286వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Day 286 of Praja Sankalpa Yatra begins | Sakshi
Sakshi News home page

286వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Mon, Oct 15 2018 9:38 AM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 286వ రోజు సోమవారం ఉదయం ఎస్‌. బూర్జవలస శివారు నుంచి ప్రారంభమైంది. ఆయన వెంట నడిచేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ జననేత పాదయాత్ర సాగిస్తున్నారు.

అడుగడునా సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు కదులుతున్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. చౌదంతి వలస మీదుగా బొబ్బిలి నియోజకవర్గంలోని బాడంగి మండలం పిండ్రంగి వలస, డొంకిన వలస, పెద్దపల్లి క్రాస్‌ మీదుగా లక్ష్మీపురం క్రాస్‌ వరకు ఈ రోజు పాదయాత్ర సాగనుంది. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement