోట్లు జీతాల రూపేణా: రూ.20 కోట్లు -
సింగరేణిలో సమ్మె సైరన్.. కారణాలు ఇవే..
సాక్షి,భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సమ్మె బాట పట్టేందుకు సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 25న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇవ్వగా 30వ తేదీన అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ రెండు పర్యాయాలు ఉన్నప్పటికీ సమ్మె నోటీసులు ఇవ్వడం ఇదే మొదటి సారి. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘమైన బీఎంఎస్ సంఘాలు కూడా సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూలతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు కదం తొక్కనున్నాయి. ప్రైవేట్ పరంతో నష్టాలు ► సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది. ► బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయడం వలన బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది. ప్రైవేట్ మాఫియా వారు పేద కార్మికులను పీల్చి పిప్పి చేస్తారు. ► రక్షణ, పర్యావరణానికి ప్రైవేట్ సంస్థలు ప్రాధాన్యత ఇవ్వ వు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా పాటించరు. ► సింగరేణి బ్లాకులన్నీ క్రమంగా ప్రైవేట్పరం చేస్తారు. అప్పడు సింగరేణిలో కొత్త గనుల రావు. ► ప్రస్తుత కారుణ్య నియామకాల ద్వారా చేపడుతున్న వారసత్య ఉద్యోగాలు ఉండవు. ► క్రమంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పటి హక్కులు, బోనసులు, అలవెన్సుల తగ్గిస్తుంది. ► దేశ సంపద ప్రైవేటు కంపెనీ చేతిలో పెడితే వారి అభివృద్ధికే ఉపయోగపడుతుంది. కార్మికుల డిమాండ్లు ఇవే.. ► కార్మిక సంఘాల నాయకులు బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణతో పాటు సింగరేణి పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటీసులో డిమాండ్ల పత్రాలను అందజేశారు. ► సింగరేణిలో ఉన్న ఓపెన్కాస్ట్లో మట్టి తొలగింపు విధానం, అండర్గ్రౌండ్ గనుల్లో కాంట్రాక్ట్ పద్దతిని నిలిపివేయాలి. ► గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి. ► మెడికల్ బోర్డులో ఆన్ఫిట్ అయిన మైనింగ్స్టాఫ్, ట్రెడ్మెన్స్, ఈపీ ఆపరేటర్లకు సర్ఫెస్ ఉద్యోగాల్లో సుటబుల్ జాబ్ ఇవ్వాలి. ► సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ నిర్ణయించిన ప్రకారం వేతనాలు చెల్లించాలి. ► వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న వారందరికీ డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. ► సీఎం కేసీఆర్ ఇచ్చిన çహామీ మేరకు సింగరేణి కార్మికుల ఇంటి పేర్లు మార్చాలి. ► డిపెండెంట్ ఉద్యోగ అర్హత వయస్సు 35 నుంచి 40 ఏళ్లకు పెంచాలి. ► కోల్ఇండియా లిమిటెడ్ ఉద్యోగుల మాదిరిగా సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్నును సింగరేణి యాజమాన్యమే చెల్లించాలి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం.. సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం కార్మిక వ్యతిరేకత విధానాలు అవలంభిస్తోంది. ఈ వి«ధానాలను వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా సమ్మె చేద్దామని చూస్తున్నాం. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. –అప్పాని శ్రీనివాస్, బీఎంఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు సమ్మెను విజయవంతం చేయాలి సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. కేంద్రం సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణ చేస్తోంది. ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అన్ని సంఘాలు కలిసి ప్రైవేటీకరణ ను రద్దు చేసే వరకు నిరంతర పోరాటాలు నిర్వహిస్తాం. కార్మికులు సిద్ధంగా ఉండాలి. –జోగు బుచ్చయ్య, ఐఎన్టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు చదవండి: ఈ ఆదివారం ట్యాంక్బండ్పై సండే– ఫన్డే రద్దు.. కారణమిదే! -
ధాన్యం తూకం వేయరా
చిగురుమామిడి: ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో కొందరు రైతులు పురుగు మందు డబ్బాతో మంచినీటి ట్యాంకు ఎక్కి నిరసనకు దిగారు. గురువారం ఉదయం కొనుగోలు కేంద్రంలో కాటాలు నిలిచిపోవడంతో ఆగ్రహించిన మరికొందరు రైతులు సెంటర్లోనే ధర్నాకు దిగారు. ఓ వైపు ట్యాంకు ఎక్కిన రైతులు, మరోవైపు కింద రైతుల ధర్నాతో ఏం చేయాలో పాలుపోక కేంద్రం నిర్వాహకులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారుల రాక ఆలస్యం కావడంతో రైతులు ఆగ్రహించారు. తమ ధాన్యాన్ని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తూకం వేయడం లేదని, రైసు మిల్లు యజమానులు నూక పేరుతో బస్తాకు మూడు నుంచి నాలుగు కిలోలు కట్ చేస్తున్నారని ఆరోపించారు. నూకలవుతున్నాయనే సాకుతో 43 నుంచి 44 కిలోలు తూకం వేస్తూ రైతులను ముంచుతున్నారని వాపోయారు. రైతు సంఘం మండల కన్వీనర్ శ్రీనివాస్రెడ్డి, నాయకులు బందెల శ్రీనివాస్, గట్టు జనార్దన్, మురళి, అందె రాయమల్లు, కుట్ల శ్రీనివాస్, గుమ్మడి బాలయ్య, మరో ఇద్దరు రైతులు ట్యాంకు పైనే ఉండగా.. అధికారులు స్పందించకుంటే పురు గు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని పలుమార్లు హెచ్చరించారు. సమాచారం అందుకున్న చిగురుమామిడి తహసీల్దార్ ముబీన్అహ్మద్, నయాబ్ తహసీల్దార్ చంద్రశేఖర్, చిగురుమామిడి ఎస్ఐ దాస సుధాకర్, ఐకేపీ సీసీ వెంకటేశ్వర్లు తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. ఎలాంటి కొర్రీలు లేకుండా మిల్లర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ట్యాంకు ఎక్కిన రైతులు కిందకు దిగారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అందె స్వామి తదితరులు పాల్గొన్నారు. -
సింగరేణిలో సమ్మె సైరన్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో చాలా కాలం తరువాత సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు గుర్తింపు సంఘం సమ్మెకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం టెండర్ల తేదీలను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు యూనియన్గా ఉన్న టీబీజీకేఏస్ అప్రమత్తమైంది. కేంద్రం ప్రైవేటీకరిస్తున్న బొగ్గుబ్లాకుల్లో నాలుగు సింగరేణి సంస్థ పరిధిలోవే ఉన్నాయి. బొగ్గు గనుల ప్రయివేటీకరణపై ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఉద్యమానికి సమాయత్తమవుతుండగా, టీబీజీకేఏస్ మరో అడుగు ముందుకేసి సింగరేణిలో సమ్మె పిలుపు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై గురువారం రామగుండం ఏరియాలో నిర్వహించే సెంట్రల్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్పరం అయితే రాబోయే రోజుల్లో కార్మికుల ఉనికికే ప్రమాదంగా మారనుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగా ముందుకు... టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సమ్మె నిర్వహించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ సెంట్రల్ కమిటీ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, టీబీజీకేఏస్ సెంట్రల్ కమిటీ సమావేశం గురు వారం యైటింక్లయిన్కాలనీలో నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఏస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పాల్గొంటున్నట్లు వెల్లడించారు. -
జెఫ్ బెజోస్కు ఇక చుక్కలే..20కి పైగా దేశాల్లో అమెజాన్ ఉద్యోగుల స్ట్రైక్..!
Amazon Workers Strike on Black Friday: అమెజాన్ అధినేత జెఫ్బెజోస్కు ఆ సంస్థ ఉద్యోగులు షాక్ ఇవ్వనున్నారు. 20దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నా చేయనున్నారు. కరోనా మహమ్మారిలోనూ రేయింబవళ్లు సంస్థకోసం పనిచేశామని, అందువల్లే జెఫ్బెజోస్ 200 బిలియన్ల డాలర్లతో ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారని గుర్తు చేస్తున్నారు. తాము పనికి తగ్గట్లు వేతనాన్ని ఆశిస్తున్నామని ఇప్పటికే స్ట్రైక్లో పాల్గొన్న ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 26న నవంబర్ 26న అమెజాన్లో పనిగంటలు, కింది స్థాయి ఉద్యోగుల పట్ల ఉన్నతాధికారులు అకౌంటబులిటీ (జవాబు దారీతానాన్ని)తో పాటు మొత్తం 25రకాల డిమాండ్లను నెరవేర్చాలని బ్లాక్ ఫ్రైడే రోజు సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ సమ్మెలో 20 లేదా అంతకాన్నా ఎక్కువ దేశాలకు చెందిన అమెజాన్ ఉద్యోగులు,యూనియన్ సంఘాలు, గ్రీన్పీస్, ఆక్స్ఫామ్ వంటి సంస్థలు స్ట్రైక్కు మద్దతు పలకనున్నారు. ఎక్కువ తీసుకుంటుంది.. తక్కువ ఇస్తుంది అమెజాన్లో పనిగంటలు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పనిగంటలు ఎక్కువగా ఉన్న అందుకు తగ్గట్లు వేతనాలు ఇవ్వాలని, కానీ అలా జరగడం లేదన్నారు. ఉద్యోగులతో పని ఎక్కువ పనిచేయించుకుంటుంది. తక్కువ జీతాల్ని చెల్లిస్తుంది' అంటూ ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్ ప్రపంచానికి తెలిపేందుకు మేక్ అమెజాన్పే.కామ్ పేరుతో వెబ్సైట్ ను లాంఛ్ చేశారు. ఆ వెబ్ సైట్లో ఉద్యోగులు పేర్కొన్నారు. జెఫ్ జెజోస్పై ఆగ్రహం ఉద్యోగులు చేస్తున్న స్ట్రైక్కు మద్దతుగా పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అమెజాన్ పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటుందంటూ 'ప్రోపబ్లికా' నివేదిక వెలుగులోకి వచ్చింది. నివేదిక ప్రకారం జెఫ్బెజోస్ 2006 నుంచి 2018 మధ్య ఎలాంటి పన్నులు చెల్లించలేదని నివేదికలో పేర్కొంది. అయితే ఈ పరిణామల నేపథ్యంలో అమెజాన్ ఉద్యోగులు చేస్తున్న ధర్నా జెఫ్బెజోస్కు పెద్దదెబ్బేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సోషల్ మీడియాలో అసత్య ప్రచారం..దిగ్భ్రాంతిలో ఆనంద్ మహీంద్రా -
నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల ఆందోళన
హైదరాబాద్: నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు సోమవారం ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదు.. వార్డుల్లో పనిచేయలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇటీవల వార్డుబాయ్ 100 రూపాయల కోసం ఆక్సిజన్ను మార్చడం వలన ఒక పసివాడి నిండు ప్రాణం పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా బాధితుల బంధువులు మూకుమ్మడిగా ఆస్పత్రి లోపలికి వచ్చారు. దీంతో.. ఇతర సిబ్బంది తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. బాధిత బంధువులు.. ఎక్కడ దాడిచేస్తారోనని భయపడిపోయారు. తక్షణం.. తమకు సరైన భద్రత కల్పించాలని ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. చదవండి: నాగశౌర్య ఫామ్హౌజ్ కేసు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు -
1వ తేదీ నుంచి యధావిధిగా రేషన్ పంపిణీ: కొడాలి నాని
శ్రీకాకుళం జిల్లా: ఒకటవ తేదీ నుంచి రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తాం.. షాపులు మూసేస్తే రేషన్ సప్లై ఆగిపోదు అన్నారు మంత్రి కొడాలి నాని. ఇప్పుడు 11 వేల వాహనాలతో ఇంటింటికి రేషన్ పంపిణీ ప్రభుత్వమే చేస్తోంది.. డీలర్లకు ఏవైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.. రేషన్ డీలర్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేది లేదు అని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘‘గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు.. ఇప్పుడు పరిస్థితి వేరు. గతంలో ప్రజాపంపిణీ వ్యవస్థ మొత్తం రేషన్ దుకాణం నుంచే జరిగేది. రేషన్ దుకాణాలు బంద్ చేస్తాం అంటే వాటిని పక్కనపెట్టి పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తాం’’ అని తెలిపారు. (చదవండి: సీఎం జగన్ను చంద్రబాబు ఇంచుకూడా కదపలేరు: కొడాలి నాని) ‘‘రేషన్ దుకాణాలు కొనసాగాలంటే వారి భాష, పద్ధతి మారాల్సిన అవసరం ఉంది. లేదు మేము ఇలాగే ఉంటాం అంటే డీలర్లను బైపాస్ చేసి వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తాం. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఎవరు అడ్డుకుందాం అనుకున్నా కుదరదు’’ అన్నారు. చదవండి: కుక్కలు ఎవరు బాబూ!? -
ఎయిర్ హోస్టెస్ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!
కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఆయా కార్యాలయాల్లో పని పూర్తిగా ఆగిపోయేలా చేసి తమ డిమాండ్లు నెరవేర్చుకుంటారు. అలాగే ఈ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్లకు కూడా తమ ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యాయట. దీంతో వినూత్నంగా నిరసనలు చేపట్టారు. ఆ వివరాలు.. ఇటలీలోని కాంపిడోగ్లియోలో సుమారు 50 మంది ఎయిర్ హోస్టెస్లు రోడ్డు మీదకు వచ్చి బట్టలు విప్పి నిరసన చేపట్టారు. జీతంలో కోతలు, ఉద్యోగాల నష్టంపై మనస్తాపం చెందారని, అందుకే తాము నిరసన చేపట్టామని మీడియాకు వెల్లడించారు. ఇంత హఠాత్తుగా వారి ఉద్యోగాల్లో మార్పులు ఎందుకువచ్చాయంటే.. చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! అలిటాలియా ఎయిర్లైన్స్ తాజాగా ఐటీఏ ఎయిర్వేస్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ పరిణామం అలిటాలియా ఎయిర్లైన్స్లో పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలిటాలియా ఎయిర్లైన్స్ దాదాపు 10,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ అయితే ఐటీఏ ఎయిర్వేస్లో మాత్రం కేవలం 2,600 మంది ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారట. మరోవైపు ఐటీఏ ఎయిర్వేస్కు చెందిన ఓ ఉద్యోగి.. సీనియారిటీ ప్రకారం రావల్సిన ఉద్యోగాలు కూడా మాకు దక్కలేదు, శాలరీలు కూడా బాగా తగ్గించారు, ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని సందిగ్థంలో ఉన్నామని’ విచారం వ్యక్తం చేశారు. దీని గురించి ఐటిఎ ఎయిర్వేస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో అల్టావిల్లాను అడిగితే.. ‘అందరు ఉద్యోగులందరూ కంపెనీ నిబంధనలను అనుసరించి ఒప్పందంపై సంతకం చేసారు. ఉద్యోగులు సమ్మె చేస్తారని నేను భావింలేదు. అలా చేస్తే, వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని మీడియాకు తెలిపారు. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
ఎయిరిండియాలో మరో వివాదం.. చిక్కుల్లో టాటా గ్రూపు
ఎయిరిండియాను తిరిగి స్వాధీనం చేసుకున్నామన్న సంతోషం ఆస్వాదించకముందే టాటా గ్రూపుకి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. మరోసారి మహారాజా స్టేటస్ని తెచ్చి పెట్టాలంటే చెమటోడ్చక తప్పని పరిస్థితిలు కళ్లేదుటే కనిపిస్తున్నాయి. ఆస్తులపై పేచీ ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణలో భాగంగా వేల కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న ఎయిరిండియాను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. ఇటీవల టాటా సన్స్ రూ. 18,000 కోట్లు చెల్లించేందుకు అంగీకరించి ఎయిరిండియాను దక్కించుకుంది. దీంతో ఎయిరిండియా స్థిర, చర ఆస్తులన్నీ టాటా సన్స్ స్వంతం అవుతాయి. ఇందులో బోయింగ్ విమానాలతో పాటు సిబ్బంది క్వార్టర్స్, కార్గో స్టేషన్లు ఇతర విలువైన భూములు కూడా ఉన్నాయి. క్వార్టర్లు ఖాళీ చేయండి నిబంధనల ప్రకారం ప్రైవేటీకర ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆరు నెలలలోపు ప్రస్తుతం ఎయిరిండియా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బంది వాటిని ఖాళీ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే ఎయిరిండియా కాలనీల్లో ఉంటున్న ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎయిరిండియా ఉద్యోగులు భగ్గుమంటున్నారు. ఉన్న పళంగా మమ్మల్ని క్వార్టర్లు ఖాళీ చేయమనడం దారుణమంటూ మండి పడుతున్నారు. సమ్మెకు రెడీ ఎయిరిండియాలో ప్రస్తుతం 12,085 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో పర్మినెంట్ ఉద్యోగులు 8084, కాంట్రాక్టు ఉద్యోగులు 4001 మంది ఉన్నారు. ఇందులో చాలా మందికి ముంబై, ఢిల్లీ, కోల్కతా తదితర ఏరియాల్లో క్వార్టర్లు కేటాయించారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తే తమ కుటుంబాలు రోడ్డు మీద పడతాయంటూ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలంటూ జారీ చేసిన నోటీసులు వెనక్కి తీసుకోకుంటే నవంబరు 2 నుంచి నిరవధిక సమ్మె చేస్తామంటూ తేల్చి చెబుతున్నారు. కనీసం మాట్లాడరా ? ఎయిరిండియాను ప్రైవేటీకరించిన తర్వాత సెటిల్మెంట్, తమ భవిష్యత్తుకు భరోసా అందించేందుకు కేంద్రం నుంచి ఎటువంటి చర్యలు లేవని, కానీ ఇప్పటికిప్పుడు ఇళ్లు వదిలేసి వెళ్లాలంటూ ఆదేశాలు ఇవ్వడం అమానవీయమని ఉద్యోగులు అంటున్నారు. కనీసం తమతో చర్చలు జరిపేందుకు కూడా ఎవరూ సిద్ధంగా లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిక్కుముళ్లు ఏవియేషన్ రంగంలో తమదైన ముద్ర వేయాలని టాటాగ్రూపు ఎప్పటి నుంచో ఆశిస్తోంది. విస్తారాలో పెట్టుబడులు పెట్టినా పూర్తి స్థాయిలో టాటాల ఆశయం నెరవేరలేదు. ఈ సమయంలో ఎయిర్ ఇండియా ద్వారా ఏవియేషన్ రంగంలో దూసుకుపోవాలని టాటా యోచిస్తోంది. అయితే అంతకు ముందు ఉద్యోగుల సెటిల్మెంట్, క్వార్టర్లు తదితర చిక్కుముళ్లు వీడాల్సి ఉంది. చదవండి : ఎయిర్ఇండియా తర్వాత ప్రైవేటీకరించేది వీటినే ! -
దీక్ష భగ్నంపై వైఎస్ షర్మిల ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సింగరేణికాలనీకి చెందిన ఆరేళ్ల బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన నిరాహారదీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. ఆమెతోపాటు శిబిరంలో ఉన్న నాయకులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. కాగా, శాంతియుతంగా దీక్ష చేస్తున్న షర్మిలను తరలించటంపై సింగరేణికాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని బుధవారం పరామర్శించిన షర్మిల ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించాలంటూ ఆ కుటుంబం ఇంటి సమీపంలోనే దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ధర్నా చేసే హక్కు లేదా?: కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ధర్నా చేసే హక్కు కూడా లేదా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆరేళ్ల చిన్నారికి జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించేందుకు వెళ్లిన తమను పోలీసులతో నిర్బంధించడాన్ని తాలిబన్ల చర్యగా ఆమె అభివర్ణించారు. లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ..బాలిక హత్యాచార ఘటనపై తాము ఆందోళనకు దిగాకే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమపై అర్ధరాత్రి పోలీసులతో దాడి చేయించడం ఈ ప్రభుత్వం చేతకానితనానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ పాలనలో యువత ఆశయం లేకుండా కాలం వెళ్లదీస్తోందని, మత్తు మందులకు బానిసయ్యే దురవస్థ ఏర్పడిందన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలపై దాడులు పెరిగాయని, మద్యం విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. చదవండి: సైదాబాద్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల -
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈనెల 29న సమ్మె
-
ఏపీ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
-
ఏపీ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జూనియర్ డాక్టర్లతో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపారు. డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు తెలిపారు. చదవండి: సీఎం జగన్ను కలిసిన ‘డీఎస్సీ-2008’ అభ్యర్థులు వైఎస్ఆర్ బీమాపై సమీక్ష: సీఎం జగన్ కీలక నిర్ణయాలు -
TS: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ జూనియర్ డాక్టర్లు(జూడాలు) చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరింది. నేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్ చెస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు జూడాలు డీఎంఈతో చర్చలు కొనసాగించారు. అయితే ఈ చర్చలు విఫలం కావడంతో సమ్మెను రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఇక జూడాల సమ్మెపై సీఎం కేసీఆర్ సీరియస్ అయి వెంటనే విధుల్లో చేరాలని కోరిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హామీలు లిఖితపూర్వకంగా ఇస్తేనే తాము విధుల్లో చేరుతామని జూడాలు స్పష్టం చేశారు. ఇవాళ మరోసారీ డీఎంఈతో జూడాల చర్చలు జరగనున్నాయి. చదవండి: జూడాల సమ్మె సరికాదు: సీఎం కేసీఆర్ -
తెలంగాణ: రెండోరోజుకు చేరిన జూడాల సమ్మె
-
జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. కాగా, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 10న టి–జూడా రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు రమేశ్రెడ్డికి సమ్మె నోటీసు ఇచ్చారు. పక్షం రోజుల్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని నోటీసులో స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమ్మెకు దిగుతున్నట్లు జూడాల సంఘం స్పష్టం చేసింది. చదవండి: బీజేపీలో ఈటల చేరిక దాదాపు ఖరారు Etela Rajender: బీజేపీ వైపు ఈటల? -
నేటి నుంచి తెలంగాణలో జూడాల సమ్మె
-
26 నుంచి జూడాల సమ్మె!
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ... రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. అప్పటివరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు జూడా సంఘం రాష్ట్ర, గాంధీ యూనిట్ అధ్యక్షులు వాసరి నవీన్రెడ్డి, మణికిరణ్రెడ్డి శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. స్టైపెండ్ను జనవరి 2020 నుంచి పెంచాలని, విధినిర్వహణలో మృతి చెందిన జూడాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, జూడాలకు బీమా సౌకర్యంతోపాటు కుటుంబ సభ్యులకు నిమ్స్లో కరోనా వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. కాగా, సీనియర్ డాక్టర్ల సమస్యల్ని కూడా పరిష్కరించకుంటే తాము కూడా సమ్మె బాట పడతామని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) స్పష్టం చేసింది. ఈ సంఘం ప్రతినిధులు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) డైరెక్టర్కు సమ్మె నోటీసు ఇచ్చారు. -
పిడుగుపాటు గురైన యువకుడు.. ఆవు పేడతో వైద్యం..
రాయ్పూర్: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇంకా కొందరు మూఢ నమ్మకాలనే గుడ్డిగా నమ్మాతూ పాటిస్తున్నారు. ఇదే తరహా ఘటన చత్తీస్ఘడ్లో చోటు చేసుకుంది. పిడుగుపాటుకు గురై మృతిచెందిన యువకుడుని బతుకుతాడనే నమ్మకంతో ఆవు పేడతో కొన్ని గంటల పాటు పాతిపెట్టారు. చత్తీస్ఘడ్లోని పలు చోట్ల టౌటే తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఓ వ్యక్తి ఇంటి బయట, ప్రాంగణంలో పేరుకుపోయిన మురుగు నీటిని తొలగించడానికి ప్రయత్నిస్తూ, అడ్డుకున్న కాలువను తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అతను పిడుగుపాటు గురై అక్కడికక్కడే మూర్ఛపోయాడు. పెద్ద శబ్ధం రావడంతో ఇంటి చుట్టూ పక్కన వాళ్లంతా గుమిగూడారు. వారందరూ ఆ యువకుడిని ఆవు పేడ గొయ్యిలో పాతిపెట్టమని సూచించారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆ యువకుడి మొఖం తప్ప మిగతా శరీరాన్ని ఆవు పేడతో కొన్ని గంటల పాటు పూడ్చి పెట్టారు. అయినప్పటికీ, ఆ వైద్యం ఫలించకపోవడంతో వారు 108 అంబులెన్స్ పిలిపించి ఆస్పత్రికి తరలించారు. చికిత్స కోసం ఉదయపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారు. చదవండి: న్యూఢిల్లీ: 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. -
నాలుగు రోజులు బ్యాంకులకు వరుస సెలవులు!
దేశవ్యాప్తంగా రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇందులో రెండు రోజులు(శని, అది) సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా బ్యాంకు సేవలు ఆగిపోనున్నాయి. ప్రభుత్వ ఆధీనంలో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 15న రెండు రోజుల సమ్మెను ప్రారంభించాలని 9 బ్యాంక్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథాతథంగా పనిచేయనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్బియు) 2021 మార్చి 15, 16 తేదీలలో బ్యాంక్ ఉద్యోగుల అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబిఎ) తమకు తెలిపినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. సమ్మె జరిగే రోజుల్లో బ్యాంకు శాఖలు, కార్యాలయాలు సజావుగా పనిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కెనరా బ్యాంక్ తెలిపింది. కేంద్ర 2021 బడ్జెట్ సందర్భంగా మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల(పిఎస్బి)ను ప్రైవేటీకరించనున్నట్లు ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. 10 లక్షల మంది ఈ సమ్మెలో పాల్గొంటారని అంచనా. చదవండి: 'వరల్డ్ వైడ్ వెబ్’ కోటకు బీటలు గోల్డ్ పెట్టుబడులపై తగ్గని ఆదరణ -
బాబోయ్... ఈ ప్రిన్సిపాల్ మాకొద్దు
సాక్షి, సిద్దిపేట(హుస్నాబాద్): తాగుబోతు ప్రిన్సిపాల్ మాకొద్దంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కిషన్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి మద్యం తాగివచ్చి సిబ్బంది, మహిళా అటెండర్, విద్యార్థులతో దురుసుగా ప్రవరిస్తున్నారని, కులాల పేరుతో దూషిస్తున్నారని విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాలకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ను తొలగించాలంటూ మూకుమ్మడిగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిత్యం కళాశాలకు మద్యం తాగి వస్తున్నారని తెలిపారు. మాట్లాడాలని వెళ్తే దూషిస్తారని, దురుసుగా ప్రవర్తిస్తారని ఆరోపించారు. కళాశాలకు బస్సు సౌకర్యం, ల్యాబ్, ఫర్నిచర్, బోధన బోధనేతర సిబ్బంది, లైబ్రేరియన్, పీడీ ఇలా ఎవరూ లేరని, కనీస సౌకర్యాలు కరువయ్యాయన్నారు. విద్యార్థులకు మద్దతుగా టీఎస్ఎఫ్ (టెక్నికల్ స్టూడెంట్స్ ఫెడరేషన్) రాష్ట్ర అధ్యక్షుడు మేకల అక్షయ్ కుమార్, రాష్ట్ర కమిటీ ఇన్చార్జి వెంకన్న నాయక్, నాయకులు బస్వరాజ్ నాగరాజు, ఎగ్గిడి వేణు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి, ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులకు వినతిపత్రం అందజేశారు. -
రెండు రోజులు బ్యాంకింగ్ సమ్మె!
సాక్షి, న్యూఢిల్లీ: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్యూ) ప్రైవేటీకరణ ప్రతిపాదనను నిరసిస్తూ, మార్చి 15 నుంచీ రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించాలని తొమ్మిది యూనియన్ల ప్రాతినిధ్య సంస్థ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) మంగళవారం బ్యాంకింగ్కు పిలుపునిచ్చింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్బీయూ స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1న తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్ను ప్రైవేటీకరించింది. 2019లో ఈ బ్యాంకులో మెజారిటీ వాటాను ఎల్ఐసీకి విక్రయించింది. అలాగే గడచిన నాలుగేళ్లలో 14 ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసింది. -
సమ్మె సైరెన్
కరీంనగర్: కేంద్రప్రభుత్వ విధానాలకు నిరసనగా గురువారం తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు కార్మికలోకం సన్నద్ధమైంది. కేంద్రం కార్మిక చట్టాల సవరణ నిలిపివేయాలని, రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకోవాలని తొమ్మిది కార్మిక సంఘాలతోపాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రక్షణ, ఫార్మారంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ ఉద్యోగుల ఫెడరేషన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసేందుకు జిల్లావ్యాప్తంగా ఐఎన్టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్కేవీ, టీఎన్టీయూసీ, ఏఐయూటీసీ కార్మికల సంఘాలు సిద్ధమయ్యాయి. కార్మికులను సమ్మెలో భాగస్వాములను చేసేందుకు నాయకులు రౌండ్టేబుల్ సమావేశాలు, మోటర్ సైకిల్ ర్యాలీలు, కరపత్రాల పంపిణీలు, క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహించారు. కార్మికులు పనిచేసే సంస్థలకు సమ్మె నోటీసులు అందజేశారు. ఇప్పటికే జిల్లాస్థాయి సన్నాహక సదస్సు ఏర్పాటు చేసి సార్వత్రిక సమ్మె రోజున జిల్లాకేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. షాపింగ్మాల్స్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేసే కార్మికులకు కూడా ప్రత్యేక టీంల ద్వారా సమ్మె ప్రాధాన్యతను వివరించారు. జిల్లాలో కార్మికులు జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 1.8 లక్షలమంది కార్మికులు, ఇతర రంగాలలో మరో 1.5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. రైస్మిల్లు కార్మికులు 40 వేల మంది, ఐసీడీఎస్ 11 వేల మంది, ఐకేపీ 4,720 మంది, గ్రామపంచాయతీ కార్మికులు 8 వేల మంది, ఆశ కార్యకర్తలు 6,470 మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు 7,460 మంది సమ్మెలో పాల్గొననున్నారు. కరోనాకాలంలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులు తీవ్ర దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. కొన్ని కంపెనీలు అసలు జీతాలు ఇవ్వకుండానే కార్మికులను తొలగించాయి. మరికొన్ని కంపెనీలు సగం జీతంతో పని చేయించాయి. దీంతో కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న పాలకులకు వ్యతిరేకంగా సమ్మెతప్ప మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చి సమ్మెకు సై అంటున్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్, స్కీంవర్కర్లకు ఉద్యోగ భద్రత లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరోనాకాలంలో భవన నిర్మాణ కార్మికులకు రూ.1500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవ్వకపోవడంతో వేలాదిమంది నిరాశకు లోనయ్యారు. ప్రధాన డిమాండ్లు ∙ లేబర్కోడ్లను, రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. ∙ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడం నిలిపివేయాలి. ∙ అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. ∙ కోవిడ్ను సాకుగా చూపి ఉద్యోగాల నుంచి తొలగించడం, వేతనాల్లో కోత పెట్టడం నిలిపివేయాలి. ∙ అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను, రైల్వే, రక్షణ, ఎల్ఐసీ, బ్యాంకులు ప్రైవేటీకరించరాదు. ∙ వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసి ఆహారభద్రతను దెబ్బతీసే చట్టాలను రద్దు చేయాలి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కులను హరిస్తోంది. సంఘం ఏర్పాటు చేసుకోవడం నుంచి సమ్మె చేయడం వరకు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులన్నింటినీ ఒక్కొక్కటిగా సంస్కరణల పేరిట నిర్వీర్యం చేస్తోంది. సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని కార్మికుల శక్తిని చాటాలి. – పొనగంటి కేదారి,సీపీఐ జిల్లా కార్యదర్శి రాజ్యాంగబద్ధంగా కార్మికులకు చెందాల్సిన హక్కులను కాలరాయడం అప్రజాస్వామికం. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మిక చట్టాలు నిర్వీర్యమయ్యాయి. ఎల్ఐసీ, బ్యాంకింగ్ రంగ సంస్థ, బీఎస్ఎన్ఎల్, విమానాయానం లాంటి సంస్థలనే ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గం. సార్వత్రికసమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలి. – గీట్ల ముకుందరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి -
నేడు ఆటో, క్యాబ్ల బంద్
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకు రాష్ట్ర కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. దీంతో గురువారం గ్రేటర్ హైదరాబాద్లో ఆటో, క్యాబ్ల బంద్ పాటించనున్నట్లు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ తదితర సంఘాలు ప్రకటించాయి. కాగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్క ర్స్ ఫెడరేషన్ తదితర సంఘాలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపారు. అయినా సిటీ బస్సులు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. దక్షిణమధ్య రైల్వే మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఘ్, తదితర కార్మిక సంఘాలు కూడా సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపాయి. అయితే సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే అన్ని ప్రత్యేక రైళ్లు యథావిధిగా నడుస్తాయి. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని ఆ సంఘం నాయకులు అరుణ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొననున్న దృష్ట్యా సరుకు రవాణాకు అంతరాయం ఏర్ప డే అవకాశం ఉంది. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సం క్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని.. మోటార్ వెహికల్ యాక్ట్–2019ని రద్దు చేయాలని.. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సంఘాలు డిమాండ్ చే శాయి. సార్వత్రిక సమ్మెకు మద్దతు ప్రకటిస్తు న్నట్లు తెలంగాణ డ్రైవర్స్ యూనియన్ జేఏసీ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. కాగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. సింగరేణి కార్మికులు, బ్యాంక్, బీమా ఉద్యోగులు సంపూర్ణంగా సమ్మె పాటిస్తున్నారు. సింగరేణిలో బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సమ్మె దిగడంతో బొగ్గు గనులు బోసిపోయాయి. గనుల వద్ద కార్మికులు నిరసన ఈ ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికుల హక్కులను హరించడమే కాకుండా పనిగంటలు పెంచడం, ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం చట్టాలను తీసుకు వస్తుందని ఆరోపించారు. అటు ఎన్టీపీసీ కాంటాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించి గేటు ముందు ధర్నా చేశారు. బ్యాంక్ ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో బ్యాంక్ సేవలు స్తంభించాయి. ఆర్టీసీ కార్మికులు సైతం సమ్మెకు సంఘీభావం తెలిపినప్పటికీ బస్సులు మాత్రం యధావిధిగా నడుస్తున్నాయి. కార్మికుల సార్వత్రిక సమ్మెకు రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. పలుచోట్ల నిరసనలు ర్యాలీలు చేపట్టారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు సమ్మెకు సంఘీభావం తెలిపి కార్మికులతో కలిసి నిరసన ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. -
ప్రధాని ఎదుట ధర్నా చేస్తాం
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించాలని రాష్ట్రపతిని కలిసి కోరతామనీ, అవసరమైతే ప్రధానమంత్రి నివాసం ఎదుట ధర్నాకు దిగుతామని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ను కోరాలని రాష్ట్ర కేబినెట్ శనివారం తీర్మానించింది. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందంటూ కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ప్రస్తుతం జైపూర్లోని ఓ హోటల్లో మకాం వేసిన తమ విధేయ ఎమ్మెల్యేలతో సీఎం గహ్లోత్ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గహ్లోత్.. రాష్ట్రంలో సంక్షోభం సమసిపోయేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కలిసి కోరుతామనీ, అవసరమైతే ప్రధాని నివాసం ఎదుట ధర్నా చేపడతామన్నారని పార్టీకి చెందిన ఓ నేత వెల్లడించారు. హోటల్లో కనీసం మరో 21 రోజులు మకాం కొనసాగించేందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఎమ్మెల్యేలను కోరారన్నారు. మెజారిటీ సభ్యుల బలం తమకు ఉన్నందున బీజేపీ కుట్రలేవీ సాగవని తెలిపారన్నారు. రాజ్యాంగాన్ని లోబడి నడుచుకుంటున్నాననీ, తనపై ఎటువంటి ఒత్తిడులు లేవని గవర్నర్ మిశ్రా చెప్పడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శుక్రవారం రాత్రి రాజ్భవన్ ఎదుట ఆందోళనకు విరమించారు. అయితే.. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఏ మేరకు ఉంది, ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ సభను సత్వరమే సమావేశ పరచాలనే డిమాండ్కు కారణం తదితర ఆరు అంశాలపై స్పష్టతనివ్వాలని సీఎం గహ్లోత్ను గవర్నర్ కోరారు. దీంతో శనివారం సీఎం గహ్లోత్ నేతృత్వంలో కేబినెట్ సమావేశమై ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈనెల 31వ తేదీన అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ను కోరాలని నిర్ణయించింది. అయితే, గవర్నర్తో ముఖ్యమంత్రి గహ్లోత్ భేటీపై తుది నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్నిందంటూ కాంగ్రెస్ శ్రేణులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు జైపూర్తోపాటు జిల్లా కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపరచాలని గవర్నర్ను డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశం జరగకుండా బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు గోవింద్æ ఆరోపించారు. అరాచక వాతావరణం సృష్టించింది: బీజేపీ రాజస్తాన్లో అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక వాతావరణం సృష్టించిందని బీజేపీ ఆరోపించింది. అసెంబ్లీని సమావేశపరిచేందుకు ఆదేశాలు ఇవ్వాలనే డిమాండ్తో గవర్నర్ కార్యాలయాన్ని భయపెట్టేందుకే రాజ్భవన్ ఎదుట గహ్లోత్ ఆందోళన చేపట్టారని ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా నేతృత్వంలోని 15 మంది సభ్యుల బృందం శనివారం గవర్నర్ మిశ్రాను కలిసివినతి పత్రం అందజేసింది. అనంతరం బీజేపీ శాసనసభా పక్షనేత గులాబ్ చంద్ కటారియా మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కు పేరుతో రాజ్భవన్ వద్ద కాంగ్రెస్ ఆడిన డ్రామా దురదృష్టకరం. ఏ ఎజెండా లేకుండానే శాసనసభను సమావేశపరచాలని ప్రభుత్వం గవర్నర్ను కోరింది. ఇలా గవర్నర్పై ఒత్తిడి తేవడం రాజ్యాంగ విలువలను అగౌరవపరచడమే’ అని ఆయన అన్నారు. ï రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయాలని గవర్నర్ను కోరారా? అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆయన చెప్పారు. -
సింగరేణిలో మూడో రోజు సమ్మె
-
డిజిటల్ స్ట్రైక్
-
అమెజాన్కు షాక్ ఇచ్చిన ఉద్యోగులు
బెర్లిన్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్కు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్ అయిన జర్మనీలో అమెజాన్ ఉద్యోగులు నిరసనకు దిగారు. కార్మికుల భద్రత, హక్కులపై పోరాడేందుకు 48 గంటల పాటు జర్మనీలోని అన్ని కేంద్రాల ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. అమెజాన్ సంస్థలోని పలువురు ఉద్యోగులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు అండగా నిలుస్తూ వారికి ఆర్థిక సహాయం అందించాల్సిన సంస్థ కనీసం పట్టించుకోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (‘అధ్యక్షుడిగా వైదొలగినా ట్రంప్ను వెంటాడతాం’ ) కరోనా కష్టకాలంలోనూ కంపెనీ తమ స్వప్రయోజనాలకు, లాభాపేక్షకు మాత్రమే ప్రాధ్యానం ఇస్తుందని తమ భద్రత గురించి ఆలోచించడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో 'గుడ్ అండ్ హెల్తీ వర్క్' అనే నినాదంతో 48 గంటల పాటు సమ్మె కొనసాగుతుందని ఉద్యోగ సంఘం ప్రతినిధి ఓర్హాన్ అక్మాన్ తెలిపారు. జర్మనీలోని వివిధ కేంద్రాల్లో పనిచేస్తున్న దాదాపు 30-40 మందికి కరోనా సోకిందని, అయినా ఇప్పటివరకు వారికి ఎలాంటి ఆర్థిక సహాయం అందలేదని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్న ఆరోపణల్ని అమెజాన్ తోసిపుచ్చింది. ఉద్యోగులు, కస్టమర్ల భద్రత దృష్ట్యా సంస్థ .. జూన్ నాటికి సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 30,227 కోట్లు) పెట్టుబడి పెట్టిందని ప్రకటించింది. ఇప్పటికే 21 మిలియన్ల గ్లవుజులు, 18 మిలియన్ల ఫేస్ మాస్కులు సహా 39 మిలయన్ల ఇతర భద్రతా పరికరాలను అందించామని జర్మనీ అమెజాన్ ప్రతినిధి అన్నారు. నిరాదార ఆరోపణలు చేస్తూ సంస్థకు చెడ్డపేరు తేవడం మంచిది కాదని పేర్కొన్నారు. కాగా 2013 నుంచి జర్మనీలో వేతనాలు పెంచాలంటూ ఉద్యోగులు తరుచూ సమ్మెలకు దిగుతున్నారు. (దోశ ఆకృతిలో కనిపిస్తున్న గ్రహం ) -
ముంబైకు షాక్..సమ్మె చేపట్టిన ‘బెస్ట్’ ఉద్యోగులు
ముంబై : మహారాష్ట్రలో కరోనా విలయ తాండవం చేస్తోంది. దేశంలో దాదాపు మూడో వంతుకు పైగా పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర అతిపెద్ద కరోనా హాట్స్పాట్గా తయారైంది. ఈ నేపథ్యంలో తాజాగా బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లే, ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) ఉద్యోగుల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో యూనియన్ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. వైరస్తో ఇప్పటికే బెస్ట్ ఉద్యోగుల్లో ఎనిమిది మంది మృతి చెందగా 120 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో సోమవారం (మే 18) నుంచి బస్సులు నడపమని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ముంబైలో కరోనా విజృంభిస్తున్న సమయంలో బెస్ట్ సంస్థ తీసుకున్న నిర్ణయం నగరానికి మరింత ప్రమదకరంగా మారనుంది. (లాక్డౌన్ : కేంద్రం కీలక ఆదేశాలు ) ప్రస్తుతం నగరంలో ప్రజా రవాణాకు సంబంధించి కేవలం బెస్ట్ బస్సులు మాత్రమే పనిచేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా సబర్బన్ రైళ్ల సేవలు నిలిపి వేసిన అనంతరం ముంబై అంతటా అత్యవసర సేవల ఉద్యోగుల కోసం బెస్ట్ బస్సులు ముఖ్యపాత్ర పోషించాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో తమ సిబ్బందికి తగిన భద్రతా చర్యలు అందించకపోవడంతో సమ్మెకు పిలుపునిచిన్నట్లు యూనియన్ అధినేత శశాంక్ రావు తెలిపారు. కార్మికులకు ప్రత్యేక క్వారంటైన్, ఆసుపత్రి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పరిహారం కింద కోటి రూపాయలతోపాటు కుంటుంటంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. (లాక్డౌన్ 4.0: కొత్త నిబంధనలు ఇవే! ) కాగా ముంబైలో బెస్ట్ బస్సుల స్థానంలో కనీసం 1,200 మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 96,169కు చేరాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5242 కరోనా కేసులు నమోదు కాగా, 157 మంది మరణించారు. మొత్తం బాధితుల్లో 36, 824మంది కోలుకోగా 56,316 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. (ఏపీలో కొత్తగా 52 కరోనా కేసులు ) -
దిగిరాకపోతే రాష్ట్రం మొత్తం సేవలు నిలిపేస్తాం!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ సమ్మె బాటలోకి దిగారు. ఆయిల్ సంస్థలు ట్యాంకర్ల ఓనర్స్కి రావాల్సిన రవాణా ఛార్టీలో 80 శాతం కోత పెట్టిన నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రవాణా కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా సమ్మె చేపట్టారు. దీంతో సూర్యపేటలో పెద్ద సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్స్ రోడ్లపై నిలిచిపోయాయి. దాదాపు 500 ఆయిల్ ట్యాంకర్లు రోడ్లకు పరిమితమయ్యాయి. సింగిరేణికి కూడా ఆయిల్ ట్యాంకర్స్ సరఫరా ఆగిపోయింది. ఆయిల్ సంస్థలు దిగిరకపోతే మధ్యాహ్నం తరువాత తెలంగాణ మొత్తం ఆయిల్ ట్యాంకర్లను నిలిపివేస్తామని తెలంగాణ ఆయిల్ ట్యాంకర్స్ ఓనర్స్ హెచ్చరించారు. చదవండి : మంచిర్యాలలో ‘మహా’ కలకలం -
చర్చలు విఫలం..
గాంధీఆస్పత్రి: గాంధీఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వర్తిస్తున్న స్టాఫ్నర్సులు బుధవారం వైద్యాధికారులతో జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మెకొనసాగుతుందని, గురువారం వైద్య మంత్రి ఈటల రాజేందర్ను కలిసిపరిస్థితిని వివరిస్తామని అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సుల యూనియన్ ప్రతినిధులు స్పష్టం చేశారు. కాగా పదమూడేళ్లుగా గాంధీ ఆస్పత్రిలో 212 మందిస్టాఫ్నర్సులు అవుట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిని కోవిడ్ నోడల్ కేంద్రంగా ప్రకటించడంతోవారంతా ప్రాణాలకు తెగించి విధులకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోరెగ్యులరైజ్ చేయాలని లేకుంటే ప్రభుత్వం తరపున కాంట్రాక్టు పద్ధతిలోనైనా తమను తీసుకోవాలని కోరుతూ బుధవారం బహిష్కరించారు. ఈ మేరకు యూనియన్ ప్రతినిధులు మేఘమాల, లక్ష్మీ, ఇందిర, ప్రమీలలు డీఎంఈ రమేష్రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్కుమార్తో మాట్లాడారు. ఇటువంటి తరుణంలో విధులు బహిష్కరించడం తగదని, రెగ్యులరైజ్, కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం తమ చేతుల్లోలేదని, ప్రభుత్వం నిర్ణయిస్తుందని అధికారులు స్పష్టం చేయడంతో యూనియన్ ప్రతినిధులు బయటకు వచ్చి చర్చలు విఫలం అయినట్లు ప్రకటించారు. విధులకు హాజరుకాకుంటే టెర్మినేట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు షిఫ్ట్ల్లో 150 మంది రెగ్యులర్ నర్సింగ్ సిబ్బంది గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 200మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సులు విధులు బహిష్కరించడంతో రెగ్యులర్ సిబ్బంది 150 మంది మూడు షిఫ్ట్ల్లో పనిచేస్తున్నట్లు ఆస్పత్రి అధికారులు తెలిపారు. బుధవారం 18 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్నర్సులు విధులకు హాజరయ్యారని, మిగిలిన వారంతా బహిష్కరించారని వివరించారు. కోవిడ్ బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామన్నారు. -
మార్చి 27న బ్యాంకుల సమ్మె
చెన్నై: బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మె చేపట్టనున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన మెగా బ్యాంక్ విలీనాలను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ రంగంలోని రెండు ప్రధాన యూనియన్లు (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్) మార్చి 27 న సమ్మెకు దిగనున్నాయి. బ్యాడ్ లోన్ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి వెంకటచలం అన్నారు. చెడు రుణాల మొత్తం రూ. 216,000 కోట్లుగా వుండటంతో, 2019 మార్చి 31 తో ముగిసిన సంవత్సరానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ .150,000 కోట్ల స్థూల లాభాలకు పరిమితమైనాయని తెలిపారు. దీంతో రూ .66,000 కోట్ల నికర నష్టం వాటిల్లిందని విమర్శించారు. తాజా బ్యాంకుల విలీనం వల్ల భారీ ఎత్తున పేరుకు పోయిన కార్పొరేట్ బ్యాడ్ లోన్లు తిరిగి వస్తాయని ఎలా నమ్మగలమని ఆయన ప్రశ్నించారు. దీనికి ఉదాహరణగా ఎస్బీఐ విలీనం విలీనం తరువాత ఈ బెడదమరింత పెరిగిందనే విషయాన్ని గుర్తుచేశారు. కేవలం 323 మిలియన్ల జనాభా ఉన్న అమెరికాలో బ్యాంకుల సంఖ్య భారతదేశంలోని బ్యాంకుల కంటే ఎక్కువ ఉందని, అలాంటిది 1.35 బిలియన్ల జనాభా కలిగిన భారతదేశంలో మరిన్ని బ్యాంకుల అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఏకీకరణ అవసరం లేదని వెంకటాచలం అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ఫైట్ ఫర్ రైట్స్
బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లసాధనకు వారు శుక్రవారం ఆందోళన బాటపట్టారు. హిమాయత్నగర్లో ఇలా ప్లకార్డులు చేతబూనినిరసన తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో/సుల్తాన్బజార్ : వేతన సవరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బ్యాంకు ఉద్యోగసంఘాలు చేపట్టిన సమ్మెతో ఎక్కడిక్కడ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోజువారి వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులపైన ఆధారపడిన వ్యాపారవర్గాలు సైతం ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సమాచారం తెలియకపోవడంతో చాలామంది ఖాతాదారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు వచ్చి నిస్సహాయంగా తిరిగి వెళ్లారు. మరోవైపు ప్రైవేట్ బ్యాంకులు, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తెలుగు రాష్ట్రాల విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల సమ్మెకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు బ్యాంకు ఉద్యోగులు అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో ఆందోళన చేపట్టారు. అబిడ్స్, బ్యాంక్ స్ట్రీట్లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నిరసన సభలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ లాభాలు లేవనే నెపంతో ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్పొరేట్ సంస్థలు ఎగవేసిన వేల కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ నాగేశ్వర్ మొండి బాకీల జోలికి వెళ్లకుండా చిన్నచిన్న రుణాలు పొందిన పేద మధ్యతరగతి ప్రజలను మాత్రం ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్యాంకు ఉద్యోగుల 12 డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫెడరేషన్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ కన్వీనర్ ఆర్. శ్రీరామ్, యూఎఫ్బీఎ రాష్ట్ర కన్వీనర్ బీఎస్. రాంబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలలో బ్యాంకు యూనియన్ల నాయకులతోఉద్యోగుల వేతన సవరణ 12.25 శాతం నుంచి 15 శాతం పెంచిదని తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో రెండు రోజుల సమ్మె అనివార్యం అయ్యిందని అన్నారు,. మొండి బాకీల వల్ల తీవ్ర నష్టం వచ్చిందన్నారు. వచ్చిన లాభాలలో ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదన్నారు. తమ సమ్మెతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 30వేల కోట్ల లావాదేవిలు స్తంభించినట్లు పేర్కొన్నారు.బ్యాంకుల బంద్ వల్ల శుక్రవారం జంటనగరాల్లోని సుమారు 6వేల బ్యాంకుల వరకు మూతపడ్డాయి. సుమారు 70 వేలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలోపాల్గొన్నారు. శనివారం కూడా ఈ సమ్మె కొనసాగనుంది.ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య, సిఐటీయు నాయకులు వీరయ్య, నాబార్డ్ ఎంప్లాయీస్ యూనియాన్ నాయకులు కైలాశ్పతి, అసిస్టెంట్ జీఎస్ ఎం.శ్రీనివాస్, ఎఐబీఈవో నాయకులు రవీంద్రనాథ్, ఉదయ్భాస్కర్, కుమార్, రమణతో పాటు వందలాది ఉద్యోగులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
31 నుంచి బ్యాంకింగ్ రెండు రోజుల సమ్మె!
న్యూఢిల్లీ: వేతన సవరణకు తక్షణ చర్యలు చేపట్టాలన్న ప్రధాన డిమాండ్తో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో బ్యాంక్ యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నాయి. 9 బ్యాంక్ యూని యన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇచ్చిన పిలుపుతో ఉద్యోగులు ఈ సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ ఐక్య వేదికలో అఖిల భారత బ్యాంక్ ఆఫీసర్ల సమాఖ్య (ఏఐబీఓసీ), అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ), బ్యాంక్ కార్మి కుల జాతీయ సంఘం (ఎన్ఓబీడబ్ల్యూ) వంటివి ఉన్నాయి. సమస్యల పరిష్కార దిశలో చీఫ్ లేబర్ కమిషనర్ ముందు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదని, దీనితో యూనియన్లు సమ్మె నోటీసును వెనక్కు తీసుకోలేదని ఏఐబీఓసీ ప్రెసిడెండ్ సునిల్ కుమార్ తెలిపారు. యూనియన్ల నుంచి డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి కూడా ఎటువంటి హామీ రాలేదని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం ఒక ప్రకటనలో తెలిపారు. మా సమస్యలూ పరిష్కరించాలి:ఐబీపీఏఆర్ఏ (ఏపీఅండ్టీఎస్) బ్యాంకింగ్ సమ్మె నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ పెన్షనర్లు అండ్ రిటైరీస్ అసోసియేషన్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా) ఐదవ ద్వైవార్షిక సమావేశం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. తమ సమస్యల పరిష్కారానికి, తగిన గౌరవప్రదమైన పెన్షన్ పొందడానికి ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని, ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. -
ఆ రెండ్రోజులు బ్యాంకులు పనిచేయవు..
కోల్కతా : వేతన సవరణపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిగిన చర్చలు ముందుకు సాగకపోవడంతో ఈనెల 31, ఫిబ్రవరి 1న రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంక్ యూనియన్లు బుధవారం పిలుపునిచ్చాయి. డిమాండ్ల సాధన కోసం మరోసారి మార్చి 11 నుంచి 13 వరకూ సమ్మె చేపడతామని బ్యాంకు యూనియన్ల సమాఖ్య (యూఎఫ్బీయూ) వెల్లడించింది. అప్పటికీ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఏప్రిల్ 1 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని యూఎఫ్బీయూ పశ్చిమ బెంగాల్ కన్వీనర్ సిద్ధార్ధ ఖాన్ వెల్లడించారు. కాగా యూఎఫ్బీయూ 15 శాతం వేతన పెంపును కోరుతుండగా ఐబీఏ 12.25 శాతం మేరకే పెంపును పరిమితం చేస్తోందని ఇది తమకు ఆమోదయోగ్యం కాదని ఆయన చెప్పారు. నెలాఖరు నుంచి బ్యాంకు ఉద్యోగులు సమ్మె తలపెట్టడంతో ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అత్యవసర క్లియరెన్స్, ఏటీఎం సేవలకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఖాతాదారులు కోరుతున్నారు. -
రేషన్ సిబ్బందికి సర్కార్ షాక్
సాక్షి, చెన్నై: సమ్మె బాటకు సిద్ధపడ్డ రేషన్ షాపుల సిబ్బందిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నో వర్క్..నో పే అంటూ సమ్మె రోజుల్లో జీతాలు నిలుపుదలకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కాస్త సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెకు సిద్ధ పడ్డ రేషన్ సిబ్బందిని ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలో రెండు కోట్ల 20 లక్షల మేరకు కుటుంబకార్డుదారులు ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని రేషన్ దుకాణాల ద్వారా కుటుంబకార్డుదారులకు ఉచిత బియ్యం, చౌక ధరకే చక్కెర, కంది, ఉద్ది, పామోలిన్, కిరోసిన్ అందిస్తున్నారు. ముఫ్పై వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాల్లో 70 వేల మంది దాకా పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంగా అధికారులు తమను వేధిస్తున్నారంటూ, రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల బాట కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, అధికారుల వేధింపుల నుంచి రక్షించాలని, తమకు జీతాలు పెంచాలన్న, ఇతర అలవెన్స్లు పెంచాలన్న డిమాండ్లతో తొలుత రేషన్ సిబ్బంది పోరుబాటను దశల వారీగా సాగిస్తున్నారు. అయితే, పాలకుల్లో స్పందన లేని దృష్ట్యా, ఇక సేవల నిలుపుదలకుసిద్ధమయ్యారు. గతంలో వలే కాకుండా, ఈ సారి సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి సమ్మె గంటకు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెలోకి వెళ్లేందుకు నిర్ణయించాయి. నీరుగార్చేందుకు అస్త్రం.. రేషన్ దుకాణాల్లో సాధారణంగా నెలలో మొదటి, రెండు, మూడు వారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సిబ్బంది సమ్మె గంట మోగించిన పక్షంలో నిత్యావసర వస్తువుల సరఫరా ఆగే ప్రమాదం నెలకొనడం ఖాయం. దీనిని పరిగణించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ విధులకు రాకుండా సిబ్బంది సమ్మెలోకి వెళ్తారో అక్కడల్లా ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా నిత్యావసర వస్తువుల్ని కార్డుదారులకు ఎలాంటి ఆటంకం అన్నది లేకుండా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. అదే సమయంలో సిబ్బందిని దారిలోకి తెచ్చుకోవడంతో పాటు సమ్మెను అణగదొక్కేందుకు ప్రభుత్వం కొత్తబాటను ఎంచుకుంది. సిబ్బందికి హెచ్చరికలు చేస్తూ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఓ హెచ్చరిక సిబ్బందిని డైలమాలో పడేశాయి. నో వర్క్..నో పే అంటూ విధులకు హాజరు కాని వారికి సమ్మె రోజులకు జీతాలు నిలుపుదల చేయనున్నట్టు ప్రకటించారు. పౌరసరఫరాల విభాగం అధికారి కన్నన్ ఈ ఉత్తర్వుల్ని అన్ని మండల, డివిజన్ కార్యాలయాలకు జారీ చేశారు. ఆయా దుకాణాల తాళాలను మండల అధికారులు చేజిక్కించుకోవాలని, సమ్మె గంట మోగిన పక్షంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం అన్నది లేకుండా ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా అందించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే, ఎక్కడెక్కడ సిబ్బంది విధులకు హాజరు కారో, ఆ రోజుల్లో వారికి జీతాలు ఇవ్వబోమని స్పష్టం చేయడం గమనార్హం. ఇది కాస్త రేషన్ సిబ్బంది సంఘాల్ని కలవరంలో పడేసింది. గతంలో ఇదే మాదిరిగా సంఘాలన్నీ ఒకే వేదికపైకి రాగా, పాలకుల హెచ్చరికలతో చీలికలు తప్పలేదు. అదే పరిస్థితి మళ్లీ పునరావృతం అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే. -
ఆర్టీసీ సమ్మెతో కేసీఆర్కు భయం: మందకృష్ణ
సాక్షి, హైదరాబాద్ : వందేళ్ల క్రితం అమలైన కెనడా ఫార్ములాను తెలంగాణలో అమలు చేయాలని కేసీఆర్ కుట్ర పన్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన కొంత మంది కార్మికులపై కాల్పులు జరిపించి ఉద్యమాన్ని పక్కదోవ పట్టించాలని చూశారని ఆరోపించారు. కానీ భయంతో ఆ ప్రణాళికలను అమలు చేయలేకపోయాడని విమర్శించారు. ‘కేసీఆర్, ఆయన భజనపరులకు నిన్నటి వరకు కాళేశ్వరం అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఇప్పుడు కాళేశ్వరంపై కేంద్రం కన్ను పడడంతో కేసీఆర్ దృష్టి ఆర్టీసీపై పడింది. ఆర్టీసీ కార్మికుల నుంచి రాజకీయ పార్టీలను, ప్రజలను దూరం చేయాలని కేసీఆర్ కుట్ర చేశారు. ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలని కలలు కన్నార’ని విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ.. ‘సమాజం మద్దతును ఆర్టీసీ కూడగట్టుకుంది. సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గొద్దు. ఎవ్వరూ ఆత్మహత్య చేసుకోవద్దు. కేసీఆర్ ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టిన ఘనత కార్మికులదే. టీఎన్జీవో నాయకులు ఆర్టీసీ జేఏసీకి అండగా నిలవాలి. అంతేకానీ, కేసీఆర్కు వంత పాడి ఆర్టీసీ కార్మికులకు వెన్నుపోటు పొడవద్దు. సమ్మె మొదలైన నాటి నుంచి కోర్టు కార్మికుల పక్షానే నిలిచింది. కోర్టు హెచ్చరికల చివరి రూపమే సీఎస్ను, ఆర్టీసీ ఎండీని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిని బోనులో నిలబెట్టింది. ఆర్టీసీ సమ్మె కేసీఆర్లో భయాన్ని పుట్టించింది. అందుకే కేవలం తొమ్మిది నిమిషాల్లో పరిష్కారమయ్యే సమస్యకు తొమ్మిది గంటలు కేటాయించి చర్చలు జరిపాడ’ని ఎద్దేవా చేశారు. -
ఆర్టీసీ విలీనానికి ఆమోదముద్ర
-
సమ్మెకు విరామం
ప్రభుత్వ వైద్యులు ఎట్టకేలకువెనక్కుతగ్గారు. వారంరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీరిపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకుసిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెనువిరమించారు. సమ్మెకుదిగిన వైద్యులంతా శుక్రవారం విధులకు హాజరుకావడంతో రోగులకు కొంత ఊరటలభించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల పోస్టులను పెంచాలని, విద్యార్హతకు సమానంగా వేతనాలు చెల్లించాలని, వైద్య విద్యలో పీజీకి ప్రభుత్వ డాక్టర్లకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పీజీ వైద్య విద్యార్థులకు నియామక ఇంటర్వ్యూలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ వైద్యులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించడం, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ వచ్చారు. తమిళనాడు ప్రభుత్వ డాక్టర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి, ఉన్నతాధికారులు గతంలో అనేకసార్లు చర్చలు జరిపారు. ఆరు వారాల్లోగా డిమాండ్లను నెరవేరుస్తామని అప్పట్లో మంత్రి విజయభాస్కర్ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రోజులుగడుస్తున్నా హామీల అమలును ప్రభుత్వం దాటవేయడంతో అక్టోబర్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో గత నెల 25వ తేదీన వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. సుమారు 15 వేల మంది వైద్యుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి. సాధారణ చికిత్సతోపాటు అత్యవసర విభాగం వైద్యులు సైతం సమ్మెకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకులోనయ్యారు. గురువారం ఉదయం చెన్నై జీహెచ్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి ప్రాంగణంలోని వైద్యులను సమ్మె విరమించాల్సిందిగా కోరారు. సమ్మెకు మద్దతుగా బయటి ప్రాంతాల నుంచి వస్తున్నవారిని అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా వైద్యులు నినాదాలు చేశారు. సమ్మెను తీవ్రం చేయడంలో భాగంగా హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు సమ్మెలో పాల్గొనేలా చేశారు. ప్రభుత్వం, వైద్యుల సంఘం ఎవరికివారు పంతాలకు పోవడంతో సమస్య జఠిలంగా మారింది. ఈ దశలో వైద్యులచేత సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చొరవచూపేలా ఆదేశించాలని సూర్యప్రకాశం అనే న్యాయవాది గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో క్రమశిక్షణ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైనారు. సమ్మెలో ఉన్న సుమారు 50 మంది వైద్యులను గురువారం ఆకస్మిక బదిలీ చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే ఎస్మా చట్టం కింద డిస్మిస్ చేసి, వారి స్థానంలో కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. ఈ పరిణామంతో భీతిల్లిన 2,160 మంది సాయంత్రానికి విధుల్లో చేరారు. శుక్రవారం ఉదయం విధుల్లో చేరని వైద్యుల స్థానాలను ఖాళీలుగా ప్రకటించి కొత్తవారితో భర్తీ చేస్తామని మంత్రి మరోసారి హెచ్చరించారు. అంతేగాక 188 కొత్త డాక్టర్లకు శుక్రవారం నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ సర్వం సిద్ధం చేసుకున్నారు. వైద్యులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మె విరమిస్తే చర్యలకు సిద్ధమని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడువు విధించారు. ఈ పరిణామాలతో దిగొచ్చిన వైద్యుల సంఘం ప్రతినిధులు సమ్మెను తాత్కాలికంగా విరమించి విధుల్లో చేరుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వైద్యులకు ధన్యవాదాలు :మంత్రి విజయభాస్కర్ ప్రభుత్వ విన్నపాన్ని మన్నించి సమ్మెను విరమించిన వైద్యులకు ధన్యవాదాలని మంత్రి విజయభాస్కర్ అన్నారు. మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ, సమ్మెను విరమించినందున ఇప్పటి వరకున్న వైద్యుల సర్వీసును రద్దు (బ్రేక్ ఇన్ సర్వీస్)చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్లు తెలిపారు. -
ఆర్టీసీ చరిత్రలో ఇదే అతి పెద్ద సమ్మెగా రికార్డు
-
మా పొట్ట కొట్టకండి
తాండూరు టౌన్: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులమంతా సమ్మె చేస్తుండగా, తాత్కాలిక ఉద్యోగులుగా చేరి మా పొట్ట కొట్టకండని ఆర్టీసీ కార్మికులు వేడుకున్నారు. డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ప్రభుత్వం బస్సులను నడిపిస్తున్న విషయం విదితమే. 18వ రోజుకు చేరిన సమ్మెలో భాగంగా మంగళవారం ఆర్టీసీ కార్మికులు, అఖిల పక్ష నేతలు, ప్రజా, కుల సంఘాల నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారి వద్దకు వెళ్లి వారికి గులాబీ పువ్వులను అందించారు. ఆర్టీసి బలోపేతానికి, ఉద్యోగ భద్రతకు, ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం సమ్మె చేస్తున్నామని, దీనికి విరుద్ధంగా మీ స్వలాభం కోసం విధులకు హాజరవుతూ మా పొట్టలు కొట్టొద్దని వేడుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అయితే కొత్త నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. మీరంతా శాశ్వత ఉద్యోగులుగా మారొచ్చని హితవు పలికారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం కావాలనే తాత్కాలిక ఉద్యోగులను తీసుకుందన్నారు.కార్మికులపై కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం మానేయాలని, ఇకనైనా హైకోర్టు ఆదేశాలను శిరసావహించి కార్మిక సంఘాల జేఏసీ నేతలను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ మొండి వైఖరి వీడకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నిరసన కార్యక్రమంలో టీజేఎస్ నేత సోమశేఖర్, టీజేఎంయూ డిపో గౌరవాధ్యక్షుడు పటేల్ విజయ్, బీజేపీ నేతలు కృష్ణముదిరాజ్, భద్రేశ్వర్, సీపీఎం నేత శ్రీనివాస్, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అంజిలయ్య, గోపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు బ్యాంకుల సమ్మె
-
నేడు దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
న్యూఢిల్లీ/కోల్కతా: బ్యాంక్ల విలీనానికి నిరసనగా నేడు(మంగళవారం) కొన్ని బ్యాంక్ యూనియన్లు సమ్మె చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంక్ సర్వీసులకు అంతరాయం ఏర్పడనున్నది. బ్యాంక్ల విలీనాలు, డిపాజిట్ల రేట్ల తగ్గింపు, ఉద్యోగ భద్రతకు సంబంధించిన కొన్ని అంశాలపై నిరసన తెలియజేస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్ఐ)లు బ్యాంక్ యూనియన్లు జాతీయ స్థాయిలో 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే బ్యాంక్ ఆఫీసర్లు, ప్రైవేట్ రంగ బ్యాంక్లు, ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లు, సహకార బ్యాంక్లు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. బ్యాంక్ల విలీనం వీటిపై ఎలాంటి ప్రభావం చూపనందున ఇవి ఈ సమ్మెలో పాల్గొనడం లేదు. సమ్మె కొనసాగుతుంది.... ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చలు విఫలమయ్యాయని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీ.హెచ్. వెంకటాచలమ్ పేర్కొన్నారు. అందుకని సమ్మె కొనసాగుతుందని తెలిపారు. సమ్మె పరిధిలోనే ఉన్నందున ఏటీఎమ్లను కూడా మూసేస్తామని బ్యాంక్ యూనియన్లు పేర్కొన్నాయి. కొన్ని బ్యాంక్ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్కు ఇవ్వడం, బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని ఈ యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి. తగిన స్థాయిల్లో బ్యాంక్ క్లర్క్లను నియమించాలని, భారీగా పేరుకుపోతున్న మొండి బకాయిల రికవరీకి గట్టి చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభావం స్వల్పమే !.. పలు బ్యాంక్లు ఇప్పటికే సమ్మె విషయమై తమ ఖాతాదారులను అప్రమత్తం చేశాయి. సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంక్ సంఘాల్లో తమ ఉద్యోగుల సభ్యత్వం తక్కువగా ఉందని, ఈ సమ్మె ప్రభావం బ్యాంక్ కార్యకలాపాలపై స్వల్పంగానే ఉంటుందని ఎస్బీఐ వెల్లడించింది. సమ్మె కారణంగా ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని సిండికేట్ బ్యాంక్ పేర్కొంది. అయితే సమ్మె జరిగితే, కార్యకలాపాలపై ప్రభావం ఉండగలదని వివరించింది. గత నెలలో 26, 27 తేదీల్లో బ్యాంక్ల సమ్మెకు ఆఫీసర్ల యూనియన్లు పిలుపునిచ్చాయి. కానీ, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ యూనియన్లు సమ్మెను విరమించాయి. -
బంగ్లాదేశ్ వస్తుందా భారత్కు?
ఢాకా: భారత్లో బంగ్లా పర్యటనకు ఇంకా రోజుల వ్యవధే ఉంది కానీ... ఆటగాళ్ల అనూహ్య నిర్ణయం ఈ సిరీస్ను సందిగ్ధంలో పడేసింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉన్నపళంగా సమ్మెబాట పట్టారు. కాంట్రాక్టు మొత్తాల పెంపుతో పాటు తమ డిమాండ్లు తీర్చకపోతే ఏ స్థాయి క్రికెటైనా ఆడబోమని మీడియా సమావేశంలో తెగేసి చెప్పారు. సమ్మె బావుట ఎగరేసిన వారిలో మేటి క్రికెటర్లు కెపె్టన్ షకీబుల్ హసన్, మహ్ముదుల్లా, ముషి్ఫకర్ రహీమ్ సహా మొత్తం 50 మంది ఆటగాళ్లున్నారు. దీంతో జాతీయ క్రికెట్ లీగ్తో పాటు భారత పర్యటనకు ఆటగాళ్ల సమ్మె దెబ్బ తగలనుంది. వచ్చే నెల 3 నుంచి భారత్లో బంగ్లా పర్యటన మొదలవుతుంది. ఇందులో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగమైన 2 టెస్టుల సిరీస్, మూడు టి20లు ఆడనుంది. అంతకంటే ముందే బంగ్లాలో శిక్షణ శిబిరం మొదలు కావాల్సి ఉంది. ఈ పరిణామాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కాబోయే అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ‘ఇది పూర్తిగా బంగ్లా క్రికెట్ బోర్డు (బీసీబీ) అంతర్గత వ్యవహారం. బీసీసీఐ పరిధిలో లేని అంశం. ఏదేమైనా సిరీస్ జరగాలనే ఆశిస్తున్నా’ అని అన్నాడు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య కోల్కతాలో ఓ టెస్టు జరగనుంది. ఒకవేళ సిరీస్ జరగకపోతే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పూర్తి పాయింట్ల (120)ను భారత్కే కేటాయిస్తుంది. -
సమ్మెకు దిగిన క్రికెటర్లు..
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్లు సోమవారం సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు క్రికెట్ ఆడమని అదేవిధంగా క్రికెట్ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి తేల్చిచెప్పారు. అంతేకాకుండా బీసీబీకి గతంలోనే 11 డిమాండ్లతో కూడిన లేఖను పంపామని.. కానీ పట్టించుకోకపోవడంతోనే సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు తెలిపారు. మైదాన సిబ్బంది, ఆటగాళ్ల జీతాలు పెంచడం, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఫీజు పెంచడం, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో మార్పులు, ప్రయాణ ఖర్చుల పెంపు వంటి డిమాండ్లతో సమ్మెకు దిగినట్లు క్రికెటర్లు పేర్కొంటున్నారు. సుమారు 50 మంది క్రికెటర్లు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు సమాచారం. సమ్మెలో పాల్గొన్న క్రికెటర్లకు షకీబుల్ హసన్, ముష్పీకర్ రహీమ్లు నాయకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్-బంగ్లాదేశ్ సిరీస్ జరిగేది అనుమానంగా మారింది. టీమిండియాతో బంగ్లా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న తొలి టి20 జరగాల్సి ఉంది. అయితే బంగ్లా క్రికెటర్లు సమ్మెకు దిగడంతో ఈ సిరీస్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇది బీసీబీకి చెందిన అంతర్గత విషయమని, దానిపై స్పందించాల్సిన అవసరం లేదని బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న సౌరవ్ గంగూలీ పేర్కొన్నారు. బంగ్లా- టీమిండియా సిరీస్ తప్పక జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా బీసీబీ నుంచి అధికారిక సమాచారం వచ్చేంత వరకు దీనిపై స్పందించకుండా ఉంటేనే ఉత్తమమని గంగూలీ పేర్కొన్నాడు.