Budjet
-
వేతన జీవులను కనికరించేనా?
న్యూఢిల్లీ: బడ్జెట్ 2025పై మధ్య తరగతి, వేతన వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఆదాయపన్ను ఉపశమనం లభిస్తుందన్న అంచనాలతో ఉన్నాయి. పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలు సైతం పన్ను తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో ఆదాయం మిగిలించొచ్చని, ఇది మందగించిన వినియోగానికి ప్రేరణనిస్తుందని ఆర్థిక మంత్రికి సూచించడం గమనార్హం. దీంతో వ్యక్తిగత ఆదాయపన్ను పరంగా కొంత ఉపశమనం కల్పించొచ్చన్న అంచనాలు పెరిగాయి. ఇదే కనుక నిజమైతే అది వినియోగానికి ఊతమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా బేసిక్ ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని పెంచొచ్చని, పన్ను శ్లాబుల్లో సర్దుబాట్లు చేయొచ్చని, స్టాండర్డ్ డిడక్షన్ను పెంచొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వీటికితోడు పన్ను నిబంధనల్లో మార్పుల ద్వారా పన్ను చెల్లింపుదారులపై భారం తగ్గించొచ్చని భావిస్తున్నారు. అంచనాలు ఇలా..→ నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు ఆదాయ పరిమితి రూ.3లక్షలు. రూ.3–7 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను అమల్లో ఉంది. రానున్న బడ్జెట్లో ఈ బేసిక్ మినహాయింపును రూ.5లక్షలకు పెంచొచ్చని తెలుస్తోంది. అప్పుడు రూ.3–7 లక్షల శ్లాబు కాస్తా రూ.5–7 లక్షలుగా మారుతుంది. దీంతో మొత్తం మీద రూ.10,000 మేర పన్ను ఆదా అవుతుంది. → 7–10 లక్షల ఆదాయంపై 10% పన్ను ప్రస్తుతం అమల్లో ఉంది. అలాగే, రూ.10–12 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను అమలవుతోంది. వీటిల్లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. → రూ.12–15 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ప్రస్తుతం అమలవుతోంది. బడ్జెట్లో దీన్ని రూ.12–18 లక్షలకు సవరించొచ్చని భావిస్తున్నారు. 30 శాతం పన్నును రూ.18లక్షలకుపైన ఆదాయం ఉన్న వారికి వర్తింపచేసే అవకాశం ఉంది. ఇది ఆచరణలోకి వస్తే రూ. 18లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి రూ.3లక్షల ఆదాయంపై 30 శాతం రూపంలో సుమారు రూ.90వేల వరకు ఆదా అవుతుంది. రూ.18 లక్షలకు పైన ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఊరట ఉండకపోవచ్చు. → నూతన పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.75,000గా ఉంది. దీన్ని రూ.1,00,000కు పెంచొచ్చని తెలుస్తోంది. నిజానికి రూ.50,000గా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ను గత బడ్జెట్లో రూ.75,000కు పెంచారు. మొత్తం ఆదాయంలో దీన్ని నేరుగా మినహాయించుకోవచ్చు. పాత విధానంలో ఇది కేవలం రూ.50,000గానే కొనసాగుతోంది. 72 శాతం మంది కొత్త విధానంలోనే పన్ను రిటర్నులు సమర్పించారు. పెద్దగా పన్ను మినహాయింపుల్లేని, సరళతర నూతన పన్ను విధానంలోకి క్రమేణా అందరినీ తీసుకురావడం కేంద్రం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. కనుక మరిన్ని పన్ను ప్రయోజనాలు కొత్త విధానంలో కల్పించడానికే ఆర్థిక మంత్రి పరిమితం కావచ్చు. → రూ.2.5 లక్షలు మించిన పీఎఫ్ వడ్డీపై టీడీఎస్ను, ఉపసంహరణ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇ–సాప్లను విక్రయించినప్పుడే పన్ను చెల్లించేలా అనుమతించాలని, ఎన్ఆర్ఐల ఇల్లు విక్రయంపై టీడీఎస్ నుంచి మినహాయింపులు కల్పించాలన్న డిమాండ్లు సైతం ఉన్నాయి. ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం! మరింత మందిని ఇందులోకి తీసుకురావడంపై దృష్టి 5 % పన్ను శ్లాబులో మార్పు: రూ.10,000 వరకు ఆదా 30 శాతం పన్ను శ్లాబులోనూ మార్పు: రూ.90,000 వరకు ఆదా – సాక్షి, బిజినెస్ డెస్క్ -
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
ఎనిమిదేళ్లుగా కొనసాగుతున్న పనులు..! సొంతింటి కల నెరవేరేనా..?
మెదక్: గూడులేని నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం నత్తనడకన కొనసాగుతోంది. ఆర్థికంగా స్తోమత లేని పేదలకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి అందిస్తామని 2014 లో బీఆర్ఎస్ ప్రబుత్వం ప్రకటించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను సైతం స్వీకరించారు. బడ్జెట్లో కేటాయించిన ప్రకారం జిల్లాకు 4,776 ఇళ్లు మంజూరు చేశారు. లక్ష్యం ఘనంగా ఉన్నా.. ఆచరణ మాత్రం అంతంతే అన్నట్లుగా మారింది జిల్లాలో ఇళ్ల కేటాయింపు. చాలా చోట్ల నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన వాటిని పంపిణీ చేయకుండా వదిలేయడంతో ఎనిమిదేళ్లుగా అర్హులకు ఎదురు చూపులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా.. ప్రభుత్వం మెదక్ జిల్లాలో అర్హులకు 4,776 ఇళ్లను మంజూరు చేసింది. అందులో 3,779 ఇళ్లకు టెండర్ పిలువగా, 3,644 గృహాల పనులు ప్రారంభమయ్యాయి. వీటిలో 2,440 ఇళ్లు పూర్తి కాగా, 1,204 పనులు జరగాల్సి ఉంది. చాలా వరకు పునాది స్థాయిలో, మరికొన్ని స్లాబ్ వేసి వదిలేశారు. పూర్తి అయిన కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని పిల్లకొటాల్ శివారులో 950 ఇళ్లు మంజూరవగా, 540 ఇళ్లు పూర్తయ్యాయి. వీటిని గతేడాది ఆగస్టులో మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగతా 410 ఇళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి సూచించినా.. పనులు ముందుకు సాగడంలేదు. నర్సాపూర్కు 500 ఇళ్లకు 250 మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయి. పూర్తయిన వాటిని పంపిణీ చేయకపోవటంతో అవి శిథిలావస్థకు చేరాయి. చేగుంట మండలానికి 1,250 ఇళ్లు మంజూరవగా, 108 మాత్రమే పూర్తయ్యాయి. వాటిని ఇంకా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. ఇదే మండలం కొండాపూర్ గ్రామంలో 20 ఇళ్ల నిర్మాణం పూర్తయినా.. అధికారికంగా పంపిణీ చేయలేదు. దీంతో గ్రామానికి చెందిన కొందరు పేదలు ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారు. మెదక్ మండలం పాతూర్, రాయినిపల్లి గ్రామాలకు 40 చొప్పున కేటాయించినా.. నేటికి పనులు మొదలుకాలేదు. కొల్చారం మండలంలోని కొల్చారం, ఎనగండ్లలో ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలంలో కామారం, మీర్జాపల్లి, కొర్విపల్లిలో కూడా నిర్మాణాలు పూర్తికాలేదు. బీఆర్ఎస్ కార్యకర్తలకే పంపిణీ.. జిల్లాలో మొదటి దశలో పూర్తయిన 2,440 ఇళ్లలో పంపిణీ చేసినవి 1,568 కాగా ఇంకా 872 పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఇప్పటివరకు పంపిణీ చేసిన వాటిలో బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. లబ్ధిదారుల ఎంపికను సర్పంచులు, కౌన్సిలర్లు చేశారు. ఈ నెల 21న రెండో విడత ప్రారంభించాలని, అర్హుల ఎంపికను అధికారులకు అప్పగించాలని కోరుతున్నారు. ఇప్పుడైనా అర్హులకు ఇళ్లు అందుతాయో లేదో వేచి చూడాల్సిందే. -
చంద్రయాన్-3 విజయంతో మళ్లీ తెరపైకి వచ్చిన ఆదిపురుష్
ప్రభాస్- కృతి సనన్ నటించిన ఆదిపురుష్ భారీ డిజాస్టర్తో పాటు ఆ సినిమాపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఒక రకంగా ప్రభాస్ నటించిన ఏ సినిమాకు ఇంతలా వ్యతిరేఖత రాలేదనే చెప్పాలి. తాజాగ చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయింది. చంద్రమండలంపై భారత్ అడుగుపెట్టింది. ఇలాంటి సమయంలో ఆదిపురుష్ సినిమా పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: చంద్రయాన్-3 పై సినిమా.. ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోనే) చంద్రయాన్-3 కోసం రూ.615 కోట్ల బడ్జెట్ మాత్రమే ఖర్చు అయింది. కానీ 'ఆదిపురుష్' కోసం రూ.700 కోట్లు ఖర్చు పెట్టి ఏం సాధించారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ లెక్కన 'ఆదిపురుష్' కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు భారతీయ జెండాను చంద్రమండలంపై సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. ఆదిపురుష్ లాంటి చెత్త సినిమాలు తీయకుండా దేశానికి ఉపయోగపడే పనులకు ఖర్చుపెడితే బాగుంటుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివిధ సినిమాలకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యయాలతో చంద్రయాన్-3 బడ్జెట్ను నెటిజన్లు పోలుస్తూ... ఇస్రోను ప్రశంసిస్తున్నారు. హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ కూడా 'ఓపెన్హైమర్' సినిమా కోసం రూ. 800 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. అణుబాంబు సృష్టికర్త జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే దర్శకుడు సుమారు పదేళ్ల కిందటే ఇంటర్స్టెల్లార్ అంతరిక్షం కాన్సెప్ట్తో వచ్చిన సనిమా కోసం ఏకంగా రూ.1350 కోట్లు ఖర్చుబెట్టాడు. -
ప్రభాస్ మొదటి సినిమాకు ఎంత లాభం వచ్చిందో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 'ఈశ్వర్' సినిమాతో మొదలైంది. ఈ చిత్రం 2002 నవంబరు 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్పేట్ ఈశ్వర్గా ప్రభాస్ దుమ్ములేపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్తోనే అవకాశాలు దక్కించుకున్నాడు ప్రభాస్. (ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ) అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్తో ఈశ్వర్ సినిమాను తెరకెక్కిస్తే. నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మొదటి సినిమాతోనే యూత్, మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ను ప్రభాస్ సంపాదించుకున్నాడు. ఈశ్వర్ తర్వాత 'రాఘవేంద్ర' సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రంతో అమ్మాయిల హృదయాలతో పాటు రూ. 21 కోట్ల కలెక్షన్స్ను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో యంగ్ రెబల్ స్టార్గా అప్పట్లో చెరగని ముద్రవేశాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. (ఇదీ చదవండి: మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన) -
ఏప్రిల్ నుంచి ధరలు పెరిగేవి.. తగ్గేవి
భారతదేశంలో 2023 ఏప్రిల్ 1నుంచి కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి, అదే సమయంలో మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. దేశీయ పరిశ్రమలకు మద్దతుగా దిగుమతి సుంకాలను పెంచాలను కేంద్రం యోచిస్తోంది. ఈ కారణంగా ధరలలో కొత్త పరిణామాలు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ ప్రారంభం నుంచి ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్లు, హై-ఎండ్ ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ వస్తువులు, జ్యువలరీకి సంబంధించిన వస్తువులు, హై-గ్లోస్ పేపర్ వంటి వాటితో పాటు ఎలక్ట్రిక్ కిచెన్ చిమ్నీలు ధరలు తారా స్థాయికి చేరుకోనున్నాయి. కెమెరా లెన్స్, స్మార్ట్ఫోన్, సైకిళ్ళు, బొమ్మలు ధరలు తగ్గనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: ఈ కార్ల ఉత్పత్తికి హోండా మంగళం: ఏప్రిల్ నుంచే షురూ!) బడ్జెట్ ప్రజెంటేషన్లో బట్టలు, ఫ్రోజెన్ మస్సెల్స్, ఫ్రోజెన్ స్క్విడ్, ఇంగువ, కోకో గింజలపై కస్టమ్స్ పన్నులను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా.. ఎసిటిక్ యాసిడ్, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే రసాయనాలు, కెమెరా లెన్స్లపై దిగుమతి పన్నులు తగ్గాయి. ఖరీదైనవిగా మారే వస్తువులు: ఎలక్ట్రానిక్ చిమ్నీలు జ్యువెలరీ వస్తువులు బంగారం ప్లాటినం వెండి పాత్రలు దిగుమతి చేసుకున్న వస్తువులు ధరలు తగ్గే వస్తువులు: బొమ్మలు సైకిళ్ళు టీవీ మొబైల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎల్ఈడీ టీవీలు కెమెరా లెన్సులు -
బ్రిటన్ ఆర్థికమంత్రి క్వాసిపై వేటు
లండన్ : బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్ను రూపొందించడంతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ప్రధానికి క్వాసీ సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్ మినీ బడ్జెట్ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్ ట్రస్ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్కు పెద్ద సవాల్గా మారింది. -
కేంద్రమంత్రి చేతిలో జమ్ము కశ్మీర్ బడ్జెట్..!
-
బడ్జెట్ సమావేశాలపై బులెటిన్ విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్సభ కార్యకలాపాలకు సంబంధించి సోమవారం లోక్సభ సెక్రటేరియట్ బులెటిన్ విడుదల చేసింది. ఈ నెల 31న ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం అరగంట ప్రభుత్వ బిజినెస్ ఉంటుంది. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కరోనా నేపథ్యంలో ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 11 వరకు లోక్సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమావేశం కానుంది. -
ఆ చిన్న చిత్రానికి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారా!
గతంలో సినిమాకి 50 కోట్లు అంటే భారీ బడ్జెట్ అనుకుని ఖర్చుకు కాస్త ఆలోచించే నిర్మాతలు, బాహుబలి చిత్రం బాక్స్ఫీస్ ఫలితాలు వాళ్ల లెక్కలన్నీ మార్చేసిందనే చెప్పాలి. ప్రస్తుతం చిన్న సినిమాలు కూడా కథ డిమాండ్ చేస్తే భారీగానే ఖర్చు పెట్టేందుకు నిర్మాతలు వెనకాడడం లేదు. బెల్లంకొండ శ్రీనివాస్, రమేష్ వర్మ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాక్షసుడు’ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్గా రాక్షసుడు 2 రాబోతున్నట్లు ప్రకటించిన ఆ చిత్ర నిర్మాత అందుకు భారీగా ఖర్చు పెట్టనున్నట్లు ప్రకటించాడు. ‘రాక్షసుడు’ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ ఈ చిత్రం సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్గా ఉంటుందన్నారు. అలానే ఇందులో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ను కూడా జత చేస్తున్నామని, హాలీవుడ్ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలిపారు. కాగా ఈ హిట్ మూవీకి సీక్వెల్లో హీరో ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. ఇందుకోసం సుమారు 100 కోట్ల బడ్జెట్ను కేటాయించామని, సినిమా పూర్తిగా లండన్లో షూటింగ్ జరపనున్నట్లు చెప్పారు. ఇటీవల ‘హోల్డ్ యువర్ బ్రీత్’ అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేసి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచారు. ఎ స్టూడియోస్ సమర్పణలో హవిష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ‘రాక్షసుడు 2’ రూపొందనుంది. గిబ్రాన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్ర నిర్మాత ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో ‘ఖిలాడీ’ చేస్తున్నాడు. -
నిబంధనల మేరకే అప్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నీ కేంద్రం, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు లోబడే ఉన్నాయని ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్ర జీఎస్డీపీకి అనుగుణంగా కేంద్రం నిర్దేశించిన పరిమితుల మేరకే అప్పులున్నాయని స్పష్టం చేశారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో.. అప్పుల్లో తెలంగాణ 25వ స్థానంలో ఉందని తెలిపారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటిగా ఉందని చెప్పారు. దేశ జీడీపీతో పోలిస్తే కేంద్రం అప్పులు 62.2 శాతం ఉండగా, రాష్ట్ర అప్పులు కేవలం 22.8 శాతంగానే ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో అప్పులు, వడ్డీలు కలిపి రూ.50 వేల కోట్లు ఉంటాయన్న కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క వ్యాఖ్యలని ఖండించిన హరీశ్.. వచ్చే ఏడాది అప్పులు, వడ్డీలు కలిపి చెల్లించేది రూ.26,624 కోట్లేనని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర బడ్జెట్పై చర్చలో మంత్రి హరీశ్ సుదీర్ఘ సమాధానమిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. ఆయా రంగాల్లో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని హరీశ్ చెప్పారు. ప్రభుత్వ కీలక రంగాల్లో జాతీయ సగటు కన్నా తెలంగాణలో నిధుల కేటాయింపు తక్కువగా ఉందంటూ భట్టి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన మంత్రి.. శాఖల వారీగా చేసిన కేటాయింపులను వివరించారు. విద్యారంగంలో గత ఆరేళ్లలో 14.15 శాతం నిధుల వెచ్చింపు జరగ్గా, వ్యవసాయ రంగంలో 11.4 శాతం, విద్యుత్ రంగంలో 7.3 శాతం, ఇరిగేషన్ రంగంలో 8.4 శాతం, హౌసింగ్లో 1.8 శాతం మేర నిధులను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జాతీయ సగటు కన్నా ఎక్కువగానే నిధుల ఖర్చు జరుగుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం సైతం జాతీయ సగటు కన్నా రెట్టింపు ఉందన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువగా ఉందంటూ భట్టి సభను తప్పుదారి పట్టించారని, అయితే సీఎంఐఈ సర్వే ప్రకారం 2019–20లో జాతీయ స్థాయిలో సగటు నిరుద్యోగం 7.63 శాతమైతే.. తెలంగాణలో 4.53 శాతంగా ఉందన్నారు. 2020–21లో జాతీయ సగటు 10.35 శాతం కాగా, తెలంగాణలో 6.15 శాతంగా ఉందని వివరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్, బీజేపీలు అమ్ముతూ పోతుంటే, ఆర్టీసీ, విజయ డెయిరీ వంటి సంస్థలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటూ రాష్ట్రం నమ్మకం కలిగిస్తోందని వెల్లడించారు. నీతి ఆయోగ్ చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. ఇదే సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశాన్ని హరీశ్ ప్రస్తావించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను కేంద్రం 30 రోజుల్లో ఇస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఎక్కడ, ఎప్పుడు ఇచ్చిందో చెప్పాలని సూచించారు. ‘మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, భగీరథకు రూ.19,205 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ ఇవ్వాలని చెప్పినా కేంద్రం ఇవ్వలేదు.. 13వ ఆర్థిక సంఘం నుంచి ఆరేళ్లుగా రూ.1,129 కోట్లు, 14వ ఆర్థిక సంఘం నుంచి రెండేళ్లుగా రూ.817 కోట్లు రాలేదు. విభజన చట్టంలో పేర్కొన్న వెనకబడిన ప్రాంతాల నిధి కింద రూ.350 కోట్లు రాలేదు. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి ప్రత్యేక గ్రాంటుగా రూ.2,350 కోట్లు ఇవ్వాలని చెప్పినా రాలేదు. మొత్తంగా కేంద్రం నుంచి రూ.28,225 కోట్లు రావాల్సి ఉంది. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ నిధులపై మాట్లాడాలి..’అని అన్నారు. కేంద్రంతో సత్సంబంధాలు పెట్టుకుంటామని, అయితే రాష్ట్రానికి అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోమని వెల్లడించారు. -
కశ్మీర్లో శ్రీవారి ఆలయానికి టీటీడీ ఆమోదం
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2020-2021 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను రూపొందించింది. రూ.3,309 కోట్లతో వార్షిక బడ్జెట్కు టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు టీటీడీ పాలకమండలి శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బడ్జెట్ను ఆమోదించింది. బుందీపోటులో తరుచూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో వాటి నివారణకు రూ. 3.30 లక్షలను కేటాయించింది. అలాగే జూపార్క్ సమీపంలో ప్రతిభావంతుల భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ. 34 కోట్లతో ఎస్వీ భజన పాఠశాల, అలిపిరి రోడ్డు విస్తరణకు రూ. 16 కోట్లు, బర్డ్ ఆస్పత్రిలో మెరగైన వైద్య చికిత్స, యంత్రాల కొనుగోలు కోసం రూ. 8.5 కోట్లను కేటాయించింది. బడ్జెట్లో భాగంగా టీటీడీ విజిలెన్స్ శాఖలో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల భర్తీకి కూడా పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. చెన్నైలో పద్మావతి ఆలయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శ్రీవారి ఆలయ నిర్మాణం, పుష్కరిణి, వాహన మండపం నిర్మాణానికి ఆమోదం లభించింది. అలాగే టీటీడీ ఆలయాలు, పబ్లిక్ ప్రాంతాల్లో 1500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. టీటీడీ ఆధ్వర్యంలో జమ్మూకశ్మీర్, ముంబై, కాశీలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి టీటీడీ పాలకమండలి ఆమోదం తెలిపింది. అలాగే టీటీడీ సైబర్వింగ్ను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. -
31 నుంచి బడ్జెట్ పార్లమెంటు !
న్యూఢిల్లీ: ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రతిపాదించింది. ఈనెల 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు విడతల్లో నిర్వహించాలని అందులో పేర్కొంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు బుధవారం చెప్పాయి. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు మొదటి విడత, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో విడత సమావేశాలు నిర్వహిస్తారని తెలిపాయి. రెండు విడతల మధ్య ఉండే విరామంలో శాఖల వారీగా ఉన్న బడ్జెట్ కేటాయింపులను పార్లమెంటరీ కమిటీలు పరిశీలిస్తాయి. -
ప్రళయం నుంచి పాఠాలు.. తొలిసారి వాటర్ బడ్జెట్
అనేక జీవనదులకు పుట్టినిళ్లు భారతదేశం. దేశంలో ఎన్నో జీవ నదులు ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో అతివృష్టి, మరికొన్ని రాష్ట్రాల్లో అనావృష్టితో నీటి కొరత ఏర్పడుతోంది. దీని వల్ల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గడిచిన దశాబ్ధాల కాలంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న పట్టణాలను మనం చూస్తున్నం. ముంబైలోని లాథూర్కి నీటి సమస్యను పరిష్కరించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక రైళ్ల ద్వారా నీటిని తరలించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే పరిస్థితి చెన్నై మహానగరంలో కూడా సంభవించింది. ఇంతటి నీటి సమస్య గత వందేళ్లలో కూడా రాలేదని చెన్నై వాసులు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితి రాకముందే కేరళ కళ్లుతెరిచింది. దేశంలో తొలిసారి వాటర్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. తిరువనంతపురం: భవిష్యత్తులో వచ్చే నీటి సమస్యను ఎదుర్కొనేందుకు కేరళ రాష్ట్రం ప్రణాళికలను రచిస్తోంది. దీనిలోభాగంగానే ప్రతి ఏటా వాటర్ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎంతనీటి లభ్యత ఉంది. ఎంత అవసరం కానుంది, వంటి అంశాలను పొందుపరచనుంది. దాని ఆధారంగా ప్రాజెక్టులకు రూపకల్పన కూడా చేయాలని నిర్ణయించింది. పక్క రాష్ట్రాల కష్టాలను చూసి భవిష్యత్తులో రాబోయే నీటి కొరతను దృష్టిలో పెట్టుకొని కేరళ జాగ్రత్త పడుతోంది. నీటి వృథాను అరికట్టేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాటర్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది.కేరళలో ఎంత నీరు అందుబాటులో ఉంటుంది, ఎంత నీరు వాడుకలో ఉంటుంది, భవిష్యత్తులో ఎంత నీరు అవసరం, అదనపు నీటి కోసం ఉన్న వనరులేంటి? వంటి అంశాల్ని బడ్జెట్లో వివరించబోతోంది. తొలి రాష్ట్రం కేరళనే.. అవసరాల దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నీటి వాడకం మరింత పెరుగుతుందని కేరళ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధానమైన అంశం ఏంటంటే... దేశంలో ఇలాంటి బడ్జెట్ ప్రవేశపెడుతున్న తొలి రాష్ట్రం కేరళనే. నీటిని ఎలా పొదుపుచెయ్యాలి, అందుకోసం ప్రభుత్వం ఏం చెయ్యాలి, ప్రజలు ఏం చెయ్యాలి అనే అంశాల్ని ఈ బడ్జెట్లో చెప్పబోతున్నారు.అలాగే దీనిపై ప్రజలకు, అధికారులకు అవగహన కూడా కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక అధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు, మంత్రులు అందరూ కలిసి ఈ ప్రత్యేక బడ్జెట్ను రూపొందిస్తున్నారు. తద్వారా ఏ ప్రాంతంలో ఎంత నీరు తెలుసుకునే వీలు ఉంటుందని సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడైనా నీటి కొరత ఉంటే.. అక్కడికి నీటిని ఎలా తరలించాలి, అందుకోసం ఏయే ప్రాజెక్టులు చేపట్టాలి, అంచనా ఖర్చులు ఎంత అన్నది బడ్జెట్లో పొందుపరచే అవకాశం ఉంది. ప్రళయం నుంచి పాఠాలు.. నదులు, చెరువు, బావులు, కుంటలు, రిజర్వాయర్లు ఇలా అన్నింటిలో ఉన్న మొత్తం నీటిని అంచనా వేసి బడ్జె్ట్లో చెప్పబోతున్నారు. డిమాండ్కి తగినట్లు సప్లై చేసేందుకు ఉన్న మార్గాల్ని వివరించనున్నారు. ఈ సందర్భంగా పాతవైపోయిన రిజర్వాయర్లు, డ్యాములు, ఇతరత్రా కట్టడాల్ని తిరిగి నిర్మించేందుకు, రిపేర్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించబోతోంది. నీటి ఇంజినీరింగ్ అధికారులు, నీటి పారుదల విభాగం, వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక శాఖ, స్థానిక సంస్థలు అందరూ ఇందులో భాగస్వామ్యం కానున్నారు. అన్నీ అనుకూలిస్తే..ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు కేరళ సర్కార్ ప్రయత్నిస్తోంది. కాగా పూర్తిగా కొండ ప్రాంతమైన రాష్ట్రం కావున.. వరదలను నివారించేందుకు చర్యలు కూడా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సృష్టించిన ప్రళయం కారణంగా కేరళ అతలాకుతలమయిన విషయం తెలిసిందే. దాని నుంచే దైవభూమి పాఠాలు నేర్చుకున్నట్లుంది. -
ట్రోల్ అవుతోన్న ‘బహీఖాతా’
సాక్షి, న్యూఢిల్లీ : నేను బడ్జెట్ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు లెదర్బ్యాగ్ని ఎందుకు ఉపయోగించలేదంటే, బ్రిటిష్ వలసవాదాన్ని వదిలించుకోవడానికే. మన ప్రత్యేకతను చాటడానికి ఇదే సరైన సమయమని భావించా. అలాగే ఇది మోయడం సులువుగా ఉంటుంది. -నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, దేశ చరిత్రలో ఆర్థిక శాఖ పూర్తిస్థాయి కేబినేట్ మహిళా మంత్రిగా తొలిసారిగా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మన దేశంలో బడ్జెట్ సమర్పణ ప్రక్రియ మొత్తం బ్రిటిష్ సంప్రదాయాలకు అనుగుణంగానే సాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా బ్రిటన్ ప్రభుత్వాలు సైతం బడ్జెట్ సంప్రదాయాలు కొన్నింటిని మార్చుకుంటున్నప్పటికీ భారత్లో మాత్రం 1860లనాటి బ్రిటిష్ సంప్రదాయం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. ఉదాహరణకు బ్రీఫ్కేస్లో బడ్జెట్ ప్రసంగ పత్రాన్ని తీసుకురావడం అనేది బ్రిటిష్ సంప్రదాయ చరిత్రకు కొనసాగింపుగానే ఉంటోంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి చేతిలో బ్రీఫ్కేస్తో ఫోటో దిగడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి మన ఆర్థికమంత్రి బ్రీఫ్కేస్తో గాక జాతీయ చిహ్నంగల ఎరుపురంగు చేతిసంచితో ప్రత్యక్షమైంది. దీనిపై సోషల్మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఇదివరకటి భారతీయ ప్రభుత్వాలు మోసుకొస్తున్నబానిసత్వ వలసపాలన వారసత్వానికి నిర్మలాసీతారామన్ నేటితో చరమగీతం పాడారని కొందరు అంటుంటే, మరి అన్ని విషయాలలోనూ ఇలాంటి నిర్ణయాలు తీసుకునే దమ్ముందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆర్థికమంత్రి ముఖ్య సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇది మన భారతీయ సంప్రదాయం, పశ్చిమదేశాల బానిసత్వ గుర్తులను వదిలివేస్తున్నామని అన్నారు. అయితే దీనిపై ఓ వ్యంగ్య ట్విటర్ స్పందించాడు. మరి ఆ భారతీయ సంప్రదాయ సంచిలో ఉన్న బడ్జెట్ ప్రతులు తాటాకుల మీద ముద్రించారా?.. నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు ఎడ్లబండి మీద వచ్చిందా? అంటూ ట్వీట్లు గుప్పించాడు. ఏమైతేనేం ఇప్పటికే పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన మన ఆర్థిక మంత్రి ఇంగ్లిష్ స్టైల్ బ్రీఫ్కేస్ స్థానంలో భారతీయ సంప్రదాయం తొణికిసలాడేలా ఆమె మాటల్లో ‘బహిఖాతా’(పద్దుల పుస్తకం)ను ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. -
ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లు
న్యూఢిల్లీ: సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకులకు (పీఎస్బీలు) రుణ వితరణ పరంగా సమస్యల్లేకుండా చూసేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సాయం అందించనున్నట్టు బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే అర్థం అవుతోంది. పీఎస్బీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, ఆర్థిక రంగ ప్రేరణకుగాను వాటికి మరో రూ.70,000 కోట్ల నిధుల సాయాన్ని ప్రకటిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. బ్యాంకులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని, ఆన్ లైన్ లో వ్యక్తిగత రుణాలను, ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించాలని మంత్రి సూచించారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు కస్టమర్, ఇతర అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను అందుకునే విధంగా ఉండాలన్నారు. ఖాతాదారుల అనుమతితోనే.... ‘‘ఖాతాదారులకు వారి ఖాతాల్లో ఇతరులు చేసే డిపాజిట్ల విషయంలో ప్రస్తుతం పూర్తి నియంత్రణ లేదు. ఖాతాదారుల అనుమతితోనే ఇతరులు డిపాజిట్ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీఎస్బీల్లో గవర్నెన్స్ బలోపేతం చేసేందుకు సంస్కరణలు కూడా తీసుకొస్తాం’’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల మధ్య విలీనాల ద్వారా ఇప్పటికి 8 బ్యాంకులను తగ్గించినట్టు ప్రకటించారు. బ్యాంకులకు అదనంగా 1.34 లక్షల కోట్లు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్య నేపథ్యంలో బ్యాంకులకు అదనంగా రూ.1.34 లక్షల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్బీఐ ముందుకు వచ్చింది. ఇది ఎన్బీఎఫ్సీలకు రుణ కల్పనకు దోహదం చేస్తుంది. -
ఎన్బీఎఫ్సీలకు బాసట..
న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు (ఎన్బీఎఫ్సీ) కొంత ఊరటనిచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రతిపాదనలు చేశారు. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఎన్బీఎఫ్సీల నుంచి అత్యుత్తమ రేటింగ్ ఉన్న అసెట్స్ను ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) కొనుగోలు చేస్తే కేంద్రం వన్టైమ్ పాక్షిక రుణ హామీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్ల మేర విలువ చేసే ఎన్బీఎఫ్సీల అసెట్స్ కొనుగోలు చేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం వన్టైమ్ ప్రాతిపదికన పాక్షికంగా హామీనిస్తుంది. ఒకవేళ నష్టం వాటిల్లితే 10 శాతం దాకా హామీ ఉంటుంది‘ అని మంత్రి తెలిపారు. వినియోగ డిమాండ్ను నిలకడగా కొనసాగించడంలోనూ, చిన్న..మధ్య తరహా పరిశ్రమలకు అవసరమైన మూలధనం సమకూర్చడంలోను ఎన్ బీఎఫ్సీలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె చెప్పారు. గతేడాది సెప్టెంబర్లో ఐఎల్అండ్ఎఫ్ఎస్ గ్రూప్ కంపెనీలు డిఫాల్టు అయినప్పట్నుంచీ ఎన్బీఎఫ్సీలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎన్బీఎఫ్సీలు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటున్నాయి. అయినప్పటికీ వాటి నియంత్రణ విషయంలో ఆర్బీఐకి పరిమిత స్థాయిలోనే అధికారాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్ బీఎఫ్సీలను ఆర్బీఐ మరింత పటిష్టంగా నియంత్రించే విధంగా ఫైనాన్స్ బిల్లులో మరిన్ని చర్యలుంటాయని సీతారామన్ తెలిపారు. డీఆర్ఆర్ తొలగింపు.. పబ్లిక్ ఇష్యూల ద్వారా ఎన్బీఎఫ్సీలు నిధుల సమీకరణకు సంబంధించి డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ (డీఆర్ఆర్) నిబంధనను ఎత్తివేస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రస్తుతం డెట్ పబ్లిక్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించే ఎన్బీఎఫ్సీలు డీఆర్ఆర్ కింద కొంత మొత్తాన్ని పక్కన పెట్టడంతో పాటు ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా స్పెషల్ రిజర్వ్ కింద మరికాస్త పక్కన పెట్టాల్సి ఉంటోంది. మరోవైపు, గృహ రుణాల రంగంపై నియంత్రణాధికారాలను ఎన్హెచ్బీ నుంచి ఆర్బీఐకి బదలాయించాలని ప్రతిపాదిస్తున్నట్లు ఆమె వివరించారు. పెన్షను రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ట్రస్టును విడదీయనున్నట్లు తెలిపారు. -
‘సీత’మ్మ నష్టాలు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ .. అందరి మాటలు విన్నారు. కానీ ఎవ్వరి మాటను మన్నించినట్లు కనిపించలేదు. భారీ మెజారిటీతో రెండోసారి గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం నుంచి భారీ సంస్కరణలే ఉంటాయనుకున్న మార్కెట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. నిధుల కొరతతో ఎన్బీఎఫ్సీలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా, వినియోగం రంగంలో మందగమనం చోటు చేసుకొని వాహన ఇతర కంపెనీలన్నీ కుదేలై ఉండగా, ఆదుకునే చర్యలుంటాయని అందరూ అంచనా వేశారు. సెన్సెక్స్ ప్రారంభం: 39,990 సెన్సెక్స్ గరిష్టం : 40,032 సెన్సెక్స్ కనిష్టం : 39,441 సెన్సెక్స్ ముగింపు : 39,513 ఈ అంచనాలకు భిన్నంగా సీతమ్మ బడ్జెట్ ఉండటంతో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. ఒక్క బ్యాంక్ షేర్లు మినహా, మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. ఇది చెత్త బడ్జెట్ కానప్పటికీ, సంపన్నులపై అధిక పన్ను విధింపు, 20 శాతం షేర్ల బైబ్యాక్ ట్యాక్స్, లిస్టెడ్ కంపెనీల్లో పబ్లిక్ షేర్హోల్డింగ్ను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనలు సెంటిమెంట్ను దెబ్బతీశాయని నిపుణులంటున్నారు. మరిన్ని వివరాలు... బడ్జెట్పై ఆశావహ అంచనాలతో సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైంది. ఆసియా మార్కెట్లు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారీ సంస్కరణలను ఆశిస్తూ కొనుగోళ్లు జోరుగా సాగాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 40 వేల పాయింట్లు, నిఫ్టీ 11,950 పాయింట్లను అధిగమించాయి. బడ్జెట్కు ముందే సెన్సెక్స్ 124 పాయింట్ల లాభంతో 40,032 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ట స్థాయిని తాకింది. నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ఆరంభమైనప్పటి నుంచి నష్టాలు ఆరంభమయ్యాయి. ప్రసంగం పూర్తయ్యేంత వరకూ పరిమిత శ్రేణిలో కదలాడిన సెన్సెక్స్, నిఫ్టీలు ఆ తర్వాత భారీ నష్టాల దిశగా సాగాయి. మధ్యలో ఒకింత కోలుకున్నప్పటికీ, ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో నష్టాలు మరింత పెరిగాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 467 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్395 పాయింట్లు పతనమై 39,513 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 136 పాయింట్లు క్షీణించి 11,811 పాయింట్ల వద్ద ముగిశాయి. దీంతో నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ పడింది. సానుకూలతలున్నా క్షీణతే.. బడ్జెట్ప్రతిపాదనలకు ముందు 40 వేల పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్, బడ్జెట్ తర్వాత ఆ జోరును కొనసాగించలేక చతికిలపడింది. ఆప్షన్ల ట్రేడింగ్కు సంబంధించి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్(ఎస్టీటీ) విషయంలో ఒకింత ఊరట లభించడం, ప్రభుత్వ రంగ బ్యాంక్లకు రూ.70,000 కోట్ల మూలధన నిధులందడం, మౌలిక రంగానికి భారీగా నిధులు కేటాయించడం వంటి సానుకూల చర్యలున్నప్పటికీ, ఆ ప్రభావం పెద్దగా కనిపించలేదు. డాలర్తో రూపాయి మారకం నష్టాల నుంచి రికవరీ అయినా కూడా మన మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా, యూరప్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి.మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈ ఏడాది ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 3,044 పాయింట్లు, నిఫ్టీ 918 పాయింట్లు చొప్పున లాభపడటం విశేషం. ఇక వారం పరంగా చూస్తే, సెన్సెక్స్ 119 పాయింట్లు, నిఫ్టీ 22 పాయింట్లు చొప్పున పెరిగాయి. మరిన్ని విశేషాలు.. ► మొత్తం 31 సెన్సెక్స్ షేర్లలో 25 షేర్లు నష్టాల్లో ముగియగా, ఆరు షేర్లు– ఇండస్ఇండ్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే లాభపడ్డాయి. ► యస్ బ్యాంక్ షేర్ 8.3 శాతం నష్టంతో రూ.88 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయినా, పలు షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎస్బీఐ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరె¯Œ ్స, బజాజ్ ఫైనాన్ ్స, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి పంచ కారణాలు.. పబ్లిక్ హోల్డింగ్ 35 శాతానికి పెంపు... స్టాక్ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన స్టాక్ మార్కెట్ను పడగొట్టింది. ఇప్పటికే ఓవర్బాట్ పొజిషన్లో ఉన్న మార్కెట్లో ఈ ప్రతిపాదన కారణంగా విక్రయ ఆఫర్లు వెల్లువెత్తుతాయనే భయాలతో సెన్సెక్స్,నిఫ్టీలు భారీగా నష్టపోయాయి. 25% పబ్లిక్ హోల్డింగ్ నిబంధననే ఇప్పటిదాకా పలు ప్రభుత్వ రంగ కంపెనీలు అమలు చేయలేకపోయాయి. మరోవైపు ఈ నిబంధన కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు స్టాక్ మార్కెట్ నుంచి డీలిస్ట్ కావడానికి మొగ్గుచూపుతాయని నిపుణులంటున్నారు. మార్కెట్లో ఈ నిబంధన పెను కలకలమే సృష్టించింది. 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ట్యాక్స్(డీడీటీ)ను పలు కంపెనీలు ఎగవేసి షేర్ల బైబ్యాక్కు ప్రాధాన్యత ఇస్తుండటంతో షేర్ల బైబ్యాక్ను నిరుత్సాహపరచడానికి 20 శాతం బైబ్యాక్ ట్యాక్స్ను విధించాలని నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. వాటాదారులు కొనుగోలు చేసిన ధరను కాకుండా కంపెనీ ప్రకటించే బైబ్యాక్ ధర నుంచి ఇష్యూ ధరను తీసివేసి వచ్చిన దానిపై 20 శాతం చొప్పున పన్ను విధిస్తారు. దీంతో కంపెనీలపై భారీగా పన్ను భారం పడుతుందని, ఫలితంగా కంపెనీలు షేర్ల బైబ్యాక్లు ప్రకటించవని నిపుణులంటున్నారు. . సంపన్నులపై అధిక పన్ను రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లకు మించిన పన్ను ఆదాయం గల సంపన్నులపై సర్చార్జీని పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దీంతో ఈ రెండు కేటగిరీల సంపన్నుల పన్ను 3–7 శాతం రేంజ్లో పెరగనున్నది. సంపన్నులపై అధిక పన్ను విధించడం తప్పు కాకపోయినా, మొత్తం వారు చెల్లించాల్సిన పన్ను 42 శాతానికి పెరగడం.. మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. భారీ డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని రూ.90,000 కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు పెంచే ప్రతిపాదన కారణంగా మార్కెట్లో లిక్విడిటీ ఇబ్బందులు తలెత్తుతాయన్న భయందోళనలు నెలకొన్నాయి. పెట్రోల్, లోహాలపై ఎక్సైజ్ సుంకం మౌలిక సదుపాయాల కల్పన కోసం అవసరమైన భారీ నిధుల కోసం రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ పేరుతో ఒక్కో లీటర్ పెట్రోల్, డీజిల్లపై రూ. 1 అదనపు సుంకం విధించారు. పుత్తడి వంటి విలువైన లోహాలపై ప్రస్తుతమున్న కస్టమ్స్ సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచడం ప్రతికూల ప్రభావం చూపించాయి. రూ.2.2 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.22 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2,22,580 కోట్లు తగ్గి రూ.151,35,496 కోట్లకు పడిపోయింది. అధికాదాయం ఆర్జించే వర్గాలపై పన్ను విధించడం, భారీగా నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యం కారణంగా సెకండరీ మార్కెట్లో లిక్విడిటీ తగ్గనుండటం, ఇక కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచడం, తదితర ప్రతిపాదనల వల్ల స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది... – అమర్ అంబానీ, యస్ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ -
ఆదాయ పన్ను రద్దు సాధ్యమా?
రెండంకెల వృద్ధి సాధించాలంటే పొదుపును పెంచాలి. ఆదాయ పన్ను రద్దు చేయాలి అన్నారు డాక్టర్ సుబ్రమణ్య స్వామి గతంలో ఓసారి. కొంతమంది రాజకీయవేత్తలు, ఆదాయ పన్ను నిపుణులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని తెలివైన చర్యగా భావించవచ్చా? నిపుణులు ఏముంటున్నారో పరిశీలిద్దాం. ఆదాయ పన్ను ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు. భారత్ లాంటి దేశాల్లో పన్ను ఆదాయం సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం.. 2016 –17లో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 7.41 కోట్ల మంది. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ. 8.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మన జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2 శాతం మందే. జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.98 శాతం మాత్రమే. ఈ వాటాను పెంచడానికి బదులు, అసలు ఆదాయ పన్నునే రద్దు చేయాలన్న ఆలోచనను పలువురు ముందుకు తెస్తున్నారు. జనం చేతుల్లో మరింత డబ్బు ఉండేలా చేయడమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ‘పర్యవసానంగా డిమాండ్ పెరుగుతుంది. వ్యవస్థలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అంటున్నారు కేపీఎంజీ (ఇండియా)లో కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ విభాగాధిపతి హిమాన్షు పరేఖ్. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఆర్థిక వ్యవస్థ అవసరాల కోసం భారీగా నిధులు కావాలి. 2030 నాటికి లక్ష గ్రామాల డిజిటలీకరణ, గ్రామాల పారిశ్రామికీకరణ, నదుల శుద్ధీకరణ, తీర ప్రాంత విస్తరణ, ఆహార రంగంలో స్వయం సమృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన తదితర లక్ష్యాలు సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో పన్ను రద్దు ప్రతిపాదన అసంబద్ధమైనదే అవుతుందంటున్నారు పరేఖ్. పైగా ప్రత్యక్ష పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. పన్నుల మొత్తాలతోనే ప్రభుత్వాలు సమాజంలోని దిగువ తరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నులను రద్దు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్. ప్రత్యక్ష పన్నుల రద్దు ద్వారా కోల్పోయే ఆదాయాన్ని – పరోక్ష పన్నులు పెంచడం వంటి ఇతరత్రా చర్యల ద్వారా సమకూర్చుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు వల్ల పన్ను చెల్లింపుదారులు తమ డబ్బును పొదుపు మార్గాల్లోకి, పెట్టుబడుల్లోకి మళ్లిస్తారని, ప్రత్యక్ష పన్ను వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని పలువురు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పటికే 3.4 శాతం ద్రవ్య లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య వ్యతిరేక ప్రభావం చూపుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం యూఏఈ, కేమన్ ఐలాండ్స్, బహమాస్, బెర్ముడా తదితర కొన్ని దేశాలు ఆదాయ పన్ను విధించడం లేదు. పెద్ద దేశాలు మాత్రం పన్ను వసూలు చేస్తూనే ఉన్నాయి. నిజానికి, ప్రతి దేశమూ కనీసపాటి పన్ను విధించాలంటున్న ఓఈసీడీ – ఇందుకు శ్రీకారం కూడా చుట్టింది. ఆదాయ పన్నును రద్దు చేయడం వల్ల కొన్ని అనుకూలతలు దరి చేరవచ్చునేమో గానీ, భారత్లోని స్థూల ఆర్థిక దృశ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు బదులుగా పన్ను రేట్లను తగ్గించడం, పన్ను విధానాన్ని మెరుగ్గా అమలు పరచడం అవసరం’ అంటున్నారు పరేఖ్. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆదాయ పన్ను వసూలు చేస్తుండటం, దానిపై ఆధారపడి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నెల 31న తన నివేదిక సమర్పించనుంది. -
జీడీపీనా? ఉద్యోగాలా?
ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్ టైమ్స్ ముందస్తు బడ్జెట్ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే. మద్దతు ధర పెంచాల్సిందే.. కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు. పన్నులు ఎలా? 38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్ స్లాబ్ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు అవసరమా? ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే. ఉద్యోగాలు ఎలా? ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు. కేటాయింపులు ఎలా? బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది. -
బడ్జెట్లో వ్యవసాయం వాటా ఎంత?
దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం – సంక్షేమం కోసం జాతీయ కమిషన్ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. వ్యవసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. పంటలకు కనీస మద్దతు, రైతుకు కనీస ఆదాయ కల్పనలో మౌలిక సంస్కరణ తీసుకురావడం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు పెనుసవాల్ కానుంది. దేశ భూభాగంలో దాదాపు 50 శాతం వరకు ప్రస్తుతం తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో చిక్కుకుపోవడం చూస్తున్నాం. గత వందేళ్లలో అయిదో అత్యంత అధిక ఉష్ణోగ్రత నమోదైన నెలగా ఈ జూన్ మాసం రికార్డుకెక్కింది. దానికితోడుగా గత ఏడు సంవత్సరాల్లో వ్యవసాయరంగ వాస్తవ రాబడుల్లో వృద్ధి దాదాపుగా జీరోకి సమీపంలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ జూలై 5న తన తొలి బడ్జెట్ సమర్పించనున్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కఠినతరమైన లక్ష్యాన్ని ఎదుర్కోబోతున్నారు. మరోవైపున వ్యవసాయదారుల ఆశలు, అంచనాలు తారస్థాయిలో ఉంటున్నాయి. దేశ వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు తప్పనిసరి అనే విషయాన్ని ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవమే కానీ కేంద్రంలోని నూతన ప్రభుత్వానికి అంతకుమించిన పెద్ద సవాలు ఏదంటే వ్యవసాయరంగంలో వాస్తవ రాబడులను పెంచడం ఎలా అన్నదే. ఎకనమిక్ సర్వే 2016 అంచనా ప్రకారం దేశంలోని 17 రాష్ట్రాల్లో వ్యవసాయరంగ ఆదాయం సగటున సంవత్సరానికి రూ. 20,000 మాత్రమే. ఓఈసీడీ– ఐసీఆర్ఐఈఆర్ నిర్వహించిన కీలకమైన అధ్యయనం ప్రకారం 2007–2017 మధ్యకాలంలో రైతులకు న్యాయమైన ధరలను తృణీకరించిన కారణంగా వారు నష్టపోయిన మొత్తం రూ. 45 లక్షల కోట్లుగా తేలింది. ఇది చాలదన్నట్లుగా, గత పదిహేను సంవత్సరాల్లో వ్యవసాయరంగ రాబడులు అత్యంత కనిష్టస్థాయికి పడిపోయినట్లు తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీనిఫలితంగా గ్రామీణ వ్యవసాయరంగంలో ఉపాధి కల్పన భారీ స్థాయిలో క్షీణించిపోయింది. ఇక వ్యవసాయేతర శ్రామికుల విషయం చెప్పనక్కరలేదు. భారీ దిగుబడులను పండించడానికి దేశీయ రైతాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. కానీ ప్రతి సంవత్సరం, వ్యవసాయదారుల పరిస్థితి మరింత దిగజారిపోతూ వస్తోంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని కనిష్టంగా ఉంచడం, పరిశ్రమకు ముడిసరుకును తక్కువ ధరలకు అందించడం, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను నెరవేర్చాల్సి రావడం వంటి లక్ష్యాల సాధనకోసం తీసుకొచ్చిన సూక్ష్మ ఆర్థిక విధానాలకు మన వ్యవసాయరంగం నిజంగానే బలవుతోంది. వాణిజ్యరంగ నిబంధనలు తొలి నుంచీ వ్యవసాయరంగానికి వ్యతిరేకంగానే ఉంటున్నాయి. దీనికితోడుగా 2011–12, 2016–17 మధ్యకాలంలో ప్రభుత్వ రంగ పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.4 శాతానికి పడిపోయాయి. వ్యవసాయరంగాన్ని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పడానికి ఇది చాలు. దేశంలోని ఏదో ఒక ప్రాంతం నుంచి వ్యవసాయదారుల ఆత్మహత్యలు నమోదు కాని రోజంటూ లేదు. ఉదాహరణకు పంజాబ్ను తీసుకుందాం. 2018 సంవత్సరం జనవరిలో ప్రతిరైతుకూ 2 లక్షల రూపాయల రుణ మాఫీని ప్రకటించిన తర్వాత కూడా ఆ సంవత్సరం మొత్తంలో 430 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని భారతీయ కిసాన్ యూనియన్ అంచనా వేసింది. 2000–2017 మధ్యకాలంలో మూడు ప్రభుత్వ రంగ యూనివర్సిటీలు ఇల్లిల్లూ తిరిగి చేసిన సర్వే ప్రకారం 16,600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడినట్లు తేలింది. దేశంలోని అత్యంత కీలకమైన వ్యవసాయ రాష్ట్రంలోనే రైతుల దుస్థితి ఈ స్థాయిలో ఉండగా మిగతా దేశంలో వ్యవసాయ రంగం ఎంతగా కునారిల్లిపోతోందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. అత్యంత లోపభూయిష్టమైన ఆర్థిక విధానాల రూపకల్పన కారణంగానే రైతులు బాధితులుగా మిగిలిపోతున్నారు. రైతులకు న్యాయమైన ఆదాయాన్ని తిరస్కరించిన కారణంగానే దేశవ్యాప్తంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందని గ్లోబల్ అనలిటికల్ కంపెనీ క్రిసిల్ (íసీఆర్ఐఎస్ఐఎల్) తేల్చి చెప్పింది. వ్యవసాయ పంటలకు కనిష్ట మద్దతు ధర 2009–2013 మధ్య 19.3 శాతం మేరకు ఉండగా, తదుపరి నాలుగేళ్ల కాలంలో ఇది 3.6 శాతానికి క్షీణించిపోయింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా ఇస్తున్న డీఏ (డియర్నెస్ అలవెన్స్) స్థాయిలో కూడా రైతు పండించే పంటలకు మద్దతు ధర ఇవ్వడం లేదు. 1970లో స్కూల్ టీచర్లకు నెలకు రూ. 90ల వేతనం ఉండగా 2015 నాటికి వారి వేతనం 170 రెట్లకు పెరిగింది. అదే కాలంలో ప్రభుత్వోద్యోగుల వేతనం 150 రెట్లు పెరిగింది. దీనికి భిన్నంగా దేశీయ రైతులు పండించిన గోధుమ పంట ధర 19 రెట్లు మాత్రమే పెరిగింది. వ్యవసాయ రంగంలో మౌలిక సంస్కరణలు ఎంత అవసరమో దీన్ని బట్టే తెలుస్తోంది. 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎమ్– కిసాన్) ప్రారంభమైంది. ఈ పథకంలో భాగంగా దేశంలో భూమి ఉన్న రైతులందరికీ సంవత్సరానికి రూ. 6,000ల ప్రత్యక్ష నగదు మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు. అంటే నెలకు రూ.500లు అన్నమాట. వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి కేంద్రప్రభుత్వం నడుంకట్టినట్లు ఇది సూచిస్తోంది. పైగా దేశ చరిత్రలో రైతుకు తొలిసారిగా ప్రత్యక్ష నగదు సహాయం అందించడానికి కేంద్రప్రభుత్వం సంసిద్ధత చూపుతుండటానికి ఇది స్పష్టమైన సంకేతం కూడా. ఈ విశిష్ట పథకాన్ని ఇప్పుడు 14.5 కోట్లమంది భూమి ఉన్న రైతులకు విస్తరించారు. దీన్ని దేశంలోని 14.4 కోట్లమంది భూమిలేని రైతులకు కూడా విస్తరింపజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు గాను బడ్జెట్లో రూ. 87,000 కోట్లను కేటాయిస్తూ ప్రతిపాదన చేశారు కూడా. దీనికి 14.4 కోట్ల భూమిలేని రైతులను కూడా జతచేస్తే బడ్జెట్లో రైతులకు ప్రత్యక్ష నగదు సహాయ పథకం కోసం దాదాపు రూ.1.6 లక్షల కోట్లు కేటాయించినట్లు అవుతుంది. ఇంత పెద్ద మొత్తం కేటాయింపునకు అవసరమైన డబ్బు ఎక్కడనుంచి వస్తుంది అనేది ప్రశ్న. దీనికి ఒకటే సమాధానం. 2008–09 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నాటినుంచి పారిశ్రామిక రంగానికి మద్దతుగా అమలులోకి తీసుకువచ్చిన రూ. 1.86 కోట్ల వార్షిక ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని తక్షణం రద్దు చేయడమే ఆర్థికమంత్రికి అందుబాటులో ఉన్న సులభమైన మార్గం. ఈ ప్యాకేజీకి ఎలాంటి ఆర్థిక సమర్థన ఇప్పుడు లేదు. గత పది సంవత్సరాలుగా ఈ ఉద్దీపన ప్యాకేజీని మన పారిశ్రామిక రంగానికి అందజేస్తూనే ఉన్నారు. 2018–19లో వ్యవసాయరంగానికి రూ.11.68 లక్షల కోట్ల రుణాన్ని విస్తరించారు. బడ్జెట్లో దీన్ని రూ.12 లక్షల కోట్లకు సవరించే అవకాశం కూడా ఉంది. అయితే అతిపెద్ద సవాలు ఏమిటంటే, వ్యవసాయ రుణం సన్నకారు, చిన్నకారు రైతుల వరకు చేరడం ఎలా అన్నదే. దేశంలో సంస్థాగత రుణాలకు 15 శాతం కంటే తక్కువ మంది చిన్నకారు రైతులే పొందగలుగుతున్నారని ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ తాజాగా అంచనా వేసింది. రైతుల ఆత్మహత్యలను రైతు రుణమాఫీలు అరికట్టలేకపోవడానికి ఇదే ప్రధాన కారణం. కాబట్టే సంస్థాగత రుణాల పరిధిలోకి మరింతమంది రైతులను తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటిగా ఉండాలి. పైగా, దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి నెలకు కనీసం రూ. 18,000ల ఆదాయం తప్పనిసరిగా అందించేలా రైతులు ఆదాయం –సంక్షేమం కోసం జాతీయ కమిషన్ను ఏర్పర్చే విషయంలో కేంద్రప్రభుత్వం తీసుకురావలసిన అత్యంత మౌలిక సంస్కరణ కోసం దేశం ఎదురుచూస్తోంది. దీనికోసం ప్రతి జిల్లాలోనూ రైతుల సగటు ఆదాయాన్ని పెంపొందించేందుకు తగిన మార్గాన్ని ఏర్పర్చవలసి ఉంది. దీనికి అవసరమైన డేటా కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటోంది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (ఏపీఎమ్సీ) క్రమబద్ధీకరణ మార్కెట్ల యంత్రాంగాన్ని విస్తరించడం తక్షణ కర్తవ్యంగా ఉండాలి. ప్రతి 5 కిలోమీటర్లకు ప్రస్తుతం ఉన్న 7,000 మండీలను 42,000కు పెంచడానికి ప్ర«థమ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ధాన్యాగారాలను, గోడౌన్లను ఏర్పర్చడంపై బడ్జెట్ విధివిధానాలను రూపొందించాలి. వచ్చే అయిదేళ్ల కాలానికి గానూ దేశీయ వ్యవసాయ రంగంలో 25 లక్షల కోట్ల రూపాయలను అందిస్తామని భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఉన్న విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసం ప్రారంభ దిశగా ఈ సంవత్సరంలో దేశవ్యాప్తంగా మండీలు, గోడౌన్ల ఏర్పాటు కోసం కనీసం రూ. 5 లక్షల కోట్లను మదుపు చేయాల్సి ఉంది. అయితే దీనికంటే మిన్నగా, రైతులు ప్రభుత్వ పాలనకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిశ్రమలకోసం సులభతరమైన వాణిజ్యవిధానాన్ని ప్రోత్సహించినట్లుగానే, వ్యపసాయ పంటల సాగు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అడ్డంకులు, అవరోధాలను తొలగించడానికి వ్యవసాయాన్ని కూడా సులభతరంగా చేసే విధానాలను కేంద్రం అమలులోకి తీసుకురావలసిన అవసరం ఎంతగానో ఉంది. గతంలో వాణిజ్యమంత్రిగా సులభతరమైన వాణిజ్య విధానంకోసం దాదాపు 7,000 చర్యలను తీసుకున్న అనుభవం ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఉంది కాబట్టి వ్యవసాయ రంగానికి కూడా ఇలాంటి విధానాన్నే అమలు చేయడం ఆమెకు సులభమైన పనే. అయితే వ్యవసాయరంగంలో సులభతర విధానం అమలుకోసం కనీసం 5,000 చర్యలను అందించే యంత్రాంగం స్థాపనకోసం ఆమె ఇంకా ఎందుకు నడుం కట్టలేదన్నదే నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు దేవిందర్శర్మ ఈ–మెయిల్ : hunger55@gmail.com -
గత కేటాయింపులే బడ్జెట్లో కొనసాగింపు..
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులనే వచ్చే నెల ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లోనూ కొనసాగించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సూచనప్రాయంగా వెల్లడించింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టడం తెలిసిందే. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ జూలై 5న పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ జారీ చేసింది. మధ్యంతర బడ్జెట్లో పరిగణనలోకి తీసుకోకుండా పక్కన పెట్టిన వాటికి అవసరమైతేనే అదనపు కేటాయింపులు పరిశీలిస్తామని స్పష్టం చేసింది. ‘2019–20 మధ్యంతర బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల్లో మార్పులుండవు‘ అని సర్క్యులర్లో ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా ఏర్పాటైన 17వ లోక్సభ.. జూన్ 17 నుంచి జూలై 26 దాకా సమావేశం కానుంది. జూలై 4న 2019–20 ఆర్థిక సర్వేను, ఆ మరుసటి రోజు 5వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ మందగమనం, బ్యాంకుల మొండి బాకీలు .. ఎన్బీఎఫ్సీల నిధులపరమైన సమస్యలు, ఉపాధి కల్పన, ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతుల పునరుద్ధరణ, వ్యవసాయ రంగ సమస్యలు, ఆర్థిక క్రమశిక్షణ తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడులు పెంచడం తదితర సవాళ్లు నిర్మలా సీతారామన్ ముందు ఉన్నాయి. -
తాత్కాలికమే కానీ.. వరాల జల్లే!
తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టాలన్న సంప్రదాయాన్ని పాటిస్తూనే.. రాబోయే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయాలను వెలువరించేలా నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యూహాత్మక బడ్జెట్కు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మొదటి తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని గతేడాది నుంచి ప్రారంభించిన మోదీ సర్కారు.. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తాత్కాలిక బడ్జెట్ కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందన్న వార్తలు వెలువడ్డాయి. దీనికితోడు బుధవారం ఉదయం ఆర్థిక శాఖ ఒక వాట్సాప్ సందేశంలో.. 2019–20 బడ్జెట్ను తాత్కాలిక బడ్జెట్గా పేర్కొనవద్దని పేర్కొంది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి విమర్శలొచ్చాయి. దీంతో వెనక్కు తగ్గిన ఆర్థిక శాఖ.. తాత్కాలిక బడ్జెట్నే ప్రవేశపెడుతున్నట్లు బుధవారం సాయంత్రం స్పష్టం చేసింది. తాత్కాలిక బడ్జెట్ కారణంగా ఈసారి ఎకనమిక్ సర్వే ఉండదు. కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రవేశపెట్టే బడ్జెట్ సమయంలో మాత్రమే ఎకనమిక్ సర్వే ఉంటుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ రైతులపై వరాల జల్లు! తాత్కాలికమైతేనేం.. బడ్జెట్ తాత్కాలికమా? పూర్తిస్థాయిలోనా అన్న సంగతి పక్కన పెడితే.. ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే సర్కారు ఈ ఐదేళ్ల పదవీకాలంలో ప్రవేశపెడుతున్న చివరి బడ్జెట్ ఇదే. ఇప్పటిదాకా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్జైట్లీ అనారోగ్య కారణంగా.. ఆ బాధ్యతల్ని స్వీకరించిన రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తాజా బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ కావటంతో దీనిపై సామాన్యుల నుంచి కార్పొరేట్ల వరకు ఎన్నో వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. రైతులకు ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ప్యాకేజీ, వేతన జీవులకు ఆదాయపన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలు ఉండొచ్చన్న అంచనాలతోపాటు అత్యధిక సంఖ్యలో ఉన్న చిరువ్యాపారులకు రుణాల పరంగా వెసులుబాటు కల్పించొచ్చని భావిస్తున్నారు. మొదటి బడ్జెటే తాత్కాలికం! భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం చెట్టి స్వతంత్ర భారతంలో ప్రవేశపెట్టిన మొదటిదే తాత్కాలిక బడ్జెట్. దీన్ని 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఐదు బడ్జెట్లను కొత్తగా ఎన్నికైన ప్రభుత్వాల ఆర్థికమంత్రులు ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే తాత్కాలిక లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విధాన నిర్ణయాలు ప్రకటించకూడదు. అయితే, 1947 నవంబర్ 26న ప్రవేశపెట్టిన తొలి తాత్కాలిక బడ్జెట్ అని ఆ సమయంలో.. నాటి ఆర్థిక మంత్రి చెట్టి పేర్కొనలేదు. కానీ, 1948 ఫిబ్రవరి 28న రెండో బడ్జెట్ ప్రవేశపెడుతూ, మొదటిది తాత్కాలిక బడ్జెట్ అని చెప్పారు. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు (జనతాపార్టీ) ఆర్థిక మంత్రిగా హెచ్ఎం పటేల్ 1977లో ఓటాన్ అకౌంట్ సమర్పించారు. 1991లో చంద్రశేఖర్ కేబినెట్లోని ఆర్థిక మంత్రి యశ్వంత్సిన్హా తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మన్మోహన్సింగ్.. 1996 పార్లమెంటు ఎన్నికల ముందు తొలిసారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 2009 లోక్సభ ఎన్నికల ముందు జనవరిలో ప్రణబ్ ముఖర్జీ మొదటిసారి తాత్కాలిక బడ్జెట్ సమర్పించారు. 2014 ఫిబ్రవరి 17న పి.చిదంబరం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు జైట్లీకి అనారోగ్యం కారణంగా పీయూష్ గోయల్కు ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం దక్కింది. ఆదాయపు పన్ను పరిమితి పెంపు! ఇక మధ్యతరగతి వర్గాలు ఆదాయపన్ను పరంగా మినహాయింపులు ఈ బడ్జెట్లో ఉంటాయని ఆశిస్తున్నారు. ఆదాయపన్ను ప్రామాణిక మినహాయింపు రూ.2.5 లక్షల నుంచి పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది. సెక్షన్ 80–సీ కింద వివిధ మార్గాల్లో చేసే రూ.1.5 లక్షల పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంది. పెరుగుతున్న ఆదాయం, ద్రవ్యోల్బణం నేపథ్యంలో దీన్ని రూ.2–2.5 లక్షలు చేయాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఆర్థిక పరిపుష్టికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని బ్యాంక్ బజార్ సీఈవో అదిల్శెట్టి అభిప్రాయపడ్డారు. మెట్రో నగరాల్లో ఇళ్ల కొనుగోలుదారులకు ఆదాయపన్ను మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలు చేయాలన్న డిమాండ్ కూడా ఉంది. ఇతర డిమాండ్లలో.. కేవలం ఈక్విటీ ఫండ్స్కే కాకుండా, డెట్, హైబ్రిడ్ ఫండ్స్ కూడా సెక్షన్ 80–సీ కింద మినహాయింపు కల్పించడం.. దీర్ఘకాలిక మూలధన లాభం రూ.లక్ష దాటితే పన్ను పరిమితిని పెంచడం వంటివి కూడా ఉన్నాయి. వాస్తవ పరిస్థితులివీ! జీడీపీలో ద్రవ్యలోటును 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3%కు కట్టడి చేయాలన్నది కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ ఈ లక్ష్యం డిసెంబర్ నాటికే దాటిపోయింది. దీంతో మిగిలి ఉన్న కాలానికి వ్యయాల పరంగా పరిమితులున్నాయి. ఈ నేపథ్యంలో పన్ను తగ్గింపులు, ఇతర ప్రోత్సాహకాలకు తాత్కాలిక బడ్జెట్లో చోటు కల్పిస్తే.. అవి 2019–20 ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలపై భారం చూపిస్తాయి. 2014లో ఆర్థిక మంత్రిగా జైట్లీ బాధ్యతలు స్వీకరించే నాటికి ద్రవ్యలోటు 5% ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత.. నాటి యూపీఏ సర్కారు ద్రవ్యపరమైన ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టింది. కానీ, వీటిని సకాలంలో ఉపసంహరించుకోలేదు. దీని వల్ల 2009–10 సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 6.5%కు పెరిగిపోయింది. దీన్ని కనిష్ట స్థాయికి తీసుకొచ్చేందుకు మోదీ సర్కారు గట్టి ప్రయత్నాలనే చేసింది. చమురు ధరలు కనిష్ట స్థాయిలకు చేరడం ఇందుకు సాయపడింది. అయితే, జీఎస్టీని అమల్లోకి తేవడం, బ్యాంకుల రీ–క్యాపిటలైజేషన్ సాయం అంచనాలను మించడంతో ద్రవ్యలోటు ప్రణాళికలపై ఒత్తిడికి దారితీశాయి. దీంతో 2017–18లో 3.2% లక్ష్యాన్ని చేరడంలో వెనుకబడింది. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 3.5% వద్ద స్థిరపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018–19లో ద్రవ్యలోటు 3.3% లక్ష్యం కాగా, డిసెంబర్ వరకు తొమ్మిది నెలల కాలానికే ఈ లక్ష్యానికి 115 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3% లక్ష్యాన్ని చేరుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. -
బడ్జెట్.. పంచతంత్ర..
బదులుగా ఆ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పియూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ కూడా ఇదే.. అయితే.. ఏమిటీ మధ్యంతర బడ్జెట్.. పూర్తిస్థాయి బడ్జెట్కు దీనికి తేడా ఏమిటి? ప్రజాకర్షక నిర్ణయాలు ఉంటాయి అంటున్నారు.. అలా తీసుకోవచ్చా లేదా.. ఇలాంటి చాలా కన్ఫ్యూజన్లు.. మరి.. వాటిని క్లియర్ చేసుకుందామా.. మధ్యంతర బడ్జెట్ అంటే.. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు(భారత్లో అది ఏప్రిల్ 1) కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. ఇదో ఆదాయ, వ్యయ పట్టిక. ఇందులో తనకు ఆదాయం వచ్చే మార్గాలను తెలపడంతోపాటు, ఆ ఆదాయాన్ని ఎలా ఖర్చు చేయబోతోందన్న విషయాన్నీ వివరిస్తుంది. మధ్యంతర బడ్జెట్ విషయానికొచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. ఇది మొత్తం సంవత్సరానికి సంబంధించిన పద్దు కాదు. పరిమిత కాలానికి సంబంధించినది. అంటే.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేవరకూ ఇది అమల్లో ఉంటుంది. ఓట్ ఆన్ అకౌంట్.. మధ్యంతర బడ్జెట్ ఒకటేనా.. సాధారణంగా ఒకదానికి బదులు ఒకదాన్ని వాడేస్తుంటాం కానీ.. రెండూ వేర్వేరు. ఓట్ ఆన్ అకౌంట్లో.. ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం వచ్చేవరకూ.. అంటే అధికార మార్పిడి కాలం వరకూ అయ్యే రోజువారీ వ్యయాలకు సంబంధించిన అంచనాలు మాత్రమే ఉంటాయి. అదే మధ్యంతర బడ్జెట్లో ఆదాయం, వ్యయం రెండింటి అంచనాలు ఉంటాయి. పాలసీపరమైన చర్యలు తీసుకోవచ్చు. రోజువారీ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా(సీఎఫ్ఐ) నుంచి నిధులను తీసుకునేందుకు కేంద్రం పార్లమెంటు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏం చేయొచ్చు.. ఏం చేయకూడదు.. మధ్యంతర బడ్జెట్లో ఆర్థిక బిల్లు ఉండదు. దీని వల్ల ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయడానికి ఉండదు. శ్లాబ్లు పాతవే ఉంటాయి. ఎకనామిక్ సర్వే కూడా ఉండదని చెబుతున్నారు. సాధారణంగా అయితే రాబోయే ప్రభుత్వంపై భారం మోపేలా విధానపరమైన కీలక నిర్ణయాలేవీ ప్రకటించరు. అస్సలు తీసుకోవడానికి లేదా.. రాజ్యాంగపరంగా చెప్పాలంటే.. తీసుకోవచ్చు. ఎందుకంటే.. మధ్యంతర బడ్జెట్లో పాలసీ నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పే నిబంధనేదీ రాజ్యాంగంలో లేదు. సాధారణంగా తీసుకోరు అంతే.. ‘ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేటట్లయితే.. ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలనైనా తీసుకోవచ్చు’ అని ప్రముఖ న్యాయవాది అరవింద్ దతార్ ‘బ్లూమ్బర్గ్ క్వింట్’కు తెలిపారు. మరికొందరు కూడా ఈ వాదనను సమర్థిస్తున్నారు. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా దీంతో విభేదిస్తున్నారు. ఎకనామిక్ సర్వే ఉండదు, ఆర్థిక బిల్లు ఉండదు.. అలాగే విధానపరమైన నిర్ణయాలు కూడా ఉండకూడదని పేర్కొంటున్నారు. ఈ మధ్యంతర బడ్జెట్లో ఏముండొచ్చు.. పాత సంప్రదాయాలకు భిన్నంగా మధ్యంతర బడ్జెట్ ఉండొచ్చన్నట్లుగా కేంద్ర మంత్రి అరుణ్జైట్లీ ఇప్పటికే పలు వ్యాఖ్యలు చేశారు. దాన్ని బట్టి మోదీ సర్కారు కొన్ని విధానపరమైన కీలక నిర్ణయాలను ప్రకటించవచ్చనే ఊహాగానాలు వినవస్తున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన తమ ప్రాధాన్యతలు ఇవీ అని తెలియజేయడానికి ఈ మధ్యంతర బడ్జెట్ను ఓ అవకాశంగా వాడుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా దేశంలోని రైతాంగానికి తెలంగాణలోని రైతు బంధు తరహా పథకాన్ని ప్రకటించవచ్చని అంటున్నారు. జైట్లీ మాటలను బట్టి చూస్తే.. పాత సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ.. ఆదాయపు పన్ను వంటివాటిల్లో మినహాయింపులు ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదని పరిశీలకులు చెబుతున్నారు. -
ఈసారి ‘రైతన్న’ బడ్జెటే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతాంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. రాబోయే సాధారణ బడ్జెట్లో రైతులకు భారీగా తాయిలాలు ప్రకటించాలని యోచిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి జైట్లీ ప్రవేశపెట్టబోయేది మధ్యంతర బడ్జెటే అయినా చిన్న, సన్నకారు రైతుల్ని ఆకర్షించే నిర్ణయాలు తీసుకునే చాన్సుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం యోచిస్తున్న చర్యల్లో..పంట సాగుకు ముందే నగదు రూపంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు మంజూరు చేయడం లాంటివి ఉన్నట్లు తెలుస్తోంది. పంటల దిగుబడులు పెరిగినా ధరలు తగ్గకుండా ఉండేందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకునే వీలుంది. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యవసాయ సంక్షోభ నివారణకు ఇటీవల బీజేపీ జాతీయ మండలి తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం రైతులకు చేసిన దాని పట్ల బీజేపీ వర్గాలే సంతృప్తిగా లేనట్లు సమాచారం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందాలంటే వ్యవసాయ రంగానికి ప్యాకేజీ ప్రకటించాలని బీజేపీపై ఒత్తిళ్లు అధికమైనట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల ఏడాది ప్రకటించే బడ్జెట్ సంప్రదాయాల్ని తోసిరాజని, వ్యవసాయ రంగ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టిపెట్టామని జైట్లీ ఇటీవల∙అన్నారు. రైతులకు భారీ పథకం ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికల్లో కొన్ని 1. రైతులకు నేరుగా నగదు రూపంలో ఇన్పుట్ సబ్సిడీ 2. రూ.3 లక్షల వరకు వడ్డీ రహిత రుణాలు 3. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు -
బడ్జెట్ కోటాలో రైతు వాటా ఎంత?
రాష్ట్ర ప్రభుత్వాల రాబడిలో 90 శాతంపైగా వేతనాలు, పెన్షన్ చెల్లింపులు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులకు సరిపోతుండగా రైతుకు, వ్యవసాయానికి ప్రభుత్వం వెచ్చించే మొత్తం శూన్యమనే చెప్పాలి. ఖజానా వట్టిపోయాక సాంవత్సరిక బడ్జెట్ కేటాయింపులో రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను రైతాంగ ఉద్యమాలు అర్థం చేసుకోనంతవరకు రాజకీయ పార్టీలు దాదాపుగా అవీ ఇవీ అనే తేడా లేకుండా తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలను కురిపిస్తున్న తరుణంలో వ్యవసాయానికి అవసరమైన డబ్బు ఎక్కడికి వెళుతోందని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ఆర్థిక రాడార్ తెరపై రైతులు కనిపించే ఏకైక సమయం ఎన్నికల సమయంలో మాత్రమే. ఇది సర్వసాధారణమైపోయింది. గత ముప్పై ఏళ్లుగా నేను ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాను. తమ తమ సిద్ధాం తాలు ఏవైనా, ఆలోచనా రీతులు ఏవైనా దేశ రాజ కీయ పార్టీలన్నీ దాదాపుగా ఇదే వైఖరిని అనుసరి స్తుండటం విచారకరం. దేశంలో మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గఢ్ కూడా ఈ ధోరణినే కొనసాగిస్తున్నాయి. పైగా వ్యవసాయదారులను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు డిమాండ్లు ప్రధానంగా అజెండాగా మారనున్నాయి. దేశంలో జరుగుతున్న ప్రతి రైతాంగ నిరసనకు ఇవే కేంద్రబిందువులుగా మారిపోయాయి. అవేమిటంటే ఒకటి, వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, రెండు, ప్రభుత్వం స్వయంగా వాగ్దానం చేసిన విధంగా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి)ను అమలు చేయడం, స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ దిగుబడులపై 50 శాతం లాభాన్ని రైతులకు ప్రభుత్వమే అందించడం. ఈ మేరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యవసాయ రుణాలను మొత్తంగా మాఫీ చేస్తామని వాగ్దానం చేస్తూ వస్తున్నాయి. కానీ వాస్తవానికి, వ్యవసాయ రుణాల్లో చిన్న భాగాన్ని మాత్రమే మాఫీ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని మెజారిటీ రైతులు ప్రభుత్వ సహాయం అందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తారనే ఆశ మాత్రంగా కూడా నాకు కనిపించడం లేదు. ఇక రెండో డిమాండు విషయానికి వద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై స్వామినాధన్ కమిషన్ నిర్దేశించిన ఫార్ములాను సంపూర్ణంగా అమలు చేయవలసిన అవసరం కచ్చితంగా ఉంది. ఆవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉన్నపళాన పెంచినప్పటికీ అది మన రైతాంగంలోని అతి చిన్న భాగానికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. శాంతకుమార్ నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత అధికారిక కమిటీ ప్రకారం, 6 శాతం రైతులు మాత్రమే ఆహార సేకరణ ధరల వల్ల లబ్ధిని పొందగలుగుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం డిమాండు చేస్తున్న కనీస మద్దతు ధర, దిగుబడిపై 50 శాతం లాభాన్ని అమలు చేసినప్పటికీ, ఇప్పటికే ధాన్య సేకరణ ధరలను పొందుతున్న కొద్దిమంది రైతులు మాత్రమే లబ్ధి పొందే పరిస్థితి ఉంది. మరి అటు మార్కెట్ చేయదగిన అదనపు ఉత్పత్తులు పెద్దగా లేని లేక మౌలిక వసతులు లేమి కారణంగా ధాన్య సేకరణ కార్యకలాపాలకు దూరమైపోయిన 94 శాతం మంది రైతుల విషయం ఏమిటి? ఉదాహరణకు, ఒక్క మధ్యప్రదేశ్లోనే 94 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2017లో గోధుమపంట సీజన్లో 10.5 లక్షల రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ధాన్య సేకరణ ధరల వద్ద అమ్ముకోగలిగారు. ఇక మిగిలిన 83 లక్షల వ్యవసాయ కుటుంబాల మాట ఏమిటి? స్వామినాధన్ కమిషన్ నివేదించిన ధరల ఫార్ములాను యథాతథంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉండగా, రైతులు మండీలకు తరలిస్తున్న తమ ఉత్పత్తులన్నింటినీ అధికారికంగా ప్రభుత్వమే సేకరించే పరిస్థితి ఏర్పడనంతవరకు, పంటలకు అధిక ధరలను ప్రకటించినప్పటికీ పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు తగినన్ని ధాన్య సేకరణ వసతులను కల్పించడంలో విఫలమవడమే కాకుండా సమస్య పరిష్కారం విషయంలో చేతులెత్తేశాయి. ఇది రైతులను మరింతగా మండించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ఆశా పథకంలో కూడా, మార్కెట్కు వచ్చిన అదనపు వ్యవసాయ ఉత్పత్తులలో 25 శాతాన్ని మాత్రమే సేకరించగలనని ప్రభుత్వ స్థాయిలో తేల్చి చెప్పారు. మరి మిగిలిన 75 శాతం దిగుబడుల మాటేమిటి? మార్కెట్లో తన దిగుబడులను తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చినప్పుడు రైతులు పొందే పెను నష్టాన్ని ఎవరు భరిస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై జరుగుతున్న చర్చ రైతాంగం చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్లకు మించి ముందుకెళ్లాల్సి ఉంది. వ్యవసాయదారులు కాస్త ఊపిరి తీసుకోవడానికి అవకాశమివ్వని దేశీయ ఆర్థిక రూపకల్పన గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఇంకాస్త స్పష్టంగా వివరించాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన వెంటనే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ, రైతు రుణాలను మాఫీ చేయదలుస్తున్న రాష్ట్రాలు తమ సొంత ఆర్థిక వనరులను వెదుక్కోవలసి ఉంటుందని కరాఖండీగా చెప్పేశారు. వాస్తవానికి 2014 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం నాలుగేళ్లలో ఇదే ప్రభుత్వం రూ. 3.16 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రంగానికి చెందిన మొండి బకాయిలను లెక్కలోకి రాకుండా కొట్టిపడేసింది. కార్పొరేట్ రంగం అవకతవకల భారాన్ని భరించాల్సిందిగా అరుణ్ జైట్లీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఎన్నడూ కోరిన పాపాన పోలేదు. అటు పరిశ్రమలూ, ఇటు రైతులూ అదే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుం టున్నప్పుడు, పరిశ్రమల మొండి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ఎందుకు మారలేదు అనే ప్రశ్నను వ్యవసాయ రంగ నేతలు సంధించాల్సి ఉంది. పరిశ్రమల విషయంలో సూచించినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు రైతుల రుణాలను కూడా మొత్తంగా రద్దు చేయాల్సిందని జాతీయ బ్యాంకులను ఎందుకు ఆదేశించలేదు? ఆ భారాన్ని మాత్రమే రాష్ట్రాల ప్రభుత్వాలమీదికి నెట్టడం దేనికి? ఈ సమస్య మొత్తానికి కేంద్ర బిందువు ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం–2003లో దాగి ఉంది. స్థూల ప్రభుత్వ దేశీయ ఉత్పత్తులపై (జిఎస్డీపీ) ఒక సంవత్సరంలో తీసుకునే రుణ పరిమితిని ఈ చట్టం 3 శాతానికి కుదిం చివేసింది. ఒకసారి బడ్జెట్ నిబంధనలకేసి దృష్టి సారిస్తే, వ్యవసాయానికి కేటాయిస్తున్న డబ్బు చాలా తక్కువ స్థాయిలో ఉందని బోధపడుతుంది. ఈ విషయంలో కాస్త వివరించనివ్వండి. ఛత్తీస్గఢ్లో సవరించిన బడ్జెటరీ అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత రాబడిలో 93 శాతం వరకు వేతనాలు, పెన్షన్ చెల్లిం పులు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఒక్క వేతనాలు, పెన్షన్లు మాత్రమే బడ్జెట్లో అధికభాగాన్ని హరించివేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది 87 శాతం కాగా, రాజస్తాన్లో ఇది 116 శాతానికి పెరి గిపోయింది. ప్రభుత్వ వేతనాలు, పెన్షన్ల భారం ఇంత భారీగా ప్రభుత్వాలపై పడుతున్నప్పుడు రైతులతో సహా తక్కిన జనాభాకు కేటాయించదగిన వనరులు శూన్యం మాత్రమే. పైగా ఈ వేతనాలు, పింఛన్లు కేంద్ర ప్రభుత్వానివి కావు. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలూ మొత్త జనాభాలో అతి కొద్ది భాగంగా ఉన్న ఉద్యోగులను, పింఛనుదారులను సంతృప్తి పరిచేందుకు అహరహం శ్రమిస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2017–18లో అంచనా వేసిన మొత్తం జనాభా 8.1 కోట్లు కాగా ఆ రాష్ట్రంలో 7.5 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 లక్షలమంది శాశ్వత ఉద్యోగులు.ఈ మొత్తం వ్యవహారాన్ని పట్టి చూస్తే అర్థమవుతున్నది ఒకటే. రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను వ్యవసాయదారుల ఉద్యమాలు అర్థం చేసుకోనంత వరకు రాజకీయ పార్టీలు వీరు వారూ అనే తేడా లేకుండా తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్ప్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీనుంచి రైతులు కోరవలసిన వివరాలు ఏమిటంటే, వ్యవసాయ రంగానికి ఆ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలుకు తగిన వనరులను ఎక్కడినుంచి తీసుకొస్తాయన్నదే. దీనికి రైతులు చేయవలసిన మొదటి పని ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం–2003కి సవరణ తీసుకురావాలని డిమాండ్ చేయడం, దాంతోపాటుగా రాష్ట్ర రైతుల ఆదాయ కమిషన్ను ఏర్పర్చాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం మాత్రమే. పైగా ప్రతి రైతు కుటుంబానికీ నెలకు రూ.18,000 కోట్ల ఆదాయాన్ని కల్పించాలన్నది తప్పనిసరి నిబంధనగా ఉండాలి. ఇది ప్రతి జిల్లాలోనూ సగటున రైతుల ఆదాయాన్ని వివరించేలా చేస్తుంది, తర్వాత కనీసంగా హామీ పడిన ఆదాయంలో వస్తున్న అంతరాన్ని నగదు బదలాయింపు ద్వారా పూరించేలా వీలు కలిగిస్తుంది. దేవిందర్శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
ఆర్బీఐ నిధులపై కన్ను!?
న్యూఢిల్లీ: ఆర్బీఐ వద్దనున్న భారీ నిధులపై కేంద్రం కన్నేసిందా? వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తోందా..? నిజం ఇప్పటికైతే వాస్తవ రూపం దాల్చలేదు కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం దీనిపై ఆరోపణలకు దిగింది. మోదీ సర్కారు ద్రవ్యలోటు సంక్షోభం గట్టెక్కేందుకు ఆర్బీఐ నిధులను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తోందంటూ మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఆరోపించారు. ‘‘ప్రభుత్వం ద్రవ్యలోటు సంక్షోభంలో ఉంది. ఎన్నికల సంవత్సరంలో వ్యయాలను పెంచాలనుకుంటోంది. ఇందుకోసం ఆర్బీఐ నుంచి రూ.లక్ష కోట్లను డిమాండ్ చేస్తోం ది’’ అని చిదంబరం అన్నారు. ఒకవేళ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన విధానానికే కట్టుబడితే, ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 కింద రూ.లక్ష కోట్లను బదిలీ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేయాలనుకుంటున్నట్టు చిదంబరం ఆరోపించారు. ఆ ప్రతిపాదన లేదు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్చంద్ర గార్గ్ ట్విట్టర్లో స్పందిస్తూ... ప్రభుత్వం అంత తీవ్ర నిధుల అవసరాల్లో లేదని, రూ.3.6 లక్షల కోట్లను బదిలీ చేయాలంటూ ఆర్బీఐని కోరే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు. 2018–19 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యం 3.1 శాతాన్ని చేరుకునే క్రమంలోనే ప్రభుత్వం ఉందన్నారు. ‘‘2013–14లో ప్రభుత్వ ద్రవ్యలోటు 5.1 శాతంగా ఉంది. 2014–15 తర్వాత నుంచి ఈ లోటును గణనీయంగా తగ్గించడంలో ప్రభుత్వం సఫలం అయింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి 3.3 శాతానికి ద్రవ్యలోటును కట్టడి చేయగలం. బడ్జెట్లో పేర్కొన్న రుణ సమీకరణ లక్ష్యం రూ.70,000 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే సాధించింది. ఆర్బీఐకి సంబంధించి సరైన ‘ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్’పైనే చర్చ నడుస్తోంది’’ అని సుభాష్చంద్ర గార్గ్ తెలిపారు. అన్ని రకాల రిస్క్లను ఎదుర్కొనేందుకు వీలుగా తగినన్ని నగదు నిల్వలను కలిగి ఉండడాన్ని ‘ఎకనమిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్’గా చెబుతారు. 2016–17 ఆర్థిక సర్వే సందర్భంగా నాటి ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం... ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో నిధులు ఉన్నాయని, వాటిల్లో రూ. 4 లక్షల కోట్ల మేర ప్రభుత్వానికి బదిలీ చేస్తే వాటిని బ్యాంకుల రిక్యాపిటలైజేషన్కు వినియోగించొచ్చని పేర్కొనడం గమనార్హం. దీనిపై అప్పట్లో వివాదమేదీ రాలేదు. తాజాగా చిదంబరం ఆరోపణలతో కలకలం నెలకొంది. కార్యాచరణ వెనుక...? అయితే, ఆర్బీఐ కనీస నగదు నిల్వలపై చర్చిస్తున్నట్టు కేంద్రం ప్రకటించగా, దీనిలో అంతరార్థం పరిశీలిస్తే ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా ఆర్బీఐ కనీస నగదు నిల్వల కార్యాచరణ పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్టు ఒక అధికారి పేర్కొనడం గమనార్హం. ‘‘ప్రస్తుతం ఆర్బీఐ క్యాపిటల్ 27 శాతాన్ని ప్రొవిజనింగ్కు కేటాయించాల్సి ఉంది. అతర్జాతీయంగా చాలా సెంట్రల్ బ్యాంకుల్లో ఇది 14 శాతమే. మా లెక్కల ప్రకారం ఆర్బీఐ ప్రొవిజన్లు 14 శాతంగా ఉంటే, రూ.3.6 లక్షల కోట్ల నిధులకు స్వేచ్ఛ లభిస్తుంది’’ అని ఆ అధికారి వివరించారు. ఈ నిధులను ఆర్బీఐ వద్ద ఖాళీగా ఉంచడం కంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించొచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ అంశం నవంబర్ 19న జరిగే ఆర్బీఐ తదుపరి భేటీలో చర్చకు వస్తుందని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య పలు అంశాల్లో విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఆర్బీఐ, ప్రభుత్వరంగ బ్యాంకుల నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.54,817 కోట్ల డివిడెండ్ ఆదాయం రావొచ్చన్న అంచనాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పేర్కొంది. దీనికి అనుగుణంగానే ఆర్బీఐ రూ.50,000 కోట్లను కేంద్రానికి డివిడెండ్ ఇవ్వాలని ఈ ఏడాది ఆరంభంలో నిర్ణయించింది. -
డబుల్ రోల్
ఒకపక్క మేకప్ వేసుకుంటూ ఇంకో పక్క లెక్కలు వేస్తున్నారట రామ్ చరణ్. ఈ లెక్కకో రీజనింగ్ ఉంది. అంటే ఎవరి లెక్కలైనా తేల్చాలనుకుంటున్నాడేమో అనుకుంటున్నారా? అదేం కాదు. ఇది ‘సినిమా లెక్క’. అంటే.. బడ్జెట్ గురించిన లెక్క. ఈ లెక్కలు తండ్రి చిరంజీవితో తాను నిర్మిస్తున్న ‘సైరా’ కోసం. హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తూనే మరోపక్క ‘సైరా’ సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు చరణ్. నటుడిగా, నిర్మాతగా రెండు పడవల ప్రయాణంతో ఫుల్ బిజీగా ఉన్నారాయన. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ హైదరాబాద్లో ఒకేచోట జరుగుతుండడంతో ‘సైరా’ సెట్స్ను కూడా సందర్శిస్తున్నారట చరణ్. ఈ చిత్రాన్ని చరణ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. అందుకే ఖర్చు విషయంలో, టెక్నీషియన్స్ విషయంలో అస్సలు రాజీపడటంలేదు. ఈ సినిమా గురించి చరణ్ మాట్లాడుతూ – ‘‘వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీ మార్కెట్ విస్తృతంగా పెరుగుతోంది. ఆ డిమాండ్కు తగ్గట్టుగానే ‘సైరా’ చిత్రాన్ని ఇండియా వైడ్గా రిలీజ్ చేయనున్నాం. అలాగే చైనా లాంటి దేశాల్లో ఇండియన్ సినిమాకు మార్కెట్ కూడా బాగా పెరిగింది. అక్కడికి కూడా ఈ సినిమాను తీసుకువెళ్లాలనే ప్లాన్లో ఉన్నాం. ప్రతి ప్రాంతంలో ఉన్న ఫిల్మ్ లవర్కి మా సినిమా దగ్గరవ్వాలన్నది మా ఆలోచన. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’’ అని పేర్కొన్నారాయన. ఒకవైపు నిర్మాతగా, మరోవైపు హీరోగా రామ్ చరణ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నారన్నమాట. -
బడ్జెట్లో బీసీలకు అన్యాయం
హుజూరాబాద్రూరల్: టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఎర్రబొజ్జు నారాయణ అన్నారు. ఆదివారం పట్టణంలోని బృందావన్ సెంటర్లో ఆయన మాట్లాడుతూ గత బడ్జెట్లో బీసీ సబ్ప్లాన్ ప్రకటించిన ప్రభుత్వం.. ప్రస్తుతం నిధులు కేటాయించకుండా మాట తప్పిందన్నారు. రూ. వెయ్యి కోట్ల నిధులు కేటాయిస్తామని చెప్పి.. ఇప్పటికీ రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ తిరుణహరి శేషు, జిల్లా సెక్రెటరీ జె.కె. ప్రభాకర్, జేఏసీ మండల అధ్యక్షుడు సబ్బని తిరుపతి, ఉపాధ్యక్షుడు సాధుల లక్ష్మీనారాయణ, మహిళ సభ్యులు పాల్గొన్నారు. -
బడ్జెట్ ఓ కురవని మేఘం
గ్రామీణాభివృద్ధి శాఖకు కేంద్ర బడ్జెట్లో నాలుగు శాతం నామమాత్రపు కేటాయింపులు చేశారు. వీటితో ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు. గత మూడేళ్లుగా గ్రామీణ ప్రాంతాలు ఎదుర్కొంటున్న దుర్భిక్షం నేపథ్యంలో 2018 బడ్జెట్ గ్రామీణ ప్రజల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని భావించారు. బడ్జెట్ ఉపన్యాసం కూడా అదే ధోరణిని ధ్వనించింది. అయితే ఆర్థికమంత్రి చూస్తున్న గ్రామీణ భారతం, ప్రజలనుభవిస్తున్న గ్రామీణ భారతం ఒక్కటేనా అన్నది ఇప్పుడు మనముందున్న సమస్య. గత 3 బడ్జెట్లలో మాట వరుసకన్నా ఉపాధి, నైపుణ్యం, గ్రామీణ ఉపాధి, ఉత్పత్తి వంటి పదాలు వినిపించాయి. ఈ బడ్జెట్లో అవి కూడా కరువయ్యాయి. గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఆరోగ్య బీమా ఈ బడ్జెట్ ప్రాధాన్యతలుగా ముందుకొచ్చాయి. 2008 బడ్జెట్లో యూపీఏ ప్రతిపాదించిన రుణమాఫీ పథకం 2009 ఎన్నికల్లో ఫలితాన్నిచ్చినట్లుగా ఈ ఆరోగ్యబీమా ఎన్డీయేకు 2019లో అచ్చొస్తుందా అన్నది వేచి చూడాలి. ఈ రెండు పథకాల మధ్య మౌలికమైన తేడా ఉంది. రైతు రుణమాఫీ పథకం ఎన్ని పరిమితులతోనైనా రైతుల చేతుల్లో రొక్కం మిగి ల్చింది. కానీ మోదీ ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం కార్పొరేట్ ఆసుపత్రుల ఖజానాను నింపే పథకమన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యబీమా పథకాన్ని ముందుకు తేవటంతో 2014 ఎన్నికల్లో గ్రామీణ ప్రజల ఆదాయాలు రెట్టింపు చేస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని, అవినీతిని అంతమొందిస్తామని బీజేపీ వాగ్దానాలు నీటిమీద రాతలయ్యాయన్న అంగీకరించినట్లైంది. విత్తనాలు వేయటానికి ముందు రైతు ఆకాశంలో కనపడే ప్రతి మేఘమూ కురవటానికే వచ్చిందా అన్నట్లు చూస్తాడు. మోదీ మాయాజాలం కూడా ప్రజలకు కురవని మేఘాలు చూపించి కాలక్షేపం చేస్తోంది. బడ్జెట్ ప్రసంగానికి, కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోటానికి ఒక్క గ్రామీణ మౌలిక రంగం గురించి ప్రస్తావనను చూస్తే సరిపోతుంది. గ్రామీణాభివృద్ధికి క్లస్టర్ విధానాన్ని అనుసరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే పాతిక ముప్పై గ్రామాలకు ఉపయోగపడేలా మౌలికసదుపాయాల కల్పన వ్యూహం. కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయింపులు 4 శాతానికి మించి పెరగలేదు. మరి ఆరున్నర లక్షల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించటం అంటే 21వ శతాబ్దపు మయసభను ఊహించుకోవటం తప్ప మరో మార్గం లేదు. ప్రభుత్వానికి ప్రాణప్రదమైన పథకాలు స్వచ్ఛభారత్ అభియాన్, ప్రధానమంత్రి గ్రామసడక్ యోజన, ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకం కేటాయింపులు నిరాశాజనకంగా ఉన్నాయి. ఆవాస్ యోజన కేటాయింపులు 9 శాతం తగ్గితే ఉపాధి హామీ కేటాయింపులు యథాతథంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు రెండు కోట్ల పాయఖానాలు, యాభై లక్షల నివాసాలు నిర్మాణం లక్ష్యంగా నిర్ణయించింది. కానీ కేటాయింపులు తగ్గట్టుగా లేవు. ఒక్క ఏపీలోనే 30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని డిసెంబరులో హూంకరించిన టీడీపీ తన విజ్ఞప్తిని కనీసం ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా చేయకపోవటం గమనిస్తే రాష్ట్రంలో పెరుగుతున్న ప్రజల ఆగ్రహావేశాన్ని కేంద్రంపై నెట్టే ప్రయత్నమే తప్ప మరోటి కాదని తేటతెల్లమవుతుంది. ఇక ఆరోగ్య బీమా పథకంపై ఆర్థిక మంత్రి ప్రకటన రెండు కీలక అంశాలు చర్చకు పెడుతోంది. మొదటిది దేశంలో పేదలెందరు అన్న ప్రశ్న. దావోస్ మొదలు ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, ప్రపంచ వాణిజ్య సంస్థలకిచ్చిన లెక్కల్లో దేశ జనాభాలో పేదలు 20 శాతంలోపే అన్న వాదన వినిపించిన ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్న యాభై కోట్ల ప్రజానీకం కోసం ఆరోగ్య బీమా పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఏది మోసం, ఏది వాస్తవం అన్నది ప్రజలే నిర్ణయిం చుకోవాలి. పైగా 2008లో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు (ఆరెస్బీవై) నేడు మోదీ రంగు మార్చి చెప్పుకుంటున్న ‘ఆయుష్మాన్ భారత్’ పథకానికి మధ్య పేర్లలో తప్ప తేడా లేదు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పదుల కొద్దీ పథకాలకు పేర్లు మార్చటం తప్ప మోదీ గ్రామీణ ప్రజలకు కొత్తగా ఇచ్చిన వరాలు ఏమీ లేవు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు పునాది నాటి ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆరెస్బీవై అమలు కొన్ని రాష్ట్రాల్లో తప్ప విజయవంతం కాలేదు. ప్రజల్లో ఈ పథకం, దాని ప్రయోజనం పట్ల సరైన అవగాహన లేకపోవటం ఒక కారణమైతే ప్రాథమిక వైద్యసేవలను పటిష్టం చేయకపోవటం మరో కారణం. చివరిగా 2018 బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరోగ్యబీమా పథకం నేరుగా ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరవేయటం కాకుండా బీమా కంపెనీల ద్వారా చేరవేయటానికి సంకల్పించింది. నేరుగా అందించాల్సిన సేవల విషయంలోనే ప్రభుత్వ వైఫల్యం బట్టబయలవుతుంటే మార్కెట్ నియంత్రిత సేవలు ప్రజలకు ఎక్కువ ప్రయోజనం కల్గిస్తాయని నమ్మటం ఎలా? ప్రైవేటు వైద్య, ఇంజ నీరింగ్ కళాశాలలనే నియంత్రించలేని మనదేశంలో లక్షల కోట్ల రూపాయలతో కూడిన ప్రైవేటు ఆరోగ్య బీమా కంపెనీలను నియంత్రించి ప్రజల ఆరోగ్యానికి బీమా హామీ కల్పిస్తుందని ఆశించటం ఎలా? వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు కొండూరి వీరయ్య 98717 94037 -
చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదు?
నెల్లూరు : కేంద్ర బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వంద ప్రమాణాలు అవలంబిస్తున్నారని వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఒకలా, బయట మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విదేశీ పర్యటనల వల్ల ఏమీ ప్రయోజనం లేదని, విదేశీ పర్యటన కేవలం తన అవినీతి సొమ్ము దాచుకొనేందుకే తప్ప రాష్ట్ర ప్రజల కోసం కాదన్నారు. -
విభజన హామీలన్నీ నెరవేర్చాలి: ఎంపీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఎంపీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. గురువారం ఆమె బడ్జెట్పై జరిగిన చర్చలో మాట్లాడారు. ‘‘విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు కొద్దిరోజులుగా చేస్తున్న ఆందోళనకు మా మద్దతు పలుకుతున్నాం. ప్రభుత్వం–పాలన ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వంలో ఉన్న టీడీపీ సభలో ఆందోళన చేస్తుండడం ప్రభుత్వానికి మంచిది కాదు. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది’’ అని అన్నారు. ‘‘ఈ బడ్జెట్లో రైతు గురించి చేసిందేమీ లేదు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఎలాంటి వ్యూహమూ లేదు. ఎలాంటి కేటాయింపులూ లేవు. గడిచిన మూడేళ్లుగా లేదు. ఇప్పుడూ లేదు. సులభతర వాణిజ్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తెచ్చారు. 140వ స్థానం నుంచి 100వ స్థానానికి ఎగబాకారు. వ్యాపారానికి సంబంధించి 31 బిల్లులు తెచ్చారు. కానీ రైతుల గురించి ఏం చేశారు. కేవలం 2 బిల్లులు తెచ్చారు. పెస్టిసైడ్స్ బిల్లు, నాబార్డు బిల్లు, విత్తనాల బిల్లు, శీతల గిడ్డంగుల బిల్లు.. ఇలా అనేకం పెండింగ్లో ఉన్నాయి. తొలి బడ్జెట్ నుంచే రైతుల ఆదాయం రెట్టింపునకు సంబంధించి కేటాయింపులు ఎందుకు చేయలేదు. ఎరువుల సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాలో వేస్తామన్నారు. ఎందుకు చేయలేదు. సాగునీటికి నీళ్లిస్తామన్న ప్రకటనలే తప్ప కేటాయింపులేవీ? మా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరాం. కానీ పురోగతి లేదు. కనీసం రాష్ట్రాలు చేసే ప్రాజెక్టులకైనా సాయం చేయాలి కదా.. ప్రతి రైతును యూనిట్గా తీసుకుని ఫసల్ బీమా యోజన చేపట్టాలి. కనీస మద్దతు ధర కేవలం 26 పంటలకే ప్రకటిస్తున్నారు. కేవలం 2 వ్యవసాయ ఉత్పత్తులనే కేంద్రం సేకరిస్తోంది. మిగిలిన అన్నింటికీ మద్దతు ధర ప్రకటించాలి’’ అని పేర్కొన్నారు. అప్పటికే తనకు కేటాయించిన సమయం పూర్తయిందని సభాపతి ప్రకటించడంతో చివరగా ‘‘విభజన హామీలు నెరవేర్చాలి.. జై ఆంధ్రా.. ’ అంటూ ప్రసంగం ముగించారు. -
జైట్లీ పాత ముచ్చట్లకు సుజనా చప్పట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో మరోసారి ప్రకటన చేశారు. ఎప్పటిలాగే పాత పాటే పాడారు. హామీల అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోయారు. అదనంగా పైసా కూడా ఇస్తున్నట్లు చెప్పలేదు. అయినప్పటికీ టీడీపీ నేత, కేంద్ర సహాయ మంత్రి వైఎస్ చౌదరి(సుజనా చౌదరి) హర్షం వ్యక్తం చేస్తూ పలుమార్లు బల్లలు చరిచడం గమనార్హం. టీడీపీ ఎంపీలు సైతం ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయకుండా మౌనంగా ఉండిపోయారు. హామీలపై స్పష్టత ఇవ్వకుండా చర్వితచరణంగా సాగిన అరుణ్ జైట్లీ ప్రకటనపై వైఎస్సార్ సీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రకటనలో కొత్తదనమేమీ లేదంటూ వెల్లో బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేశారు. సుజనా చౌదరికి ముందే తెలుసా? బడ్జెట్పై జరిగిన చర్చకు అరుణ్ జైట్లీ గురువారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల నిరసనపై తనకు సానుభూతి ఉందని, ప్రసంగం చివరలో తాను ఏపీ హామీలపై ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. ప్రసంగం చివరలో అత్యంత ఉత్కంఠ మధ్య ప్రకటన చేశారు. కానీ, మొన్న చేసిన ప్రకటననే కొన్ని అదనపు వాక్యాలు జోడించి చదివారు. జైట్లీ ప్రసంగానికి ముందే సుజనా చౌదరి అనూహ్యంగా మధ్యాహ్నం లోక్సభలో ఒక ప్రకటన చేశారు. తాను కేంద్ర మంత్రిగా మాట్లాడుతున్నానని చెప్పారు. బడ్జెట్పై చర్చకు ఆర్థిక మంత్రి ఇచ్చే సమాధానంలో ఏపీ హామీలపై స్పందించాలని అన్నారు. ఒకవేళ 15 రోజుల్లోగా ఈ అంశాలన్నీ పరిష్కారం కాకపోతే వచ్చే సెషన్లో 2 గంటల పాటు చర్చకు అనుమతించాలని స్పీకర్ను కోరారు. అంటే అరుణ్ జైట్లీ ప్రకటనలో కొత్తగా ఏమీ ఉండబోదని పరోక్షంగా ముందే తేల్చేశారు. జైట్లీ ప్రకటన ఎలా ఉండబోతోందో ఆయనకు ముందే తెలుసన్న సంగతి దీని ద్వారా స్పష్టమైంది. సుజనా చౌదరి ప్రకటన కంటే ముందే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్కుమార్ మాట్లాడారు. బడ్జెట్పై చర్చకు ఇచ్చే సమాధానంలో అరుణ్ జైట్లీ ఏపీ వ్యవహారాలపై ప్రకటన చేస్తారని చెప్పారు. ఇదీ ఆర్థిక మంత్రి ప్రకటన..: ‘‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం మేం నిలబడ్డాం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోనుందని వారికి అండగా నిలిచాం. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కొన్ని నిబంధనలు పొందుపరిచారు. అందులో అనేకం అమలయ్యాయి. ఇంకా కొన్ని పురోగతిలో ఉన్నాయి. హామీ మేరకు ఏపీలో చాలా సంస్థలకు నిధులిచ్చాం. ఇకపైనా అన్ని సంస్థలకూ నిధులిస్తాం. సంస్థల నిర్మాణం జరుగుతున్న కొద్దీ నిధులు ఇస్తూనే ఉంటాం. ఏపీలో నూతన రాజధాని నిర్మాణానికి కూడా నిధులు అందజేశాం. వెనుకబడిన ప్రాంతాలకు సైతం నిధులు ఇచ్చాం. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రూ.4,500 కోట్లు ఇచ్చాం. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో గణనీయమైన భాగం మేం చెల్లిస్తామని చెప్పాం. ఇక మరో రెండు అంశాలను కార్యాచరణలో పెట్టాలి. అందులో మొదటిది ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించిన నిధులు. ఎక్సటెర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జనవరి 3న ఏపీ ముఖ్యమంత్రి నాకు లేఖ రాశారు. ఈ నిధులను నాబార్డు ద్వారా ఇవ్వాలని కోరారు. ఇందుకోసం బుధవారం ఒక కార్యాచరణ రూపొందించాం. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తాం. ఇక రెండో అంశమైన రెవెన్యూ లోటు భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో ప్రతిపాదన వచ్చింది. ఏపీ సర్కారు ఇంకొంత మొత్తాన్ని ఆశిస్తోంది. మేం ఈ అంతరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. అంతరాన్ని పూడ్చుతాం. ఈ రెండు అంశాలు మరికొద్ది రోజుల్లో కొలిక్కి వస్తాయి. ప్రత్యేక రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ తదితర అంశాలపై ఆయా శాఖలతో చర్చిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్నేహితులతోనూ చర్చిస్తున్నాం. సాధ్యమయ్యే అత్యుత్తమ పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. ఇవన్నీ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై మాకు సానుభూతి ఉంది. అందువల్ల ప్రతీ అంశాన్ని సానుభూతితో చూస్తున్నాం’’ అని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఉదయం నుంచి ఏం జరిగింది? ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో వైఎస్సార్సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వి.వరప్రసాదరావు, వైఎస్ అవినాశ్రెడ్డి, మిథున్రెడ్డి ధర్నా చేపట్టారు. అధికార టీడీపీ పార్లమెంట్లో డ్రామాలాడుతోందని దుయ్యబట్టారు. టీడీపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి, నిరసన తెలపాలని సవాల్ విసిరారు. లోక్సభ ప్రారంభం కాగానే వైఎస్సార్సీపీ ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఉదయం నుంచి రాత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పూర్తయి, సభ వాయిదా పడేవరకూ వెల్లోనే ఉన్నారు. టీడీపీ మంత్రులు రాజీనామా చేయాలి అరుణ్ జైట్లీ ప్రకటన తరువాత వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఆర్థిక మంత్రి ప్రకటన కొత్తసీసాలో పాత సారాలా ఉంది. ఎలాంటి కొత్త విషయం లేదు. గతంలో చెప్పిన విషయాలే మళ్లీ చెప్పారు. మన రాష్ట్రం నష్టపోవడానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే. ఆయనను కేంద్రం విశ్వసించడం లేదు. ఆయన చరిత్రను చూసి అవకాశవాదిగా గుర్తించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప రాష్ట్రం మేలు గురించి పట్టించుకోవడం లేదు. ఆయనకు ధైర్యం ఉంటే కేంద్రంలోని టీడీపీ మంత్రులతో రాజీనామా చేయించాలి. ఎంపీలను వెల్లోకి వెళ్లమంటారు. తన మంత్రులను కుర్చీల్లో కూర్చోమంటారు. చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తన మంత్రులతో రాజీనామా చేయించాలి’’ అని మేకపాటి పేర్కొన్నారు. చంద్రబాబులాగా కక్కుర్తి పడం ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది. నాలుగేళ్లయింది. ఇంకా చేస్తాం, చూస్తామంటే ఎలా? కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేస్తోంది. చంద్రబాబుపై బీజేపీకి ఉన్న కోపం కారణంగా రాష్ట్రం నష్టపోతోంది. మేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో చెప్పినవి, రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని మాత్రమే కోరుతున్నాం. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్, పెట్రో కెమికల్ కాంప్లెక్స్, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, పారిశ్రామిక కారిడార్ వంటి కీలక అంశాల విషయంలో కేంద్రం ఇప్పటిదాకా చేసిందేమీ లేదు. రాష్ట్రం నష్టపోయినా ఫరవాలేదు, తనకు రాజకీయ లబ్ధి చేకూరితే చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఆయన స్వార్థం వల్ల రాష్ట్ర ప్రజలంతా నష్టపోవాల్పి వస్తోంది’’ అని మేకపాటి రాజమోహన్రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ ఏం సాధించిందన్న మీడియా ప్రశ్నకు సమాధానమిస్తూ... ‘‘మేం ప్రతిపక్షంలో ఉన్నాం. మాకు 9 మంది ఎంపీలు ఉంటే, ఏపీలో చంద్రబాబు ముగ్గురిని తీసుకున్నాడు. తెలంగా>ణలో ఉన్న ఒక ఎంపీని తీసుకున్నాడు. ఇప్పుడు ఐదుగురం ఉన్నాం. పోరాటం సాగిస్తున్నాం. అన్యాయాలకు వ్యతిరేకంగా గొంతెత్తుతున్నాం. కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలుపుతున్నాం. ప్రభుత్వంలో అధికారం పంచుకుంటున్న టీడీపీ వాళ్లు సాధించిందేమిటో చెప్పాలి’’ అని అన్నారు. టీడీపీ వెళ్లిపోతే కేంద్ర సర్కారులో వైఎస్సార్సీపీ చేరుతుందని అంటున్నారన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ... ‘‘ఎవరండీ చేరేది? ఆఖరులో మేం చేరేది ఏముంది? బాబులాగా కక్కుర్తి పడేవాళ్లం కాదు. రాష్ట్ర ప్రజలు జగన్ నాయకత్వాన్ని ఆశీర్వదించి 20 స్థానాలు వచ్చినప్పుడు.. రేపు ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ఏపీ ఎంపీలతో ఢిల్లీ పెద్దలకు కచ్చితంగా పని పడుతుంది. మన ప్రాపకం కోరే పరిస్థితి వస్తుంది. అప్పుడు మన రాష్ట్రానికి రావాల్సినవన్నీ సాధించుకోవచ్చు’’ మేకపాటి స్పష్టం చేశారు. సోనియాగాంధీతో టీడీపీ నేతల మంతనాలు టీడీపీ ఎంపీలు లోక్సభ వెల్లో ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తుండగా ఉదయం 11.30 గంటల సమయంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ లోక్సభ సెక్రెటరీ జనరల్ టేబుల్ వద్ద ఉన్న పుస్తకాలను ఎత్తుకుని తన స్థానం వైపు వెళ్లారు. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాలపాటు వాయిదా వేశారు. ఈ సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నేత సోనియాగాంధీ వద్దకు టీడీపీ నేతలు వెళ్లి మంతనాలు జరిపారు. ఆ పార్టీ లోక్సభాపక్ష నేత తోట నర్సింహం, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, రవీంద్రబాబు తదితరులు సోనియాతో మాట్లాడారు. సభ తిరిగి 11.45కు ప్రారంభమైన తరువాత సుజనా చౌదరి సూచనల మేరకు టీడీపీ సభ్యులు మౌనం దాల్చారు. కొద్దిసేపు పోడియం వద్దే పడుకున్నారు. మధ్యాహ్నానికి కొద్దిమందే మిగిలారు. సభలో అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత మౌనంగా ఉండిపోయిన టీడీపీ ఎంపీల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సభ వాయిదా పడిన అనంతరం తామంతా జైట్లీని కలిసి, గట్టిగా నిలదీసినట్లు లీకులు ఇవ్వడం గమనార్హం. -
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
-
మధ్యతరగతిపై పన్నుల భారం
కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విభిన్న రకాల వ్యక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారం మోపారని, ప్రభుత్వ ఉద్యోగుల సహితం బడ్జెట్పై విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు జరపలేదని, ప్రజలపై భారాలు మోపుతుందంటున్నారు. పెట్టుబడి దారులకు కొమ్ముకాసే బడ్జెట్ కల్లూరురూరల్: కేంద్రం ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్మిక సంక్షేమాన్ని తుంగలో తొక్కి పెట్టుబడి దారులకు ఊతం ఇచ్చేలాగా వుందని సీపీఎం మండల కార్యదర్శి తన్నీరు కృష్ణార్జునరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్లో పేదలకు ఎటువంటి మేలు జరిగే అవకాశం లేదని, అంకెల గారడితో ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసగించిందన్నారు. రెతులకు ఎలాంటి ఉపయోగం కలగదన్నారు. – తన్నీరు కృష్ణార్జునరావు, సీపీఎం మండల కార్యదర్శి మద్దతు ధరతో రైతుకు మేలు తల్లాడ: బడ్డెట్లో కనీస మద్దతు ధర కల్పించడం హర్షదాయకం. పత్తి, మిర్చి వంటి పంటలు ప్రతి ఏటా మద్దతు ధర లేక రైతాంగం నష్ట పోతుంది. రైతుల పరిస్థితి, వారి కష్టాలను చూసిన కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయించింది. వ్యవసాయం రంగంలో రుణాలు ఇప్పించడానికి రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రకటించటం మంచిదే. రైతులకు ఉపయోగ పడే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. – దగ్గుల శ్రీనివాసరెడ్డి, రైతు, తల్లాడ మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది మాది పేద కుటుంబం. కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు దారులకు సంవత్సరానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని బడ్జెట్లో చెప్పటం మాలాంటోళ్లకు ధైర్యం కలిగించింది. – ఎం.నాగబాబు, సత్తుపల్లి ఆరోగ్య బీమా మంచిది చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తున్నా. కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామనటం చాలా మంచిది. వీటితో పిల్లలను మంచిగా చదించటానికి అవకాశం లభిస్తుంది. – చిత్తలూరి నర్సింహారావు, సత్తుపల్లి నిరుద్యోగులకు నిరాశే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయించకపోవటం దారుణం. నిరుద్యోగులకు నిరాశే కలిగించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరిందేమీ లేదు. ఇది ధనులకు ఉపయోగపడేవిధంగా ఉంది. – భీమిరెడ్డి పుల్లారెడ్డి, వేంసూరు గ్యాస్ పొయ్యి ఇస్తే పొగ బాధ తప్పినట్లే కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. కట్టెల పొయ్యి మీద పొగతో వంట చేసుకునే మాలాంటి వాళ్ళకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇస్తే పొగ కష్టాలు తీరుతాయి. – జినుగు రాణి, పెనుబల్లి -
36 వేల దిగువకు సెన్సెక్స్
బడ్జెట్కు ముందు రోజు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్ బుధవారం హెచ్చుతగ్గులమయంగా కొనసాగింది. అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగా ఉండటం కూడా ప్రతికూల ప్రభావం చూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 36వేల పాయింట్ల దిగువకు పడిపోగా, ఇంట్రాడేలో నిఫ్టీ 11 వేల పాయింట్ల దిగువకు పతనమైంది. అయితే చివర్లో కొనుగోళ్ల కారణంగా నిఫ్టీ 11 వేల పాయింట్లపైన నిలదొక్కుకోగలిగింది. మోదీ ప్రభుత్వ చివరి బడ్జెట్ కావడంతో ఇన్వెస్టర్లు వరుసగా రెండో రోజూ జాగ్రత్తగా వ్యవహరించారు. దీంతో స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టపోయింది. చివరి గంటలో కొనుగోళ్లు ఒకింత పుంజుకోవడంతో నష్టాలు తగ్గాయి. మొత్తం మీద సెన్సెక్స్ 69 పాయింట్ల నష్టంతో 35,965 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 22 పాయింట్ల నష్టంతో 11,028 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 215 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. నష్టాల్లో ఫార్మా షేర్లు... అమెజాన్, వారెన్ బఫెట్, జేపీ మోర్గాన్లు సంయుక్తంగా ఆరోగ్యరంగంలోకి ప్రవేశించనున్నాయన్న వార్తల నేపథ్యంలో మన ఫార్మా షేర్లు బాగా నష్టపోయాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 3.7 శాతం పతనమైంది. హెచ్యూఎల్, సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐటీసీ, టీసీఎస్, విప్రో, ఎల్ అండ్ టీ, పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో ఎస్బీఐలు 3 శాతం వరకూ నష్టపోయాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్లు లాభాల్లో ముగిశాయి. అందరి కళ్లూ బడ్జెట్పైనే.. ఇన్వెస్టర్ల కళ్లన్నీ బడ్జెట్పైనే ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే గత రెండేళ్లతో పోల్చితే బడ్జెట్పై అంచనాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని పేర్కొన్నారు. ద్రవ్య క్రమశిక్షణ, వృద్ధి సంస్కరణల మధ్య సమతూకం సాధించాల్సిన అవసరముందని వివరించారు. బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కీలకం కానున్నదని, మౌలికాభివృద్ధి, సంస్కరణలు కూడా ముఖ్యమైన అంశాలేనని పేర్కొన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ పన్నుల్లో తగ్గుదల ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయని వివరించారు. -
కొత్త పురపాలికలకు నిధులు!
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదే కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన నిధులను కూడా పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. పురపాలకశాఖ కార్యక్రమాలపై కేటీఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది చేపట్టనున్న ప్రాజెక్టులు, ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమాలకు అవసరమైన నిధులతో అంచనాలను రూపొందించాలని కోరారు. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాల కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కేశవపురం రిజర్వాయర్పై చర్చించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ మెట్రో రైలు విభాగాలకు సంబంధించిన నిధుల అవసరాలను ఆరా తీశారు. సమీక్షలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్, అధికారులు పాల్గొన్నారు. -
కూలీల రాత మారేనా?
ఈయన పేరు నడిపి రాజం. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ బతుకుబండిని లాగుతున్నారు. భార్యాభర్తలిద్దరూ రోజంతా కష్టపడితే వచ్చేది రూ.400. అదీ పని దొరికితే! కూలీ లేని సమయంలో భార్య బీడీలు చుడుతుంది. కొడుకు చదువు, పండుగలూపబ్బాలు, ఉప్పూపప్పు.. మిగతా ఖర్చులన్నీ వచ్చే కాస్త సంపాదనతోనే తీర్చుకోవాలి. ‘‘అన్నీ రేట్లు పెరిగిపోతున్నయి. బియ్యం.. కూరగాయల ధరలు మండిపోతున్నయ్. వాటికే నెలకు రూ.3–5 వేల ఖర్చు వస్తుంది. తిండికే మస్తు తక్లీబు అయితంది’’అని రాజం వాపోయాడు. ఈయనలాంటివారు రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉన్నారు. పనిదొరికితే తిండి లేదంటే.. పస్తులు ఉంటున్న కుటుంబాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని వచ్చి, ఎన్ని మారినా వీరి తలరాతలు మాత్రం మారడం లేదు. కేంద్ర ప్రభుత్వం తమలాంటి గరీబోళ్లను ఆదుకోవాలని, రోజువారీ సరుకుల ధరలు తగ్గించాలని వీరంతా కోరుతున్నారు. మరి జైట్లీ తన బడ్జెట్లో వీరికోసం ఏం చేస్తారు..? సుస్థిర ఉపాధికి ఏం భరోసా ఇస్తారు..? వేచి చూడాల్సిందే..!! -
బీసీ యువతకు రాయితీ రుణాలు!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కులాల్లోని నిరుద్యోగ యువత కోసం స్వయం ఉపాధి పథకాలను అమలు చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ చర్యలు చేపడుతోంది. 2017–18లో ఇప్పటివరకు బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లు ఎలాంటి రాయితీ పథకాలు అమలు చేయలేదు. మరో రెండున్నర నెలల్లో ఏడాది ముగియనుండటంతోపాటు వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు కేటాయించిన రూ.2 వేల కోట్ల బడ్జెట్ వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ శాఖ సర్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కేటాయించిన బడ్జెట్ ప్రకారం పథకాల అమలులో భాగంగా అర్హుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయనుంది. మండలం యూనిట్గా పథకాల అమలు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కార్పొరేషన్లు, ఫెడరేషన్లు.. స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పే యువతకు రాయితీతో కూడిన రుణ సహకారం అందిస్తున్నాయి. రూ.లక్షలోపు రుణం తీసుకున్న లబ్ధిదారులకు గరిష్టంగా రూ.80 వేల రాయితీని ప్రభుత్వం ఇస్తోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు రాయితీలిస్తోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియంతా మండల స్థాయిలో ఎంపీడీఓలు పర్యవేక్షిస్తారు. ప్రతీ గ్రామంలో లబ్ధిదారులుండాలనే ఉద్దేశంతో గ్రామల వారీగా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం వాటిని వడపోసి మండల స్థాయిలో జాబితా తయారు చేస్తారు. తర్వాత జిల్లా సంక్షేమాధికారి ఆధ్వర్యంలో జిల్లా జాబితా రూపొందించి రాష్ట్ర కార్యాలయానికి సమర్పిస్తారు. ఇందుకోసం జిల్లాస్థాయిలో ప్రణాళిక రూపొందించారు. భారీ బడ్జెట్.. 2017–18లో బీసీలకు రాయితీ రుణాలకు సంబంధించి ప్రభుత్వం భారీ బడ్జెట్ కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్కు రూ.1,000 కోట్లు, రజక, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్లకు రూ.500 కోట్లు కేటాయించింది. మిగతా ఫెడరేషన్లు, బీసీ కార్పొరేషన్ పరిధిలో మరో రూ.500 కోట్ల మేర ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో ఎంపిక జాబితా రూపొందించేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది లబ్ధిదారుల ఎంపిక చేపడితే కేటాయించిన బడ్జెట్ను తర్వాత విడుదల చేసినా కోటాలో నష్టం ఉండదని అభిప్రాయ పడుతున్నారు. -
ధరలపైనే జనాగ్రహం! ఇరాన్ను కుదిపేస్తున్న ఉద్యమం
‘‘గాజా కాదు, లెబనాన్ కాదు. ఇరాన్ కోసం నేను ప్రాణం ఇస్తా!’’ అనే నినాదంతో జనం ఇరాన్ అంతటా ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. నిరసన ర్యాలీలతో తిరగబడిన ప్రజలపై ప్రభుత్వం బలప్రయోగానికి దిగింది. మంగళవారం వరకూ జరిగిన హింసలో దాదాపు 22 మంది మరణించారు. కిందటి గురువారం ఇరాన్లో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు సవాలుగా మంగళవారం నుంచి సర్కారుకు అనుకూలంగా ర్యాలీలు మొదలయ్యాయి. స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన ప్రజాస్వామ్యం కోసం టునీసియా మొదలు ఈజిప్ట్ వరకూ అరబ్ దేశాల్లో ‘అరబ్ వసంతం’ వంటిదే ఇరానీల ఆందోళన అని పాశ్చాత్య మీడియా ప్రచారం చేస్తోంది. అయితే, దాదాపు ఎనిమిది కోట్లకు పైగా జనాభా ఉన్న ఇరాన్లో ప్రస్తుత అశాంతికి దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులే కారణమన్నది అందరూ అంగీకరిస్తున్న సత్యం. ప్రాచీన నాగరికతకు ప్రసిద్ధిగాంచిన ఇరాన్లో ప్రభుత్వంపై ఆగ్రహించిన జనం వీధుల్లోకి రావడం ఇది మొదటిసారి కాదు. 2009 అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ సాగిన ఉద్యమంలో దాదాపు 34 మంది మరణించారు. ప్రజాగ్రహానికి ఆజ్యం పోసిన డిసెంబర్10 బడ్జెట్! అధ్యక్షుడు హసన్ రూహానీ కిందటి డిసెంబర్10న ప్రవేశపెట్టిన బడ్జ్ట్ ప్రతిపాదనలు నిత్యావసరాలతోపాటు అనేక వస్తువుల ధరలు బాగా పెంచేలా ఉండడంతో ప్రజల్లో అసంతృప్తి లేచింది. ఓ పక్క జనంపై ధరల భారం పెంచుతూనే మరో పక్క మత సంస్థలకు ఇతోదికంగా నిధుల కేటాయింపులకు బడ్జెట్ వీలు కల్పించింది. ముడి చమురు అమ్మకాల విషయంలోనేగాక, పశ్చిమాసియా రాజకీయాల్లో ఆధిపత్యానికి అరబ్ దిగ్గజం సౌదీఅరేబియాతో పోటీపడడం వల్ల కూడా ఇరాన్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ‘ప్రాంతీయ పెద్దన్న’ హోదా కోసం షియా ముస్లింల జనాభా ఉన్న దేశాలు, షియా పాలకులున్న రాజ్యాలకు శక్తికి మించి సాయపడడం కూడా ఇరాన్ను సంక్షోభంలోకి నెట్టింది. దేశంలో పెట్రోలు వంటి నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం పెరుగుతుండగా ఇరాన్ విదేశాంగ విధానం ప్రజల్లో అసంతృప్తి జ్వాలలను ఎగదోస్తోంది. పాలస్తీనా గెరిల్లా రాజకీయ సంస్థ హమస్, లెబనాన్కు చెందిన హిజ్బుల్లా, సిరియా అసద్ ప్రభుత్వం, యెమెన్ హౌతీలకు ఇరాన్ సర్కారు అడిగినంత నిధులు సమకూర్చడం ఇరానియన్లకు నచ్చడంలేదు. ఆంక్షలు, ఇతర కారణాలతో అంతర్గత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలాంటి సాయం చేయడం అనవసరమనీ, ఓ రకంగా చూస్తే ఇది దేశద్రోహంతో సమానమని ప్రజలు భావిస్తున్నారు. నాయకుడు లేని ప్రజా ఉద్యమం! ఇరాన్లో రాజధాని టెహరాన్ తర్వాత రెండో పెద్ద నగరం మాషాద్లో డిసెంబర్28న మొదలైన సర్కారు వ్యతిరేక నిరసన ప్రదర్శనలు దేశంలోని 27 నగరాలు, పట్టణాలకు వారంలోపే వ్యాపించాయి. ఈసారి జనాందోళన ప్రత్యేకత ఏమంటే ప్రజలు ఏ నాయకుడి పేరు ప్రస్తావించడం లేదు. ఏ సంస్థ గొడుగు కింద పోగవడం లేదు. అధ్యక్షుడు రూహానీ, అగ్ర(మత)నాయకుడు అలీ హొసేన్ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఝలక్
-
రూ.100కోట్లపై సందిగ్ధం
► పబ్లిక్ హెల్త్కా..? కార్పొరేషన్ కా ..? ► మూడునెళ్లయినా తేల్చని ప్రభుత్వం ► అయోమయంలో పాలకవర్గాలు కరీంనగర్కార్పొరేషన్: రాష్ట్ర ప్రభుత్వం 2016–17 బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్ల నిధులపై ఇంకా సందిగ్ధం వీడడంలేదు. గతేడాది బడ్జెట్ నిధులకు సంబంధించి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు చేసి ప్రభుత్వానికి పంపించారు. వాటికి ఆమోదం తెలుపుతూ మూడు నెలల క్రితం కార్పొరేషన్లకు ఇచ్చే రూ.100 కోట్ల నిధులను పబ్లిక్ హెల్త్ విభాగానికి ఇస్తూ సర్కారు జీవో విడుదల చేసింది. అయినా పబ్లిక్హెల్త్ ఈఎస్సీకి ఎలాంటి ఉత్తర్వులు అందించకుండానే సస్పెసన్లో పెట్టినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను పబ్లిక్హెల్త్ ద్వారా ఖర్చుపెట్టడం పట్ల కార్పొరేషన్లు పాలకవర్గాలు అంసతృప్తి వ్యక్తం చేశాయి. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పాలకవర్గాలు కార్పొరేషన్ యంత్రాంగం ద్వారానే నిధులు ఖర్చుపెట్టాలని కౌన్సిల్ సమావేశాల్లో తీర్మాణాలు చేసి ప్రభుత్వానికి పంపించాయి. రాష్ట్ర మంత్రులతో జరిగే ఇతర సమావేశాల్లోనూ ఈ నిధుల వినియోగంపై వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మున్సిపల్ ద్వారానే నిధులు ఖర్చుపెట్టేలా చూస్తామని ప్రభుత్వం మాట ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటనగానీ, ఎలాంటి కార్యాచరణగానీ చేపట్టకపోవడంతో అధికారులు, పాలకవర్గసభ్యులు అయోమయానికి గురవుతున్నారు. పబ్లిక్ హెల్త్లో సిబ్బంది కరువు పబ్లిక్ హెల్త్ విభాగంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీనికి తోడు మిషన్భగీరథ పనులతోనే తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే నిధులను ఖర్చుపెట్టాలంటే రూ.100 కోట్లకు టెండర్లు పిలవడం, అగ్రిమెంట్లు, నాణ్యత పరిశీలన తదితర పనులు తక్కువ సిబ్బందితో చేయడం అంత సులువైన పనికాదు. నిధులు ఖర్చు కత్తిసాముగానే మారనుంది. అదే కార్పొరేషన్లలో అయితే పదుల సంఖ్య లో ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. ప్రస్తుతం ఒత్తిడి ఉన్న పనులు కూడా పెద్దగా ఏమీలేవు. టెండర్ల నిర్వహణ, పనుల పరిశీలన చేయడం ఇబ్బందేమీ కాదు. ఇప్పటికే ప్రతిపాదనలు పూర్తిచేసుకున్న కార్పొరేషన్ల అధికారులు నిధులు మున్సిపాలిటీలకు ఇస్తే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయోమయంలో పాలకవర్గాలు కార్పొరేషన్లకు ఇచ్చే నిధులను మున్సిపల్ విభాగం నుంచి కాకుండా పబ్లిక్హెల్త్ నుంచి పనులు చేపట్టాలని ప్రభుత్వం జీవో ఇవ్వడం కార్పొరేటర్లను అయోమయానికి గురిచేసింది. మున్సిపల్ విభాగం ద్వారా ఖర్చు పెడితే తమకు బాధ్యత ఉంటుందని, తమ డివిజన్లలో నాణ్యతతో పనులు చేయించుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అదే పబ్లిక్ హెల్త్ విభాగం ద్వారా పనిచేస్తే తమకేమీ సంబంధం ఉండదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులను కార్పొరేషన్ల ద్వారానే ఖర్చుపెట్టే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నిధులపై అంశంపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. -
వెనుకబడిన తరగతులకు బడ్జెట్లో పెద్దపీట
-
ప్రజల ఆకాంక్ష మేరకే బడ్జెట్ కేటాయింపులు
-
బడ్జెట్ అంతా అంకెల గారడి: రామకృష్ణ
కడప: రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా అంకెల గారడిలా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రంలో రెండంకెల వృద్ధి జరిగితే.. వలసలు ఎందుకు ఆగడంలేదని, 950 మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ జిల్లాలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రామకృష్ణ.. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను పూర్తిగా వాడలేదని అన్నారు. గత ఏడాది కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
బడ్జెట్ పై విశ్లేషణ
-
వర్గీకరణ ప్రక్రియలో జాప్యాన్ని సహించం
- నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు - పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే తమిళుల తరహా ఉద్యమం కర్నూలు సీక్యాంప్: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తామని నవ్యాంధ్ర మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు పరిశపోగు శ్రీనివాసరావు మాదిగ హెచ్చరించారు. ఎస్టీబీసీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 20 నుంచి 3వ విడత మాదిగల మేలుకొలుపు యాత్ర జరుగుతోందని, యాత్ర పూర్తయ్యేలోగా బిల్లు పెట్టాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ విషయంలో జాప్యాన్ని సహించేది లేదని, 13జిల్లాల మాదిగలతో బీజేపీ కార్యాలయాలను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. జీఓ నెంబర్ 25 ప్రకారం సబ్ ప్లాన్ నిధులను మాదిగల సంక్షేమానికి ఖర్చు పెట్టాలన్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోతే తమిళుల తరహా ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రాచపూడి చంద్రశేఖర్, చిన్నమాదిగ, సూరి, వెంకటేశ్వర్లు, ప్రభాకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
బడ్జెట్ కేటాయింపులు పెంచాలి
స్కీమ్ వర్కర్ల డిమాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా కాకినాడ సిటీ : ఐసీడీఎస్, ఎ¯ŒSహెచ్ఎం, మిడ్డేమీల్స్, ఐకేపీ, సర్వశిక్షాభియాన్, ఉపాధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం 2017 బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని స్కీం వర్కర్లు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా, ప్రదర్శన నిర్వహించారు. సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని, 45వ ఎల్ఐసీ సిఫార్సులను అమలు చేయాలని, సంక్షేమ పథకాలను ప్రైవేటీకరణ చేయరాదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి సంఘీభావం ప్రకటించి స్కీం వర్కర్లను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి, కనీస వేతనం రూ.18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్, ఎంప్లాయీస్ యూనియ¯ŒS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్లకు రూ.లక్షల కోట్లు కట్టబెడుతూ, ప్రజలకు ఉపయోగపడుతున్న సంక్షేమ పథకాలకు కోత పెట్టడం అన్యాయమన్నారు. స్కీం వర్కర్ల జిల్లా నాయకురాలు ఎం.వీరలక్ష్మి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ అజయ్కుమార్, సీపీఎం పట్టణ కార్యదర్శి పలివెల వీరబాబు, మున్సిపల్ వర్కర్స్ యూనియ¯ŒS నాయకులు తుపాలకుల వీర్రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు దుర్గాప్రసాద్, అంగ¯ŒSవాడీ నాయకులు కృష్ణకుమారి, శాంతాలక్ష్మి, ఆశ, మిడ్డేమీల్స్ సంఘాల ప్రతినిధులు బేబిరాణి, రమణాబాయి పాల్గొన్నారు. -
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
సర్కారు నిధులతోనే అభివృద్ధి పనులు వేధిస్తున్న లోటు బడ్జెట్ ఇదీ నగరపంచాయతీ తీరు.. హుస్నాబాద్ : హుస్నాబాద్ మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్గ్రేడ్ అయి ఆదాయం పెరిగినా.. ఇంకా లోటు బడ్జెట్తోనే కాలం వెల్లదీస్తోంది. ఖర్చులు భారీగా పెరగడంతో పన్నుల రూపేనా వచ్చిన డబ్బుతో ఏ ఒక్క అభివృద్ధి పనికి వెచ్చించలేకపోతున్నారు. కేవలం ప్రభుత్వం వివిధ గ్రాంట్ల నుంచి విడుదల చేసిన వాటితోనే అభివృద్ధి పనులు దర్శనమిస్తున్నాయి. ఆదాయం మూరెడు.. ఖర్చు బారేడు అన్న చందంగా మారింది నగరపంచాయతీ తీరు. హుస్నాబాద్ నగర పంచాయతీ పాలకవర్గం 2016–2017 బడ్జెట్ రూ.16.27 కోట్లతో అంచనా వేసింది. పన్నులు పెంచి దాదాపు పూర్తిస్థాయిలో వసూలు చేసినా ఖర్చులకే సరిపోవడంతో అభివృద్ధి పనులు శూన్యంగా మారాయి. రాబడి బాగానే ఉన్నా అంతకు మించి ఖర్చులవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పన్నుల భారం పెరిగినా అంతే రీతిలో అభివృద్ధి జరుగుతుందని పాలకులు ప్రజలను ఒప్పించారు. అయితే అందుకు విరుద్దంగా జరుగుతుండటంతో ప్రభుత్వం నుంచి పలు గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులతో చేసిన అభివృద్ధినే ప్రజలకు చూపిస్తున్నారు. వివిధ పన్నుల రూపంలో వసూళ్లు రూ.1కోటికి పైగా వచ్చినా నిర్వాహణకే ఖర్చయిపోతున్నట్లు తెలుస్తోంది. ఆదాయ వనరులు ఇవే నగర పంచాయతీకి యేటా గణనీయంగా ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా 2015–2016 వరకు ఆస్తి పన్ను కింద రూ.18.76లక్షలు డిమాండ్ ఉండగా, రూ.79 లక్షలు వసూలు చేశారు. ఇవే కాకుండా అదికారులు చెప్పిన వివరాలు సుమారుగా స్టాంప్ డ్యూటీరూ.20లక్షలు, వినోద పన్ను 12 లక్షలు, అడ్వరై్టజ్మెంట్ ద్వారా 2లక్షలు, అంగడి ఆదాయం ద్వారా రూ.60లక్షలు, సెల్ టవర్స్ ద్వారా 1లక్ష, షాపింగ్ కాంప్లెక్స్ కింద రూ.3లక్షలు ఇలా నగర పంచాయతీకి ఆదాయం దాదాపు రూ.1.77 కోట్లు సమకూరుతుందని అ«ధికారులు చెబుతున్నారు. పన్నుల రూపంలో వచ్చిన నిధుల నుంచి ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ కింద దాదాపు కొంత శాతం సంబంధిత కాలనీలో పలు అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇవీ ఖర్చులు.. నగర పంచాయతీ ఖర్చులు ఆదాయాన్ని మించిపోతున్నాయి. పారిశుధ్య కార్మికులకు ఏడాదికి రూ. 84 లక్షలు, విద్యుత్ బిల్లులు రూ.84 లక్షలు, డిజిల్ ఖర్చు రూ.12లక్షలవుతున్నాయి. ఇక కార్యాలయ నిర్వాహణ వ్యయం ఏడాదికి రూ.6లక్షల వరకు వెచ్చిస్తున్నారు. ఇలా మొత్తం రూ.1 కోటి 86లక్షలు అవుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు మేజర్ గ్రామ పంచాయతీ బకాయిలు దాదాపు రూ.3 కోట్లు ఉందని, ఇప్పటి వరకు వాటిని తీర్చుకుంటూ వస్తున్నందును లోటు బడ్జెట్ ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రాంట్ల ద్వారానే అభివృద్ధి పనులు పన్నుల రూపంలో వచ్చే నిధులు కేవలం జమా ఖర్చులకే తప్పా అభివృద్ధి పనులకు ఎక్కడా వెచ్చించిన పరిస్థితి లేదు. ఆదాయంతో పోల్చితే ఖర్చు అధికంగా ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేసే గ్రాంట్ల పైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్లాన్, నాన్ ప్లాన్ గ్రాంటు, 14వ ఆర్థిక సంఘం ని«ధులు, ఎఎస్సీ నిధులతో నే పట్టణంలో పలు వార్డుల్లో సీసీరోడ్లు, మురుగుకాలువలు, తాగునీరు. పైపులైన్, విద్యుత్ మరమ్మతులకు వెచ్చిస్తున్నారు. ఆదాయంతో పోల్చితే ఖర్చులెక్కవ.. –కుమారస్వామి, కమిషనర్ నగర పంచాయతీ ఆదాయంతో పోల్చితే ఖర్చులే అధికంగా ఉన్నాయి. కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లుల చెల్లింపులకే ఆదాయం సరిపోతుంది. గ్రామ పంచాయతీ బకాయి బిల్లులు చెల్లిస్తూ రావడం లోటు బడ్జెట్కు ఓ కారణమని చెప్పవచ్చు. వచ్చే ఏడాది వరకు మిగులు బడ్జెట్కు కృషి చేస్తాం. ఆదాయ మార్గాల్లో కొన్నింటిలో పెంచితే తప్పా ఖర్చుకు తగిన ఆదాయం సమకూరే పరిస్థితి లేదు. మిగతా నగర పంచాయతీలతో పోల్చితే ఇక్కడ పన్నులు తక్కువగా ఉన్నాయి. -
'బడ్జెట్ డబుల్ చేసినా అది మనోళ్లతో కాదు'
ముంబై: రామ్గోపాల్ వర్మ ఈసారి తన ట్వీట్లతో బాలీవుడ్ ఇండస్ట్రీ మీద పడ్డాడు. హాలీవుడ్ సినిమాలతో పోల్చితే మన బాలీవుడ్ టాలెంట్ ఎందుకూ పనికిరాదని తీర్మానించేశాడు. ఇండియాలో హాలీవుడ్ సినిమాలు సాధిస్తున్న వసూళ్లను ఆపడానికి బాలీవుడ్ గాంధీ ఎక్కడున్నాడంటూ ప్రశ్నించాడు. అంతే కాదు 'బ్రిటీషర్లను ఇండియా నుంచి తరిమేయడానికి ఒక్క గాంధీ సరిపోయాడు కానీ.. వందమంది బాలీవుడ్ గాంధీలు కలిసినా హాలీవుడ్తో పోరాడగలరా.. నాకు డౌట్గా ఉంది' అన్నాడు. బడ్జెట్ను డబుల్ చేసి ఇచ్చినా కూడా హాలీవుడ్లో ప్రభంజనం సృష్టించిన అవతార్, ఇన్సెప్షన్, జంగిల్ బుక్ లాంటి చిత్రాలను మన హాలీవుడ్ గాంధీలు తీయలేరంటూ ఎద్దేవా చేశాడు. బాలీవుడ్లో 'అప్నా భారత్ మహాన్హై' అని చెబుతున్నారని, అమెరికాలో మాత్రం 'భారత్మే అప్నా హాలీవుడ్ మహాన్' అంటున్నారని చెప్పుకొచ్చాడు. చివరికి మన జాతీపిత 'గాంధీ' చిత్రాన్ని సైతం హాలీవుడ్ నిర్మించిందని.. 30 ఏళ్ల తరువాత సైతం మనం ఆ స్థాయికి చేరుకోలేకపోయామన్నారు. జంగిల్ బుక్ చేతిలో ఓడిపోకుండా షారుక్ను తన ఫ్యాన్స్కూడా కాపాడలేకపోయారని 'ఫ్యాన్' సినిమాపై సెటైర్లు వేశాడు రాము. -
చైనా ఆ బడ్జెట్ను పెంచుతోంది!
బీజింగ్: చైనా తన రక్షణ బడ్జెట్ను ఏ ఏటికాఏడూ పెంచుకుంటూ పోతోంది. గత సంవత్సరం రక్షణ బడ్జెట్ను 10.1 శాతం పెంచిన చైనా.. ఈ ఆర్థిక సంవత్సరం కూడా రక్షణ రంగానికి భారీగానే కెటాయింపులు జరపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చైనా పార్లమెంట్.. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్లో వార్షిక బడ్జెట్ నివేదికను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అధికార ప్రతినిధి ఫు ఇంగ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో 7 నుంచి 8 శాతం వరకు రక్షణ బడ్జెట్ పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈ పెరుగుదలకు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు శనివారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ నివేదికలో వెల్లడి కానున్నాయి. -
‘పుర’లో భారీగా అవినీతి
బడ్జెట్ సమీక్షలో సీఎం కేసీఆర్ అసంతృప్తి కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశం ఆర్డబ్ల్యూఎస్కే కొత్త నగర పంచాయతీల వాటర్గ్రిడ్ బాధ్యతలు ఆస్తుల సృష్టి కోసం ‘ఉపాధి’ నిధులు వినియోగించుకోవాలని సూచన సాక్షి, హైదరాబాద్: నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, సీవరేజీ బోర్డు (జల మండలి), టౌన్ ప్లానింగ్ విభాగాల్లో భారీగా అవినీతి జరుగుతోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. పురపాలక, పట్టణాభివృద్ధి విభాగాల్లో అవినీతి నిర్మూలన కోసం కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు లంచం ఇవ్వకుండా మున్సిపాలిటీల్లో అనుమతులు పొందినప్పుడే సుపరిపాలన అందినట్లుగా భావించాలని వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై క్యాంపు కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, ఈటల, ఇంద్రకరణ్రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులతో కలసి సీఎం కేసీఆర్ సమీక్షించారు. మిషన్ భగీరథ ద్వారా వచ్చే పైపులైన్లకు అనుబంధంగా పట్టణ ప్రాంతాల్లో అంతర్గత పైపులైన్లు నిర్మించి... ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. కొత్త నగర పంచాయతీల్లో గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలోనే ‘మిషన్ భగీరథ’ పనులు చేయాలన్నారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్రోడ్ లోపల ఉన్న 190 గ్రామాలకు హైదరాబాద్ వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో నీళ్లు అందించాలని ఆదేశించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లకు వాటి ఆదాయ, వ్యయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంటు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. ఉభయతారకంగా ‘ఉపాధిహామీ’ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఉభయతారకంగా వినియోగించుకోవాలని, ఏ కార్యక్రమాలను చేపట్టాలనే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగాల సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఉపాధి పథకం కింద వేలకోట్లు ఖర్చవుతున్నా... గ్రామాల్లో ఆశించిన మేర అభివృద్ధిగానీ, ఆస్తుల సృష్టి కానీ జరగడం లేదన్నారు. ఉపాధి కల్పించడంతో స్మశాన వాటికలు, సిమెంట్రోడ్లు, మురికి కాలువలు, మరుగుదొడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు వంటి నిర్మాణాల కోసం నిబంధనలను అనుసరించి ఉపాధిహామీ నిధులను వినియోగించాలని చెప్పారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులు, బాధ్యతలు, కార్యదర్శులు వారి విధులను గుర్తించేలా మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఐటీ రంగాన్ని విస్తరించాలి హైదరాబాద్తో పాటు వరంగల్ నగరానికి ఐటీ రంగాన్ని విస్తరింపజేయాలని ఆ శాఖతో సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఐటీ రంగం ద్వారా ఉపాధితో పాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఐటీ కంపెనీలతో పాటు ఇతర కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)గా ఇచ్చే నిధులను ఒకచోటికి చేర్చి ప్రజావసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఖర్చు చేయాలని ఆదేశించారు. -
ప్రణాళికేతర పద్దుకు కళ్లెం
- వచ్చే ఏడాది రూ. 8,100 కోట్ల అదనపు భారం - పెరగనున్న విద్యుత్, బియ్యం సబ్సిడీలు - ఉద్యోగుల డీఏల భారం రూ. 2,100 కోట్లు - పీఆర్సీ బకాయిలు రూ. 3,000 కోట్లు - దుబారాను తగ్గించేందుకు సర్కారు సంస్కరణలు - ఫిబ్రవరి చివర్లోనే రాష్ర్ట బడ్జెట్ సమావేశాలు సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది బడ్జెట్ ఆదాయపు వృద్ధికి తగ్గట్లుగానే అంతకంతకు పెరిగిపోనుంది. 2016-17 బడ్జెట్ దాదాపు రూ. 1.27 లక్షల కోట్లకు చేరుతుందని గతంలోనే సీఎం కేసీఆర్ సంకేతాలిచ్చారు. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో పన్నులు, పన్నేతర ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టుల రీ డిజైనింగ్, వివిధ పథకాలకు నిర్ణీత కేటాయింపులు, వినూత్నంగా ఎంచుకున్న బడ్జెట్ తయారీ పంథాతో కొత్త బడ్జెట్ ఉత్కంఠ రేపుతోంది. శాఖల వారీగా ముందస్తు కేటాయింపుల నేపథ్యంలో వచ్చే బడ్జెట్లో ప్రణాళిక వ్యయం రూ.62 వేల కోట్లకు ఎగబాకే సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో ప్రణాళికేతర వ్యయం కూడా భారీగా పెరిగిపోనుండటం ఆర్థిక శాఖకు తలపోటుగా మారింది. వీలైనంత మేరకు దుబారాను తగ్గించి ప్రణాళికేతర వ్యయానికి కళ్లెం వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా కొన్ని సంస్కరణలు తప్పవని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు. ప్రభుత్వ కొత్త నిర్ణయాల భారం వచ్చే బడ్జెట్పై పడనుంది. 2015-16 బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం రూ.63 వేల కోట్లు. అందులో దాదాపు రూ.40 వేల కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకే పోయాయి. కరువుభత్యాల భారం ఏటా దాదాపు రూ.1,400 కోట్లు పెరిగిపోతుంది. జూన్ నుంచి చెల్లించాల్సిన కరువుభత్యాన్ని ఇప్పటికీ చెల్లించలేదు. దీంతో మరో రూ.700 కోట్ల భారం తప్పదు. వీటికి తోడు ఉద్యోగులకు పీఆర్సీ అమలైనప్పటి నుంచి చెల్లించాల్సిన తొమ్మిది నెలల బకాయిలు దాదాపు రూ.3వేల కోట్లు పెండింగ్లోనే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపుతో ఏటా రూ.400 కోట్ల మేరకు భారం పడుతుంది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటంతో మరో రూ.600 కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. వీటికితోడు విద్యుత్తుకు ప్రభుత్వం చెల్లించే సబ్సిడీ సుమారు రూ.1000 కోట్లు పెరగనుంది. సన్న బియ్యం పథకంతో సబ్సిడీ భారం రూ.500 కోట్ల మేరకు ఉంటుందని అంచనా. ప్రస్తుతం ప్రభుత్వం తెచ్చిన అప్పులకు రూ.800 కోట్లు వడ్డీలు చెల్లిస్తుండగా, ఈ భారం మరో రూ.500 కోట్లు పెరిగిపోనుంది. దీంతో రూ.8,100 కోట్ల మేరకు ప్రణాళికేతర వ్యయం పెరిగిపోవటం ఖాయమైంది. దీంతో వచ్చే బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం రూ.70 వేల కోట్లు దాటిపోనుంది. కానీ వాస్తవ ఆదాయ వనరులకు తగ్గట్లుగా వీలైనంత మేరకు ఈ ఖర్చును తగ్గించాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అక్కర్లేని పథకాలను పూర్తిగా రద్దు చేయటంతో పాటు ఉద్యోగుల టీఏ, డీఏలు, వాహనాల నిర్వహణ ఖర్చులన్నింటినీ భారీగా తగ్గించాలని భావిస్తోంది. మిగతా పద్దులతో ఇబ్బంది భూముల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం రాకపోవడం, కేంద్రం నుంచి ఆశించినన్ని గ్రాంట్లు, నిధులు రాకపోవటంతో ఈ ఏడాది రాష్ట్ర ఖజానాను ఇరకాటంలో పడేసింది. పన్నులు, పన్నేతర ఆదాయం పెరిగినప్పటికీ మిగతా పద్దులు రాకపోవటంతో బడ్జెట్ సైతం అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే ఈసారి బడ్జెట్లో వీలైనంత మేరకు వాస్తవిక అంచనాలు ఉండేలా కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరిలోనే బడ్జెట్ సమావేశాలు కేంద్రం ఫిబ్రవరి 29న బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఈసారి కేంద్ర బడ్జెట్ కంటే ముందే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆ దిశగా బడ్జెట్ తయారీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు మొదలవుతాయనేది ఆసక్తి రేపుతోంది. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికలు, 13న నారాయణఖేడ్ ఉప ఎన్నిక జరగనున్నాయి. అధికార పార్టీ సహా రాజకీయ పక్షాలన్నీ ఈ ఎన్నికల కోలాహలంలో ఉన్నాయి. దీంతో ఎన్నికలు ముగిసిన వెంటనే ఫిబ్రవరి మూడో వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి.. కేంద్ర బడ్జెట్ కంటే ముందే ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక శాఖ ఇప్పటికే శాఖల వారీగా ప్రణాళిక వ్యయ కేటాయింపులు, జిల్లాల వారీగా అభివృద్ధి కార్డుల తయారీ ప్రక్రియలో నిమగ్నమైంది. -
రుద్రమ ప్రతాపం
-
రుద్రమదేవి రిలీజ్ ఎప్పుడు..?
-
రూ.100 కోట్లు ఇస్తే.. వంద సంవత్సరాలు ఖాయం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేంద్ర సాధారణ బడ్జెట్ లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధకరమని బాబు మరోసారి పేర్కొన్నారు. సోమవారం ఆయన అధ్యక్షతన ఏపీ టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడాలని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు సూచించారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లుగానే నిధులు ఇచ్చారని.. అన్ని రాష్ట్రాలతో సమానంగా ఏపీ అభివృద్ధి చెందే వరకూ కేంద్రం చేయూతినివ్వాలని చంద్రబాబు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.2 వేల కోట్లు అడిగితే.. కేంద్రం రూ.100 కోట్లు కేటాయించదన్నారు.ఆ మొత్తంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 100 సంవత్సరాలు పడుతుందని కేంద్రంపై పరోక్ష విమర్శలు చేశారు. ఈ సంవత్సరం 30 శాతం వర్షపాత లోటు ఉన్నప్పటికీ వ్యవసాయంలో మంచి ప్రగతి సాధించమన్నారు. మిగులు జలాలను పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు తరలిస్తామన్నారు. -
సభకు నమస్కారం!
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు.. 17 రోజులపాటు కొనసాగనున్న అసెంబ్లీ సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వివిధ అంశాలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు విపక్షాలు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, హామీల అమలులో జాప్యం, పార్టీ ఫిరాయింపుల వ్యవహారం వంటి వాటిపై రాజకీయపక్షాలన్నీ ఇప్పటికే భగ్గుమంటున్నాయి. దీంతో శనివారం నుంచి మొదలుకానున్న అసెంబ్లీ సమావేశాలు 17 రోజుల పాటు వాడివేడిగా సాగనున్నాయి. గత సమావేశాల సమయంలో రాష్ర్టంలో ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలే అయినందున సభలో ప్రస్తావించేందుకు పెద్దగా అంశాలేవీ లేక విపక్షాలు చేష్టలుడిగి చూస్తుండిపోయాయి. కానీ ఇప్పు డు పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వంపై ఎక్కుపెట్టడానికి వాటి చేతిలో అనేక అస్త్రశస్త్రాలు సిద్ధంగా ఉన్నాయి. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై కాంగ్రెస్, బీజేపీ శాసనసభాపక్షాలు ఇప్పటికే సమావేశమై చర్చించుకోగా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఆదివారం సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేసుకోనున్నారు. సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చాలన్న ప్రతిపాదన, రైతుల ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు విపక్షాల దాడిని తిప్పికొట్టేందుకు, పది మాసాల కాలంలో సాధించిన ప్రగతిని వివరించేందుకు అధికారపక్షం గణాంకాలతో సిద్ధమవుతోంది. కాగా, 11వ తేదీన రాష్ర్ట ప్రభుత్వం తొలి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. తొలిరోజున ఉదయం 11 గంటలకు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఫిరాయింపులపై గర్జన కాంగ్రెస్, టీడీపీల నుంచి అధికార పార్టీలోకి వలస వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయా పార్టీల నే తలు పట్టుదలగా ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తలసాని శ్రీనివాస్యాదవ్ ఈసారి మంత్రిగా సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయన రాజీనామా వ్యవహారం అధికారపక్షానికి తల నొప్పిగా మారే అవకాశముంది. విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా అధికారపక్షం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందన్న అంశం ఈ సమావేశాల్లో ప్రధాన ఎజెండా కానుంది. ఎమ్మెల్యే పదవికి మంత్రి తలసాని చేసిన రాజీనామాను నెలల తరబడి పెండింగ్లో పెట్టడంపైనా సభలో దుమారం రేగే అవకాశముంది. అలాగే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా విపక్షాలు గుర్రుగా ఉన్నాయి. సచివాలయాన్ని ఎర్రగడ్డకు తరలించాలనుకోవడం, అక్కడి చెస్ట్ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్కు మార్చాలన్న ప్రతిపాదనలను దాదాపు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆందోళనలూ చేశాయి. ఈ విషయంలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఒకే మాటపై నిలబడి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు సిద్ధమయ్యాయి. అవసరమైతే సభలో సమన్వయంగా వ్యవహరించాలని భావిస్తున్నాయి. ప్రస్తుత సచివాలయంలో సకల సదుపాయాలు ఉన్నప్పటికీ వాస్తు పేరుతో దాన్ని ఎర్రగడ్డకు మార్చాలనడంపై బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. హామీలేమయ్యాయి? రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన వేతన సవరణ స్కేళ్లకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువడకపోవడం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతభత్యాలను అమలు చేస్తామన్న హామీని పట్టించుకోకపోవడంపై సర్కార్ను విపక్షాలు నిలదీసే అవకాశముంది. టీఆర్ఎస్ ఎన్నికల హామీలైన ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల విషయంలో ఎలాంటి ముందడుగు పడకపోవడం, ఎస్సీ, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ వ్యవహారం కొలిక్కి రాకపోవడం కూడా ప్రస్తావనకు రానుంది. అలాగే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోతల వ్యవహారం దుమారం రేపనుంది. ఇక రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఇప్పటికే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ అంశం మరోసారి చర్చకు కానుంది. డిప్యూటీ సీఎంగా పనిచేసిన డాక్టర్ రాజయ్యను అవినీతి ఆరోపణలపై బర్తరఫ్ చేసిన విషయాన్నీ లేవనెత్తేందుకు విపక్షాలు కాచుక్కూర్చున్నాయి. పక్కా వ్యూహంతో అధికారపక్షం సిద్ధం విపక్షాలకు అవకాశమివ్వకుండా మంత్రులు సన్నద్ధంగా సభకు హాజరుకావాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. శాఖలకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో సిద్ధంకావాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను వివరించడం ద్వారా విపక్షాల నోళ్లు మూయించాలని సర్కారు భావిస్తోంది. ‘ధీటుగా స్పందిస్తాం. సరైన సమాధానాలతో తిప్పికొడతాం. గత సమావేశాల్లో మాదిరిగానే పైచేయి సాధిస్తాం. విపక్షాలే ఆత్మరక్షణలో ఉన్నాయి’ అని మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం కోటా పెంపు, కల్యాణ లక్ష్మి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు, అమరవీరుల కుటుంబాలకు సాయం తదితర అంశాలను ప్రభుత్వం ఉపయోగించుకోనుంది. ఈసారి మంత్రివర్గంలో పలువురు సీనియర్లు చేరడం కూడా కలిసిరానుంది. కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్ను సమర ్థంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ విప్తోపాటు ముగ్గురు విప్లు, అయిదుగురు పార్లమెంటరీ కార్యదర్శులనూ రంగంలోకి దించి సభను సమర్థంగా నిర్వహించే వ్యూహంతో ఉంది. రెండు అసెంబ్లీల్లో ఒకేరోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా శనివారం నుంచే ప్రారంభం కానున్నాయి. పక్కపక్కనే రెండు అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో భద్రతా ఏర్పాట్లు పోలీసులకు సవాలుగా మారాయి. దీంతో ఇరు రాష్ట్రాల పోలీసు అధికారులను మోహరించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ప్రవేశమార్గాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వీక్షించేందుకు సందర్శకులను అనుమతించరు. గ్యాలరీ లోకి కూడా పరిమిత సంఖ్యలోనే పాసులు జారీచేయాలని నిర్ణయించారు. శనివారం ఉదయం 8.55 గంటలకు ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. తరువాత 11 గంటలకు తెలంగాణ ఉభయసభల్లో ఆయన ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగం అనంతరం రెండు రాష్ట్రాల ఉభయసభలు సోమవారానికి వాయిదా పడతాయి. -
బడ్జెట్ సమావేశాలపై కేబినెట్ చర్చ
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం భేటీ అయింది. సీఎం కె.చంద్రశేఖర్రావు సారథ్యంలో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ తొలి రోజున రాష్ట్ర గవర్నర్ చేసే ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదించింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే బడ్జెట్ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, విపక్షాలను ఎదుర్కోవాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులను కూడా కేబినెట్ ఆమోదించింది. అలాగే ఇప్పటివరకు జారీ చేసిన నాలుగు ఆర్డినెన్స్లపైనా దృష్టి పెట్టింది. వాటర్గ్రిడ్ పథకం కింద పైపులైన్ నిర్మాణానికి భూ వినియోగదారుల హక్కుల సేకరణ, మార్కెట్ కమిటీల పునర్వ్యవస్థీకరణ, వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు, పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఆర్డినెన్స్లు తెచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం ఇవి జారీ అయిన 6నెలల్లోగా సంబంధిత బిల్లులకు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో ఈ సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రవేశపెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు ఏపీ పోలీస్ హౌసింగ్ సొసైటీని విభజించి తెలంగాణ పోలీస్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టనుంది. కాగా, 11న అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని, విపక్షాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు మంత్రులు సమన్వయంతో వ్యవహరించాలని నిర్ణయించింది. ఇక గజ్వేల్లో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంగా పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఉన్న మార్గాలపై కేబినెట్ దృష్టిసారించింది. ఇతర రాష్ట్రాల్లో పన్నుల వసూళ్లను అధ్యయనం చేయాలని అభిప్రాయపడింది. వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని సార థ్యంలో కీలక విభాగాల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయించింది. -
అధికారంలో కలసి కులుకుతూ విపక్షంపై విమర్శలా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకుంటూ బీజేపీతో చెట్టాపట్టాలేసి నడుస్తున్న తెలుగుదేశం నాయకులు రాష్ట్రంలో విపక్షంపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నారని వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో, ముఖ్యంగా రాజధానికి నిధుల విషయంలో అన్యాయం చేసినా విపక్షనేత జగన్మోహన్రెడ్డి విమర్శించలేదని తెలుగుదేశం నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుబట్టారు. అక్కడి బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ, ఇక్కడి టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగం పంచుకుంటూ కూడా ఒకర్నొకరు పల్లెత్తు మాటనుకోకుండా నాటకాలాడుతున్నది వారేనని ఒక ప్రకటనలో రాంబాబు నిశితంగా విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా అధికారంలో ఉండీ నోరుమెదపకుండా ఉన్న వారే నిస్సిగ్గుగా విపక్షాన్ని విమర్శిస్తున్నారని నిందించారు. బడ్జెట్ వెలువడిన వెంటనే పార్టీ సీనియర్ నాయకుడు సోమయాజులు కేంద్ర ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించారని, అది పార్టీ అధినేత అభిప్రాయం కాకుండా పోతుందా అని ఆయన గుర్తు చేశారు. అంతెందుకు, కేంద్ర బడ్జెట్ తీవ్రంగా నిరాశపరిచిందని తాజాగా మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ కూడా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి విమర్శించిన విషయం ఈ నాయకుల మెదళ్లకెక్కదా? అని కూడా ఆయన ప్రశ్నించారు. -
కార్పొరేట్కు వరాల జల్లు
జైట్లీ బడ్జెట్ జన జీవితాలను జటిలం చేసేదిగానూ, కార్పొరేట్ వర్గా లకు వరాల జల్లు కురిపించేదిగానూ ఉంది. ప్రస్తుతం దేశ పరిస్థితి బాగుందని సర్వేలో తేల్చారు. ఇక సరైన ప్రణాళికతో అభివృద్ధి దిశగా పరుగులు తీయడమే తరువాయి అని చెప్పారు. అయితే అన్ని సాను కూలతలను ఉపయోగించుకుని సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధించే దిశ గా బడ్జెట్ని మలచలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. వ్యవసాయరంగం సంక్షోభంలో ఉందంటూనే, సరైన చేయూతనిచ్చే ప్రయత్నం చేయ లేదు. స్థూలజాతీయోత్పత్తిలో 18 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రంగానికి జరిపిన కేటాయింపులు, రైతుల బాధల్ని తొలగించే ప్రణాళి కలూ తూతూమంత్రాలే. వేతనదారులకు పన్ను నొప్పి నివారణా చర్య లు శూన్యం. సేవలపన్ను పెంచడం ద్వారా సామాన్యుడి జేబుకి చిల్లు ల్ని పెద్దవి చేశారు. ప్రపంచ ఆకలి పస్తుల జనాభాలో సగం మంది ఉన్న దేశంలో వారి ఆకల్ని తగ్గించే మార్గాలకు కేటాయింపులు కానీ, ఉపాధి హామీ పథకం లాంటి ఉపశమన మార్గాలకు భారీ చేయూతగానీ లేదు. మానవ వనరులను సమర్థంగా ఉపయోగించుకునే రీతిలో విద్యా, ఆరో గ్యాలకు, వైద్యానికి పెద్దపీట వేస్తే బాగుండేది. ఆర్థిక క్రమశిక్షణ అంటే సంక్షేమానికి కోత పెట్టడమే అన్న ప్రభుత్వ ఆలోచన అనాగరికం. కార్పొరేట్ వర్గాలకు వరాల జల్లు కురిపించి, కాలే కడుపుల్ని విస్మరిం చడం దారుణం. డా. డి.వి.జి శంకరరావు మాజీ ఎంపీ, పార్వతీపురం -
'భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధం'
న్యూఢిల్లీ: భూసేకరణ చట్టంపై ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు దిగి వచ్చింది. భూసేకరణ చట్టంపై విపక్షాలు ఆందోళన తీవ్రతరం చేస్తూ ఏకతాటిపైకి రావడంతో కేంద్ర ప్రభుత్వం కాస్త తగ్గింది. భూసేకరణ చట్టంలో మార్పులకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశానికి ప్రజల శక్తి సామర్థ్యాలే ముఖ్యమని మోదీ స్పష్టం చేశారు. దేశంలో చోటు చేసుకున్న సమస్యలను కాలానుగుణంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. భూసేకరణ చట్టంతో వచ్చిన కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు వచ్చాయని, రైతులకు ఆ చట్టం నచ్చితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదా?అని ప్రశ్నించారు. భూసేకరణ చట్టాన్ని సవరిస్తూ తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పులేదన్నారు. ఒకవేళ తప్పులున్నాయని నిరూపిస్తే సరిదిద్దుకుంటామని మోదీ తెలిపారు. దేశాభివృద్ధి తమ లక్ష్యమని, చివరకు విజయం సాధిస్తామన్నారు. బొగ్గు గనుల వేలం ద్వారా రూ. లక్ష కోట్లు సమీకరించామని మోదీ తెలిపారు. పండించే రైతులకు భూసారం తెలియాల్సి ఉన్న భూసార కార్డులు ఇస్తున్నామన్నారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ ప్రసంగించారు. సమస్యలు ద్వారానే చర్చలు పరిష్కారమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రాధమ్యాలను రాష్ట్రపతి ప్రసంగంలో వివరించిన సంగతిని మోదీ గుర్తు చేశారు. స్వచ్ఛ్ భారత్ పై అందరూ మాట్లాడుతున్నారు, దేశంలో అపరిశుభ్రత కూడా సమస్యే అని మోదీ తెలిపారు. 'మన దేశ మూల సూత్రం సర్వేజనా సుఖినోభవంతు.దేశానికి ప్రజల శక్తి సామర్ధ్యాలే ముఖ్యం. అవినీతి వల్లే దేశం భష్ట్ర్రు పట్టిపోయింది. అవినీతి మహ్మమ్మారి నుంచి దేశాన్ని కాపాడాలి' అని మోదీ తెలిపారు.ఇప్పటికీ పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం విచారకరమన్నారు. పథకాల పేర్ల మార్పు సమస్య కాదని, ప్రభుత్వ పథకాల అమలు తీరే ప్రధానమన్నారు ప్రధాని ప్రస్తావించిన మరికొన్ని విషయాలు.. *బొగ్గు గనుల వేలం ద్వారా రూ. లక్ష కోట్లు సమీకరించాం *పండించే రైతులకు భూసారం తెలియాలి *మన విద్యార్థులే భూసార పరీక్షలు నిర్వహించి భూసార కార్డులు రైతులకు ఇస్తారు *పెన్షన్ తీసుకోవాలంటే ప్రతి నవంబర్ లో లైఫ్ సర్టిఫికేట్ కావాలా? *బతికున్నాడో?లేదో? సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించుకోలేమా? *మనిషి తనకు తాను బతికి ఉన్నాడని చెప్పుకోవడం దౌర్భగ్యం *అనవసరమైన ఖర్చులు తగ్గించి అధికార వికేంద్రీకరణను మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం -
'లోటు బడ్జెట్ పై చంద్రబాబువి పొంతనలేని లెక్కలు'
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు బడ్జెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడివి పొంతనలేని లెక్కలని ఏపీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా , ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీపై ఎన్డీఏలో మంత్రులైన టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని బొత్స ప్రశ్నించారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదంతో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా ?అని నిలదీశారు. ఈ ప్రాంత ఎంపీ అశోక్ గజపతిరాజు కేంద్రమంత్రి కావడం అదృష్టమని.. అయితే విభజన బిల్లులోని అంశాలను సాధించలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని బొత్స ఎద్దేవా చేశారు. రామతీర్థంలో శ్రీరామనవమి ఉత్సవాలు జరగాలని కోరుకున్నామని.. దేవుడు దగ్గరు కూడా రాజకీయాలు చేస్తున్నారన్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద విభజన చట్టంలోని హామీల అమలు కోసం ధర్నాలు చేస్తామని బొత్స హెచ్చరించారు. -
వైద్యారోగ్యానికి రూ. 8 వేల కోట్లు?
- నేడు ఆర్థిక శాఖకు ప్రతిపాదన హైదరాబాద్: 2015-16 బడ్జెట్కు గానూ వైద్య ఆరోగ్యశాఖ ప్రతిపాదనలు తయారుచేసింది. ఈ మేరకు ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి సహా ఉన్నతాధికారులు బుధవారం సమావేశమై రూ.8 వేల కోట్ల బడ్జెట్కు కసరత్తు పూర్తిచేశారు. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్కు ఆ ప్రతిపాదనలను గురువారం సమర్పించనున్నారు. ఆరోగ్యశాఖ డెరైక్టరేట్కు రూ.1200 కోట్లు, వైద్యవిద్యా శాఖకు రూ.1700 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.500 కోట్లు, కుటుంబ సంక్షేమ శాఖకు రూ.1330 కోట్లు, వైద్య విధాన పరిషత్కు రూ.420 కోట్లు ప్రతిపాదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే వైద్య ఆరోగ్యశాఖకు చెందిన నిమ్స్, ఆయుష్ తదితర సంస్థలకు కూడా బడ్జెట్ ప్రతిపాదనలు తయారుచేశారు. -
బంగారు తెలంగాణే బడ్జెట్ లక్ష్యం
అసెంబ్లీలో ఆర్థికమంత్రి ఈటెల వివరణ బడ్జెట్పై చర్చలో విపక్షాల విమర్శలకు సమాధానం * భారీ కసరత్తు తర్వాతే సమగ్ర బడ్జెట్ను రూపొందించాం * పేదల సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలు మార్చుతాం * ఇక తెలంగాణలో ఆకలి పాటలకు కాలం చెల్లినట్టే * ప్రతి అర్హుడికీ ఆహారభద్రత కార్డు అందే వరకూ నిద్రపోం * తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రాష్ట్రాభివృద్ధిలో ప్రదర్శిస్తాం సాక్షి, హైదరాబాద్: ‘నిన్నటి వరకు ఆకలి పాటలు పాడుకున్నం. సుదీర్ఘ తెలంగాణ ఉద్యమంలో వాటిని ఊరూరా వినిపించినం, ఇక ఆ పరిస్థితులు ఉండయ్. ఆకలి పాటలకు కాలంజెల్లింది. ఇకముందు కడుపులు నింపే పాటలే. మన తెలంగాణ కోసం ఎంత తీవ్రమైన ఉద్యమం చేసినమో.. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు అంతే స్ఫూర్తితో ముందుకు సాగుతం. అందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. లక్ష కోట్లకుపైగా బడ్జెట్ను రూపొందించే క్రమంలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేశామని చెప్పారు. కొన్ని విషయాల్లో అధికారులు నిబంధనలను ఉటంకించినప్పుడు.. కావాలంటే వంద సార్లు చర్చిద్దాం, పేదల సంక్షేమం కోసం అవసరమైతే చట్టాలు మార్చుకుందామని ముఖ్యమంత్రి పేర్కొన్నారని తెలిపారు. బడ్జెట్పై జరిగిన చర్చలో వివిధ పార్టీల నేతలు లేవనెత్తిన అంశాలకు శుక్రవారం అసెంబ్లీలో ఈటెల సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా శాఖలవారీగా వివరాలను సభ ముందుంచి విశదీకరించారు. ప్రతిపక్షాల విమర్శలకు సమాధానం చెబుతూనే అడుగడుగునా గత ప్రభుత్వాల పనితీరును ఎండగట్టారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు.. ఆహార భద్రత కార్డుల జారీపై విపక్షాలన్నీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు యత్నించిన క్రమంలో సభలో ఆర్థికమంత్రి స్పష్టమైన వివరణ ఇచ్చారు. రాష్ర్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇచ్చేవరకు తమ ప్రభుత్వం నిద్రపోదన్నారు. అయితే గతంలో ‘సర్వరోగ నివారణి’ తరహాలో తెల్ల రేషన్ కార్డును అన్నింటికీ ఉపయోగించే పద్ధతి ఉండేదని, ఇకపై మూస పద్ధతిలో ఉండరాదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ఇక పింఛన్ల కోసం భారీ స్థాయిలో రూ. 4 వేల కోట్లు కేటాయించిన ఘనత తమదేనన్నారు. కుటుంబంలో ఎంతమంది వికలాంగులున్నా అందరికీ పింఛన్ అందుతుందని, వికలాంగులను గుర్తించేందుకు అవసరమైతే సదరం క్యాంపులను విస్తృతంగా నిర్వహిస్తామని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన చెరువుల వ్యవస్థ గతంలో దెబ్బతిన్నదని, ఇప్పుడు కాకతీయుల స్ఫూర్తితో వాటిని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. తొలివిడత 9 వేల చెరువుల అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎక్కడికక్కడ నిలిచిపోయిన జలయజ్ఞంలోని కీలక ప్రాజెక్టులను కొలిక్కి తెచ్చేలా ఈ బడ్జెట్లో రూ. 6500 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో బొగ్గు, నీళ్లున్నా కరెంటు ఉత్పత్తి కేంద్రాలను ఆంధ్రాలో ఏర్పాటు చేసిన నాటి పాలకుల వల్లే రాష్ట్రానికి కరెంటు కష్టాలొచ్చాయని, దీన్ని అధిగమించేందుకు రామగుండం ఎన్టీపీసీతోపాటు ఇతర విద్యుత్ కేంద్రాలను విస్తరిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఉత్పత్తి వ్యయం తగ్గేలా ప్లాంట్లను ఆధునీకరిస్తామన్నారు. ఇక హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ‘ఐటీ, ఫార్మా, సినిమా సిటీ, ఎడ్యుకేషన్ హబ్గా హైదరాబాద్ వెలుగొందుతుంది. విభజనకు ముందు విశాఖపట్నం తరలించుకుపోయిన ఫార్మాసిటీ.. ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తోంది. అక్కడ తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నామని ఫార్మా కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి’ అని ఈటెల పేర్కొన్నారు. మండలిలోనూ సుదీర్ఘ సమాధానం శాసనమండలిలోనూ బడ్జెట్పై చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు ఆర్థిక మంత్రి దాదాపు గంటన్నరపాటు సమాధానమిచ్చారు. నవ్వేవారి ముందు జారిపడొద్దన్న లక్ష్యం తో భారీ కసరత్తు చేసి బడ్జెట్ను సమగ్రంగా రూపొందించామన్నారు. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద దాదాపు సమాన స్థాయిలో వ్యయం చూపడం అభివృద్ధికి సూచిక అని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం రూ. 27 వేల కోట్లను అప్పుగా తెచ్చుకునే అవకాశం ఉన్నప్పటికీ రూ. ఐదు వేల కోట్ల రుణాలకే పరిమితమయ్యామని చెప్పారు. బడ్జెట్లో పద్దులను ఆయన మరోసారి చదివి విని పించారు. ఉద్యోగుల పంపకాలు పూర్తయిన తర్వాత నిరుద్యోగుల ఆకాంక్షలు ఫలించేలా త్వరలో సర్వీసు కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామన్నారు. హైదరాబాద్ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలిపారు. కాగా, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చే నాటికే రాష్ట్రం బంగారు తెలంగాణగా ఉందని ఈ రాష్ట్రాన్ని రత్నాల తెలంగాణగా మార్చాలని మండలిలో విపక్ష నేత డి.శ్రీనివాస్ అన్నారు. పూర్తిస్థాయిలో బడ్జెట్ అమలుపై సందేహం వ్యక్తం చేశారు. ఆ పత్రికలు, చానళ్లను నమ్మొద్దు తెలంగాణపై విషం చిమ్మే కొన్ని పత్రికల రాతలు, కొన్ని చానళ్ల మాటలను నమ్మొద్దని ఆర్థిక మంత్రి సభను కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని హేళన చేసిన ఆ పత్రికలు, చానళ్లు ఇప్పుడు తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలనూ తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఆవిర్భావం అసాధ్యం అని ఊదరగొట్టారు. మా ఉద్యమాన్ని ఉద్దేశించి.. తమ పార్టీ మఖలో పుట్టి పుబ్బలో అంతరిస్తుందన్నరు. కానీ మేం తెలంగాణ తెచ్చి చూపెట్టినం. ఇప్పటికీ పద్ధతి మార్చుకోకుండా మా పనితీరును విమర్శిస్తూనే ఉన్నాయి. వాటిని నమ్మి అపోహలకు గురికావద్దని సభ్యులను కోరుతున్నా’ అని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. మా.. కాదు.. మన ముఖ్యమంత్రి బడ్జెట్పై విపక్షాల విమర్శలకు దీటుగా సమాధానాలు చెప్పిన ఈటెల ఓ విషయంలో మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చింది. మాట్లాడిన ప్రతీసారి ‘మా ముఖ్యమంత్రి ఇలా’.. అంటూ పేర్కొనడాన్ని సమావేశాలు మొదలైనప్పటి నుంచే కాంగ్రెస్ సభ్యులు ఎద్దేవా చేస్తూ వస్తున్నారు. ఈటెల ‘మా ముఖ్యమంత్రి’ అన్నప్పుడల్లా రాష్ట్రమంతటికీ ఒకరే ముఖ్యమంత్రిగా ఉంటారని, ‘మన ముఖ్యమంత్రి’ అనాలంటూ కామెంట్ చేస్తున్నారు. కానీ ‘మా ముఖ్యమంత్రి’ అనడాన్ని దాదాపు ఊతపదంలా మార్చుకున్న ఈటెల శుక్రవారం నాటి సుదీర్ఘ ప్రసంగంలో దాన్ని సరిదిద్దుకోడానికి ఇబ్బందిపడ్డారు. ‘మా ముఖ్యమంత్రి’ అని అన్న వెంటనే ‘మనముఖ్యమంత్రి’ అని అనాల్సి వచ్చింది. -
నేటి తెలంగాణ అసెంబ్లీలో రైతు ఆత్మహత్యలపై చర్చ
హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.శుక్రవారం సభను విపక్షాలు అడ్డుకోవడంతో సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. నేటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యలు, విద్యుత్ సంక్షోభంపై చర్చించనున్నారు. ఉదయం పది గంటలకు ప్రారంభకానున్న అసెంబ్లీ సమావేశంలో తొలుత బడ్జెట్ పై చర్చించనున్నారు. చర్చకు అధికార, విపక్షాలు సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు పెరిగాయాంటూ నిలదీసేందుకు కాంగ్రెస్, టీడీపీలు సన్నద్ధమవుతున్నాయి. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి అధికారపక్షం వ్యూహ రచన చేస్తోంది. ఇందుకు సంబంధించి ముందుగా టీఆర్ఎస్ వ్యూహరచన కమిటీ సమావేశం కానుంది. -
లాబీ ముచ్చట్లు
జానాకు ఆ అర్హత ఎక్కడిది? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డ సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్య లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు, సీఎల్పీ ఉప నాయకుడు జీవన్రెడ్డి మధ్య అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ సాగింది. ‘‘అన్నా.. మీరు పార్టీ మారారంటే ఓ లెక్కుంది. పదవి వదులుకుని వెళ్లారు. ప్రస్తుతం పరిస్థితి అలా లేదు కదా..’’ అని జూపల్లిని ఉద్దేశిస్తూ జీవన్రెడ్డి అన్నారు. అందుకు జూపల్లి బదులిస్తూ... ‘‘అసలు వాస్తవం మాట్లాడాలంటే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మాట్లాడే నైతిక అర్హత జానారెడ్డికి ఎక్కడిది? రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీ రామారావు మంత్రివర్గంలో పనిచేసి, తీరా పదవులు పోతాయని తెలియగానే కాంగ్రెస్లో చేరలేదా..’’ అని అన్నారు. దీంతో టీఆర్ఎస్లో మీలాంటి వారికి న్యాయం జరగలేదనే మా బాధ అని కాంగ్రెస్ మరో సభ్యుడు సంపత్ అనడంతో అంతా కలిసి నవ్వేసుకున్నారు. ఇక్కడి దాకా లాక్కొచ్చాం.. బడ్జెట్పై చర్చను ప్రారంభించిన సీఎల్పీ నేత జానారెడ్డి తన సహజ ధోరణికి విరుద్ధంగా టీఆర్ఎస్ తీరుపై, పేరు పెట్టకుండానే సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జానా నుంచి ఇంతటి ఆగ్రహాన్ని ఊహించని పలువురు.. ‘మొత్తానికి భలే మాట్లాడారు..’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అన్నారు. దీంతో.. ‘‘నిన్నట్నుంచీ తయారు చేశాం. ఇక్కడిదాకా లాక్కొచ్చాం. ఏమైతేనేం విషయా న్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు’’ అని జీవన్రెడ్డి చెప్పుకొచ్చారు. ఎంత మంది మిగిలారో లెక్కపెట్టుకోండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి హరీశ్రావు మధ్య ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడినట్లు స్పీకర్ ప్రకటించగానే... జానారెడ్డితో కలిసి ఎమ్మెల్యేలంతా బయటకు వెళుతున్నారు. ఇదే సమయంలో వారికి మంత్రి హరీశ్ ఎదురుపడ్డారు. ‘‘అన్నా, ఎంత మంది మిగిలారో.. ఓసారి లెక్కపెట్టుకోండి..’ అని జానాను ఉద్దేశించి అనడంతో అంతా నవ్వుకున్నారు. ఎర్రబెల్లిని అనుసరించని సొంత ఎమ్మెల్యేలు సభ రెండుసార్లు వాయిదా పడిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేల తీరు మారకపోవడంతో స్పీకర్ పది మందిని సస్పెండ్ చేశారు. బయటకు రావడానికి నిరాకరించిన వారిని మార్షల్స్ బలవంతంగా బయటకు ఎత్తుకొచ్చారు. సమావేశ మం దిరం నుంచి బయటకు వచ్చాక కూడా టీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ వదల్లేదు. ‘బయటకు వచ్చాక కూడా మీకేం సంబంధం’ అని ఎమ్మెల్యేలు రేవంత్రెడ్డి, వెంకట వీరయ్య మార్షల్స్తో వాదనకు దిగారు. ఒకవైపు ఈ గలాటా జరుగుతుండగానే టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి ఒక్కరే వెళ్లి స్పీకర్ కార్యాలయం ఎదుట కింద కూర్చుకున్నారు. ఎంతసేపటికీ ఒక్క ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గరకు రాలేదు. ఈలోగా ఆరుగురు మార్షల్స్ వచ్చి ఆయను తీసుకెళ్లారు. మార్షల్స్ హడావుడి సభ జరగకుండా అడ్డుకుంటున్న కొందరు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తారని ‘మార్షల్స్’ ముందే ఊహించినట్లు ఉంది. సభ రెండోసారి వాయిదా పడి తిరిగి ప్రారంభం కాగానే.. అసెంబ్లీ లాబీల్లో అక్కడక్కడ ఉన్న వారందరినీ అధికారులు ఒక్కచోటుకు చేర్చారు. చీఫ్ మార్షల్ గది వద్ద సిద్ధంగా ఉంచారు. అప్పటికప్పుడు వీరంతా మార్షల్ రిబ్బన్స్ కట్టుకుని.. కాసేపటికే టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకు వచ్చారు. - సాక్షి, హైదరాబాద్ -
ఇది అంకెల గారడీ బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ఆదాయాన్ని అధికంగా చూపడంతో బడ్జెట్ అంకెల గారడీని తలపిస్తోందని శాసన మండలిలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ అన్నారు. ఇది వాస్తవికత లేని బడ్జెట్ అని అభివర్ణించారు. శుక్రవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం అనంతరం బడ్జెట్పై జరిగిన చర్చలో తొలుత ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం కనీసం కృతజ్ఞతలు తెలపకపోవడం శోచనీయమన్నారు. తాము రాష్ట్రాన్ని ఇచ్చే నాటికే ఆర్థిక మిగులుతో తెలంగాణ బంగారు తెలంగాణగా ఉందని..ఇపుడు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని రత్నాల తెలంగాణగా మార్చాలని సవాలు విసిరారు. గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రాంతంలో పలు జిల్లాల తలసరి ఆదాయం పెరిగిందని, పేదరికం తగ్గిందని ఆయన గణాంకాలు చదివి వినిపించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి రామగుండం ఎన్టీపీసీకి విద్యుత్ను తరలించి అక్కడి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కరెంటు సరఫరా చేసే అంశాన్ని సాంకేతికంగా పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన వాటర్గ్రిడ్ పథకానికి కేవలం రూ.2 వేల కోట్లు కేటాయించడంతో ఈ పథకం ఎలా పూర్తవుతుందని ప్రశ్నించారు. మరో రూ.23 వేల కోట్లను ఎక్కడి నుంచి సమకూరుస్తారన్నారు. ఈ పథకానికి తగిన ప్రణాళిక లేకపోవడం శోచనీయమన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు పూచీకత్తునిచ్చి రుణమాఫీ సంపూర్ణంగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇన్పుట్ సబ్సిడీపై ఆసక్తికర చర్చ.. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంపై ఎలాంటి వివక్ష చూపలేదని విపక్ష నేత డి.శ్రీనివాస్ తన ప్రసంగంలో పేర్కొనడంతో..సభలో ఉన్న పంచాయతీరాజ్శాఖ మంత్రి కేటీఆర్ అభ్యంతరం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొక్కిపెట్టిన రూ.450 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలను మంజూరు చేసిన ఘనత తమదేనన్నారు. ఎర్రజొన్న రైతులకు సంబంధించిన రూ.11.92 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేశామని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా మండలి సోమవారానికి వాయిదాపడింది. ఇది ప్రజల బడ్జెట్... తెలంగాణ తొలి బడ్జెట్ ప్రజల బడ్జెట్ అని ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మండలిలో సుదీర్ఘంగా ప్రసంగించారు. రైతురుణాల మాఫీ, కల్యాణ లక్ష్మి, కేజీ టు పీజీ ఉచిత విద్య, వాటర్గ్రిడ్, యాదగిరిగుట్ట అభివృద్ధి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన ముఖ్యమంత్రిని కొనియాడారు. కేజీ టు పీజీపై రగడ ‘‘గత ఎన్నికల్లో కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అత్యంత ప్రాచుర్యం పొందిన నినాదం. ప్రతి ఎన్నికల సభలో ఈ నినాదాన్ని అధికార పార్టీ బలంగా వినిపించింది. బడ్జెట్లో ఈ పథకానికి నామమాత్రంగా రూ.25 కోట్లు కేటాయించారు. ఇంత ప్రాచుర్యం పొందిన పథకానికి కేటాయింపులు ఇంతేనా ? ఈ పథకాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసింది’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో చేసిన వ్యాఖ్య అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ‘గాలికి వదిలేయడానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు..ఆంధ్ర ప్రభుత్వం అంతకన్నా కాదు’ అని విద్యా శాఖ మంత్రి జగదీష్రెడ్డి ఈ వ్యాఖ్యను తిప్పికొట్టడంతో ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా సభలో అన్పార్లమెంటరీ భాషను వినియోగిస్తే పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ ఇరుపక్షాలను శాంతపరిచారు. ఆ ఎమ్మెల్సీలను ఏపార్టీవారిగా గుర్తిస్తారు? ఇదిలా ఉండగా.. శుక్రవారం సభ ప్రారంభం కాగానే తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలను ఏ పార్టీ సభ్యులుగా గుర్తిస్తారో చెప్పిన తరువాతే ప్రశ్నోత్తరాలను ప్రారంభించాలని కాంగ్రెస్పక్ష నేత డి.శ్రీనివాస్ నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు పట్టుపట్టగా.. టీడీపీ సభ్యులు కూడా మద్దతు పలికారు. ఏ నిబంధన ప్రకారం ఈ ప్రశ్నను లేవనెత్తారనే విషయాన్ని స్పష్టం చేస్తే దీనిపై స్పందిస్తామని మంత్రి కె.తారక రామారావు బదులిచ్చారు. సభ్యులు పార్టీలు మారడం ఈ రోజు కొత్త కాదని, గతంలో చాలా సార్లు జరిగినదేనని స్పష్టం చేశారు. సభలో విపక్షాల ప్రశ్నించే అధికారాన్ని అధికార పక్షం అడ్డుకుంటోందని విపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో సభలో వాతావరణం వేడెక్కింది. ఈ అం శంపైనే దాదాపు 15 నిమిషాల పాటు వాదోపవాదాలు జరిగాయి. ‘టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీలపై విచారణ చేస్తున్నాం.. సభలో వారు అడిగే ప్రశ్నలను పార్టీలతో ప్రమేయం లేకుండా సభ్యులు వ్యక్తిగతంగా అడిగిన ప్రశ్నలుగానే గుర్తిస్తాం, సభ సజావుగా సాగేందుకు సహకరిం చాలి’ అని చైర్మన్ స్వామిగౌడ్ విజ్ఞప్తి చేయడం తో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. కల్తీ పాల వ్యాపారంపై కఠిన చర్యలు ఉపముఖ్యమంత్రి రాజయ్య రాష్ట్రంలో కల్తీ పాల వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య స్పష్టం చేశారు. పాల కల్తీపై తనిఖీల కోసం త్వరలో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. పాలను ఎక్కువ సమయం నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్ రసాయనాన్ని కలిపి సింథటిక్ పాలను విక్రయిస్తున్న ప్రైవేటు పాల వ్యాపార సంస్థలపై తీసుకున్న చర్యలను వెల్లడించాలని మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వి.భూపాల్రెడ్డి, జగదీశ్వర్రెడ్డి, యాదవరెడ్డిలు లేవనెత్తిన ప్రశ్నలకు ఉపముఖ్యమంత్రి పై విధంగా స్పందించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సింథటిక్ పాల వ్యాపారం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయని, ప్రధానంగా హెరిటేజ్ సంస్థ పాలల్లో ఫార్మాలిన్ కలిపినట్లు నిర్ధారణ కావడంతో ఈ బ్రాండు పాలను నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం జీవోసైతం జారీ చేసిం దని యాదవరెడ్డి సభ దృష్టికి తీసుకు రాగా.. కాంగ్రెస్తో పాటు టీఆర్ఎస్ సభ్యులు సైతం కల్తీ పాలపై ఆందోళన వ్యక్తంచేశారు. కేరళలో హెరిటేజ్ పాలను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయాన్ని పత్రికల్లో మాత్రమే చూశామని, రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా సింథటిక్ పాలను పట్టుకున్నట్లు సమాచారం లేదని మంత్రి రాజయ్య సమాధానమిచ్చారు. -
మంత్రులకు సీఎం శాఖలకు బదులిచ్చే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: శాసనసభ మొదటి, రెండో సమావేశాల్లో ముఖ్యమంత్రి శాఖలకు సంబంధించిన బాధ్యతలను మంత్రులకు కేటాయిం చారు. పదకొండు విభాగాలకు సంబంధించిన అంశాలను ఎవరెవరికి కేటాయించిందనే వివరాలతో అసెంబ్లీ బులెటిన్ విడుదల చేసింది. శాంతి భద్రతలు-నాయిని నర్సింహారెడ్డి, బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమం, దేవాదాయం-ఈటెల రాజేందర్, మైనారిటీ సంక్షేమం-డిప్యూటీ సీఎం మహమూద్అలీ, క్రీడలు, యువజన సర్వీసు లు, పర్యటన-డిప్యూటీ సీఎం రాజయ్య, పురపాలన, పట్టణాభివృద్ధి-పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంధనం, సాధారణ పరిపాలన- టి.హరీష్రావు, వాణిజ్య పన్నులు-పి.మహేందర్రెడ్డి, పరిశ్రమలు, జౌళి- కేటీఆర్, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం-జోగురామన్న, మహిళా శిశు సంక్షేమం, న్యాయం-జి.జగదీష్రెడ్డి, రోడ్లు భవనాలు-కె.పద్మారావుకు కేటాయించారు. -
గన్పార్కు వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేల ధర్నా
రైతుల ఆత్మహత్యలపై ప్లకార్డులతో నిరసన సాక్షి, హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. శుక్రవారం బడ్జెట్ సమావేశాల సందర్భంగా సభ ప్రారంభానికి ముందు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గన్పార్కు ఎదుట ధర్నా చేశారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రైతుల ఆత్మహత్యలను నివారించాలని, ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, పద్మావతి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్, వంశీచందర్రెడ్డి, మాధవరెడ్డి,రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ఎమ్మెల్యేలు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి నడుస్తూ వచ్చారు. -
టీడీపీ ఎమ్మెల్యేల ధర్నా
సాక్షి, హైదరాబాద్: శాసనసభ నుంచి ఒకరోజు సస్పెన్షన్కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశ ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉప నాయకుడు రేవంత్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్రెడ్డి, మాగంటి గోపీనాథ్, ఎ.గాంధీ, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్గౌడ్, రాజేశ్వర్ రెడ్డి ద్వారానికి అడ్డుగా కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు స్పీకర్ చాంబర్ వద్ద బైఠాయించేందుకు ఎర్రబెల్లి విఫల ప్రయత్నం చేశారు. చాంబర్కు వెళ్లే దారిలో ఉన్న సెక్యూరిటీని తోసుకుంటూ ఆవేశంగా వెళ్లిన ఎర్రబెల్లి.. ప్రధాన ద్వారం వద్ద నేలపై బైఠాయించారు. అయితే మిగతా టీడీపీ ఎమ్మెల్యేలెవరు ఆయనకు తోడుగా అక్కడకు రాలేదు. రెండు, మూడు నిముషాల వ్యవధిలోనే ఎర్రబెల్లిని మార్షల్స్ అక్కడి నుంచి తీసుకెళ్లి అసెంబ్లీ ప్రధానద్వారం మెట్లపై వదిలి వెళ్లారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి అక్కడే ధర్నా కొనసాగించారు. రైతు ఆత్మహత్యలను పట్టించుకోని ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు. ఈ సమయంలో సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బయటకు వెళ్తూ.. ప్రజలు, రైతులు మిమ్మల్ని బర్తరఫ్ చేశారంటూ వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవలే టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ కూడా వారి పక్క నుంచే బయటకు వెళ్లిపోయారు. సస్పెండ్ అయిన వారి జాబితాలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేరు లేకపోయినా.. మిగతా పార్టీ సభ్యులతోపాటే సభ నుంచి బయటకు వచ్చిన ఆయన ధర్నాలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎమ్మెల్యే కిషన్రెడ్డి మద్దతు తెలిపారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడ్డాక టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనను విరమించుకున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు టీడీపీ ఎమ్మెల్యేలు గన్పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ధర్నా నిర్వహించారు. గజ్వేల్కు ఎమ్మెల్యేల బృందం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేల బృందం మెదక్ జిల్లా గజ్వేల్కు వెళ్లింది. ఎర్రబె ల్లి సారథ్యంలో మధ్యాహ్నం మూడు గంటలకు నేతలు అసెంబ్లీ నుంచి వాహనాల్లో గజ్వేల్కు వెళ్లారు బాధిత కుటుంబాలకు రూ.50వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందజేశారు. పోచారం క్షమాపణ చెప్పాల్సిందే: ఎర్రబెల్లి రైతు ఆత్మహత్యలపై బాధ్యతారహితంగా మాట్లాడిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీలో క్షమాపణ చెప్పాల్సిందేనని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రైతుఆత్మహత్యలపై చర్చ జరిపిం చాలని పట్టుబడితే టీడీపీ సభ్యులను సభ నుంచి బయటికి గెంటేశారని ఆరోపించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ.. సభను ఇష్టానుసారం నడిపిస్తోందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 378 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పపడ్డారరన్నారు. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజవర్గంలోనే అత్యధిక ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. -
సభలో ఇదేనా మీ విజ్ఞత?
కవ్వించి అసెంబ్లీని అడ్డుకుంటారా? విపక్షాల తీరుపై సీఎం కేసీఆర్ మండిపాటు సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్, ఆత్మహత్యలు అన్నింటిపై చర్చించేందుకు మేం సిద్ధమేనని ముందే సభలో చెప్పాం. ప్రాధాన్యక్రమంలో ప్రజా సమస్యలపై కచ్చితంగా చర్చిద్దామన్నాం. సభను నలభై యాభై రోజులు జరుపుకొందామని అన్నాం. అయినా వినకపోతే ఎలా? ప్రశ్నోత్తరాలు జరక్కుండా అడ్డుకుంటే ఎలా? ఇదేనా మీ విజ్ఞత. కవ్వించి సభను అడ్డుకుంటారా? ఇదేం పద్ధతి.. కొత్త రాష్ట్రంలో తొలి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే వినాలన్న విజ్ఞత లేదు. సభను అడ్డుకోవడం విజ్ఞతే అనుకుంటే దాన్ని మీకే వదిలేస్తున్నా’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రతిపక్షంపై మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు జరగకుండా, బడ్జెట్పై చర్చ ప్రారంభించేందుకు సహకరించకుండా పదే పదే అడ్డుపడిన కాంగ్రెస్, టీడీపీ సభ్యుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పది మంది టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘సభ్యులను సస్పెండ్ చేయాలన్నది మా కోరిక కాదు.. మాకు బాధలేదా! తప్పనిసరి పరిస్థితుల్లోనే సభ్యులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. ఆనవాయితీ ప్రకారం సాధారణ బడ్జెట్ను నిర్ణీత సమయంలో ఆమోదించడం రాజ్యాంగపరమైన విధి అని అన్నారు. బడ్జెట్పై చర్చను రెండు మూడు రోజుల్లో పూర్తి చేసుకున్న తర్వాత సమస్యలపై చర్చిద్దామని సూచించారు. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఆందోళన చేయాలి కానీ, చర్చకు తాము సిద్ధమని చెప్పినా కూడా సభను జరగనీయబోమనే ధోరణిలో వ్యవహరించడమేంటని విపక్షాలపై కేసీఆర్ మండిపడ్డారు. సభ్యులు వాయిదా తీర్మానాలు ఇవ్వొచ్చని, అయితే బిజినెస్ రూల్స్ ప్రకారం ప్రశ్నోత్తరాలు జరగాలని సూచించారు. ప్రతి సభ్యునికి మాట్లాడే అవకాశం వచ్చేలా చూడాలన్నారు. ప్రశ్నోత్తరాల్లోనూ ప్రధానమైన అంశాలు ఉన్నాయని, వాటిపై జీరో అవర్లో చర్చిద్దామంటే టీడీపీ సభ్యులకు అసలు ప్రశ్నోత్తరాలు జరగడమే ఇష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తొలి ప్రశ్నే విద్యుత్పై ఉండటమే ఇందుకు కారణమన్నారు. రాష్ట్రానికి రావాల్సిన 1,186 మెగావాట్ల విద్యుత్ను ఇచ్చేందుకు ఏపీలోని టీడీపీ ప్రభుత్వం నిరాకరిస్తున్నందున, ఆ ప్రశ్న చర్చకు రాకుండా టీడీపీ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. కేసీఆర్ మాట్లాడిన అనంతరం సభలో బడ్జెట్పై చర్చ ప్రారంభమైంది. -
కొత్త ఆలోచనలతో బడ్జెట్
వివిధ శాఖల కార్యదర్శులతో భేటీలో ప్రధాని న్యూఢిల్లీ: వచ్చే ఏడాది రూపొందించే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుందనే దానిపై ప్రధాని మోదీ సంకేతాలిచ్చారు. బడ్జెట్ పూర్తిగా నూతన ఆలోచనలు, ప్రతిపాదనలతో ఉండాలని మంత్రిత్వశాఖలు, విభాగాలకు చెందిన 80 మంది కార్యదర్శులకు తన నివాసంలో ఇచ్చిన తేనీటి విందులో మోదీ. ముఖ్యంగా పెట్టుబడులకు తగిన ఫలితాలు ఉండేలా బడ్జెట్ ఉండాలని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్ ప్రచార కార్యక్రమాల పురోగతిని ప్రధాని ఈ సందర్భంగా సమీక్షించారు. నిర్భయంగా నిర్ణయాలు తీసుకోవాలని, తన పూర్తి మద్దతు ఉంటుందని కార్యదర్శకులకు భరోసా ఇచ్చారు. ‘‘మంచి పనులు జరగడం మొదలైంది. పాలనలో పారదర్శకత తీసుకొచ్చి మరింత కలసికట్టుగా పనిచేద్దాం’’ అని పిలుపునిచ్చారు. అవినీతి నిరోధక చట్టం కింద తమకు రక్షణ లేదని పలువురు కార్యదర్శులు మోదీ దృష్టికి తీసుకురాగా సరైన నిర్ణయాలు తీసుకున్న వారికి అండగా ఉంటానని ప్రధాని వారికి హామీ ఇచ్చారు. బడ్జెట్ సంబంధ ప్రక్రియలను మూడు నెలల ముందుగానే చేపట్టాలని...దీనివల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుంచే బడ్జెట్ అమలు కార్యకలాపాలు నిర్వహించడం వీలవతుందన్నారు. -
10న సాధారణ బడ్జెట్
మోడీ సర్కార్ తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: కేంద్రంలో నూతనంగా కొలువుదీరిన మోడీ సర్కారు తమ తొలి బడ్జెట్ను జూలై 10న ప్రవేశపెట్టనుంది. 2014-15 సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెడ్తారు. జూలై 8న రైల్వే బడ్జెట్ను, ఆ మర్నాడు ఆర్థిక సర్వేను ప్రవేశపెడ్తారు. జూలై 7న ప్రారంభమయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 14న ముగుస్తాయి. మొత్తంమీద ఈ సెషన్లో 28 రోజులు సమావేశాలు జరుగుతాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సోమవారం సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీపీఏ) బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ఖరారు చేసింది. యూపీఏ ప్రభుత్వం ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడవు జూలై 31న ముగియనుంది. అందువల్ల ఆ లోపే నూతన బడ్జెట్ ఆమోదం పొందాల్సి ఉంది. పార్లమెంటు ప్రాంగణంలోని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు చాంబర్లో సీసీపీఏ భేటీ అయింది. ఇప్పటికే జారీ అయిన ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రాధాన్యతాక్రమంలో సభ ముందుకు తీసుకురావాలని కూడా సీసీపీఏ భేటీలో నిర్ణయించారని అధికార వర్గాలు వెల్లడించాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలకు సంబంధించి జారీ అయిన ఆర్డినెన్సు, ఎస్సీ, ఎస్టీలపై దురాగతాల నిరోధ(సవరణ) ఆర్డినెన్స్, సెబీకి సంబంధించిన ఆర్డినెన్స్, ట్రాయ్ చట్టం(సవరణ) ఆర్డినెన్స్ వాటిలో ఉన్నాయని తెలిపాయి. జూలై మూడో వారంలోగా ఆ ఆర్డినెన్సులను బిల్లులుగా మార్చాల్సి ఉంది. లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఈ సమావేశాల్లోనే జరగనుందని ఇటీవలే వెంకయ్యనాయుడు చెప్పిన విషయం తెలిసిందే. అలాగే, బడ్జెట్ సమావేశాల కన్నా ముందే లోక్సభలో ప్రతిపక్ష హోదా అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ సుమిత్ర మహాజన్ గతంలో ప్రకటించారు. ఇటీవల పెంచిన రైలు ప్రయాణ, రవాణా చార్జీలపై ప్రతిపక్షాలు బడ్జెట్ సమావేశాలను అడ్డుకోవాలని భావిస్తున్నాయి. -
జూలై రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ (2014-15 ఆర్థిక సంవత్సరానికి)ను జూలై 11న నరేంద్ర మోడీ ప్రభుత్వం సమర్పించనుందనే సంకేతాల నేపథ్యంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జూలై రెండో వారం నుంచే ప్రారంభం కావచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఆర్డినెన్స్లు, ప్రధాని ప్రధాన కార్యదర్శిగా ట్రాయ్ మాజీ అధిపతి నృపేంద్ర మిశ్రాను నియమించే అంశం ఈ సమావేశాల్లో చర్చకు రానున్నాయి. మరోవైపు రాజ్యసభలో 60 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, జూలై రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్దిష్టంగా ఎప్పుడు ప్రారంభించేదీ కేబినెట్ నిర్ణయిస్తుందన్నారు. అయితే బడ్జెట్ సమావేశాలు జూలై 7 నుంచే ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత పార్లమెంట్ ఆమోదించిన ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగుస్తుంది. ఇక ఈ బడ్జెట్ సమావేశాల్లో లోక్సభ ఉపసభాపతి ఎన్నిక ఉంటుందని వెంకయ్యనాయుడు చెప్పారు. సభలో కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది సభాపతి పరిధిలో ఉంటుందని, దీనిపై ఏమీ వ్యాఖ్యానించబోనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
వ్యయం చేసిన ప్రాంతమే చేల్లించాలి
రుణాలు, చెల్లింపులపై ఆర్థికశాఖ యోచన సాగునీటి ప్రాజెక్టుల వారీగా చేసిన వ్యయం ఆధారంగా ఆ ప్రాంతం ఖాతాలో అప్పు {పాంతాల వారీగా వేరు చేయలేని అప్పులనే జనాభా ప్రాతిపదికన నిర్ధారణ సీపీడీసీఎల్ కోసం ఈపీడీసీఎల్ ఆస్తులు తాకట్టుతో రూ. 4 వేల కోట్లు అప్పు.. ఇప్పుడు ఈ అప్పు సీపీడీసీఎల్ చెల్లించాలా? ఈపీడీసీఎల్ చెల్లించాలా అనేది ప్రశ్నార్థకం హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పును విడిపోయాక ఏ రాష్ట్రం ఎంత చెల్లించాలనే విషయంలో గందరగోళం నెలకొంటోంది. ఆస్తులు, అప్పులు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే ప్రత్యేకంగా బడ్జెట్ అమలు కోసం చేసిన రుణాన్ని వ్యయం ఆధారంగా పంపిణీ చేయాలని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన రుణ మొత్తాలను ఏ ప్రాంతంలో వ్యయం చేస్తే ఆ ప్రాంతానికే చెల్లింపు భారాన్ని వర్తించాలనే అభిప్రాయం ఆర్థిక శాఖ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రాంతాల వారీగా విడతీయలేని అప్పులను మాత్రమే జనాభా ప్రాతిపదికన ఇ టు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తింపచేయాలని ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. అలా కాకుండా బడ్జెట్ కోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో వేల కోట్ల రూపాయల చొప్పున చేసిన అప్పులను జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 42 శాతం, ఆంధ్రప్రదేశ్కు 52 శాతం చొప్పున పంపిణీ చేయడం అశాస్త్రీయం అవుతుందని ఆర్థిక శాఖ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఏదైనా ప్రాజెక్టు కోసం ప్రత్యేకించి విదేశీ సంస్థల నుంచి అప్పు చేస్తే ఆ ప్రాజెక్టు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతానికి ఆ అప్పును వర్తింప చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో కూడా చట్టంలో స్పష్టత లేకపోయినప్పటికీ గతంలో రాష్ట్రాల విభజన సమయంలో అనుసరించిన విధానాన్ని విదేశీ సంస్థల అప్పుల విషయంలో ఇక్కడ కూడా అనుసరించాలని నిర్ణయించారు. బడ్జెట్ అమలు కోసం సర్కారు ప్రతి ఏడాది 20 వేల కోట్ల రూపాయలకుపైగా ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించి అప్పు చేస్తోంది. వీటిని మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకు వ్యయం చేస్తున్నారు. సాగునీటి రంగంలో ప్రాజెక్టుల వారీగాను, అలాగే రహదారుల వారీగాను బడ్జెట్ కేటాయింపులున్నాయి. ఆ కేటాయింపుల్లో ఆయా ప్రాజెక్టులకు ఇప్పటివరకు ఎంత మేర వ్యయం చేశారో లెక్కించి ఏ ప్రాంతంలోని ప్రాజెక్టు వ్యయాన్ని ఆ ప్రాంతానికి అప్పులో చూపెట్టాలని భావిస్తున్నారు. 1. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాజీవ్ స్వగృహకు రూ. 427 కోట్లు రుణంగా మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు నుంచి ఈ మొత్తాన్ని కేటాయించింది. ఆ మొత్తాన్ని జంటనగరాల్లో గృహ నిర్మాణాల కాంట్రాక్టర్ల చెల్లింపుల కోసం ఇచ్చారు. దీంతో ఆ అప్పును తెలంగాణ రాష్ట్రానికి వర్తింప చేయాలి. కానీ బడ్జెట్ కోసం తెచ్చిన అప్పుల్లో రాజీవ్ స్వగృహ కోసం అని లేదు కదా? వాటిని మాకెలా వర్తింపచేస్తారంటే సమాధానం ఏమిటనేది ప్రశ్నార్థకం. 2.ఇటీవల సీపీడీసీఎల్ కోసం నాలుగు వేల కోట్ల రూపాయల రుణానికి ఈపీడీసీఎల్ ఆస్తులను తనఖా పెట్టారు. ఆ తనఖాల్లో సీపీడీసీఎల్ కోసం అప్పు కోసం అని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనలేదు. ఇప్పుడు ఆ ఆప్పును సీపీడీసీఎల్ చెల్లించాలా లేదా ఈపీడీసీఎల్ చెల్లించాలా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. 3.గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేయడం కోసం యూనిట్కు 9 రూపాయల వరకు చెల్లించి కరెంటు కొనుగోలు చేశారు. ఇందుకు ఏకంగా రూ.23 వేల కోట్లు అప్పు చేశారు. అలా కొన్న విద్యుత్తులో అధికభాగం జంటనగరాలతోపాటు ఇతర నగరాలకు సరఫరా చేశారు. అలాంటి రుణాన్ని ఇరు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయడం ఎంతవరకు సమంజసమని ఉన్నతాధికారులే సందేహం వ్యక్తం చేస్తున్నారు. 4. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతానికి ప్రయోజనం కలిగేలా రుణ మొత్తాన్ని వ్యయం చేశారో అదే ప్రాంతానికి వర్తింపచేయాలని, ప్రాంతాల వారీగా విడతీయలేని అప్పును మాత్రమే జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సమ న్యాయం
బెంగళూరు : షెడ్యూలు కులాలు, తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించిన మేరకే నిధులు విడుదల చేశామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో వివక్ష చూపినట్లు కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చేసిన ఆరోపణలు సత్యదూరమని కొట్టిపారేశారు. పశుసంవర్ధకశాఖకు నూతనంగా కేటాయించిన సంచార పశు చికిత్స వాహనాలను క్యాంపు కార్యాలయంలో సీఎం మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు జనాభాకు అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని చట్టం చేసిన రాష్ట్రాల్లో కర్ణాటక రెండోదన్నారు. ఈ చట్టం వచ్చే ఆర్థిక ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు. 2013-14 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం గత ప్రభుత్వం రూ.8,600 కోట్లు కేటాయించిందన్నారు. అయితే నూతన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు రూ.15,300 కోట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈ నిధులు 80 శాతం ఎక్కువని వివరించారు. కాగా, ఈ మొత్తం నిధుల్లో ఎస్సీలకు 17.95 శాతం, ఎస్టీలకు 7.5 శాతం కేటాయిస్తామన్నారు. పశువైద్యుల నియామకం : మంత్రి జయచంద్ర లోక్సభ ఎన్నికల తర్వాత పశువైద్యుల నియామక ప్రక్రియను చేపడతామని కార్యక్రమంలో పాల్గొన్న పశుసంవర్ధకశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. శాఖలో 911 పోస్టులు ఖాళీ ఉన్నాయని, వీటిలో 250 స్థానాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దశల వారిగా మిగిలిన వాటిని భర్తీ చేస్తామని చెప్పారు. దాదాపు 200 పశు చికిత్స సంచార వాహనాలను పశుసంవర్ధక శాఖకు అందించనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతగా 35 వాహనాలను అందించినట్లు తెలిపారు. -
ఇండోర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఇండోర్-యశ్వంత్పూర్ మధ్య నడిచే కొత్త ఎక్స్ప్రెస్ రైలు పట్టాలెక్కింది. 2012-13 బడ్జెట్లో రైల్వేశాఖ ఈ ఎక్స్ప్రెస్ను ప్రకటించింది. అయితే వివిధ కారణాలతో ప్రారంభంకాని ఈ రైలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఆదివారం రాత్రి 8.55కు ఇండోర్లో బయలుదేరే ఈ రైలు యశ్వంత్పూర్కు మంగళవారం ఉదయం 11.15కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1.30కి యశ్వంత్పూర్లో బయల్దేరి ఇండోర్కు గురువారం ఉదయం 5.15కు చేరుకుంటుంది. ఇది నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడ, మహబూబ్నగర్, గద్వాల, కర్నూలు సిటీ, గుత్తి, ధర్మవరం మీదుగా వెళ్తుంది.