YS Jagan Padayatra
-
ప్రజలకు ఏం కావాలో సీఎం జగన్కు తెలుసు
సాక్షి, తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర.. ఏపీ రాజకీయ ప్రస్థానంలో మరిచిపోలేని ఒక ఘట్టం. నేటితో(సోమవారం) ఆ యాత్ర పూర్తై నాలుగు సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు పార్టీ నేతలు, కార్యకర్తలు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్టారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ సురేష్ తదితరులు హాజరయ్యారు. దీనిలో భాగంగా సజ్జల మాట్లాడుతూ.. ప్రజల్లో ఉండటమే రాజకీయం అని నమ్మిన వ్యక్తి జగన్. పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలు మ్యానిఫెస్టోలో రూపొందించారు. ఇప్పటివరకూ 98 శాతం మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు పూర్తి చేశారు. ప్రజలకు ఏమీ కావాలో అది చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్. ప్రజలకు మంచి చేశారు కనుకే దైర్యంగా ఎమ్మెల్యేలను ఇంటింటికీ పంపుతున్నారు. జగన్ జీవితం తెరచిన పుస్తకం. వైఎస్సార్సీపీ అంటే దేశంలోనే విలక్షణమైన పార్టీగా నిలబడింది. ప్రజల నమ్మకాన్ని జగన్ ఏనాడూ వమ్ము చెయ్యలేదు. చాలా వరకూ అధికార పార్టీలు ముందస్తు కోరుకుంటారు. కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి. వెంటిలేటర్ పై ఉన్న పార్టీలు ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాయి. 2024లో షెడ్యుల్ ప్రకారమే రాష్టంలో ఎన్నికలు జరుగుతాయి. పవన్-చంద్రబాబులు తమ అక్రమ సంబంధాన్ని పవిత్రం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి పరామర్శిస్తారు. కానీ చావుకు కారణం అయిన వారిని పరామర్శించడం ఏంటి? అక్రమ సంబంధాన్ని సక్రమం చెయ్యడం కోసం కలుస్తున్నారు. తెలంగాణలో కిందా మీదా పడి బీజేపీకి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు చంద్రబాబు. టీడీపీ -జనసేన కలవడం శుభపరిణామం అని సీపీఐ రామకృష్ణ అంటున్నాడు. ఎరుపు కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో.?, బలమైన జగన్నీ ఎదుర్కోడానికి వీళ్లంతా ఏకం అవుతున్నారు. చంద్రబాబు, పవన్లు ఎన్ని పగటి కలలు కన్నా ప్రజాబలం ఉన్న జగన్నీ ఏమీ చెయ్యలేరు. ఒకవైపు జగన్ ఉన్నారు.. ఆటు వైపు గుంట నక్కలు ఉన్నాయి. ప్రజల్లో ఉండి, ప్రజలకు ఏం కావాలో అది చేసిన నాయకుడు జగన్. చంద్రబాబు, పవన్ ఏ విలువలు, సిద్దాంతాలకు కట్టుబడి ఉన్నారో ప్రజలకు అర్థం అయింది. ఒక బలవంతమైన నాయకుడిని ఎదుర్కొనేందుకు ఇలాంటి వారంతా ఒకటవుతున్నారు. సీపిఐ రామకృష్ణ కామెంట్స్ విచిత్రంగా ఉంది. మరి బీజేపీ కూడా వారితో కలిస్తే ఏం చెప్తారు?, ఎరుపు, కాషాయం కలిస్తే పసుపు అవుతుందేమో చూడాలి. దుష్టశక్తులు ఇంకా ఏమేమి చేస్తాయో చూడాలి. పందికొక్కులు, గుంటనక్కలు ఏకం అవటాన్ని జనం చూడాలి. ఇలాంటి వారికి ప్రజలే బుద్ది చెప్తారు’ అని పేర్కొన్నారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘పాదయాత్రలో వేల సమస్యలు జగన్ దృష్టికి వచ్చాయి. ప్రజా సమస్యలు తెలుసుకుని మ్యానిఫెస్టోలో పెట్టాం. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అనే నినాదం వచ్చింది’ అని స్పష్టం చేశారు. -
మహా సంకల్పానికి ఐదేళ్లు ..
-
జనం జెండా - ఒకటే లక్ష్యం ఒకటే ఆశయం
-
తన ఇంటి ఖర్చు మీద ఈనాడు రోతరాత.. పద్మావతి ఆగ్రహం
-
పేదల ఇళ్లపై పచ్చమీడియా కుట్ర బట్టబయలు
-
3 Years Of YS Jagan Ruling: జనమే సాక్షి - ప్రజా పాలనకు మూడేళ్లు
-
ఆర్టీసీ ఉద్యోగులకూ న్యాయం చేయండి
సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతన వ్యత్యాసం సరిచేసి, పాతపెన్షన్కు అనుమతించాలని, ఇంటి అద్దెలు, సీసీఏలు పాతవి కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్కి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయుఎ) విజ్ఞప్తి చేసింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిన సీఎంకు కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.శ్రీనివాసరావు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో నాలుగేళ్లకు ఓసారి వేతన సవరణ జరిగేదని తెలిపారు. 2017 ఏప్రిల్ 1న 25శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ జరిగిందని పేర్కొన్నారు. అనంతరం 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలోకి విలీనం చేసిందని, అప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు 19శాతం వేతన వ్యత్యాసం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2020 జనవరి 1 నుంచి బకాయి ఉన్న కరువు భత్యంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఫిట్మెంట్ను కలిపి 2021 ఏప్రిల్ 1 నుంచి వేతన సవరణ చేసి.. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా న్యాయం చేయాలని కోరారు. -
పదకొండవ వసంతంలోకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం
-
విజయసంకల్పానికి రెండేళ్లు
-
రేపు ఉచిత పంటల బీమా చెల్లింపు
సాక్షి, అమరావతి: ఆరుగాలం కష్టపడి తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరవు కాటకాలు, చీడపీడలు ఇతర ప్రకృతి వైపరీత్యాలతో కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొండంత అండలా నిలుస్తోంది. సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్రలో రైతుల కష్టాలు, కడగండ్లు స్వయంగా చూసిన సీఎం వైఎస్ జగన్, ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు. ఆ మేరకు రైతులను ఆదుకునే విధంగా ‘డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా’ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2019 సీజన్లో పలు కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం వారికి బీమా పరిహారం అందజేస్తోంది. అందులో భాగంగా రేపు (మంగళవారం) 9.48 లక్షల రైతులకు ఏకంగా రూ.1252 కోట్ల పరిహారం అందుతోంది. క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మొత్తాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటికే ఒక పరిహారం: 2018–19 రబీ పంటల బీమా ప్రీమియంకు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లు చెల్లించిన ఈ ప్రభుత్వం, నాటి పంటల నష్టానికి సంబంధించి బీమా కంపెనీల నుంచి క్లెయిమ్లు వచ్చేలా చేసింది. ఆ మేరకు ఈ ఏడాది జూన్ 26న, బీమా కంపెనీలు రాష్ట్రంలో 5.94 లక్షల రైతులకు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఆనాడు కూడా క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్లో బటన్ నొక్కిన సీఎం వైఎస్ జగన్, రైతుల ఖాతాల్లో నేరుగా ఆ బీమా పరిహారం జమ చేశారు. పైసా కూడా భారం లేకుండా: దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. భూమి సాగు చేస్తూ, ఈ–క్రాప్లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని పంటల బీమా పరిధిలో చేర్చి, రైతుల తరపున బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ, వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోంది. పూర్తి పారదర్శకత: గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలను వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ–క్రాప్లో నమోదు చేసి బీమా సదుపాయం కల్పించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినప్పుడు ఆ వివరాలు అంచనా వేసి, బీమా పరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఈ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, పథకంలో లబ్ధిదారులైన (అర్హులైన) రైతుల జాబితాలను, పూర్తి వివరాలతో గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వం–ప్రీమియం: 2019 సీజన్లో పంటల బీమా కింద రైతులు కట్టాల్సిన రూ.468 కోట్ల ప్రీమియమ్తో పాటు, ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన రూ.503 కోట్లు కూడా కడుతూ, మొత్తం రూ.971 కోట్ల ప్రీమియమ్ను ప్రభుత్వం బీమా కంపెనీలకు చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో..: రైతుల పంటల బీమా కోసం ప్రీమియంగా గత ప్రభుత్వం తన వాటాగా ఏడాదికి కేవలం రూ.393 కోట్ల ప్రీమియమ్ మాత్రమే చెల్లించింది. అదే ఈ ప్రభుత్వం గత ఏడాది (2019)కి సంబంధించి ఏకంగా రూ.971.23 కోట్ల ప్రీమియం చెల్లించింది. -
వైఎస్ జగన్కు మద్దతుగా పదరా.. ఓ అడుగేద్దాం!
ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేపడుతున్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పదరా.. ఒక అడుగేద్దాం అంటున్నారు నియోజకవర్గంలోని ప్రజలు. ఈ పాదయాత్రపై స్థానికుల సంభాషణ సాగిందిలా.. –చిత్తూరు రూరల్ పెద్దరాయుడు: ఏం బా సుబ్బరాయుడు యాడా పొలం కాడికి పోతా ఉండావా. సుబ్బారాయుడు: అవున్నో..పైరుకు నీళ్లు పెట్టాలి. పెద్దరాయుడు: రాబ్బా పోదువు..కరెంటు 9 గంటలు ఉండాది కదా.. సుబ్బారాయుడు: ఏమ్ లేదున్నో..గవర్నమెంట్ మా అకౌంట్లో రూ.2 వేలు వేసి ఉండాదినా . నా భార్యను పంపించి ఉండా.. తీసుకో రమ్మని. పెద్దరాయుడు: యాడ్రా వాళ్లంతా నడుచుకుంటా పోతాండారు సుబ్బారాయుడు:: మన జగనన్న పాదయాత్ర సేసి మూడేళ్ల అయిందంటనా. పెద్దరాయుడు: ఓహో...జగన్ అప్పుడు మన ఊరు పక్క కూడా వచ్చినాడు కదరా.. సుబ్బారాయుడు: అవున్నో..మనం పొయ్యినాం కదా! పెద్దరాయుడు: నాకు రైతు భరోసాతోపాటు రూ.2,250 పింఛన్ వస్తా ఉండాది. సుబ్బారాయుడు: అవును నా భార్యకు ఒళ్లు సరిలేదని రూ. 5వేలు, మనవడికి అమ్మఒడి, నా చిన్న కొడుక్కి, రేషన్కార్డు, కష్టకాలంలో ఉండారని రూ.వెయ్యి ఇచ్చినారు. పెద్దరాయుడు: ఇదంతా ఎందుకు చేస్తా ఉండారు... సుబ్బారాయుడు: వాళ్ల నాయన మాదిరిగా జగన్కూడా పాదయాత్ర చేసి ఊళ్లో వాళ్ల కష్టం తెలుసున్నాడు కదా. 341 రోజులు, అన్ని ఊళ్లు తిరుగుతూ జనం కష్టం, ఊళ్లో కష్టాలను కళ్లరా చూసారాబ్బా. ఇన్నీ రోజులు సేయడమంటే ఏం తమాషానా..? పెద్దరాయుడు: అవునబ్బో జనం కోసం ఇదంతా చేస్తుండాడు. సెప్పిన తేదీకి కరెక్టుగా చేస్తుండారు. మాట మీద నిలబడే వ్యక్తి అని నిరూపించుకున్నాడబ్బా. సుబ్బారాయుడు: అవున్నో.. అప్పుడు మాదిరి ఇప్పుడు లేదున్నో.. మనకు ఏం కావాలన్నా ఇంటికి వలంటీర్లు వస్తుండారు. పెద్దరాయుడు: మరి మనకోసం ఇంత చేస్తున్నాడు కదా.! అప్పుడెట్టాగో ఆయనతో పాటు నడవలేక పోయాం.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మనం కూడా పదాం.. ఈళ్లతో పాటు ఒక అడుగు వేద్దామా. సుబ్బారాయుడు: సరే ఆ సేద్యం ఎప్పుడూ ఉండేదే కానీ, నేనూ వస్తా ఒకడుగేద్దాం పద. -
వైఎస్ జగన్కు రాపాక శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసి నేటికి (శుక్రవారం) మూడు సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజాసంకల్ప యాత్రం ఓ చరిత్రను లిఖించిందని అన్నారు. వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఆయన వెంట వైఎస్సార్సీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా ఆయనకు మద్దతుగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. 17 నెలల పాలనలో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నాయని, బ్యాంకుల ద్వారా ప్రత్యేక మైన నిధులు మంజూరు చేసి ఏప్రిల్ నాటికి బాగుచేస్తానని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగవు ‘గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రోడ్లు కూడా వేసిన పరిస్థితి లేదు. అటువంటి రోడ్లను కూడా బాగు చెయ్యటానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. అన్ని వర్గాలను ఆకర్షించే విధంగా ప్రభుత్వ పాలన ఉంది. పాదయాత్ర ఇచ్చిన హమీ మేరకు 56బీసీ కులాలకు కార్పొరేషన్లు ఎర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఎవరు చేయని సాహసం సీఎం జగన్ చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కరోనా పేరుతో ఎన్నికలను నిలుపుదల చేశారు. వాస్తవానికి అప్పుడు కరోనా కేసులు అంతగా లేవు. ఇప్పుడు వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలి అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేవలం తెలుగుదేశం పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి గ్రామంలో కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఎన్నికలు నిర్వహించడం సరైనది కాదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యహారం పై ప్రజల నుండి పూర్తి వ్యతికత ఉంటుంది. స్దానిక సంస్థలు ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగే పరిస్థితి లేదు’ అని అన్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్రకు మూడేళ్లు
-
ప్రజల ముంగిట పాలన
-
విద్యారంగంపై నేడు సీఎం జగన్ సమీక్ష
-
సీఎం వైఎస్ జగన్ ఒక విజన్ ఉన్న నాయకుడు
-
‘నాలుగు నెలలకే రాద్ధంతం చేయడం సరికాదు’
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రజా సంకల్ప యాత్ర ప్రధాన కారణమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన మదిలోని విషయాలు వెల్లడించారు. నవంబర్ 1 అనగానే వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర గుర్తొస్తుందన్నారు. ప్రజా సంకల్పయాత్ర.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ప్రజలకు భరోసా ఇచ్చిందన్నారు. టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి, తమను ప్రజలకు దగ్గర చేసిందన్నారు. వందల నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు పాదయాత్ర ద్వారా ప్రజలు ఘనమైన మెజార్టీ ఇచ్చారని అదే సంకల్పయాత్ర గొప్పతనమని కొనియాడారు. నవరత్నాల ద్వారా పేద ప్రజలకు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే పేద, బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచారని మల్లాది విష్ణు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టి నాలుగు నెలలు గడవక ముందే ప్రతిపక్షాలు ఎంతో కాలంగా ఉన్న సమస్యలను కూడా ఈ నాలుగు నెలల్లో చేసినట్టు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగదన్నారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించింది వారి సమస్యల పరిష్కారానికి మాత్రమే అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేసి అందరితో శభాష్ అనిపించుకునేలా ముఖ్యమంత్రి పాలన సాగిస్తారని మల్లాది విష్ణు పేర్కొన్నారు. -
అనంతపురం: కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్
కరువుకు నిలయం అనంత. ఇక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితి అంతంతే. అందుకే బడుగుబలహీన వర్గాల పిల్లలకు సంక్షేమ హాస్టళ్లే దిక్కు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం.. వసతుల లేమి విద్యార్థులకు ప్రత్యక్ష నరకంగా మారింది. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించిన జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆ మేరకు తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమించారు. హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ.. అక్కడే రాత్రి బస చేస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యంపై కన్నెర్ర చేస్తూ.. మెరుగైన వసతి సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. సాక్షి, అనంతపురం : విద్యారంగంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రెండేళ్లలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించి ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల రూపురేఖలు మార్చేందుకు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్గా సత్యనారాయణ బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి అట్టడుగు వర్గాల పిల్లలు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, దివ్యాంగ సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. అకస్మిక తనిఖీలు చేస్తూ దడ పుట్టిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, విద్యార్థుల హాజరు, భోజనం నాణ్యత, మెనూ అమలు.. హాస్టల్ వార్డెన్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కొత్త పంథా ఎంచుకున్న కలెక్టర్ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్న కలెక్టర్ విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఐదుగురు వార్డెన్లపై ఇప్పటికే వేటు వేశారు. అయినప్పటికీ మిగతా వారిలో పెద్దగా మార్పు రాలేదు. సస్పెండ్ చేయడం.. కొద్దిరోజుల తర్వాత దాన్ని ఎత్తివేయడం వల్ల ఉపయోగం లేదని భావించిన కలెక్టర్ కొత్త పంథా ఎంచుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డెన్లపై సస్పెన్షన్తో సరిపెట్టకుండా ఇంక్రిమెంట్ల కోతకు చర్యలు తీసుకుంటున్నారు. షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ ఇచ్చిన తర్వాత(విత్/వితౌట్ కుములేటివ్ ఎఫెక్ట్) ఒకటి లేక రెండు ఇంక్రిమెంట్లు కోత విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెనుకొండ ఏఎస్డబ్ల్యూఓ ప్రసాద్, చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ వార్డెన్ మారుతీరావు, కుక్ నారాయణమ్మ, బీకేఎస్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ బాబుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కూడేరు బీసీ బాలికల హాస్టల్ వార్డెన్ కేఆర్ శశికళకు చార్జెస్ ఫ్రేం చేశారు. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ⇔ చెన్నేకొత్తపల్లి ఎస్సీ హాస్టల్ను ఈనెల 7న కలెక్టర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. 55 మంది పిల్లలకు గాను 26 మంది మాత్రమే ఉన్నారు. 29 మంది గైర్హాజరయ్యారు. వినాయక చవితి పండుగకు వెళ్లిన వారు ఇంకా రాలేదని వార్డెన్ ఇచ్చిన సమాధానంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ 3వ తేదీ అయితే 7వ తేదీ వరకు రాకపోయినా మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా పప్పులో ఉప్పు ఎక్కువైందనీ, సాంబారులో నీళ్లు తప్ప కూరగాయలు కనిపించలేదని.. పైగా పప్పులో రాళ్లు కనిపించాయన్నారు. తనకు వడ్డించిన అన్నంలోనే రాయి వచ్చిందన్నారు. మెనూ ప్రకారం వెజిటబుల్ కర్రీ చేయాల్సి ఉన్నా..నీళ్ల చారుతో సరిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇔ ఇక ఈనెల 3న కలెక్టర్ బుక్కరాయసముద్రంలో ఎస్సీ హాస్టల్ను పరిశీలించారు. 130 మందికి గాను కేవలం 5 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఎస్టీ హాస్టల్ వార్డెన్ అందుబాటులో లేరు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన కలెక్టర్ అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు రాకకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అందరూ పనితీరు మార్చుకుని ప్రభుత్వ ప్రాధాన్యామాలకు అనుగుణంగా పనిచేయాలని లేకపోతే ఇంటికి పంపించేందుకు కూడా వెనకాడేది లేదని కలెక్టర్ హెచ్చరిస్తున్నారు. సస్పెన్షన్ వేటు పడిన వార్డెన్లు ►రామునాయక్, అనంతపురం ఎస్సీ నంబర్–4 హాస్టల్ వార్డెన్ ►బాబు, బుక్కరాయసముద్రం ఎస్సీ హాస్టల్ వార్డెన్ ►వెంకటేశ్వర్లు, ఎస్టీ హాస్టల్ వార్డెన్ ►ఠాగూర్, గుంతకల్లు మండలం పాతకొత్తచెరువు బీసీ హాస్టల్ వార్డెన్ (వీరిలో రామునాయక్, ఠాగూర్పై సస్పెన్షన్ ఎత్తివేశారు.) -
‘సీఎం జగన్ పాలన దేశంలోనే రికార్డు’
సాక్షి, విశాఖ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 80 రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడం దేశంలోనే ఒక రికార్డని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్ రెడ్డి కొనియాడారు. నవరత్నాల అమలుతోపాటు కీలక బిల్లులు తీసుకురావడంతో విమర్శకుల నుంచి సైతం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్నారని స్పష్టం చేశారు. కృష్ణా బ్యారేజ్ వచ్చిన వరద నీటిపై కూడా చంద్రబాబు, టిడిపి నేతలు రాజకీయం చేయడం దిగజారుడు తనమని ఎద్దేవా చేశారు. -
వైఎస్ జగన్ పాదయాత్రపై పుస్తకావిష్కరణ
సాక్షి, అమరావతి: చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్, ది ప్రింట్ ఎడిటర్ చీఫ్ పద్మభూషణ్ శేఖర్ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కారం చేశారు. సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేయబడింది. ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుధీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు, శేఖర్గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్సీపీ నేతలు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం: సీఎం వైఎస్ జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర అనేది ఒక స్పిరిట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 3648 కి,మీ పాదయాత్ర చేయడమంటే సామాన్యమైన విషయం కాదని, ప్రజల సహకారంతోనే పూర్తి చేయగలిగానని అన్నారు. ఏకంగా 14 నెలల పాటు సాగిన ఈ ప్రయాణంలో ప్రతి పేదవాడిని కలిశానని, దాని ఫలితంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 50 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయని సీఎం గుర్తుచేశారు. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా.. ప్రతీక్షణం ప్రజల కోసమే పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. తన పాదయాత్రపై పుస్తకాన్ని రూపకల్పన చేసినందుకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు.. పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలను, వారసత్వాన్ని జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తుచేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయన్నారు. వైఎస్ జగన్ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు. కార్యక్రమంలో రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. తన నాలుగున్నర దశాబ్దాల పాత్రికేయ అనుభవంలో పాదయాత్రపై పుస్తకాన్ని రూపొందిచడం గొప్ప విషయమన్నారు. -
ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా
సాక్షి, కర్నూలు/ నంద్యాల: ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అందరి సంక్షేమానికి కృషి చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన మాటలే తమకు స్ఫూర్తి అని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలు చూడమన్నారు. తమకు ఓటు వేయని వారికి సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన చేసిన తొలి ప్రసంగం ఆకట్టుకుంది. చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా..సూటిగా చెప్పి స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు అందుకున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రసంగం సాగిందిలా ‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు స్థలాలు ఇచ్చి వాటిలో ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. దివంగత వైఎస్ఆర్లాగా తమ ముఖ్యమంత్రి ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. గతంలో కూడా పలు ప్రభుత్వాలు పేదలకు గృహాలు కట్టించి ఇచ్చాయి. అయితే మా ప్రభుత్వం కట్టించి ఇచ్చే ఇంటిపై లబ్ధిదారుడు అవసరాల కోసం బ్యాంకులో రుణం సైతం పొందవచ్చు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 300 చదరపు అడుగుల ఇంటి కోసం పేదల నుంచి రూ.2.65 లక్షలు వసూలు చేశారన్నారు. తమ ప్రభుత్వం చేపట్టే కొత్త ఇళ్ల నిర్మాణానికి నంద్యాల, బేతంచెర్లలో ఉండే క్వారీల్లో దొరికే బండలు, టైల్స్ను తీసుకుని మూతపడుతున్న పరిశ్రమలకు జీవం పోయాలని కోరుతున్నాను. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పడుతున్న ఆరాటాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీయడానికి రివర్స్ టెండర్ విధానం, జ్యుడీషియల్ విచారణకు శ్రీకారం చుట్టార’న్నారు. చివరకు అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన స్పీకర్, ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెప్పి ప్రసంగాన్ని ముగించారు. -
మహానేతకు ఘన నివాళులు
పులివెందుల : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 70వ జయంతి వేడుకలను ఇడుపులపాయలో సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సోమవారం ఉదయం కడప నుంచి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో కలిసి హెలికాప్టర్లో ఇడుపులపాయకు చేరుకున్నారు. వీరికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి, జిల్లా కలెక్టర్ హరికిరణ్ పూలబొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు ఘన స్వాగతం లభించింది. అనంతరం వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వారితో పాటు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిలమ్మ, బ్రదర్ అనిల్కుమార్, వైఎస్ జగన్ కుమార్తెలు హర్ష, వర్ష, షర్మిల కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సోదరులు రవీంద్రనాథరెడ్డి, సుధీకర్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ ప్రతాప్రెడ్డి, పులివెందుల వైఎస్సార్సీపీ నేత వైఎస్ మనోహర్రెడ్డి, చక్రాయపేట మండల నాయకులు వైఎస్ కొండారెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల ఇన్చార్జి ఎన్.శివప్రకాష్రెడ్డి, వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ గూడూరు రవి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, ఎస్టేట్ మేనేజర్ భాస్కర్రాజు తదితరులు పాస్టర్లు బెనహర్ బాబు, నరేంద్రకుమార్, మృత్యుంజయ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలమ్మ వైఎస్సార్ ఘాట్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఇడుపులపాయలోని ఎస్టేట్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కాసేపు గడిపారు. అక్కడికి వచ్చిన బంధువులందరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి సీఎం వైఎస్ జగన్ రోడ్డు మార్గాన గండి క్షేత్రానికి వెళ్లారు. -
జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా..
వైఎస్సార్ జిల్లా నుంచి రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టడంతో హర్షాతిరేకం వ్యక్తమైంది. సమైక్య ఆంధ్రప్రదేశ్కు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004లో పులివెందుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ సీఎం పీఠాన్ని అధిరోహించిన వైఎస్సార్ 2009లోనూ అదే రీతిలో పట్టాభిషిక్తులయ్యారు. వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తాజాగా అదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గురువారం ముఖ్యమంత్రి కావడంతో జిల్లా ప్రజానీకంలో పట్టరాని సంతోషం కలుగుతోంది. తండ్రి మాదిరిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాను మరోమారు దేశపటంలో నిలిపారని గర్వపడుతున్నారు. జిల్లాను ప్రగతిపథంలో పయనింపజేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తారని బలంగావిశ్వసిస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: ఢిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే అంటారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయంలోనూ ఈనానుడ్ని జిల్లాప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రానికి సారథి అయినా తమ జిల్లాకు మాత్రం ముద్దుబిడ్డేనంటూ వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడు తమ జిల్లాలోని పులివెందులకు ఎమ్మెల్యేనని వ్యాఖ్యానిస్తున్నారు. కష్టనష్టాలలో తోడుగా ఉంటూ ఆశీర్వదించిన తమ పట్ల కూడా ఆయన అదే తరహాలో ప్రేమ కురిపిస్తారని భావిస్తున్నారు. ఈసందర్భంగా ఆయనలోని పోరాటపటిమను..నాయకుడిగా ఎదిగిన తీరుపై చర్చించుకుంటున్నారు. గురువారం జిల్లావ్యాప్తంగా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. తమ జిల్లాకు చెందిన నాయకుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే మురిసిపోయారు. ప్రమాణ స్వీకార ఘట్టం జరుగుతున్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యమయ్యాయంటే ఆ కుటుంబంపై జిల్లా ప్రజానీకం చూపిస్తున్న ఆదరాభిమానాలను అర్ధం చేసుకోవచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం ప్రత్యక్షంగా చూసేందుకు బుధవారం సాయంత్రమే వైఎస్సార్సీపీ నాయకులు..కార్యకర్తలు..అభిమానులు విజయవాడకు తరలివెళ్లారు. ఎదురొడ్డి నిలిచిన నాయకుడు తన తండ్రి వైఎస్సార్ అకాల మరణం తర్వాత సుమారు పదేళ్లపాటు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అదే సమయంలో జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రజానీకం అఖండ మెజారిటీ కట్టబెట్టారు. 2009లో కడప ఎంపీగా 1,78,846 ఓట్ల మెజారిటీ సాధించారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో 5,45,671ఓట్ల రికార్డు ఆధిక్యత సాధించి అబ్బురపరిచా రు. అప్పట్లోనే దేశం యావత్తూ కడప వైపు చూసేలా చేశారు. 2104లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి 75243 ఓట్లతో మరో మారు రికార్డు సృష్టించారు. ఈదఫా తాజా ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ(90110ఓట్లు) తెచ్చుకుని ఔరా అనిపించుకున్నారు. ఇదీ జిల్లా ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపిన అపారమైన ప్రేమకు తార్కాణం. అందుకే ఆయన తరచూ జిల్లాను మదిలో స్మరించుకుంటారు. ‘ఈ పులివెందుల నాకెన్నో పాఠాలు నేర్పింది. కష్టాలకు ఎదురొడ్డే శక్తిని ఇచ్చింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ సడలని ధైర్యాన్ని నూరిపోసింది. ఈ గడ్డకు రుణపడి ఉంటాను’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో ఇటీవల ఎన్నికల్లో నామినేషన్ వేశాక జరిగిన సభలో భావోద్వేగానికి గురయ్యారు. అందుకే ఊపిరి సలపని ఒత్తిళ్లలోనూ ..తక్కువ సమయ వ్యవధి ఉందని గుర్తించినా ప్రమాణ స్వీకారానికి ముందు జిల్లాను సందర్శించారు.బుధవారం ఆయన జిల్లాలో పర్యటనకు రావ డం ఇక్కడి ప్రజలను కూడా ఆశ్చర్యానందాల్లో ముంచింది. రాయచోటి ప్రాంతానికి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ధనుం జయరెడ్డిని తన పాలన మార్కు టీంలోకి తీసుకోవడమే జిల్లాపై ఆయన చూపించే మక్కువకు ఉదాహరణ అని అధికారులంటున్నారు. నాన్న చూపిన ప్రగతి బాట తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన మార్గంలోనే ఆయన తనయుడు కూడా నడుచుకుంటున్నారని జిల్లా ప్రజలంటున్నారు. ప్రమాణ స్వీకార వేదికపై వైఎస్ జగన్మోహన్రెడ్డి అవ్వాతాతలకు పించను పెంచుతూ చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడంటూ ప్రశంసిస్తున్నారు. గ్రామ సచివాలయాలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలనే సాహసోపేత నిర్ణయం ముమూర్తులా రాజశేఖరుడి స్ఫూర్తిని తలపింపజేసిందని సంబరపడుతున్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టగానే జిల్లాభివృద్ధి పరుగులు పెట్టింది. సమగ్రాభివృద్ధి దిశగా పయనించింది. అదే చొరవ వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా చూపిస్తారని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల హామీలో భాగంగా కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సంగతిని గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఏడాది డిసెంబర్ లోగానే ఈ కర్మాగారానికి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ శ్రేణులు చెబుతున్నాయి. 2022 నాటికి ఈ పెద్ద ప్రాజెక్టు పూర్తి చేయాలనే సంకల్పంతో చర్యలు మొదలయ్యాయని తెలుస్తోంది. బుడ్డ శనగలు (బెంగాల్ గ్రామ్)కు గిట్టుబాటు ధరపై కొత్త సీఎం ప్రత్యేక చొరవ చూపనున్నారు. రూ.6,500తో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఇదివరకే ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వమున్న జగన్ ఈదిశగా కసరత్తు చేపట్టనున్నట్లు భోగట్టా. గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ప్యాకేజీ మార్చేందుకు సన్నహాలు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు పేర్కొంటున్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పెండింగ్ పనులపై వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టిసారిస్తారని జిల్లా వాసులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. -
ఏపీలో కొనసాగిన ఆనవాయితీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఆనవాయితీ కొనసాగింది. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన నాయకులు అధికారం చేపట్టడం అనే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. తన తండ్రి బాటలో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అధికారం చేపట్టబోతున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. కాలినడన అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. టీడీపీ సర్కారు మోసాలను, వైఫల్యాలను సాధికారికంగా ప్రజలకు వివరించి చెప్పారు. ఎల్లో మీడియా, పచ్చ నాయకుల కుట్రలను దీటుగా ఎదుర్కొని తాజా ఎన్నికల్లో వైఎస్ జగన్ విజేతగా నిలిచారు. తండ్రి తగ్గ వారసుడు అనిపించుకున్నారు. 2003లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2012, అక్టోబర్ 2న ‘వస్తున్నా ... మీ కోసం’ అంటూ పాదయాత్ర చేపట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014 శాసనసభ ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. తాజా ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో వైఎస్ జగన్ సీఎం కాబోతున్నారు. దీంతో పాదయాత్ర చేసిన ముగ్గురు నాయకులు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించినట్టైంది. -
నిరుద్యోగ సమస్య పరిష్కారమవ్వాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి
-
పాదయాత్ర సంకల్పం
-
ముఖ్యమంత్రే దళారీల కెప్టెన్ అయ్యారు : వైఎస్ జగన్
సాక్షి, తిరుపతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘అన్న పిలుపు’ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మెరుగైన పాలనకు సలహాలు, సూచనలు ఇవ్వాలని హాజరైన తటస్థులను కోరారు. సమస్యలేవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని విఙ్ఞప్తి చేశారు. ఎక్కడ అమ్మితే కనీస మద్దతు ధర వస్తుందో!? అన్నపిలుపు కార్యక్రమంలో భాగంగా రైతు పి.వెంకటరెడ్డి రైతు సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. రైతుల దగ్గర రూ. 10 నుంచి 12రూపాయలకు కొన్న కేజీ మామిడిని.. హైదరాబాద్లో రూ. 60-70 మధ్య అమ్ముతున్నారని పేర్కొన్నారు. ఇంత తేడా ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదని .. ఇలా అయితే రైతు ఎలా బతుకుతాడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘గడచిన రెండేళ్లుగా మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మదనపల్లె ప్రాంతంలో టమోటా రైతులు ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్యార్డుల్లో అక్రమంగా 20శాతం ఫీజులు వసూలు చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. మామిడి, టమోటా రైతులు కష్టాలు తీర్చాలని కోరారు. కనీస మద్దతు ధరలు ప్రకటించినా అవి రైతులకు అందడం లేదని.. ఎక్కడ అమ్మితే కనీస మద్దతు ధర వస్తుందో వారికి తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రే దళారీల కెప్టెన్ అయ్యారు! రైతు వెంకటరెడ్డి ప్రస్తావించిన సమస్యల గురించి స్పందించిన వైఎస్ జగన్.... ‘ప్రజాసంకల్ప యాత్రలో ఈ అంశం గురించి నేను ప్రస్తావించా. ఇదే జిల్లాలో టీడీపీ నాయకులు గల్లా, ఆదికేశవులు కుటుంబానికి చెందిన శ్రీని ఫుడ్స్, పక్కనే హెరిటేజ్ ఫుడ్స్.. ఇవన్నీ కూడా రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు. ఇలా చేస్తే.. ఇక రైతులకు ఎలా మద్దతు ధర వస్తుంది. ఈ సమస్యపై నాకు పూర్తి అవగాహన ఉంది. కెప్టెన్గా ఉన్నవాడు దళారీలకు సహకరిస్తే మద్దతు ధర రాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి దళారీలకు కెప్టెన్ అయ్యాడు. రైతుల దగ్గర నుంచి తక్కువ ధరలకు ఆయనే కొనుగోలు చేసి.. నాలుగు రెట్లకు ప్యాక్ చేసి అమ్ముతున్నాడు. నాన్న హయాంలో రైతులకు లభించిన ధరలు మీ అందరికీ తెలుసు. ఆయన బాటలో రూ. 3వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడుతున్నాం. పంటవేసే ముందు ధరను నిర్ణయిస్తాం. ప్రభుత్వ రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియను ప్రోత్సహిస్తాం. అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత తేడాను కచ్చితంగా చూపిస్తాం’ అని హామీ ఇచ్చారు. మంత్రి ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మక్కయ్యారు చంద్రబాబు పాలనలో అంతా పక్షపాతమేనని ఐరాలకు చెందిన చలపతి ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అమర్నాథ్రెడ్డి ఫ్యాక్టరీల యజమానులతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. ‘ఫ్యాక్టరీ యజమానులు జట్టుగా మారిపోయారు. పచ్చ చొక్కాలకే లబ్ది చేకూరుస్తున్నారు. చంద్రబాబు అన్నీ అబద్ధాలే చెప్తున్నారు. ఆయన చేసిన ప్రమాణానికి అర్థం లేకపోయింది. పోలీసులు, అధికారులు అందరూ పక్షపాతం చూపిస్తున్నారు. మతం, కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు’ అని వాపోయారు. ప్రజల కష్టాలు అర్థం చేసుకుని వైఎస్ జగన్ నవరత్నాలు ప్రకటిస్తే.. ఇప్పుడు వాటిని కూడా దొంగిలిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం హేమ చంద్ర అనే వ్యక్తి మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీకి జబ్బు చేసిందని, మన్నవరం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు గనుక పూర్తై ఉంటే 5 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని.. కానీ ఇప్పుడు 10 మంది సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు మాత్రం ఇచ్చారని వాపోయారు. ఆరోగ్య శ్రీ అమలు చేస్తాం.. ఎవరికీ లంచాలు ఇవ్వక్కర్లేదు వీరి సమస్యలకు స్పందనగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ ఈ రెండూ కలిపి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు మన్నవరం ప్రాజెక్టు. ప్రాజెక్టు ఎక్కడ పెట్టాలన్న అంశంపై ఆలోచన చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి రావాలని వైఎస్సార్ గట్టి పట్టుబట్టారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ ఈ ప్రాజెక్టును సాధించారు. ఆయన మరణం తర్వాత ప్రాజెక్టు పూర్తిగా నిర్వీర్యం అయిపోతోంది. మనకు ఉద్యోగాలు రావాలంటే విప్లవాత్మక మార్పులు రావాలి. పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఆ పరిశ్రమల్లో మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. దేవుడి దయ వల్ల ప్రభుత్వం ఏర్పాటు కాగానే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చట్టం తీసుకు వస్తాం. ప్రతి కంపెనీ అమలు చేయక తప్పని పరిస్థితి తీసుకు వస్తాం. ఉద్యోగాల కల్పనపై మా పాలనలో ప్రత్యేక దృష్టి. రాష్ట్రంలో 2.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు సున్నా. 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే... వాటిని భర్తీ చేయాలన్న ఆలోచన లేదు. ఉన్న స్కూళ్లను మూసేస్తున్నారు. గ్రామ సచివాలయాల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తాం. వీటికి అనుసంధానంగా గ్రామ వాలంటీర్లను తీసుకొస్తాం. ప్రతి యాభై కుటుంబాలకు ఒకరిని వాలంటీర్గా పెడతాం. గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై డోర్ డెలివరీ చేస్తారు. ఎవ్వరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. ప్రభుత్వ పథకాలకోసం తిరగాల్సిన పనిలేదు. గ్రామ వాలంటరీకు ఒక్కొక్కరికీ రూ.5వేలు జీతం ఇస్తాం. ప్రత్యేక హోదా అన్నది మరొక ఎత్తు. 25కి 25 మొత్తం ఎంపీ స్థానాలన్నీ మనమే సాధించుకుందాం. ప్రత్యేక హోదాకు సంతకం పెట్టిన పార్టీకే..మద్దతు ఇస్తాం. ప్రత్యేక హోదా ఉంటే ఆదాయపుపన్ను, జీఎస్టీ కట్టాల్సిన అవసరంలేదు.ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్సార్ అమలు చేస్తున్నప్పుడు దేశం మొత్తం మనవైపు చూసింది. నాన్న కన్నా ఒక అడుగు ముందుకు వేసి ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తాం’ అని పేర్కొన్నారు. ఆప్కో చైర్మన్లు లంచాలు తీసుకుంటున్నారు! జీఎస్టీతో చేనేతల ఇబ్బందులు మరింత పెరిగాయని సత్యవేడుకు చెందిన భక్తవత్సలం తెలిపారు. చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి.. ఉత్పత్తి వ్యయం తగ్గించాలని కోరారు. గతంలో వైఎస్సార్ రుణమాఫీ చేసి.. చేనేతలను ఆత్మహత్యల నుంచి కాపాడారని గుర్తు చేసుకున్నారు. ఇందుకు బదులుగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘చేనేతల సమస్యలను నేను పాదయాత్రలో తెలుసుకున్నా. తమిళనాడులో 250 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తారు. మేం అధికారంలోకి వస్తే మగ్గం ఉన్న ప్రతి ఇంటికీ నెలకు రూ.2 వేలు ఇస్తాం. నవరత్నాల్లో చెప్పినవి కాక ఈ సహాయం అందుతుంది. చేనేతలు ఆకలి బాధలకు గురికాకూడదు. ఆప్కో నుంచి చేనేతలకు రావాల్సిన బకాయిలు ఇప్పటికీ రావడంలేదు. ఆప్కో ఛైర్మన్లుగా ఉన్నవాళ్లు స్కూలు యూనిఫారమ్స్లోనూ లంచాలు తీసుకునే పరిస్థితి ఉందని పాదయాత్రలో నాకు చెప్పారు. టీడీపీ మాదిరిగా కాకుండా ఏ విధానమైనా చాలా పారదర్శకంగా ఉండేలా చేస్తాం’ అని హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా రైతుల పరిస్థితి అధ్వానం చిత్తూరు జిల్లాలో ఒక్క ఎకరాకూ నీళ్లు అందడం లేదని.. రాష్ట్ర అభివృద్ధిలో సమతుల్యత లేదని రాయలసీమ మేధావుల సంఘ సభ్యుడు పురుషోత్తం రెడ్డి అన్నారు. రూజ్వెల్ట్ అమెరికాను సమగ్రంగా అభివృద్ధి చేసినట్లుగా.. ప్రాంతాల వారీగా ఉన్న అసమానతలను తొలగించాలని కోరారు. ఈ అంశంపై సమగ్ర విధానం రావాలన్నారు. మనకు కావాల్సింది సింగపూర్ కాదని క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. పురుషోత్తం రెడ్డి వ్యాఖ్యలకు స్పందనగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘గోదావరిలో 3వేల టీఎంసీల నీళ్లు కలిసి పోతున్నాయి. ఈ నీటిని దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టెయిల్ ప్రాజెక్టు ద్వారా సాగర్ను నింపాలని వైఎస్సార్ ప్రయత్నించారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన చనిపోయారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య సఖ్యత ఉంటే... దుమ్ముగూడెం- సాగర్ ప్రాజెక్టు మెటీరియల్ అవుతుంది. మన రాష్ట్రానికే కాదు, తెలంగాణకు కూడా మేలు జరుగుతుంది. మంచి చేయగలిగే అవకాశం వస్తే కచ్చితంగా దీనికోసం అడుగులు వేస్తాను. ఇది జరిగితే పోలవరం ప్రాజెక్టుకు ఈ నీళ్లు అదనం అవుతాయి’ అని వ్యాఖ్యానించారు. ఉచిత విద్య అందిస్తే బాగుంటుంది ఫీజు రియంబర్స్మెంట్ కన్నా ఉచిత విద్య అందిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భాస్కర్ అనే వ్యక్తి అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులకు అపర కర్మలు చాలా ముఖ్యమని.. అందుకే ప్రతి గ్రామంలో ఒక భవనం ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని.. వారి మరణానంతరం కుటుంబాలకు పెన్షన్ ఇస్తే బాగుంటుందన్నారు. చిత్తూరు జిల్లా బాగా వెనకబడి ఉందని.. చిన్న చిన్న జబ్బులకే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. ప్రతి ఆరోగ్య పరీక్ష, చికిత్సకు కచ్చితమైన ధర నిర్ణయించాలన్నారు. తుంగభద్రలో వాటాగా రావాల్సిన నీళ్లు కచ్చితంగా తీసుకురావాలని సూచించారు. ఈ విషయాల గురించి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మనం వచ్చాక పూర్తి స్థాయి ఫీజు రియింబర్స్మెంట్ చెల్లిస్తాం. ఇంచుమించు మనం ప్రకటించిన పథకాలు అవే పద్ధతిలో ఉన్నాయి. న్యాయవాదులు ప్రజాసంకల్పయాత్రలో ఇవే కోరారు. కచ్చితంగా చేస్తాం. స్కూళ్లలో, కాలేజీల్లో ఫీజులు ఈ రకంగా ఉంటే.. ఎవ్వరూ కూడా చదువుకోలేరు. వైద్య పరీక్షలు, చికిత్సల కోసం రేట్లపై ఒక నియంత్రణ కూడా ఉండాలని గట్టిగా భావిస్తున్నాం. స్కూలు, కాలేజీ ఫీజులను కచ్చితంగా నియంత్రిస్తాం. ఆరోగ్యశ్రీని మెరుగుపరచాలని అనుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్, కేటీఅర్ భేటీపై టీడీపీ అసత్యప్రచారం చేస్తున్నారు
-
వైఎస్ జగన్ సీఎం కావాలి
భూపాలపల్లి అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామికి మొక్కుకున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ తెలిపారు. 14 నెలల క్రితం జగన్ ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుకోగా ఎలాంటి అవాంతరాలు లేకుండా యాత్ర పూర్తయినందుకు సోమవారం మెట్ల మార్గంలో కొండపైకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. కిషన్ వెంట జిల్లా నాయకులు వెంకటరెడ్డి, నరేష్, కుమార్, సంపత్ ఉన్నారు. -
కడప శివారులో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
-
తిరునగరి..జనహారతి
-
సంకల్ప భయం
-
ప్రజాసంకల్పయాత్ర అద్వితీయం.. అపూర్వం..
-
తిరుపతిలో వైఎస్ జగన్కు ఘనస్వాగతం
-
పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!
సాక్షి, విజయవాడ : ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభను చూసి టీడీపీ నేతలకు చెమటలు పడుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి నందిగం సురేశ్ విమర్శించారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, ఆయన మంత్రులు వైఎస్ జగన్ పాదయాత్ర మీద అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని తప్పుబట్టారు. చంద్రబాబు ఎలా పాదయాత్ర చేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని, ఆయన రాత్రిపూట కిలోమీటరు నడిస్తే.. ఆరు కిలోమీటర్లు బస్సు ఎక్కేవారని, టీడీపీ వైఖరి దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మంత్రి దేవినేని ఉమాకి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీశారు. చంద్రబాబుని ప్రజలను నమ్మరని తెలిసి.. ఇపుడు వైఎస్ జగన్ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని అన్నారు. వైఎస్ జగన్పై హత్యాయత్నం కేసులో నిజాలు బయటకొస్తాయనే ఎన్ఐఏ విచారణకు భయపడ్డారని, ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో టీడీపీ నేతలు ఇంకా భయపడిపోతున్నారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో చంద్రబాబు పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబుని మరో నాలుగు నెలల్లో ఇంటికి పంపబోతున్నారని, 2019 ఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలు అని పేర్కొన్నారు. -
ప్రజల గుండె చప్పుడు వింటూ..!
-
జననేతకు జైకొట్టిన జనసంద్రం
-
341వ రోజు పాదయాత్ర డైరీ
-
వచ్చేది రైతు రాజ్యమే!
-
వీడలేమంటూ.. వీడుకోలంటూ..
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంటికొచ్చిన చుట్టాన్ని వీడ్కోలు పలికే సమయంలో హృదయం బరువెక్కుతుంది.. కళ్ల వెంట నీళ్లు వస్తాయి.. అలాంటిది పద్నాలుగు నెలల బంధం విడిపోతుంటే ఆ హృదయ వేదనకు కొలమానం ఉంటుందా..? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కచ్చితంగా ఇలాంటి సన్నివేశాలే బుధవారం ఆవిష్కృతమయ్యాయి. ఏడాదికిపైగా జననేత వెంట ఉండి.. ప్రతీరోజూ ఆయన అడుగులో అడుగులేస్తూ, ప్రజా సంకల్పయాత్రలో ఏదో ఒక బాధ్యతను భుజానికెత్తుకున్న వాళ్లు అనేకమంది ఉన్నారు. ఏ బాధ్యత లేకపోయినా అభిమాన నేతకు మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురానికి పాదయాత్ర చేసిన వాళ్లూ అనేకులున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి విశ్రమించే వరకూ వాళ్లకు వాళ్లే ఆత్మీయ బంధువులు. ఈ మహాయజ్ఞంలో తాము భాగస్వాములు కావాలన్నదే వారందరి ఏకైక ఆశయం. 14 నెలలుగా వైఎస్ జగన్ బస వద్దే వీళ్లంతా ఉన్నారు. నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పించే వీరిలో పాదయాత్ర ముగింపుతో ఎంతో మార్పు కనిపించింది. హావభావాల్లో తేడా.. మాటల్లో భావోద్వేగం.. స్వరం జీరబోవడం.. ఏదో కోల్పోతున్నామనే భావన వీరిలో స్పష్టంగా ప్రతిబింబించింది. మళ్లీ ఎప్పుడు కలుస్తామో! వైఎస్ జగన్ బసచేసే శిబిరం వద్ద బుధవారం ఉదయం నుంచే వీడ్కోలు కార్యక్రమం మొదలైంది. ‘ఇవ్వాళే ఆఖరు.. మళ్లీ మనం ఎప్పుడు కలుస్తామో’.. అంటూ ఒకరికొకరు ఆత్మీయంగా హత్తుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. ఆఖరిసారిగా కలిసి అల్పాహారం చేయాలని ఒకరినొకరు స్వాగతించుకోవడంతో శిబిరం వద్ద ఉద్విగ్న సన్నివేశాన్ని తలపించింది. టెంట్ వేసే వారు కొందరు.. వాహనాలు తిప్పేవారు మరికొందరు.. పాదయాత్ర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యత మరికొందరిది.. ఎవరే పనిలో ఉన్నా రాత్రి అన్నదమ్ముల్లా ఒకేచోట కలిసి భోజనం చేయడం అలవాటుగా మారింది. ఊరికి సమీపంలో ఉండే టెంట్ వద్దే ఉదయం స్నానాలు చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. ఒక్కోసారి చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా అంతలోనే సర్దుకుపోయే వాళ్లమని తెలిపారు. బహుమతులు.. కలిసి ఫొటోలు జననేత రోప్ పార్టీలో ఉన్నవాళ్లు రోజంతా బిజీగానే ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాయకుడిని అంటిపెట్టుకుని ఉండాల్సిందే. వీరిలో ఏడాదిగా ఊరెళ్లని వారూ ఉన్నారు. చాలామంది అక్కడి వాతావరణానికే అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగియడంతో ఇప్పటివరకూ కలిసి మెలిసి ఉన్న వారు దూరమవడాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ‘అన్నా.. ఒక్క ఫొటో దిగుదాం. చూసుకున్నప్పుడల్లా గుర్తుండిపోవాలి’.. రోప్ పార్టీలోని ఓ వ్యక్తి తన సహచరులతో కన్నీటిపర్యంతమవుతూ అన్న మాటలివి. గుండె పగిలే ఏడుపొస్తోందన్నా.. పాదయాత్రలో ఏడాదికి పైగా పనిచేశా. ఈ కాలంలో ఎంతోమంది పరిచయమయ్యారు. కష్టాలు పంచుకున్నాం. ఇష్టాలు చెప్పుకున్నాం. యాత్రలో కలిసి పనిచేసిన మేం ఓ పెద్ద కుటుంబంలా ఉన్నాం. ఇలా వీడ్కోలు చెప్పుకునే రోజు వచ్చిందని తెలిసి కన్నీరు పెట్టనివారు లేరు. ఉదయం నుంచి నాకు ఎన్నిసార్లు బాధేసిందో. నాలో నేనే కన్నీళ్లు పెట్టుకున్నా. – వై. లక్ష్మారెడ్డి (ఓఎస్డీ డ్రైవర్) ఇంటికెళ్లాలంటే బాధేస్తోంది ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్నతో కలిసి పాదయాత్ర చేశా. వందల మంది నాకు ఆత్మీయులయ్యారు. సెలవుకు ఇంటికెళ్లినా మళ్లీ ఎప్పుడు టెంట్ దగ్గరకొస్తాననే నా ప్రాణం లాగేది. ఎన్ని కష్టాలున్నా అందరం పంచుకునే వాళ్లం. ఒకేచోట తినడం, ఒకేచోట పడుకోవడం. ఇంతకన్నా సమైక్యత ఎక్కడుంటుంది? – ప్రశాంత్ నిద్రలోనూ పాదయాత్ర ఆలోచనే ఆరంభం నుంచి చివరివరకూ పాదయాత్ర వాహనాల నిర్వహణ బాధ్యత నాదే. రోజంతా చాలా బిజీగా ఉండేవాడ్ని. అంతా నా వాళ్లే.. నా ఇల్లే అన్న ఫీలింగ్ ఉండేది. నిద్రపోతున్నా పాదయాత్రలో వాహనాలెక్కడున్నాయి? ఏ డ్రైవర్ ఏం చేస్తున్నాడనే కలవరింతే ఉండేది. జగన్ అధికారంలోకి వస్తాడని జనం చెప్పుకుంటుంటే చాలా ఆనందం అనిపించేది. – జనార్థన్ బాసటగా బాటసారులు! జగన్తో కలసి ఏడాదికిపైగా యాత్రలో పాల్గొంటున్న సైనికులు’ వారంతా అలుపెరగని యాత్రికుడితో కలసి సాగుతున్న సైన్యం.. ప్రజల కష్టాలను కళ్లారా చూస్తూ.. వేల కిలోమీటర్లు అధిగమిస్తూ.. శారీరక బాధను దిగమింగుకుంటూ జనం మోములో చిరునవ్వు కోసం పరితపిస్తున్న ప్రజాసంకల్ప సారథి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన యజ్ఞంలో తోడుగా నిలిచారు. ఎండా వానలకు వెరవకుండా ప్రకృతి పెట్టిన పరీక్షలో నెగ్గారు. పట్టుసడలని ఉక్కు సంకల్పంతో ప్రజల వద్దకు వచ్చిన జగన్కు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అండగా ఉన్నారు. నూనూగు మీసాల యువకుల నుంచి ఏడు పదులు దాటిన పెద్దలు, దివ్యాంగుల నుంచి కళాకారుల వరకు ఎందరో ప్రతిపక్ష నేత అడుగుల్లో అడుగులు వేస్తూ చరిత్రలో భాగస్వాములయ్యారు. వైఎస్ జగన్ తమను పేరుపేరునా ప్రేమగా పిలిచి పలకరిస్తుంటే అది చాలని తృప్తిగా చెబుతారు. జగన్ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను డైరీలో నోట్ చేశామని, దీన్ని ఆయనకు కానుకగా అందచేయనున్నట్లు శ్రీకాకుళానికి చెందిన ఎన్ని శంకరరావు చెప్పారు. జగన్ను సీఎం చేసిన తర్వాతే ఇంటికి రావాలని తన భార్య చెప్పి పంపినట్లు కాంట్రాక్టు ఉద్యోగాన్ని సైతం వదులుకుని పాదయాత్రలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన వి.శంకర్ తెలిపారు. తన తల్లి చనిపోతే జగన్ స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారని గుంటూరుకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త పురుషోత్తమ్ గుర్తు చేసుకున్నారు. దాహార్తిని తీర్చిన మంచినీటి వ్యాన్ ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నవారి దాహార్తిని తీర్చిన ఘనత ఈ వ్యాన్ది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన బుల్లెట్ కృష్ణారెడ్డి ఈ మినీవాటర్ ట్యాంకర్ ఉన్న వ్యాన్ను సమకూర్చి మండు వేసవిలో సైతం చల్లటి నీటిని అందించారు. -
సమష్టి కృషితో..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మనం ఏదైనా చిన్న కార్యక్రమం తలపెడితే ఎన్నో ప్రణాళికలు, మరెన్నో ఉప ప్రణాళికలు, ఇంకెన్నో సర్దుబాట్లు.. మార్పులు, చేర్పులు చేస్తూ అవసరమైన వారందరినీ కలుపుకుంటూ అనుకున్న లక్ష్యం సాధిస్తాం. అటువంటిది ఓ మహాయజ్ఞం విజయవంతం వెనుక ఎంతమంది శ్రమ, మరెంతమంది సహాయ సహకారాలు ఉంటాయో ఊహించలేం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 341 రోజులపాటు నిర్విఘ్నంగా, నిరాటకంగా అప్రతిహతంగా కొనసాగడం వెనుక పట్టుదల, అకుంఠిత దీక్ష, సమిష్టి కృషి, సమయస్ఫూర్తి కనిపిస్తుంది. మహాభారతంలో కౌరవుల దుష్టపాలనను అంతంచేసేందుకు బయల్దేరిన పాండవులకు ప్రతిఒక్కరూ ఒక్కో అస్త్రమై ఏ విధంగా సహకరించారో చంద్రబాబు అవినీతి పాలనపై దండెత్తిన జగన్కు ఆ విధంగా పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజలు అంతగా సహకరించారు. రూట్ మ్యాప్ ఖరారు మొదలు జగన్ బస, సభ నిర్వహణ వరకు ప్రతి ఒక్కటీ పక్కా ప్రణాళికతో విజయవంతమయ్యాయి. చలి గజగజ వణికిస్తున్నా.. జడి వాన కురుస్తున్నా.. మాడు పగిలిపోయేలా ఎండలు కాస్తున్నా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న తమ నేత జగన్కు అండదండలు అందించారు. జగన్ ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు నడవాలో, ఏ ఊరు నుంచి ఏ ఊరికి వెళ్లాలో రూట్ మ్యాప్ ఖరారు చేసిన వారు ఒకరైతే ఆయన బస ఏర్పాటుచూసే వారు మరొకరు. అన్నపానీయాలు, ఆరోగ్య సూచనలు, సలహాలు, వ్యాయామం, శిబిరంలో సమీక్షలు, మర్నాటి ప్రణాళికలు, బహిరంగ సభా వేదికల ఖరారు, ప్రసంగాలు.. ఇలా ఎన్నెన్నో వ్యవహారాలను చక్కబెట్టడంలో పార్టీ నేతలు కృతకృత్యులయ్యారు. వీరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వ్యక్తిగత సహాయకులు కే నాగేశ్వర్రెడ్డి, రవి, పార్టీ ఇతర నేతలు అర్జున్, డాక్టర్ హరికృష్ణ, రఘునాథరెడ్డి, వైద్య సహాయకులు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గురుమూర్తి, ట్రాన్స్పోర్టు బాధ్యుడు జనార్ధన్.. ఇలా ఎందరెందరో ఉన్నారు. తమ నాయకుడు ఎక్కడుంటే ఆయనతో పాటు అడుగులో అడుగువేస్తూ ఉండే శ్రేణులు సైతం జగన్ శిబిరం పక్కనే ఉండేవారు. వీరికీ ఎలాంటి లోటు రాకుండా చూశారు. ప్రతీరోజూ రెండు టెంట్లు.. రూట్ మ్యాప్ ఖరారు చేసిన తర్వాత వైఎస్ జగన్ మధ్యాహ్నం, రాత్రి విశ్రాంతి తీసుకునేందుకు టెంట్లు వేసే బాధ్యతను ఒకరు చేపడితే.. సభా వేదికల ఖరారును రఘునాథరెడ్డి బృందం చేపట్టేది. నిత్యం రెండు గుడారాలను వేయవలసి ఉండేది. మొత్తం మూడు టెంట్లు ఉంటే రెండు ప్రతిరోజూ వేసి ఉంటాయి. మరొకటి రవాణాలో ఉండేది. పాదయాత్ర సాగే మార్గంలోనే జనప్రవాహాన్ని దాటుకుంటూ వీటిని ఒకచోటి నుంచి మరోచోటికి తరలించడం తలకు మించిన పని అయినా ఆ బాధ్యత చేపట్టిన వారు ఎంతో చాకచక్యంతో సమయస్ఫూర్తితో తరలించేవారు. బస కోసం ఎంపిక చేసిన స్థలాన్ని చదును చేయడం మొదలు టెంట్ వేసే వరకు అన్ని పనులను దగ్గరుండి పార్టీ శ్రేణులు చూసుకునే వారు. మధ్యాహ్నం వేసిన టెంట్ను మరుసటి రోజు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునే ప్రాంతానికి చేర్చేవారు. రాత్రి వేసిన టెంట్ను పొద్దున జగన్ పాదయాత్ర ప్రారంభించిన తర్వాత తీసివేసి ఆ మరుసటి రోజు రాత్రి ఎక్కడ బసచేస్తారో అక్కడికి తరలించే వారు. పక్కా ప్రణాళిక.. ఎక్కడ, ఏమిటీ అనేది ఒకసారి ఖరారైన తర్వాత ఎవరు, ఎలా అనేది ముందురోజే ఖరారయ్యేది. ఇందుకోసం ఆయా బాధ్యతలు చేపట్టిన వారు ఆయా ప్రాంతాల్లోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఇతర నేతలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ముందుకు సాగుతుండేవారు. దీంతోపాటు పాదయాత్రలో పాల్గొనే ప్రజలకు సైతం మధ్యాహ్న భోజన సదుపాయం ఉండేది. పాదయాత్రలో వచ్చే వినతులను, ఆరోగ్య సంబంధిత సమస్యలను డాక్టర్ హరికృష్ణ పర్యవేక్షించేవారు. ప్రతి ఫిర్యాదును కే నాగేశ్వరరెడ్డి, డాక్టర్ హరికృష్ణల ద్వారా కృష్ణమోహన్కు అందితే ఆయన కంప్యూటర్లలో నిక్షిప్తం చేయించే వారు. డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గురుమూర్తి వంటి వారు జగన్ ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టేవారు. ఎందరో సారథులు.. రూట్మ్యాప్ ఖరారు మొదలు బహిరంగ సభల ఏర్పాటు వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బృందం చూసేవారు. రూట్ పరిశీలన వంటి వాటిని అర్జున్ పర్యవేక్షించే వారు. జగన్ వ్యక్తిగత భద్రత, రవాణా, గుడారాల ఏర్పాటు వంటి పనులను రఘునాథరెడ్డి, జనార్ధన్ పర్యవేక్షించే వారు. పార్టీ నేతలను సమన్వయం చేసుకునే వారు కె.నాగేశ్వర్రెడ్డి. జగన్కు అవసరమైన సమాచారాన్నీ, వ్యక్తిగత వ్యవహారాలను, ముఖ్య విషయాల్లో అధ్యక్షుడికి ఎప్పటికప్పుడు సమాచారం చేరవేయడంవంటి అంశాలను ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి నిర్వర్తించేవారు. పాదయాత్రలో జగన్కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యక్తిగత సహాయకునిగా రవి వ్యవహరించే వారు. జాతీయ మీడియాతో.. -
‘విజయ సంకల్పం’ ఆవిష్కృతం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ఓ వైపు 16వ నంబర్ జాతీయ రహదారి.. మరోవైపు ఆత్మవిశ్వాసానికి ప్రతీకలా నిలిచిన విజయ సంకల్ప స్థూపం. జన జాతర.. గాల్లోకి ఎగసిన బెలూన్లు.. బాణసంచా పేలుళ్లు.. జై జగన్.. జై జై జగన్.. కాబోయే సీఎం అంటూ మిన్నంటిన నినాదాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్థూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. వేలాది మందితో పాదయాత్రగా వచ్చిన జగన్ స్థూపం ప్రాంగణంలోకి వెళ్లి ఆసాంతం పరిశీలించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడున్న పార్టీ సీనియర్ నేతలు, ఇతర ప్రముఖులను అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఆయనకు విజయ సంకల్ప స్థూపం నమూనాను అందజేశారు. మూడు అంతస్తులతో నిర్మించిన ఈ స్థూపం చరిత్రాత్మకమైనదిగా నిలిచిపోతుందని పార్టీ నేతలు వివరించారు. జనం గుండె చప్పుళ్లకు ప్రతీక.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాగిన ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్ 3,648 కిలోమీటర్ల దూరం నడిచి నూతన అధ్యాయాన్ని లిఖించారు. ఆత్మ విశ్వాసానికి, విజయ సంకల్పానికి సూచికగా 91 అడుగుల ఎత్తులో ఈ స్థూపాన్ని నిర్మించారు. లక్షలాది ప్రజల గుండె చప్పుళ్లకు ఇది చిహ్నంలా నిలిచింది. ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు తమ పాదయాత్రల ముగింపు సందర్భంగా స్థూపాలు నిర్మితమైన ఏకైక ప్రాంతంగా ఇచ్ఛాపురం నిలిచింది. వైఎస్సార్, ఆయన కుమార్తె షర్మిల పాదయాత్ర ముగింపులకు కూడా ఇచ్ఛాపురమే వేదికైంది. ఈ సందర్భంగా స్థూపాలు నిర్మించారు. జాతరను తలపించిన స్థూప ప్రాంగణం ఈ స్థూపం ప్రాంతమంతా జన జాతరను తలపించింది. అక్కడికి చేరుకున్న జనమంతా ఆ స్థూపాన్ని ఆసక్తిగా తిలకించారు. ఫొటోలు దిగారు. జగన్ వచ్చి ఆవిష్కరించేంత వరకు అదరూ స్థూపం గురించే చర్చించుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించాక వేలాది మంది జనం మధ్య వైఎస్ జగన్ బహుదా నది మీదుగా బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఇచ్ఛాపురం పట్టణంలోకి ప్రవేశించారు. కృష్ణా జిల్లా ప్రజలు నాతో ఓ మాటన్నారు. మా అల్లుడుగారు (చంద్రబాబు) ఇక్కడికి ఇల్లరికం వచ్చారన్నా. ఎన్టీఆర్ ఇల్లునే కాదు.. పార్టీనే కాదు.. చివరకు రాష్ట్రాన్నే దోచుకుతిన్నారని చెబుతున్నారు. ఇలాంటి మోసాలు చేసే, అబద్ధాలు చెప్పే వ్యక్తిని పొరపాటున క్షమిస్తే.. తానేమీ చెయ్యకపోయినా అన్నీ చేసినట్టు బుకాయిస్తాడు. అన్నీ ఇచ్చానని, ప్రజలు కేరింతలు కొడుతున్నారని ఎల్లో మీడియాలో రాయిస్తాడు. – ఉయ్యూరు సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబు మాత్రం ఆయన, ఆయన బినామీలతో తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి, రైతుల్ని మోసగిస్తూ అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసే సమయంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ రహస్యాలు కాపాడతానని, అవినీతికి తావు లేకుండా చేస్తాం అని ప్రమాణం చేసిన ఈ పెద్దమనిషి.. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన బినామీలకు చెప్పి దగ్గరుండి ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు, రైతుల్ని మోసం చేసినందుకు బొక్కలో వేయాల్సిన పని లేదా? – విజయవాడ సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రతి సభలోనూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రసంగం ఉత్తేజభరితంగా సాగింది. మాటలు తూటాల్లా పేలాయి. వాటిలో మచ్చుకు కొన్ని... ‘జన్మభూమి కమిటీలుండవు, ఎవరికీ ఒక్క రూపాయి లంచమిచ్చే పరిస్థితి ఉండదు. అప్పులను చూసి ఎవరూ భయపడొద్దు. ఎన్నికల నాటికి మీ అప్పులు ఎంతైతే ఉన్నాయో.. ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల చేతికే అందేలా చేస్తానని హామీ ఇస్తున్నా.’ ‘చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మళ్లీ ఇపుడు నాలుగేళ్లుగా ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. దీంతో మద్య నిషేధం గోవిందా.. అందాక ఉన్న 2 రూపాయలకు కిలో బియ్యం సబ్సిడీ గోవిందా.. అందాక ధైర్యంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా గోవిందా.. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గోవిందా.. వ్యవసాయం గోవిందా.. వర్షాలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం గోవిందా.. పెన్షన్లన్నీ గోవిందా.. అన్నీ గోవిందానే..’ రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలతో రేషన్ షాపుల స్థానంలో బడా మాల్స్ పెట్టిస్తారట. వీటిల్లో ప్రజలకు సరుకులు 20 శాతం తక్కువ ధరకు లభిస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందు రేషన్ షాపుల్లో 20 శాతం కాదయ్యా.. 60 శాతం తక్కువ ధరకు దొరికేవయ్యా.. చంద్రబాబు గారూ.. – ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చంద్రబాబూ.. నేను సూటిగా అడుగుతున్నా.. మహారాష్ట్రకు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యకు టీటీడీ బోర్డు సభ్యత్వం ఇచ్చింది నువ్వు కాదా? నీ బావమరిది బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీస్తున్నాడు. ఆ షూటింగ్ సెట్స్లో వెంకయ్యనాయుడు కన్పించడం లేదా? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనేందుకు అడ్డగోలుగా నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన నువ్వు.. బీజేపీతో కక్కుర్తి పడ్డావు కాబట్టే ఇవాల్టి వరకూ అరెస్టు కాకుండా తిరగగలుగుతున్నావనేది నిజం కాదా? రాష్ట్రంలో చంద్రబాబు, ఈయన కొడుకు చెయ్యని అవినీతి లేదు. ఇసుక నుంచి మొదలు పెడితే మట్టిదాకా.. బొగ్గు, కరెంట్ కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ అసైన్డ్ భూములు.. చివరకు గుడి భూములు కూడా వదలకుండా దోచేస్తున్న పరిస్థితి వాస్తవం కాదా? ఈ నాలుగేళ్ల కాలంలో అక్షరాల నాలుగు లక్షల కోట్ల రూపాయలు సంపాదించావ్. అయినా నీ మీద సీబీఐ విచారణ జరగకుండా కాలం వెళ్లబుచ్చుతున్నావంటే నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నాయి కాబట్టే కదా చంద్రబాబూ? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టులో మీకు నచ్చిన కాంట్రాక్టర్లను బినామీలుగా తీసుకొచ్చి, నామినేషన్ పద్ధతిలో మీ ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచి అక్షరాల రూ.1,853 కోట్లు లూటీ చేశారని కాగ్ నివేదిక చెప్పినా, నీ మీద సీబీఐ విచారణ జరగడం లేదంటే.. నీకు, బీజేపీకి సంబంధాలు ఉన్నట్లే కదా చంద్రబాబూ? నువ్వీమధ్య నీతి ఆయోగ్ సమావేశం జరిగినప్పుడు ఢిల్లీకెళ్లావు. అక్కడ మోదీ కన్పిస్తే నువ్వు చేసిందేంటి? ఆయనకు వంగి వంగి నమస్కారం పెట్టడం నిజం కాదా? చంద్రబాబు నాయుడు ఎప్పటికీ మా మిత్రుడని నిండు లోక్సభలో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనడం నిజం కాదా? – విజయనగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2014 ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్కు వేసినట్లే అని చంద్రబాబు అన్నాడు. బీజేపీతో జత కట్టాడు. ఇప్పుడు జగన్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటాడు. కాంగ్రెస్తో జత కడతాడు. ఆయనకు మంచిదన్నది ఈనాడుకు మంచిదవుతుంది.. అదే రాస్తుంది. టీవీలలో చూపిస్తారు. ఈయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటుంది. – సబ్బవరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చెరువులను బాగు పరచాలంటే మూడడుగులు తవ్వితే ఫర్వాలేదు.. సిల్ట్ తీస్తున్నారులే అనుకోవచ్చు. కానీ పూడిక తీత అని నామకరణం చేసి, దానికి నీరు–చెట్టు అని పేరుపెట్టి ఏకంగా 50 అడుగుల వరకూ తవ్వేస్తే నీళ్లందక రైతులు అగచాట్లు పడుతున్నారు. ముఖ్యమంత్రే దగ్గరుండి ఇలా దోచుకోవడం సబబేనా? – గన్నవరం సభలో వైఎస్ జగన్ ఇక్కడి ఇసుక విశాఖ వెళ్తోందని, లారీ రూ.30 వేలకు అమ్మకుంటున్నారని ప్రజలు చెబుతుంటే.. చంద్రబాబు మాత్రం ఇసుక ఉచితంగా ఇస్తున్నామని చెబుతున్నాడు. మీకు ఇసుక ఉచితంగా ఇస్తున్నారా? ఎవరికిస్తున్నారో తెలుసా? చంద్రబాబు బినామీలకు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు లంచాలు తీసుకుంటున్నారు. అవి చినబాబు దగ్గరకు పోతున్నాయి. అక్కడి నుంచి పెదబాబు దగ్గరకెళ్తున్నాయి. వ్యవస్థ ఇంతగా దిగజారింది. ఇవాళ ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. జేఎన్టీయూ లెక్చరర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ల సిబ్బంది. ఏఎన్ఎమ్లు, సెకెండ్ ఏఎన్ఎమ్లు, విద్యుత్ రంగంలోని కార్మికులు, మోడల్స్ స్కూళ్ల సిబ్బంది, ఆదర్శ రైతులు, గోపాలమిత్రలు, ఆయుష్ ఉద్యోగులు, వీఏవోలు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు, అంగన్వాడీలు.. ఇలా అందరిలోనూ అభద్రత నెలకొంది. ఆసుపత్రులసర్వీసులనూ ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే అంతో ఇంతో ఉద్యోగాలొస్తాయి. దాన్ని చంద్రబాబు దగ్గరుండి నీరుగార్చాడు. వెన్నుపోటు పొడిచాడు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీలున్నాయని లెక్క తెల్చారు. ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా ఇచ్చారా? డీఎస్సీ పరీక్షలు పెట్టడు. కానీ ఆ డీఎస్సీ పరీక్షల కోసం పిల్లలు ప్రిపేర్ కావడానికి టెట్–1, టెట్–2, టెట్–3 అంటాడు. ఈ పెద్దమనిషి వ్యవసాయం దండగన్నాడు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంట్ తీగల మీద బట్టలారేసుకోవాలన్నాడు. ప్రాజెక్టులు కడితే ఖర్చు తప్ప రాబడి ఉండదన్నదీ ఈయనే. సబ్సిడీలు పులిమీద సవారీలాంటివని ఆయన అనడమే కాకుండా..ఏకంగా తన పుస్తకంలో రాసుకున్నాడు.రైతుకు సంబంధించిన అవార్డు ఇలాంటి వ్యక్తికివ్వడం ఆ అవార్డును అవహేళన చేసినట్టు కాదా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనతో వచ్చేదేంటో తెలుసా? కరవు. అందుకే ఆయనకు ఉత్తమ కరవు రత్నఅనే అవార్డు ఇవ్వొచ్చు. కరవొచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైనా ఆదుకోవాలి. కానీ ఈయన మాత్రం ఆదుకోకుండా వెనకడుగు వేస్తాడు. కుంభకర్ణుడిలా నిద్రపోతాడు. అందుకే ఈయనకు కలియుగ కుంభకర్ణ అనే అవార్డుకచ్చితంగా ఇవ్వొచ్చు. ఆయన సీఎం అవుతూనే సహకార డెయిరీలు, చక్కెర ఫ్యాక్టరీలను దగ్గరుండి మూసేయిస్తాడు. అందుకే ఉత్తమ సహకార రంగ ద్రోహి అనేఅవార్డు కూడా ఇవ్వొచ్చని సిఫార్సు చేస్తున్నా. – గజపతినగరం సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ -
ఆఖరిరోజూ అదే ఆప్యాయత
(ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : తూరుపు దిక్కున మబ్బులు ఎర్రబారుతున్నాయి.. అప్పుడప్పుడే మంచు తెరలు విచ్చుకుంటున్నాయి.. చలిపులి నెమ్మదిగా నిష్క్రమిస్తోంది.. సూర్య కిరణాలు ఎగబాకుతున్నాయి.. అప్పటికే దూర ప్రాంతాల నుంచి జనం రాక మొదలైంది.. చురుక్కుమంటున్న వేడిమితో పాటే జన సందోహం అంతకంతకూ పెరుగుతోంది.. పోలీసులు సమాయత్తమవుతున్నారు.. భద్రతా సిబ్బంది బారులు తీరుతున్నారు.. కాన్వాయి సిద్ధమవుతోంది.. జనం కేరింతలు కొడుతున్నారు.. ఎటుచూసినా కిక్కిరిసిన వాహనాలే.. యువతీ యువకుల కోలాహలం.. జై జగన్ జైజై జగన్ అంటూ నినాదాలు హోరెత్తుతున్నాయి.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం అగ్రహారం వద్ద ఏర్పాటుచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి శిబిరం వద్ద బుధవారం ఉ.8 గంటల ప్రాంతంలోని దృశ్యమిదీ. తెల్లవారుజాము నుంచే వచ్చీపోయే వాహనాలతో రద్దీగా ఏర్పడిన ఆ ప్రాంతం నుంచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ప్రజా సంకల్పయాత్రలో చిట్టచివరిరోజు పాదయాత్రను ప్రారంభించనుండడమే ఆ ప్రాంతంలో ఇంత సందడికి ప్రధాన కారణం. ఆఖరి ఘట్టంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అసంఖ్యాకంగా తరలివచ్చిన అశేష జనసందోహం మధ్య ఉదయం సరిగ్గా 8.22 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ తన శిబిరం నుంచి బయటకు వచ్చారు. అదే స్ఫూర్తి, అదే ఆహార్యం.. తెల్లచొక్కా, క్రీమ్ కలర్ పాంటుతో కాళ్లకు బూట్లు ధరించి ముకుళిత హస్తాలతో బయటకు వచ్చిన జగన్కు అప్పటికే గుమికూడిన నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలతో ఎదురేగి అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 2017 నవంబరు 6వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ఏ స్ఫూర్తితోనైతే ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారో సరిగ్గా 341 రోజుల తర్వాత కూడా అదే స్ఫూర్తి, అదే పట్టుదల ఉట్టిపడింది. ప్రసన్న వదనం, చిరునవ్వు, తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో అందరికీ అభివాదం చేస్తూ ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో తుది ఘట్టాన్ని ముగించారు. మొత్తం 13 జిల్లాల మీదుగా ఇచ్ఛాపురం వరకు ప్రజాసంకల్ప యాత్ర సాగింది. పట్టుదల, విలువలు, విశ్వసనీయత, భరోసా వారసత్వంగా పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్ వజ్ర సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిభూతంగా నిలిచింది. విసుగూ, విరామం ఎరుగక.. విసుగూ, విరామం లేకుండా అందర్నీ అప్యాయతతో పలకరిస్తూ ఆయన తన యాత్రను కొనసాగించడం విశేషం. మధ్యమధ్యలో పార్టీ ప్రముఖులను, ప్రజా ప్రతినిధులను, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన బాధ్యులను, కార్యకర్తలను చిరునవ్వుతో ముచ్చటిస్తూనే తనను కలిసేందుకు వచ్చిన అక్కచెల్లెమ్మలను ఆప్యాయతతో పలకరిస్తూ ముందుకు సాగారు. నడిచింది తానే అయినా నడిపించింది మీరేనని ఆయన ప్రజలకు చెప్పిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. జగన్ పలకరింపుతో పులకరించిన ప్రజలు తమ ఊళ్లకు ముందుగానే సంక్రాంతి వచ్చిందంటూ సంబరపడ్డారు. భోజనాలు చేశారా? మధ్యాహ్నం విశ్రాంతి శిబిరం వద్ద తనను కలిసేందుకు వచ్చిన జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మీడియా ప్రతినిధులను ఆత్మీయతతో పేరుపేరునా పలకరించి కుశల ప్రశ్నలు వేశారు. భోజనాలు చేశారా? అని ఆరా తీశారు. ప్రజలు తన కోసం వేచి ఉన్నందున నడుస్తూ దారి మధ్యలోనే మాట్లాడుకుందామంటూ వారితో మాటామంతి కలిపారు. జనం తాకిడి ఎక్కువగా ఉన్నా తాను ఏమి చెప్పదలచుకున్నారో దాన్ని సూటిగా చెప్పారు. భవిష్యత్ కార్యాచరణ గురించి మీడియా పదేపదే అడిగినా జనమే నా ఊపిరి, ప్రజలే నా నమ్మకం, విశ్వాసం అని విస్పష్టంగా చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయబోనన్నారు. ప్రజల పదఘట్టనలతో ఓ పక్క దుమ్మూ, ధూళి ఎగిసిపడుతున్నా, మరోపక్క జనం తనను కలిసేందుకు బారులు తీరి ఉన్నా ఎవరినీ నిరాశపరచలేదు. జగన్ యుగపురుషుడని, తమ ఆత్మబంధువని కొందరు చేసిన ప్రశంసలకు సైతం ఆయన చిరునవ్వు, నమస్కారమే సమాధానమైంది. నిద్ర లేచింది మొదలు నడుం వాల్చే వరకు ప్రజలే శ్వాస, ధ్యాసగా ఆయన తన ప్రజాసంకల్ప యాత్రను ముగించారు. చరిత్ర పునరావృతమైంది.. అంతకుముందు.. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం పట్టణ సమీపంలోని బహుదా నది వంతెనను దాటినప్పుడు వచ్చిన ప్రజల్ని చూసి చాలామంది చరిత్ర పునరావృతమైందంటూ బెజవాడలో కనకదుర్గమ్మ వారథి ఊగిపోయిన తీరును గుర్తుచేసుకున్నారు. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిటకిటలాడుతూ కనిపించింది. బస్సుల్లోని ప్రయాణీకులు చేతులు ఊపుతూ జగన్కు అభినందలు తెలిపితే దానికి ప్రతిగా జగన్ రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఆటోలు, ద్విచక్ర వాహనాల మీద వచ్చిన వాళ్ల సంఖ్యకు లెక్కేలేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె, జగన్ సోదరి షర్మిలమ్మ కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. అక్కున చేర్చుకున్న ఇచ్ఛాపురం.. పాదయాత్రతో పట్టణంలోకి అడుగిడిన జగన్ను ఇచ్ఛాపురం అక్కున చేర్చుకుంది. ఆయన్ను చూసేందుకు ఆబాలగోపాలం పెద్దఎత్తున ఉత్సుకత చూపారు. మేడలు, మిద్దెలు జనసంద్రంతో నిండిపోయాయి. అడుగో జగన్, అడుగడుగో జగన్ అంటూ కేరింతలు కొడుతూ జేజేలు పలికారు. అవ్వా తాతలైతే.. అమ్మ బిడ్డడు ఎట్టయిపోయిండో చూడు అంటూ దూరం నుంచే ఆశీర్వదించారు. చివరి రోజు యాత్ర అంతా ఆయన హావభావాలు, ఆహార్యం, నిరాడంబరత్వం గురించే చర్చ జరిగింది. ఇంత దూరం నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని ప్రజలు ముచ్చటించుకోవడం కనిపించింది. ఆరోగ్యం ఎలా ఉంది బాబూ.. ఉదయం ఇచ్ఛాఫురం నియోజకవర్గంలోని అగ్రహాం వద్ద పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి సాయంత్రం బహిరంగ సభ జరిగేంత వరకూ అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. కొజ్జిరియా గ్రామం చేరే సమయానికే వేలాది మంది ఆయనతో కలిసి అడుగులో అడుగేశారు. కొజ్జిరియా కూడలి ప్రజా సమూహంతో కిటకిటలాడింది. పాత కొజ్జిరియా, ఎ.బలరాంపురం, అయ్యవారిపేట మీదుగా లొద్దపుట్టి వద్ద మధ్యాహ్నం విశ్రాంతి సమయానికి ఆ ప్రాంతమంతా జనప్రభంజనమైంది. ఆయనతో కలిసి నడిచిన వారు కొందరైతే.. సెల్ఫీలు దిగిన వారు మరికొందరు. యాత్ర పొడవునా జగన్ను కలిసేందుకు పెద్దఎత్తున మహిళలు తరలిరావడం విశేషం. ఆయన్ను కలిసిన ప్రతి మహిళా జగన్ ఆరోగ్యం గురించి వాకబు చేశారు. నువ్వు చల్లంగా ఉండాలయ్యా అంటూ ఆశీర్వదించారు. యాత్ర ముగింపు రోజు సైతం ఆయనకు వినతులు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు సాగిన యాత్రలోలాగే తనకు అందిన ఫిర్యాదులను, వినతులను వినమ్రంగా స్వీకరించారు. అక్కడికక్కడ పరిష్కరించదగిన వాటిని అక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని పరిశీలించి ఏమి చేయవచ్చో సూచించమని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశించారు. -
సమర శంఖం పూరించిన జగన్
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రతిష్టాత్మకమైన రీతిలో సుదీర్ఘమైన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసి చరిత్ర సష్టించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇచ్ఛాపురం వేదికగా ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించారు. ఉత్తరాన ఉవ్వెత్తున ఎగసి పడిన జనసంద్రం సాక్షిగా భారీ బహిరంగ సభలో ఆయన చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఊపును, ఉత్సాహాన్ని నింపింది. సుమారు రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్తేజభరితంగా సాగిన ఆయన ప్రసంగం బాగా ఆకట్టుకుంది. రానున్న శాసనసభ ఎన్నికల్లో జిత్తుల మారి, మాయావి అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాతో జరిగేది ఇక యుద్ధమేనని ప్రకటించి దిశానిర్దేశనం చేశారు. తన పాదయాత్ర ముగిసిందని, అయితే నారాసురుడితో ఇకపై అలుపెరుగని రీతిలో పోరాటం చేయబోతున్నామని పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. జగన్ తన ప్రసంగంలో ఆత్మవిశ్వాసం తొణికిస లాడింది. ప్రజలు తనకు తోడుగా నిలిస్తే ప్రభుత్వం మోసాలు, అన్యాయాలపై విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేసి పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. జగన్ పాదయాత్ర ముగింపు ఓ మరపురాని ఘట్టం కనుక 13 జిల్లాల నుంచి నేతలు, కార్యకర్తలు ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు. స్తూపం వద్దకు చేరుకున్నపుడే కార్యకర్తల్లో విజయ సంకల్ప స్థూపం వద్ద ఉత్తేజభరిత వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జగన్ చేసిన ప్రసంగం వారిలో ఇంకా పోరాట పటిమను రేకెత్తించింది. జగన్ అనుకున్నది సాధిస్తాడు పేద ప్రజల పట్ల జగన్కు ఆవేదన ఉందనే విషయం ఆది నుంచీ తెలిసిందేనని, అలుపెరుగకుండా సుమారు దశాబ్ద కాలంగా ఆయన చేసిన పోరాటం వృథాగా పోదని, అనుకున్నది సాధించేదాకా ఆయన నిద్రపోడని తాను విశ్వసిస్తున్నానని వైఎస్సార్ హయాం నుంచీ రాజకీయ పరిణామాలను పరిశీలిస్తున్న పార్టీ సీఈసీ సభ్యుడు అందారపు సూరిబాబు వ్యాఖ్యానించారు. రాయలసీమ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ వి.గోపాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమరం హోరా హోరీగా ఉండబోతోందని జగన్ తన ప్రసంగం ద్వారా స్పష్టమైన సంకేతాలిచ్చారని, దానిని అందిపుచ్చుకుని వీరోచితంగా పోరాడాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. -
ఆకాశమంత అభిమానం..
రాష్ట్రంలోని ప్రతి సమస్య మీదా ఇవాళ నేను పూర్తి అవగాహనతో ఉన్నానని మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. అందుకే ప్రతి పేదవాడికీ మంచి చేయాలనే తపన, ఆలోచన నాలో ఉంది. అందుకే నేను మీ అందరినీ ఒకటే కోరుతున్నాను.ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మారుద్దామని మీ అందరికీ పిలుపు నిస్తున్నాను. తోడుగా కలిసి రమ్మని, మీ బిడ్డను ఆశీర్వదించాలని మిమ్మల్ని అడుగుతున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అందరినీ కోరుకుంటూ నా ఈ ప్రజా సంకల్ప యాత్రను ఇంతటితో ముగిస్తున్నా. ఈ దుర్మార్గపు ప్రభుత్వంపై పోరాటం ఇంతటితో ఆగదు. ఇంకా కొనసాగుతుంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని మనందరం కలిసి సాగనంపుదాం. – ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇచ్ఛాపురం జనసంద్రమైంది. వేలాది మంది ప్రజల అభిమానంతో బహుదా నది ఉప్పొంగింది. అశేష జనప్రవాహంతో రహదారులు కిక్కిరిసిపోయి జాతరను తలపించాయి. యువత కేరింతలు.. అక్కాచెల్లెమ్మల ఆనంద నృత్యాలు.. వైఎస్సార్సీపీ జెండా రెపరెపలు.. జై జగన్ నినాదాలతో ఇచ్ఛాపురం యావత్తూ హోరెత్తింది. ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజైన బుధవారం భావోద్వేగాల మధ్య ప్రజలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెంట అడుగులో అడుగేశారు. ఇరుకు రోడ్లపైనా పరుగులు పెట్టారు. ఇసుకేస్తే రాలనంత మంది ఉన్నా.. వెనుకాడకుండా జగన్ బాటలో నడిచి తమ అభిమానం చాటుకున్నారు. ‘ప్రజా సంకల్పం’ముగింపు సభ నుంచి ‘విజయ సంకల్పానికి’ప్రతినబూనారు. యుద్ధానికి పోతున్న సైన్యంలా.. ప్రజా సంకల్పయాత్ర ఆఖరి ఘట్టాన్ని చూసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా.. వివిధ రాష్ట్రాల నుంచి సైతం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి కదలివచ్చారు. దీంతో దారులన్నీ వేలాది వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా జనం.. జనమే. బుధవారం ఉదయం పాదయాత్ర శిబిరం నుంచి బయటకు వచ్చిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కొద్దిక్షణాల్లోనే అశేష జనసంద్రంలో కలిసిపోయారు. అంతమందిలో ఆయనెక్కడున్నారో గుర్తించడం చాలా మందికి కష్టమైపోయింది. పాదయాత్ర మొదలైన ఐదు నిమిషాల్లోనే కిలోమీటర్ల కొద్దీ జనం ఆయన వెన్నంటే ముందుకు సాగారు. ‘ఈ దృశ్యాన్ని దూరం నుంచి చూస్తే ఓ సైన్యం యుద్ధానికి పోతున్నట్టుగా ఉంది’అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించగా.. ‘అవును ఇది చంద్రబాబు మీదకు సాగే యుద్ధమే. అవినీతిని అంతం చేసే సైన్యమే’అంటూ ఇచ్ఛాపురానికి చెందిన మారం రాజులు అనే వ్యక్తి ఉద్వేగంతో చెప్పాడు. ఇచ్ఛాపురం సభ ఓ చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని పలువురు పేర్కొన్నారు. జగన్ ప్రసంగం సాగుతున్నంత సేపూ ప్రజలు జగన్ నినాదాలు చేస్తూ, చప్పట్లతో ప్రతిస్పందించారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనను లక్ష్యంగా చేసుకుని జగన్ నిప్పులుచెరుగుతున్నప్పుడు.. ప్రజలు సైతం ఆవేశంతో ఊగిపోయారు. ‘కాబోయే సీఎం..’అంటూ జేజేలు పలికారు. పండుగ ముందే వచ్చింది.. ఇచ్ఛాపురం వీధుల్లో ఎక్కడ చూసినా సందడే. ఏ గడపకెళ్లినా ఆనందమే. పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని చూడ్డానికి ఆ ఊరివాళ్లు తమ బంధువులను, స్నేహితులను ఇళ్లకు పిలుచుకున్నారు. ‘వైఎస్ కుటుంబంలో మూడో వ్యక్తి పాదయాత్ర మా ఊరిలో ముగుస్తోంది. మాకిప్పుడే సంక్రాంతి వచ్చినట్టు ఉంది’అని ఏరాసుల రామారావు ఆనందం వ్యక్తం చేశాడు. ‘వైఎస్ను, ఆయన కూతురు షర్మిలమ్మను, ఇప్పుడు జగన్ను.. ముగ్గుర్నీ కలిశాను. చాలా సంతోషంగా ఉంది’అని పద్మజ తెలిపింది. మరికొందరు పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయ సంకేతాలతో ఇళ్ల ముందు రంగవల్లులు దిద్దారు. ‘పండగకు తెచ్చుకున్న దుస్తులు ఇప్పుడే వేసుకున్నాం’అని ఈశ్వరి, కల్పన తెలిపారు. ఈ బాబును సీఎంగా చూడాలనుందయ్యా.. పాదయాత్ర ముగింపు రోజున కొందరు ఉద్వేగానికి గురయ్యారు. ‘ముగింపు సన్నివేశం చూడ్డానికి వచ్చారా?’అని రామశౌరమ్మ అనే మహిళను అడగ్గా.. ‘కేవలం చూడ్డానికే రాలేదయ్యా... ఈ బాబును సీఎంగా చూడాలనుంది. ఏడాదిగా నడిచాడు బిడ్డ. ఎలా ఉన్నాడో చూద్దామనొచ్చాం. ఈయనొస్తే మాలాంటోళ్లకు మంచి జరుగుతుందయ్యా..’అంటూ ఉద్వేగానికి గురైంది. ‘తెలుగుదేశపోళ్లు ఎన్ని కష్టాలు పెట్టారు ఆ బిడ్డను? కష్టం ఊరికే పోదయ్యా’అని కాల ముత్యాలు, మద్ది ఈశ్వరమ్మ పేర్కొన్నారు. ఈ ఇద్దరూ స్థూపం దగ్గర ఇతర మహిళలతో కలిసి ఆనందంగా నృత్యాలు చేశారు. మరోవైపు ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజును చిత్రీకరించేందుకు పలు జాతీయ, ప్రాంతీయ చానెళ్లు పోటీపడ్డాయి. ఎవర్ని కదిపినా జగన్ పాదయాత్ర ఓ ప్రభంజనమంటూ వర్ణిస్తుండటంతో జనాభిప్రాయమేంటో అర్థమైందంటూ పలువురు విలేకరులు వ్యాఖ్యానించారు. మరోవైపు వైఎస్ జగన్ కూడా అంత జన ఒత్తిడిలోనూ ప్రతి ఒక్క మీడియా ప్రతినిధితోనూ మాట్లాడి తన మనోగతాన్ని వివరించారు. వైఎస్సార్సీపీలోకి ప్రముఖ సినీనటుడు భానుచందర్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజైన బుధవారం పార్టీ లో పలువురు చేరారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కొత్త అగ్రహారం వద్ద ఏర్పాటు చేసిన పాదయాత్ర శిబిరంలో ప్రముఖ సినీనటుడు భాను చందర్ వైఎస్ జగన్ను కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకురాలు, ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి కుమారుడు బొడ్డేపల్లి రమేశ్ పార్టీలో చేరారు. ఆయనకు వైఎస్ జగన్ పార్టీ కండువా వేసి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ‘విజయ సంకల్పం’ ఆవిష్కృతం జై జగన్.. జై జై జగన్.. కాబోయే సీఎం అంటూ మిన్నంటిన నినాదాల మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ప్రజల హర్షధ్వానాలు, కరతాళ ధ్వనుల మధ్య విజయ సంకల్ప స్తూపాన్ని ఆవిష్కరించారు. 2017, నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా దీనిని ఆవిష్కరించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. -
అధర్మంపై యుద్ధమిది
‘మీ అందరికీ నేనొక్కటే చెబుతున్నా.. నేను 3,600 కిలోమీటర్లకు పైగా నడిచా.. దారిపొడవునా ప్రతి పేదవాడి కష్టం చూశా.. ప్రతి పేదవాడి పరిస్థితిని ఎలా మెరుగు పరచాలనే ఆలోచనతోనే ఈ 14 నెలల సమయం గడిచి పోయింది. మామూలుగా ఒక సామెత ఎపుడూ చెబుతూ ఉంటారు. ఆరు నెలలు ఎవరితోనైనా కలిసి ఉంటే వాళ్లు వీళ్లవుతారు.. వీళ్లు వాళ్లవుతారు అని. 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పేదవారి కష్టాలు వింటూనే, వారితో నడుస్తూనే, వారికి తోడుగా ఉంటూనే వారికి భరోసా ఇస్తూనే నడిచాను. గ్రామస్థాయిలో నవరత్నాలను ప్రతి పేదవాడి ఇంటికి చేరుస్తాం. నవరత్నాల్లో ప్రకటించిన పథకాలే కాకుండా రేషన్ బియ్యం కూడా నేరుగా లబ్ధిదారుడి ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం. నవరత్నాల్లో పథకాల కోసం లబ్ధిదారులు ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా, ఎవరికీ లంచం ఇవ్వకుండా నేరుగా ఆ లబ్ధిదారుడి ఇంటికి పథకాలు వచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నా. చంద్రబాబు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ, ఏదైనా పని గానీ చేసేటప్పుడు ఆయన ఆలోచించేది కమీషన్లు ఎంతవస్తాయి, డబ్బులు ఎంత దోచుకుందామా అని చూస్తారు.మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నాకు డబ్బంటే వ్యామోహం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా నా ఆలోచనలు ఉండవు. నా ఆలోచన ఒక్కటే. అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు ప్రజలకు మంచి చేయాలని.. 30 ఏళ్ల పాటు పాలించాలని నాకున్న ఆశ. జరిగిన మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత నా ఫొటో ప్రజల ఇంట్లో నాన్న ఫొటోతో పాటు ఉండాలన్నది నా ఆశ. మన పార్టీ కో ఆర్డినేటర్లకు చెబుతా ఉన్నా. నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చండి. అప్పుడే చంద్రబాబు లంచాలతో సంపాదించిన సొత్తు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఎంత వెచ్చించినా కూడా ప్రజలు ఆ జరగబోయే మేలును చూసి చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుంటారు కానీ ఓట్లు మాత్రం వేయరు. నవరత్నాలు అందరికి కన్పించేలా ప్రతి గ్రామంలోనూ ఫ్లెక్సీలు పెట్టండి. రైతు తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం కడుతుంది రైతుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ సభలో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతున్నా. ప్రస్తుతం రైతుల బీమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తుపానులు, కరువు వచ్చినా ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆ సొమ్ము వస్తుందో.. రాదో తెలియదు. ఎందుకు ప్రీమియం తీసుకుంటున్నారో తెలియదు. రైతన్నల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నా. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్ సొమ్ము పేదవాడికి ఇచ్చేందుకు ప్రభుత్వమే కృషి చేస్తుందని ఈరోజు ఇక్కడ కొత్తగా చెబుతున్నా. ఆక్వా రంగానికి రూ. 1.50లకే విద్యుత్ ఇస్తామని ఇదివరకే చెప్పా. వీటన్నింటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది. ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మరో మూడు నెలల్లో జరుగనున్న ఎన్నికల్లో నారాసురుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో, ఎల్లో మీడియాతో జరిగే యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ తనకు తోడుగా నిలవాలని, తనను ఆశీర్వదించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారు. మనం చేయబోయే యుద్ధం ఒక్క నారాసురుడితోనే కాదని, ఆయనకు మద్దతిస్తున్న రెండు పత్రికలు, పలు టీవీ చానెళ్లపై కూడా అని జగన్ ప్రజలను అప్రమత్తం చేశారు. చంద్రబాబు మాదిరిగా తనకు డబ్బుపై వ్యామోహం లేదని, అయితే ఒక్కసారి అధికారంలోకి వచ్చాక 30 ఏళ్లపాటు రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మంచి చేయాలని, 30 ఏళ్ల పాటు పరిపాలించాలనే తపన ఉందన్నారు. జిత్తులమారి, మాయావి అయిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటారని, ఎన్నికల్లో ఆయన చేయని అన్యాయం అంటూ ఏమీ ఉండదని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజలంతా ఈ యుద్ధంలో తనకు తోడుగా నిలిస్తే ఈ ఎన్నికల్లో జరిగే అన్యాయాలను, మోసాలన్నింటినీ జయిస్తానని జగన్ ధృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని, ఖాయంగా ప్రజావ్యతిరేక చంద్రబాబు పాలనను సాగనంపే సమయం ఆసన్నం అయిందని ధీమా వ్యక్తం చేశారు. 341 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన అనంతరం చివరి ఘట్టమైన ఇచ్ఛాపురంలో బుధవారం పాత బస్టాండు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఉత్తేజ పూరితంగా ప్రజలను, పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే.. యుద్ధం బాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా ‘‘ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, తోడుగా రమ్మని కోరుతున్నాను. కారణం ఏమిటంటే.. ఎన్నికల్లో జరుగబోయే ఈ యుద్ధం ఒక్క చంద్రబాబునాయుడు వంటి నారా రాక్షసుడితో మాత్రమే కాదు. ఇతనికి తోడుగా ఎల్లో మీడియా ఉంది. వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. రెండు పత్రికలు, ఈ పెద్దమనిషికి తోడుగా ఉన్న అనేక చానెళ్లు.. వీటన్నింటితో కూడా యుద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కాక ఈ జిత్తుల మారి మాయావి చంద్రబాబు ఎలాంటి పొత్తులైనా పెట్టుకుంటాడు. ఈ పెద్దమనిషి చేయని అన్యాయం, మోసం అంటూ లేదు. మీరు తోడుగా ఉంటే ఈ అన్యాయాలు, మోసాలన్నింటినీ జయిస్తాను. అందుకే నాడు తోడుగా ఉండి, ఆశీర్వదించమని ప్రతి అక్కా చెల్లెమ్మ, ప్రతి అవ్వా తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికి పేరు పేరునా విన్నవించుకుంటున్నా. మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెబుతున్నాను. ఎంత మందికి భరోసా కల్పించామన్నదే ముఖ్యం.. హైదరాబాద్ నుంచి దుబాయ్ ఎంత దూరం ఉందో మీకు తెలుసా? అని ఇవాళ ఎవరో నాన్ను అడిగారు. ఎంత అని అడిగాను. 3 వేల కిలోమీటర్లు అని చెబుతూ.. మీరు 3,648 కి.మీ నడిచారన్నా అని చెప్పారు. అదే మాదిరిగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎంత దూరం ఉందో మీకు తెలుసా అన్నా? అని కూడా అడిగారు. ఎంత? అని అడిగా.. అక్షరాలా 3,440 కి.మీ అని చెప్పారు. రికార్డులు దాటేసి ఏకంగా అంతకన్నా ఎక్కువ స్థాయిలో నడవగలిగాం అంటే నిజంగా ఇది కేవలం మీ ఆప్యాయతలు, ఆత్మీయతలు, పైనుంచి ఆ దేవుడి ఆశీస్సుల వల్లే జరిగాయని చెప్పటానికి ఏమాత్రం కూడా సంకోచించను. ఇవాళ ఎంతదూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంతమందిని ప్రత్యక్షంగా కలిశాం? ఎంతమందికి మనం భరోసా ఇచ్చామన్నదే నిజంగా ముఖ్యమైన అంశం. మోసాల్లో చంద్రబాబు పీహెచ్డీ.. చంద్రబాబు నాయుడిగారి నాలుగున్నరేళ్ల పాలనలో ఎలాంటి పనులు చేశాడో చూశామన్నా. ఆయన చేసిన పరిపాలన గురించి ప్రజలు చెబుతూ ఉంటే, జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆందోళన కలుగుతోంది. ఒక వంక రాష్ట్రంలో కరువు ఇంకో వంక తుపాన్లు.. ఒక వంక రాష్ట్ర విభజన నష్టం.. ఇంకో వంక చంద్రబాబు నాయుడి గారి దోపిడీతో నష్టపోయిన రాష్ట్రం.. మరోవంక వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్న పరిస్థితులు. మరోవంక రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం.. ఒక వంక నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం మరోవంక నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తా ప్రతి నెలా అని చెబుతూ మోసగించిన చంద్రబాబు నైజం. ఒకవంక 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి చేసిన వాగ్దానాలు.. మరోవంక 650 వాగ్దానాలు తన మ్యానిఫెస్టోలో పెట్టి, ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి.. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి? అని పీహెచ్డీ చేసిన వ్యక్తి మరోవంక. ఆయన చేసిన హామీలు, మోసాలు మరోవంక.. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా గుండె మండుతూ ఉంటుంది. పిల్లల్ని అవిటివారిగా మార్చి అడుక్కునే వారికి, రాష్ట్రం కష్టాల్లో ఉందని పదేపదే చెబుతూ విచ్చలవిడిగా దోచుకుంటున్న ఈ చంద్రబాబు గారికి ఏమైనా తేడా ఉందా? అని మీ అందరి తరపున అడుగుతున్నా. ఐదెకరాల్లో అర బస్తా పండింది.. ఇదీ రెయిన్ గన్ నిర్వాకం బాబు పాలన మీద 14 నెలల నా పాదయాత్రలో అనుభవాలను కొన్నిటిని ఈరోజు మీతో పంచుకుంటా... అనంతపురం జిల్లాలో నాకు శివన్న అనే రైతు కలిశాడు. తన పొలంలో రెయిన్గన్ల నుంచి గురించి కథలు కథలుగా చెప్పాడు. చంద్రబాబు రెయిన్ గన్ అని చెప్పి చూపించిన సినిమా ఎలా ఉందో కంటికి కట్టినట్లుగా వివరించాడు. అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎలా కుదేలైపోయిందో, రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో, లక్షల మంది ఎలా వలసలు వెళ్తున్నారో కళ్లారా చూశానని చెప్పాడు. శివన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు నా వద్దకు వచ్చాడు. ‘‘అన్నా రూ.90 వేలు అప్పు చేసి వేరుశనగ పంట వేశా’’ అని చెప్పాడు. మరి పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘‘అన్నా బాబు గారు వచ్చారు. బాబుగారితోపాటే ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా ఎప్పుడు వచ్చినా చంద్రబాబుగారితోపాటు. అది.. బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా..’’ అని చెప్పాడు. ‘‘అన్నా.. యథాప్రకారం కరవు వచ్చిందన్నా. రైతులు విలవిలలాడుతున్నారన్నా. చంద్రబాబు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువుతో చచ్చిపోతున్నామయ్యా... పంటలు ఎండిపోతున్నాయయ్యా.. సాయం చేయండయ్యా..’’ అని శివన్న చంద్రబాబు గారిని గట్టిగా అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా?.. ‘‘అయ్యో కరువు వచ్చిందా? నాకు ఇంతవరకు తెలియదే? నాకు ఎప్పడూ చెప్పలేదే’’ అని అధికారులను తిట్టారట రైతన్నల ఎదుట. ఈ పెద్ద మనిషి చంద్రబాబు డ్రామా అంతటితో ఆగిపోలేదు. రెయిన్గన్లు అని మొదలు పెట్టాడు. పొలంలో రెయిన్గన్ ఏర్పాటు చేయడం కోసం అధికారులు యాధృచ్ఛికంగా శివన్నను ఎన్నుకున్నారు. ‘‘అన్నా అధికారులు నా దగ్గరకొచ్చారు. పంటలను కాపాడతామని పొలంలో రెయిన్గన్ సిద్ధం చేశారు. ఒక పంట కుంట తవ్వి టార్పాలిన్ వేశారు. ఒక ట్యాంకుతో నీళ్లు నింపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి రెయిన్ గన్ ప్రారంభించి అలా.. అలా.. నాలుగు నీళ్లు చల్లారు. ఫొటోలకు పోజులు కొట్టాడన్నా. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత భోజనం చేద్దామని మధ్యాహ్నం ఇంటికి వెళ్లానన్నా. అంతే.. అధికారులు టార్పాలిన్ మడత పెట్టేశారు. రెయిన్గన్ చంకన పెట్టుకుని వెళ్లిపోయారన్నా..’’ అని శివన్న చెప్పాడు. శివన్న సాయంత్రం పొలం వద్దకు వెళ్లేసరికి పంటకుంట ఏదీ లేదు. పంటకుంటలో నీళ్లు కూడా లేవు. ఇదీ శివన్న పరిస్థితి. శివన్న ఐదు ఎకరాల్లో వేరు శనగ వేస్తే ఎంత పంట పండిందో తెలుసా? కేవలం అర బస్తా. ‘‘అన్నా ఇదీ పరిస్థితి. అప్పులు తీర్చడం కోసం, బతకడం కోసం ఇవాళ వడియాలు, బొరుగులు (ఉత్తరాంధ్రలో మూరీలు) అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నానన్నా’’ అని శివన్న నా వద్దకు వచ్చి చెప్పాడు. శివన్న నా వద్దకు వచ్చినప్పుడు మైక్ ఇస్తే ఏం చెప్పాడో తెలుసా?.. ‘క్రితంసారి సెంద్రబాబుకు ఓటేశా. చివరకు ఇలా అయ్యా. ఇక మనకు సెంద్రబాబుతో సావాసం వద్దబ్బా...’ అన్నాడు. అందుకే గ్రామస్థాయిలో రైతులు ఇవాళ చంద్రబాబును ఏమంటున్నారో తెలుసా? ‘‘నిన్ను నమ్మం బాబూ..’’ అని పిలుపునిస్తున్నారు. రైతులు ఆల్లాడుతుంటే జాతీయ రాజకీయాలంటూ డ్రామాలు.. చంద్రబాబు హయాంలో ఐదుకు ఐదేళ్లు ఒకవంక కరువు మరోవంక తుపాన్లు. కానీ రైతులకు మాత్రం ఇన్పుట్ సబ్సిడీలు రావు. రైతులు అల్లాడుతున్నా క్యాబినెట్ సమావేశం నిర్వహించి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన చెయ్యరు. 2018 జూన్ 1వ తేదీ నుంచి ఈనెల 2వతేదీ వరకు అంటే వారం క్రితం వరకు వర్షపాతం చూస్తే కోస్తాలో – 23.1 శాతం లోటు ఉంది. రాయలసీమలో –50.3 శాతం లోటు ఉంది. ఇంత దారుణంగా రైతన్నల పరిస్థితి ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు. ఓ రోజు బెంగళూరు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే అనంతపురం ఉంటుంది. కానీ అక్కడకు వెళ్లి కరువు బారిన పడిన రైతులకు అండగా ఉందామనే ఆలోచన చంద్రబాబుకు రాదు. మరుసటి రోజు మళ్లీ విమానమెక్కుతాడు. జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్లి స్టాలిన్తో కలసి ఇడ్లీ, సాంబార్ తింటాడు. చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. అక్కడ రైతులు అల్లాడుతున్నారనే ధ్యాస చంద్రబాబుకు ఏమాత్రం పట్టదు. అంతటితో ఆగడు. ఎలాగూ ప్రభుత్వమే కదా విమానం ఖర్చులు భరించేది అనుకుని కోల్కతా వెళతాడు. మమతా బెనర్జీతో కలసి చికెన్ తింటాడు ఈ పెద్దమనిషి. అందుకే నమ్మం బాబూ.. నమ్మం అంటున్నారు.. ఆయన (చంద్రబాబు) వచ్చాక పంటల విస్తీర్ణం, దిగుబడి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. 2008–09 పంటల విస్తీర్ణం లెక్కలు చూస్తే వైఎస్ హయాంలో 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తే.. 2017–18లో చంద్రబాబు పాలనలో అది 40 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ హయాంలో 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే చంద్రబాబు పాలనలో 157 లక్షల టన్నులకు పడిపోయింది. కానీ ఈ పెద్దమనిషి చంద్రబాబు నదుల అనుసంధానం అంటాడు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించానని బొంకుతాడు. బొంకడంలో ఇంకా నాలుగడుగులు ముందుకేసి రెయిన్గన్లతో కరువును జయించానంటాడు. దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రంలోనే ఉందని బొంకుతాడు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని చూసినప్పుడు రైతన్నలు (ఏమంటారు? అని సభికులను జగన్ ప్రశ్నించగా నమ్మం బాబూ అంటామని ముక్తకంఠంతో చెప్పారు) నమ్మమంటే నమ్మమంటారు. రైతుల నెత్తిన అప్పుల కుంపటి ఇవాళ రైతుల బతుకులు ఎలా ఉన్నాయో ఇటీవలే నాబార్డు ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రైతుల నెత్తిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. నాబార్డు నివేదిక ప్రకారం వ్యవసాయదారుల సగటు ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 28వ స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన ఘరానా మోసంతో రైతులు కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. అప్పులపై వడ్డీలు కట్టలేక, కొత్తగా అప్పులు పుట్టక అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.87,612 కోట్లుగా ఉన్న రైతుల అప్పులు ఇవాళ తడిసిమోపెడై, వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాలా రూ.1,30,000 కోట్లకు ఎగబాకిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. రుణమాఫీ చేస్తానని చెప్పి మోసాన్ని మిగిల్చాడు. రైతులకు చేస్తానన్న రుణమాఫీ పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. చంద్రబాబు చేసిన మరో అన్యాయం.. రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ డబ్బులను పూర్తిగా కట్టకుండా మానేయడం. అందుకే ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చంద్రబాబును (ఏమంటున్నారు? అని జగన్ సభికులను ప్రశ్నించారు) ‘‘నిన్ము నమ్మంగాక నమ్మం..’ అని అంటున్నారు. నాలుగున్నరేళ్లలో రైతన్నలకు ఏం పంటకైనా గిట్టుబాటు ధర లభించిందా? పంట వేసే ప్రతి రైతును అడుగుతున్నా (రాలేదు.. రాలేదు అంటూ అందరూ రెండు చేతులు పైకి ఎత్తి చెప్పారు) ధాన్యం సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు. దళారీలకు కెప్టెన్లా చంద్రబాబు ఓ ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకు తపించాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆరాటపడాలి. కానీ తన హెరిటేజ్ షాపుల కోసం ఈ పెద్దమనిషి చంద్రబాబు దళారీలకు కెప్టెన్ అయ్యారు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే పొట్లాల్లో పెట్టి రెండింతలు, మూడింతలు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న పరిస్థితి సాక్షాత్తూ ముఖ్యమంత్రే చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఇవాళ ఎలా ఉందో చిన్న ఉదాహరణ చెప్పాలంటే.. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.750. అయితే ఖరీప్ పంట చేతికొచ్చినా కూడా అమ్ముకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. ఉద్దానం.. ఇక్కడ జీడిపప్పు ఫేమస్.. పలాస జీడిపప్పు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. కిలో రూ.600కి కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉద్దానం రైతన్నలు ఉన్నారు. కానీ ఇదే పలాస జీడిపప్పును చంద్రబాబు హెరిటేజ్ షాపుల్లో కిలో రూ.1,110 చొప్పున అమ్ముతున్నారు. ఇంత దారుణమైన మోసాలు రైతులకు చేస్తున్నాడు కాబట్టే ‘‘నిన్ను నమ్మం బాబూ..’’ అని అంటున్నారు. అక్క చెల్లెమ్మలను మోసగించారు.. దారి పొడవునా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు తమ బాధలను చెప్పారు. చంద్రబాబు మోసాల కారణంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు కట్టలేదని అక్క చెల్లెమ్మల్లను కోర్టు మెట్లు ఎక్కించిన పరిస్థితి చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో బ్యాంకు సిబ్బంది నేరుగా అక్క చెల్లెమ్మల ఇళ్లపై దాడులు చేసి తాళాలు వేసిన ఘటనల గురించి అక్కడ పాదయాత్ర సమయంలో చెబితే బాధనిపించింది. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రాలేదు కానీ వడ్డీలు కట్టడానికి తాళిబొట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లు ఉంటే ఇప్పుడవి తడిసి మోపెడై వడ్డీలపై వడ్డీలు పడి రూ.22,174 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాననే హామీ గాలికి ఎగిరిపోయింది. డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు హయాంలో 2016 అక్టోబర్ నుంచి సున్నా వడ్డీ డబ్బులను కట్టకుండా ఎగ్గొట్టారు. ఇటువంటి ఎగనామం పెడుతున్న చంద్రబాబును చూసినప్పుడు ఆ అక్క చెల్లెమ్మలు ‘‘నిన్ను నమ్మం బాబూ నమ్మం..’’ అంటున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఊడగొడుతున్నారు.. చంద్రబాబు హయాంలో ఇవాళ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయదు. నిరాశతో ఉన్న యువత.. అన్నా బాబు వచ్చాడు కానీ జాబు రాలేదన్నా అంటున్నారు. బాబు వచ్చాడు.. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడన్నా అంటున్నారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణశాఖలో 3,500 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ల ఉద్యోగాలు కూడా గోవిందా.. వేల సంఖ్యలో గోపాలమిత్రల ఉద్యోగాలూ గోవిందా. ఆయుష్లో పని చేస్తున్న అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు కూడా గోవిందా.. సాక్షర భారత్లో పనిచేస్తున్న 30 వేల మంది అక్కాచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. దశాబ్దాలుగా పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టిన 85 వేల మంది మహిళల ఉద్యోగాలు సైతం గోవిందా.. రాష్ట్ర విభజన జరిగే నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తేల్చారు. ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 95 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ చంద్రబాబు హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపానపోలేదు. చంద్రబాబు పాలన చూసి యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. చంద్రబాబు పాలనలో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడం లేదు. మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశామని ఊదరగొడుతున్నాడు. జాబు రావాలంటే.. బాబు రావాలని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు ఉద్యోగం ఇస్తాడని, ఉపాధి కల్పిస్తాడని.. ఈ రెండూ ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాడని టీడీపీ నేతలతో చెప్పించాడు. చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖలను ఇంటింటికీ పంచి పెట్టారు. ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు మోసం చేశాడు. రాష్ట్రంలో 1.72 కోట్ల ఇళ్లు ఉండగా, తీరా ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఆ ఇళ్ల సంఖ్యను 3 లక్షలకు కుదించాడు. నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని రూ.వెయ్యికి తగ్గించాడు. మూత పడుతున్న పరిశ్రమలు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలే లేవు. కరెంటు బిల్లులు, రాయల్టీలు పెంచడం వల్ల, ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా ఉన్న పరిశ్రమలే మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సహకార డెయిరీలు, సహకార చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. గతంలోనే చంద్రబాబు చాలా పరిశ్రమలకు తాళాలు వేసి, అమ్మేశారు. ఇప్పుడు అరకొరగా మిగిలి ఉన్న పరిశ్రమలను సైతం అమ్మేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు. కర్నూలులో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రకాశం జిల్లాలో గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్పిన్నింగ్ మిల్లులు మూతపడ్డాయి. ఉత్తరాంధ్రలో జ్యూట్ మిల్లులు, ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడడాన్ని ఈ పాదయాత్రలో చూశా. వాళ్ల దీనగాథలను విన్నా. ఇంతకంటే సిగ్గుమాలిన సీఎం ఉండరేమో! రాష్ట్రంలో చదువుల పరిస్థితి దారుణంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కవిటిలో పాదయాత్ర చేస్తుండగా విద్యార్థులు నన్ను కలిశారు. అక్కడ జూనియర్ కాలేజీలో 400 మందికిపైగా పిల్లలు చదుకుంటున్నారు. అందులో దాదాపు 240 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఆ కాలేజీలో కనీసం బాత్రూమ్లు కూడా లేవని అక్కడి విద్యార్థినులు చెప్పారు. కానీ, మన రాష్ట్రంలో అందరికీ బాత్రూమ్లు అందుబాటులో ఉన్నాయని, ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ కార్యక్రమంలో మన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు టీవీల్లో ఊదరగొడుతున్నాడు. పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు నిజంగా సిగ్గుపడాలి. జూనియర్ కాలేజీలో ఆడపిల్లల కోసం కనీసం బాత్రూమ్లు కూడా లేవంటే ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరూ ఉండరేమో! బాబు బినామీ స్కూళ్లకు మేలు చంద్రబాబు తన బినామీల ప్రయోజనాల కోసం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 6 వేల స్కూళ్లను మూసివేయించారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లను సైతం ఎత్తివేశారు. స్కూళ్లలో చాలా పుస్తకాలు ఇవ్వలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నాసిరకం యూనిఫామ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామందికి యూనిఫామ్లే పంపిణీ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా, చంద్రబాబు వాటిని భర్తీ చేయకుండా పాఠశాలలను నాశనం చేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులను ఆరు నెలలుగా ఇవ్వడం లేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లకుండా ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లేలా కుతంత్రాలు పన్నుతున్నాడు. తద్వారా తన బినామీలైన నారాయణ, చైతన్య స్కూళ్లు వేలకు వేలు దోచుకునేలా దోహదపడుతున్నాడు. ‘నిన్ను నమ్మం బాబూ’ అంటున్నారు పాదయాత్రలో చాలామంది విద్యార్థులు నన్ను కలిశారు. వారి బాధలు చెప్పుకున్నారు. మరిచిపోలేని ఓ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా కృష్ణారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఓ చిన్న గుడిసె. ఆ గుడిసె ఎదురుగా ఓ ఫ్లెక్సీ కనిపించింది. అందులో ఓ పిల్లాడు ఉన్నాడు. దానికి పూలదండ కూడా వేసి ఉంది. తల్లిదండ్రులిద్దరూ ఏడుస్తూ నా దగ్గరికొచ్చారు. ఆ తండ్రి పేరు గోపాల్ అన్న. ఫ్లెక్సీపై ఉన్న ఫొటో తన కొడుకుదని ఈ తండ్రి చెప్పాడు. ఏమైందని అడిగా. తన కుమారుడు తెలివైన విద్యార్థి అని, ఇంజనీరింగ్లో సీటు వచ్చిందని, కాలేజీలో చేర్పించే ప్రయత్నం చేశామని, ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైగా ఉన్నాయని అన్నాడు. ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ కింద కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తుందట అని చెప్పాడు. రూ.70 వేలు అప్పు చేసి తన కుమారుడిని ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదివించానని అన్నాడు. అప్పు తీసుకొచ్చానన్న సంగతి తన కుమారుడికి తెలుసని, బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. రెండో సంవత్సరం తన బిడ్డ ఇంటికొచ్చి నా చదువు కోసం ఈసారి ఏం చేస్తావని అడిగాడని చెప్పాడు. ఏదో ఒకటి చేస్తాలే, నువ్వయితే కాలేజీకి వెళ్లి బాగా చదువుకుని గొప్ప వాడివి కావాలని సూచించానని అన్నాడు. తన చదువుల కోసం తన కుటంబం ప్రతిఏటా అప్పులు చేయడం చూసి తట్టుకోలేక ఆ పిల్లాడు ఇంటి నుంచి నేరుగా హాస్టల్కు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తండ్రి ఆవేదనను ఎప్పటికీ మర్చిపోలేను. ఇవాళ రాష్ట్రంలో చాలామంది తల్లిదండ్రులు గోపాల్ అన్న లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ రాక, వచ్చినా ఆ సొమ్ము సరిపోక, చదువుల కోసం ఆస్తులు ఆమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పేద రోగుల పరిస్థితి దయనీయం రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా పెద్దరోగం వస్తే అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులకు 8 నెలలుగా బకాయిలను చెల్లించడం లేదు. అందువల్ల ఆరోగ్యశ్రీ కింద సేవలను ఆయా ఆసుపత్రులు పూర్తిగా నిలిపివేశాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక్కడ 4 వేలమందికిపైగా కిడ్నీ వ్యాధుల బాధితులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇందులో కేవలం 1,400 మందికి మాత్రమే ఉచితంగా డయాలసిస్ సేవలు అందుతున్నాయి. మిగిలిన వాళ్లంతా సొంత ఖర్చులతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉద్దానంలో 4 వేల మందికిపైగా కిడ్నీ రోగులు ఉండగా, ప్రభుత్వం కేవలం 370 మంది మాత్రమే పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఆ పెన్షన్ ఎంతో తెలుసా?ముష్టివేసినట్లు రూ.2,500 మాత్రమేనట! అసలు ఆ కిడ్నీ రోగులు చావాలా? బతకాలా? ప్రభుత్వం ఏమనుకుంటోంది? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ఉందా? లేదా? అని అడుగుతున్నా. ‘108’కు ఫోన్ చేస్తే కుయ్ కుయ్ కుయ్ అంటూ 20 నిమిషాల్లోనే రావాల్సిన అంబులెన్స్ ఇవాళ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. విజయనగరంలో ఉండగా గరివిడి మండలం కోడూరుకు చెందిన ఓ విద్యార్థిని నా దగ్గరికొచ్చింది. ఆమె పేరు భవాని. తన ఇంటి పక్కనే గౌరి అనే గర్భవతి ఉందని, ఆమెకు పురిటి నొప్పులు వస్తే ‘108’కు ఫోన్ చేశానని, టైర్ పంక్చరైందని రాలేమని నిర్దాక్షిణ్యంగా చెప్పారని భవాని ఆవేదన వ్యక్తం చేసింది. అటువైపు స్కూల్ పిల్లలతో వస్తున్నా ఆటోలో గౌరిని ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో 108 అంబులెన్స్ రాకపోవడంతో ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చింది. విశాఖ జిల్లాలో కె.కోటపాడులో సకాలంలో 108 అంబులెన్స్ వెళ్లకపోవడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆరోగ్యశ్రీ అమలు పరిస్థితి దారుణంగా మారింది. మూగ, చెవుడు పిల్లలకు ఆపరేషన్లు చేస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. మంచి వైద్యం కోసం హైదరాబాద్కు వెళితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తారన్న ఆశ లేకుండాపోయింది. ఇంత అన్యాయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. బాబు పాలన గురించి పేద రోగులు ఏమంటున్నారో తెలుసా? నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. మాఫియాలా జన్మభూమి కమిటీలు ఇవాళ గ్రామస్వరాజ్యం కనిపించడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డు కావాలన్నా లంచం, పెన్షన్ మంజూరు కావాలన్నా లంచం, ఇల్లు కావాలన్నా లంచం.. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు పాలనలో గ్రామాల్లో అతి భయానకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరులో అవ్వాతాతలు వచ్చి వారి బాధలు చెప్పుకున్నారు. పెన్షన్లు రాక, జన్మభూమి కమిటీల వేధింపులు భరించలేక చివరకు కోర్టుకు వెళ్లారు. తాము చనిపోయామంటూ పెన్షన్లు ఇవ్వడం లేదని, కానీ, బతికే ఉన్నామని కోర్టు ముందు చెప్పుకున్నారట. అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ఇప్పటికి కూడా చాలామందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం లేదు. నిన్ను నమ్మం బాబు అని గ్రామాల్లో నిరుపేదలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. రాష్ట్రాన్ని బాబు భోంచేస్తున్నాడు పైన చంద్రబాబు ఉంటాడు, కింద జన్మభూమి కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల లంచాల తీరు గురించి ఇప్పటిదాకా చెప్పా. పైన చంద్రబాబు ఉంటాడు. ఆయన ఏదీ వదలడు, ఇసుక వదలడు. మట్టి వదలడు, బొగ్గు వదలడు. కరెంటు కొనుగోళ్లను వదలడు, కాంట్రాక్టర్లను వదలడు. మద్యాన్ని వదలడు, రాజధాని భూములు వదలడు, విశాఖపట్నం భూములు వదలడు. చివరకు గుడి భూములు, దళితుల భూములు కూడా వదలకుండా రాష్ట్రాన్ని భోంచేస్తున్నాడు. తప్పులను మనం నిలదీస్తే చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఎన్నికల సమీస్తున్న కొద్దీ చంద్రబాబుకు టెంపరేచర్ పెరుగుతోంది. ఇప్పుడు పేదలకు కొత్త ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు, ఆదరణ–2 అని పాట పాడుతున్నాడు. మరో స్కీమ్ అంటాడు, ఇంకో స్కీమ్ అంటాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్రామా అనే కొత్త సినిమా తీస్తున్నాడు. ఎన్ని నాటకాలు అడినా.. నిన్ను నమ్మం బాబు అని ప్రజలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలన మనమంతా చూశాం. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనేశారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చారు. అందులో కొందరిని మంత్రులను చేశారు. ఇలా దుర్మార్గమైన పాలన కావాలా? అని అడుగుతున్నా. ఇలాంటి మనిషి కావాలా? అని అడుగుతున్నా. నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి డ్రామాలు ఆడుతున్నాడు. అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొద్దని చంద్రబాబు ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చాడు. ఎన్నికలు వచ్చేసరికి ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చేస్తాడు. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడాడు. హోదా కాకుండా ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేశాడు. ప్రత్యేక హోదా కావాలని మనమంతా అడిగితే వెటకారంగా మాట్లాడాడు. హోదా మాటెత్తితే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని మనల్నే ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు చేసినంత మేలు ఇతర రాష్ట్రాలకు చేయలేదని కితాబిచ్చాడు. మార్పుల్లో మొదటిది.. 25 జిల్లాలు మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళణ చేయాలి. మనం చెప్పిన పథకాలు, మనం చెప్పే పనులు జరగాలంటే ఒక పటిష్టమైన వ్యవస్థ రావాలి. ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి చేరాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, ఏం చేస్తున్నాడనేది అడ్డు రాకూడదని చెబుతున్నా. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలి. మారిన వ్యవస్థను పూర్తిగా ప్రతి పేదవాడికి దగ్గరకు తీసుకుపోవాలి. ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చే మొట్ట మొదటి మార్పు జిల్లా స్థాయిలో చేస్తాం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని మీఅందరికి చెబుతున్నా. ఈ మార్పు ఎందుకంటే.. ప్రతి కలెక్టర్ ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే జవాబుదారీతనంగా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో కలెక్టర్లకు జవాబుదారీతనం లేకుండా ఉంది. కలెక్టర్.. ప్రజలకు దగ్గరగా ఉండాలి. కలెక్టర్ చేతినిండా పని ఉండేలా చేసేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామ సెక్రటేరియెట్లు తీసుకొస్తాం ప్రతీ పథకం పేదవారి ఇళ్లకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియెట్ తీసుకొస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం. ప్రస్తుతం పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, బియ్యం కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదు. గ్రామ సెక్రటేరియెట్లతో ఈ పరిస్థితిని మార్చేస్తాం. ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా, పింఛన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్మెంట్, నవరత్నాల్లో మనం చెప్పే ప్రతీ పథకం వారి ఇంటి వద్దే నేరుగా ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. పథకాలు అమలు చేసేటప్పుడు లబ్ధిదారుల అర్హత మాత్రమే చూస్తాం. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడబోమని మీకు హామీ ఇస్తున్నా. ప్రతీ పథకం లబ్ధిదారుడి ఇంటికి తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యం అంటే.. ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు ఒకర్ని గ్రామ వలంటీర్గా సేవా దృక్పథం ఉన్న యువతను తీసుకొని ఉద్యోగమిస్తాం. వారు జవాబుదారీగా ఉంటారు. వారికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. ఆ వలంటీర్లు గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానంగా ఉంటూ పనిచేస్తారు. ఇది చిట్టి చివరి సభ కాబట్టి నవరత్నాల కోసం మీ అందరికి చెబుతా. ప్రతి పేదవాడిమోములో చిరునవ్వు చూడాలని, ప్రతి రైతుకళ్లలో ఆనందం నింపాలని నవరత్నాలను తీసుకొచ్చాం. నవరత్నాల్లో కొన్ని మార్పులు కూడా చేసుకుంటా వచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ అంశాలను ప్రతిసభలోనూ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టీ ఒక్కో అంశాన్ని చెప్పుకుంటా వచ్చా. ఇక్కడ అన్ని అంశాలు మీకు వివరిస్తా. పెట్టుబడి తగ్గిస్తే రైతన్నకు ఆదాయం పెరుగుతుంది ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో.. రైతుల బతుకులు ఎలా ఉన్నాయో చూడమని మీకు చెబుతున్నా. రైతులకు ప్రధానంగా గిట్టుబాటు ధర లేదు. బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. వడ్డీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. చివరకు పంట చేతికొస్తుందనుకుంటే కరువులు, తుపానులు వచ్చి రైతన్నలు నష్టపోతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అసలు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వీటన్నింటికి చరమగీతం పాడుతున్నా. రైతులు ప్రధానంగా ఐదు సమస్యలు ఎదుర్కొంటారు. మొట్టమొదటి సమస్య పెట్టుబడి. జూన్ మాసంలో పంట వేసేందుకు పెట్టుబడి కోసం సమస్య వస్తుంది. పెట్టుబడి తగ్గించగలిగితే రైతన్నకు ఆదాయం పెరుగుతుంది. ఈ పెట్టుబడులు తగ్గించేందుకు రైతులకు ఎలా మేలు చేస్తానో చెబుతున్నా. రైతు తరఫున ప్రభుత్వమే బీమా సొమ్ము (ప్రీమియం) కడుతుంది రైతుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ సభలో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతున్నా. ప్రస్తుతం రైతుల బీమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తుపానులు, కరువు వచ్చినా ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆ సొమ్ము వస్తుందో.. రాదో తెలియదు. ఎందుకు ప్రీమియం తీసుకుంటున్నారో తెలియదు. రైతన్నల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నా. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్ సొమ్ము పేదవాడికి ఇచ్చేందుకు ప్రభుత్వమే కృషి చేస్తుందని ఈరోజు ఇక్కడ కొత్తగా చెబుతున్నా. ఆక్వా రంగానికి రూ. 1.50లకే విద్యుత్ ఇస్తామని ఇదివరకే చెప్పా. వీటన్నింటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది. ఇక రైతు ఎదుర్కొనే మరో సమస్య.. పంట పండించిన తర్వాత ఆ పంట అమ్ముకోలేని పరిస్థితి. గిట్టుబాటు ధర రాక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. సహకార డెయిరీలను ప్రోత్సహిస్తాం గిట్టుబాటు ధర కోసం, మంచి రేట్లు రైతులకు వచ్చేందుకు సహకార రంగంలో డెయిరీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తాం. సహకార డెయిరీలు మంచిరేట్లు ఇస్తే ప్రైవేటు డెయిరీలు కూడా పోటీ పడి ఎక్కువ ధర ఇస్తారు. సహకార రంగానికి చెందిన డెయిరీలకు పాలు పోస్తే లీటర్కు రూ. 4 బోనస్ ఇస్తాం. అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడక తప్పదు. పంటతో పాటు పాడి ఉంటేనే రైతుకు ఆదాయం ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది ‘పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వమాడు ఇంట కరువే ఉండదట’. పాడిని ప్రోత్సహిస్తేనే రైతన్న బతకగలుగుతాడు. ఒక లీటర్ పాలు ఒక బాటిల్లో ఒకాయన తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ పాల రేటు రూ. రూ.26. అదే బాటిల్లో మినరల్ వాటర్ లీటర్ నీళ్లు రూ. 23 అని ఆ అన్న చెప్పుకొచ్చాడు. నీళ్లకు సమాన రేటులో పాలు అమ్ముకునే అధ్వాన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్ పాల కోసం.. దాని లాభాల కోసం రైతన్నలను గాలికొదిలేశారు. తానే దళారీలకు కెప్టెన్ అయ్యి, తానే పాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు తన హెరిటేజ్లో అమ్ముకునే పరిస్థితి ఉంది. హెరిటేజ్ షాపులో మీగడ తీసేసిన పాలు అధిక ధరలకు అమ్ముతున్నారు. సహకార రంగంలో డెయిరీలను ప్రోత్సహిస్తేనే పాడి రైతులు బాగుపడతారు. ఇక ఈ అంశంలోనే చివరిది.. వ్యవసాయరంగంలో వాడే ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్ పూర్తిగా రద్దు చేస్తాం. జీడి తోటలకు రూ. 50 వేల పరిహారం అనుకోకుండా కరువు వచ్చినా, తుపాను వచ్చినా రైతన్నకు దిక్కుతోచని పరిస్థితి. తిత్లీ తుపాను వచ్చింది. చెట్లు ఒరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. అక్షరాలా రూ. 3,435 కోట్లు నష్టమని లెక్క గట్టింది. కానీ 15 శాతం.. కేవలం రూ. 500 కోట్లు ఇచ్చి చంద్రబాబు చేతులు దులుపుకొన్నాడు. పబ్లిసిటీ మాత్రం ఏ స్థాయిలో చేస్తాడంటే.. ఏ ఆర్టీసీ బస్సునూ వదిలిపెట్టడు. విజయవాడ, విశాఖపట్నంలో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు. ఈ శ్రీకాకుళం జిల్లా వరకు తిత్లీ తుపాను బాధితులకు, కిడ్నీ బాధితులకు ఏం చేయబోతున్నామో çగతంలో చెప్పాను. రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్ రాష్ట్రవ్యాప్తంగా తుపాను, కరువు రూపాల్లో కష్టమొస్తే రైతుకు తోడుగా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాల ఫండ్ కింద రూ. 4 వేల కోట్లతో నిధి పెడతాం. రూ. 2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడితే మరో రూ. 2 వేల కోట్లు కేంద్రం నుంచి సహకారం అందుతుంది. ఎక్కడ కరువు వచ్చినా, తుపాను వచ్చినా ఆ 4 వేల కోట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏ రైతుకు నష్టం రాకుండా చేస్తాం. ప్రతి రైతుమోములో చిరునవ్వు కన్పిస్తుంది. తిత్లీ తుపానుకు కొబ్బరిచెట్లన్నీ పోయాయి. చెట్టుకు రూ. 1500లు అని చెప్పారు. జీడి పంటకు ఎకరాకు రూ. 30 వేలు ఇచ్చారు. సరిపోదయ్యా అని రైతులు నెత్తినోరూ మొత్తుకున్నారు. కనీసం పట్టించుకోలేదు. కానీ మీకు హామీ ఇస్తున్నా. కొబ్బరిచెట్టు పరిహారం రూ. 3 వేలు, జీడితోటలకు పరిహారం రూ. 50 వేలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఈ విధంగా రైతన్నకు తోడుగా ఉండే పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా వస్తుంది. మనందరి ప్రభుత్వం రాగానే రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా. ఏ రేటుకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఆ రేటును రైతులు పంట వేసే ముందే ప్రకటిస్తాం. దీంతో దళారీలు ప్రభుత్వం ప్రకటించిన ధరతో పోటీపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ రేటు కంటే ఎక్కువకు వారు కొనుగోలుచేసే పరిస్థితి వస్తుంది. దీంతో రైతన్నకు గిట్టుబాటు ధర వస్తుంది. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతన్నలకు అన్నిరకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. ఇక చివరగా జలయజ్ఞం. నాలుగున్నరేళ్లు చంద్రబాబు పాలన చూసాం. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏ ప్రాజెక్టు చూసినా ఎస్టిమేషన్స్ పెంచేశారు. కాంట్రాక్టర్ల కింద తన బినామీలు తెచ్చారు. ఇష్టమొచ్చినట్లుగా రేట్లు పెంచి డబ్బులు దోచేస్తున్న పరిస్థితి. పోలవరం మొదలుకొని గాలేరు, నగరి, హంద్రీనీవా.. అన్నీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రైతులకు 9 గంటలు పగటి పూటే కరెంట్ ఇస్తాం. మే నెలలోనే ప్రతి రైతు చేతికి రూ.12,500 ఆ తర్వాత రైతన్న కోసం చేయబోయే మూడో పని ఏంటంటే.. రైతన్నకు మే మాసంలో పెట్టుబడి ఖర్చు అవసరం. దానికోసం బ్యాంకుల నుంచో.. ప్రైవేట్ వ్యక్తుల వద్దనుంచి రెండు, మూడు రూపాయల వడ్డీకో రైతులు అప్పులు చేíస్తారు. రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా ఉండేందుకు మే మాసంలోనే ప్రతి రైతుకు రూ. 12,500 నేరుగా వారి చేతిలో పెడతాం. ఇది ఎందుకంటే.. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 70 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం భూమి ఉన్నవారే. ఇలాంటి రైతులకు అప్పులు పుట్టడం కష్టం. దీంతో పెట్టుబడి కష్టమవుతుంది. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఏడాదికి రూ. 12,500 వారి చేతుల్లోనే పెడతాం. ఈ డబ్బు గతంలో వాళ్లు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులతో సంబంధం లేకుండా ఇస్తాం. డబ్బు చేతికిచ్చి.. వాళ్లు పంటలను వేసుకుంటారో వాళ్లకే వదిలి పెడతాం. ఎకరా విస్తీర్ణంలో పంటలు పెట్టడానికి చాలా పంటలకు 80–90 శాతం పెట్టుబడిగా ఈ 12,500 సరిపోయే పరిస్థితి కన్పిస్తుంది. దీని వల్ల పెట్టుబడి ఖర్చుబాగా తగ్గే అవకాశం ఉంటుంది. పెద్దరైతులకు కూడా ఉపయోగపడుతుంది. పెట్టుబడి తగ్గించే విషయంలో ప్రతి రైతన్నకు చేయబోయే నాల్గో పని ఏమిటంటే.. ఉచితంగా బోర్లు వేయిస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి కుటుంబం దీనగాథలు విన్నప్పుడు.. పలుమార్లు బోర్లు వేసి అప్పుల పాలవతున్నాం అని చెబుతున్నారు. బోర్లు వేసినపుడు పడ్డ నీళ్లు సంవత్సరానికల్లా ఆగిపోతున్నాయి. ప్రతి రైతుకు తోడుగా ఉండేందుకు బోర్లు ఉచితంగా వేయిస్తానని చెబుతున్నా. -
ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను
-
ఇడుపులపాయ టూ ఇచ్ఛాపురం @ 3648 కీ.మీ
-
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో జనసందోహం
-
మీ బాధలు నన్ను కదిలించాయి: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏదోఒక సమస్యను ఎదుర్కొంటూ పరిష్కారం కోసం వేచిచూస్తున్న రాష్ట్ర ప్రజ లు తనపై పెట్టుకున్న ఆశలు తనను మరింత బలవంతుడిని చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్ర ముగింపు సంద ర్భం గా తన మనస్సులో నెలకొని ఉన్న భావోద్వేగాలను ట్విట్టర్ ద్వారా ప్రజలతో పంచుకున్నారు. ‘‘పాదయాత్ర సమయంలో మీరు చూపిన ప్రేమానురాగాలు నన్ను వినమ్రుడిని చేస్తున్నాయి. మీ బాధలు, వేదనలు నన్ను కదిలించాయి. మీరు నాపై పెట్టుకున్న ఆశలు నాలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. మీకు ఎల్లప్పుడూ సేవ చేయాలన్న నా కృతనిశ్చయం నన్ను కార్యదక్షత దిశగా మరింత బలవంతుడిని చేస్తోంది’’అని పేర్కొన్నారు. -
నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటా: వైఎస్ జగన్
సాక్షి, ఇచ్చాపురం : అధికారంలోకి వస్తే నవరత్నాలతో ప్రతి పేదవాడిని ఆదుకుంటామని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాదయాత్ర అనుభవాలను ప్రజలతో పంచుకున్న వైఎస్ జగన్.. అధికారంలోకి వస్తే చేసే పనులను వివరించారు. గ్రామానికో సెక్రటేరియేట్.. ‘ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియేట్ను తీసుకొస్తాం. స్థానికులకే 10 మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి పథకం పేదవాడి ఇంటి ముందుకే వచ్చే విధంగా చేస్తాం. ప్రతి 50 ఇళ్ళకు ఒకరికి గ్రామ వాలంటీయర్గా తీసుకొని ఉద్యోగం ఇస్తాం. వీరికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. వాలంటీయర్ ఆ 50 ఇళ్ళకు జవాబుదారీగా ఉంటూ.. గ్రామ సెక్రటేరియేట్తో అనుసంధానమై పనిచేస్తూ.. నవరత్నాలు నుంచి రేషన్ బియ్యం వరకూ.. నేరుగా ఇంటికే చేరేలా చేస్తాం. పగటిపూటే 9 గంటల ఉచిత కరెంట్.. రైతులకు పెట్టుబడులు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటాం. పగటి పూటే 9 గంటలపాటు ఉచితంగా కరెంటు ఇస్తాం. ప్రతి రైతు ఆదాయం పెంచడం కోసం.. బ్యాంకు రుణాలపై వడ్డీ లేకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాం. మే నెలలోనే రైతన్నకు పెట్టుబడి కోసం ఏడాదికి రూ. 12,500 ఇస్తాం. రైతులందరికీ బోర్లు ఉచితంగా వేయిస్తాం. పంట ఇన్సూరెన్స్ల కోసం రైతులు ఇక ఆలోచించనక్కర్లేదు. అధికారంలోకి రాగానే ఇన్సూరెన్స్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఆక్వా రైతుకు రూపాయిన్నరకే కరెంటు ఇస్తాం. గిట్టుబాటు ధరల కోసం రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాం. ప్రతి మండలంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తాం. ఈ రోజు లీటర్ పాలు రూ.26కు అమ్ముకుంటున్నారు. హెరిటేజ్ కోసం చంద్రబాబు డైరీలను నాశనం చేశాడు. హెరిటేజ్లో మాత్రం అర లీటరు పాలు రూ.45కు అమ్ముతున్నారు. పాడి ప్రోత్సాహం కోసం.. లీటరుకు రూ. 4 బోనస్ ఇస్తాం. సహకార రంగం డైరీలను ప్రతి జిల్లాలో ప్రోత్సహిస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ను పూర్తిగా రద్దు చేస్తాం. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు నష్టపోకుండా.. రూ. 4 వేల కోట్లు(రూ. 2వేల కోట్లు రాష్ట్రం ప్లస్ రూ. 2 వేల కోట్లు కేంద్రం ఇస్తుంది) ప్రకృతి వైపరీత్యాల ఫండ్ పెడతాం. కొబ్బెరి చెట్లుకు పరిహారం రూ. 3 వేలు ఇస్తాం. జీడి చెట్లకు ఇప్పుడు ఇస్తున్న రూ. 30 వేలును రూ.50 వేలుకు పెంచుతాం. రైతన్నకు జరగకూడని నష్టం ఏమైనా జరిగితే.. వైయస్ఆర్ బీమా కింద రూ. 5 లక్షలు వెంటనే ఆ కుటుంబానికి ఇస్తాం. ఆ నష్టపరిహారం పూర్తిగా ఆడపడుచులకు ఇచ్చే సొత్తుగా చూసే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాం. దాంతో అప్పుల వాళ్ళు లాక్కొనే అవకాశం ఉండదు. ప్రతి ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. డ్రాక్రా మహిళల కోసం వైఎస్సార్ ఆసరా.. 89 మంది లక్షల మంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తాం. డ్వాక్రా అక్కా చెల్లెమ్మలకు ప్రస్తుతం ఎంత రుణం ఉందో దాన్ని నాలుగు విడతలుగా చెల్లింపు. ఫించన్లు: ప్రస్తుతం ఉన్న ఫించన్ల వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు. అవ్వతాతకి రూ.2000 ఫించన్, వికలాంగులకు రూ. 3000. అమ్మఒడి : పిల్లల చదువుల కోసం ఏ తల్లి భయపడొద్దు. పిల్లలను బడికి పంపితే చాలు ఏడాదికి ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు రూ. 500, ఇద్దరు పిల్లలకు రూ. 1000. ఆరో తరగతి నుంచి పదో తరగతి వారికి ఒక్కోక్కరి రూ.1000 చొప్పున ఇద్దరికి రూ. 2 వేలను నేరుగా తల్లలుకే అందజేత. హౌసింగ్: పేదలకు 25 లక్షల ఇళ్లు, జన్మభూమి కమిటీలతో పనిలేకుండా ఇళ్ల కేటాయింపు ఆరోగ్యశ్రీ : ఆరోగ్య శ్రీకి బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపు. సంపాదించే వ్యక్తికి ఆపరేషన్ అయితే విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం. కిడ్నీ బాధితులకు ప్రత్యేకంగా పెన్షన్. ఫీజు రీయింబర్స్మెంట్: ప్రతి పేదవాడికి పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్, ఖర్చుల కింద ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేల సాయం. జలయజ్ఞం : పోలవరం సహా అన్ని ప్రాజెక్ట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి. మద్య నిషేధం: మూడు దశల్లో మద్య నిషేధం, మొదటి దశలో దుకాణాల సంఖ్య తగ్గింపు. ఊరురా వెలిసిన బెల్ట్షాపులపై ఉక్కుపాదం. షాక్ కొట్టేలా మద్యం ధరల పెంపు. రెండో దశలో పేద మధ్యతరగతికి మద్యం అందుబాటులోలేకుండా నిషేధం. మూడో దశలో ఫైవ్ స్టార్ హోటళ్లలో మాత్రమే మద్యం. తయారు చేసినా అమ్మినా ఏడేళ్లు జైలు శిక్ష పడేలా చట్ట సవరణ -
ముగిసిన వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
ప్రజల గుండె చప్పుడు విన్నాను : వైఎస్ జగన్
సాక్షి, ఇచ్చాపురం : ‘ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ఆ గుండె చప్పుడిని నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 3,648 కిలోమీటర్లు సాగిన చారిత్రాత్మక పాదయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అశేష జనవాహిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నడిచింది తానైనా.. నడిపించింది మాత్రం ప్రజలేనని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు హయాంలో దగాపడ్డ రైతన్నా.. మోసపోయిన డ్వాక్రా అక్కా చెళ్లెమ్మలు.. ఉద్యోగం రాక నిరాశలో ఉన్న యువతను పాదయాత్రలో కలిసానని, వారి గోడును విన్నానని తెలిపారు. ‘ఇలా ప్రతి ఒక్కరిని కదిలిస్తే.. చంద్రబాబు పాలనపై ఏమంటున్నారో తెలుసా.. చంద్రబాబును నమ్మం అంటున్నారు’ అని వైఎస్ జగన్ తన పాదయాత్ర అనుభవాలను పంచుకున్నారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. ఇంత ఊహించలేదు.. ‘ఇడుపులపాయలో తొలి అడుగువేసినప్పుడు ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుందని, ఇన్ని కోట్ల మంది ప్రజాభిమానం లభిస్తుందని ఊహించలేదు. నడిచింది నేనైనా.. నడిపించింది మీరూ(ప్రజలనుద్దేశించి).. పైనున్న ఆ దేవుడు. నాన్నగారి ఆశీస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. రికార్డు స్థాయిలో పాదయాత్ర విజవంతమైందంటే.. మీ ఆశీస్సులేనని నిస్సంకోచంగా చెబుతాను. ఎంత దూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంత మందిని కలిసి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర విభజన నష్టం ఒక వైపు.. చంద్రబాబు దోపిడీ మరోవైపు. రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం ఒక వంకా.. నానాటికి పెరుగుతున్న నిరుద్యోగం. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసగించిన చంద్రబాబు నైజం మరోవంక. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చేసిన వాగ్ధానాలు. ఆ 600 హామీలు మోసం చేసిన విధానం. ఇవన్నీ చూస్తే గుండె మండుతోంది. పిల్లలను అవిటిగా మార్చి అడుక్కునే వారికి.. ప్రజలు కష్టాల్లో ఉన్నా.. విపరీతంగా దోచుకుంటున్న చంద్రబాబుకు ఏమైనా తేడా ఉందా? అని అడుగుతున్నా? ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సాగిన పాదయాత్ర విషయాలు చెబుతా.. అనంతపురం రైతు శివన్న.. అనంతపురంలో శివన్న అనే రైతు నన్ను కలిశాడు.. రెయిన్ గన్ల గురించి కంటికి కట్టినట్లు చెప్పాడు. వ్యవసాయం ఎలా కుదేలైందో.. లక్షమంది ఎలా వలుస వెళ్తున్నారో వివరించాడు. 90వేల అప్పు చేసి తన పొలంలో వేరుశనగ పంట వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. ఇంకేముందన్నా.. బాబుతో కరువు కలిసొచ్చిందన్నా..అని చెప్పాడు. అనంతపురం పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామని, దీనికి ఆయన అయ్యో కరువా? నాకు అధికారులు చెప్పనేలేదని వారిని తిట్టాడని చెప్పాడు. రెయిన్గన్ల ద్వారా పంటను కాపాడుతానన్నారు. ఆ తర్వాత ఏమైందన్నా.. చంద్రబాబు వచ్చి ఆ రైన్ గన్ ప్రారంభి.. అలా అలా నాలుగు నీళ్లు చల్లి ఫొటోలకు ఫోజులిచ్చాడు. అనంతరం ఆయన వెళ్లిపోయాడన్నా.. ఆ సాయంత్రమే అధికారులు వచ్చి రెయిన్ గన్ పట్టుకుపోయారని .. శివన్నా.. చంద్రబాబుతో దిగిన ఫొటోలు.. పేపర్ కట్టింగ్లు పట్టుకోని నాకు చూపించాడు. ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట వేస్తే బస్తా రాలేదన్నా.. ఇప్పుడు ఈ అప్పు తీర్చడానికి వడియాలు అమ్ముకుంటున్నా అని తెలిపాడు. ఇక ఈ విషయంపై బహిరంగ సభలో మాట్లాడుతానని మైక్ అందుకోని.. క్రిందటి సారి చంద్రబాబుకు ఓటేసా.. మనకు చంద్రబాబు సావాసం వద్దబ్బా అని పిలుపునిచ్చాడు. రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం జాతీయ రాజకీయాలని కొత్త డ్రామా మొదలుపెడుతాడు. బెంగళూరుకు వెళ్లి కుమార స్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే ఉన్న అనంతపురం రైతన్నను మాత్రం పట్టించుకోడు. మరుసటి రోజు చెన్నైకి వెళ్లి స్టాలిన్తో కలిసి ఇడ్లీ సాంబార్ తింటాడు. కానీ పక్కనే ఉన్న సొంత జిల్లా చిత్తూరు రైతులను పట్టించుకోడు. ప్రభుత్వ సొమ్మే కదా అని ప్రైవేట్ విమానంలో కోల్కతాకు వెళ్లి మమతాబెనర్జీతో చికెన్ తింటాడు. కానీ ప్రజల సమస్యలు పట్టించుకోడు. నమ్మం అంటే నమ్మం బాబు.. రాష్ట్రంలో పంటలు దిగుబడి చూస్తే గుండెతరక్కుపోతుంది. దివంగత నేత వైఎస్సార్ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. కానీ ఈ పెద్ద మనషీ నదుల అనుసంధానం అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో మనరాష్ట్రమే నెంబర్ వన్ అంటాడు. అందుకే చంద్రబాబు నాయుడి ప్రజలు నమ్మం అంటే నమ్మం బాబు అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం వ్యవసాయం నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున 28 స్థానంలో ఉంది. చంద్రబాబు రైతు రుణమాఫీ మోసం వల్లే రైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రుణమాఫీ కనీసం వారి వడ్డీలకు కూడా సరిపోలేదు. వడ్డీ లేకుండా బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేవి. ఆ వడ్డీని ప్రభుత్వాలు కట్టేవి. కానీ చంద్రబాబు దీన్ని పూర్తిగా మరిచిపోయారు. దీంతో రైతులంతా చంద్రబాబును నమ్మం అంటున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అడుగుతున్నా? (రాలేదు ప్రజల నుంచి సమాధానం.) దళారీ వ్యవస్థకు కెప్టెన్.. హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీ వ్యవస్థకు కెప్టెన్ అయ్యాడు. హెరిటేజ్ లాభాల కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ప్యాక్ చేసి రెండింతల రేట్లకు అమ్ముతున్నారు. ధాన్యానికి కనీస మద్దతు ధర లేదు. ఉద్దానం, పలాసలో జీడిపప్పు చాలా ఫేమస్. ఈ జీడిపప్పును ఇక్కడి రైతులు కేజీ రూ.600కు అమ్ముకోలేని పరిస్థితి. కానీ చంద్రబాబు హెరిటేజ్లో కేజీ రూ.1100లకు అమ్ముతున్నారు. ఇలా రైతులను మోసం చేస్తున్నాడు కాబట్టి వారంతా చంద్రబాబు నమ్మం అంటున్నారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు చెల్లించలేదని మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బందులు దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు తాళిబొట్లు తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడింది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు.. చంద్రబాబు హయాంలో ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి లేదు. నిరాశలో నిరుద్యోగ యువత ఉన్నారు. బాబు వచ్చాడు కానీ జాబు రాలేదని, నిరుద్యోగులు నన్ను కలిశారు. బాబు వచ్చాడు.. 30 వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా..? గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయుష్ పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. సాక్షర భారత్లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేస్తున్న 85 వేల మంది ఉద్యోగాలు గోవిందా.. విభజన సమయానికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో మెర 90వేలు ఖాలీ అయ్యాయి. మొత్తం సుమారు 2 లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. చంద్రబాబు మాత్రం 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. రాయితీలు ఇవ్వకపోవడంతో పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఫీజులు కట్టలేక ఆత్మహత్య.. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేశారు. 6వేల పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను మూసించేశారు. మధ్యాహ్న భోజన పథకానికి 6 నెలలుగా బిల్లులు చెల్లించని దుస్థితి. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో గోపాల్ అనే వ్యక్తి కలిశాడు. తన కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడని, కట్టాల్సిన ఫీజు లక్ష ఉండగా.. రీయింబర్స్ మెంట్ 30 వేలు ఇచ్చాడన్నా అని ఆవేదన చెందాడు. తొలి ఏడాది అప్పు చేసి రూ. 70వేలు ఫీజు కట్టానన్నాడు. ఫీజులు కట్టలేకపోతున్నానని తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. చంద్రబాబు హయాంలో ఫీజులు కట్టలేక చదువులు మానేస్తున్నారు. పేదవాడికి వైద్యం అందడం లేదు.. చంద్రబాబు పాలనలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఉద్దానంలో 4 వేల మంది కిడ్నీ బాధితులుంటే.. కేవలం 1400 మందికి మాత్రమే సాయం చేస్తున్నారు. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు రూ. 2500 మాత్రమే ఇస్తున్నారు. విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్షర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్లు లేక మెంటాడలో బస్సులో ప్రసవించింది. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. గ్రామాల్లో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా ఏర్పాటు చేశారు. రేషన్ కార్డు, ఇల్లు సహా చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్ కోసం వృద్ధులు కోర్టుకెళ్లిన పరిస్థితి. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. ఇసుక నుంచి మట్టి వరకు అన్నింటిలోను దోపిడియే ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబులోభయం పట్టుకుంది. ఆదరణ-2 అంటూ కొత్తనాటాకాలకు తెరలేపుతున్నారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారు. మీ బిడ్డకు తోడుగా ఉండండి.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలన్నది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చండి. నవరత్నాల మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ఓటు వేయరు. ఆరు నెలలు కలిసి ఉంటే. వారు వీరు.. వీరు వారవుతారు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజా సంకల్ప యాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. జరిగే యుద్ధం ఒక్క నారాసురుడితో మాత్రమే కాదు. ఈ నారాసురుడికి ఎల్లో మీడియా ఉంది. జిత్తులు మారి ఈ మాయావి చంద్రబాబు పొత్తులు, ఎత్తులను, అన్యాయాలను జయించేందుకు మీరంతా తోడుగా ఉండాలి.’ అని వైఎస్ జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే నవరత్నాలతో ప్రతిఒక్కరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఈ చారిత్రక ఘట్టానికి సాక్షిగా ఇచ్చాపురంలో వైఎస్ జగన్ విజయసంకల్పస్థూపం (పైలాన్)ను ఆవిష్కరించారు. -
ఇచ్ఛాపురంలో విజయసంకల్ప స్థూపం ఆవిష్కరణ
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
-
విజయసంకల్ప స్థూపంను ఆవిష్కరించిన వైఎస్ జగన్
సాక్షి, ఇచ్ఛాపురం: చరిత్రాత్మకమైన పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో ఇచ్ఛాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు.. వైఎస్ జగన్ పైలాన్ను ఆవిష్కరించే దృశ్యాన్ని అపురూపంగా తిలకించారు. పైలాన్ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్థూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు బయలుదేరారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. అంతకు ముందు వైఎస్ జగన్ పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అడుగడుగునా జన నీరాజనం
-
ప్రజాసంకల్పయాత్ర చివరి రోజు
-
వైఎస్ జగన్ జనం మనిషి
-
341వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర
-
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: వైఎస్ జగన్
చరిత్రాత్మక ప్రజాసంకల్పయాత్ర ముగిసిన సందర్భంగా ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.. ఆయన ఏమన్నారంటే.. యుద్ధం నారాసురుడు ఒక్కడితోనే కాదు.. ఒక్కసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్ళు పాలించాలనేది నాకున్న సంకల్పం. నా పాలన చూసి.. నాన్న ఫోటోతోపాటు నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండాలన్నది నా ఆశ . నవరత్నాలను ప్రతి ఇంటికీ చేర్చి.. వాటి మేలును ప్రతి ఒక్కరికీ చెప్పండి. అవి జనంలోకి తీసుకెళితే.. చంద్రబాబు నాయుడు ఎంత డబ్బులిచ్చినా.. ప్రజలు ఓటు వేయరు. ఈ 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. వారి కష్టాలు వింటూనే.. వారికి భరోసా ఇస్తూనే నడిచాను. ప్రతి పేద వాడికి మంచి చేయాలనే తపన ఉంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేసేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని, ఆశీర్వదించమని కోరుతున్నాను. ప్రజాసంకల్పయాత్ర ఇంతటితో ముగుస్తున్నా.. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉంది. మనం యుద్దం చేసేది నారాసురుడి ఒక్కడితోనే కాదు ఎల్లో మీడియాతో కూడా యుద్ధం చేయాలి. జిత్తులు మారిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటాడు. ప్రజల దీవెనలతో చంద్రబాబు మోసాలను, అన్యాయాలను జయిస్తా. చిలుకా గోరింకలు తలదించుకునేలా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 ఎమ్మెల్యేలను చంద్రబాబు సంతలో పశువులను కొన్నట్టు కొన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి నలుగురిని మంత్రులుగా చేశారు. ప్రత్యేక హోదాను ఖూనీ చేసి.. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశాడు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా కొనసాగారు. నాలుగేళ్లు హోదా ఇవ్వకపోయినా చంద్రబాబు బీజేపీని పొగిడారు. ప్రత్యేక హోదాను వెటాకారం చేస్తూ అసెంబ్లీలో మాట్లాడారు. హోదా కోసం పోరాడితే జైల్లో పెట్టిస్తానని అంటారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని హోదా కోసం మాట్లాడేవారిని ప్రశ్నించారు. చిలుక, గోరింకలు తలదించుకునేలా టీడీపీ, బీజేపీ ప్రేమ కొనసాగింది. ఎన్నికలు వచ్చేటప్పటికీ రంగులు మారుస్తున్నారు. ఎన్నికలకు మూడు నెలలు ముందే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారు. ఎన్నికల దగ్గరకు వచ్చే సమయానికి రాష్ట్ర సమస్యలను వదిలేసి మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు. ప్రజలకు ఏం చెయ్యకపోయినా.. చేసినట్లు ఎల్లో మీడియా గ్లోబెల్ ప్రచారం చేస్తుంది. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థని మార్చాలంటే జగన్కు మీ అందరి దీవెనలు కావాలి. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మారుస్తాం. కలెక్టర్లు ఏడు నియోజకవర్గాలకే బాధ్యుడిగా ఉంటే.. ప్రజలకు అందుబాటులో ఉంటారు. కలెక్టర్ల వ్యవస్థను పూర్తిగా ప్రజల వద్ద తెచ్చేందుకు ఏపీలో 13 జిల్లాల స్థానంలో 25 జిల్లాలను ఏర్పాటుచేస్తాం. సమస్యలు పరిష్కరించేందుకు గ్రామ సచివాలయాలు ఏర్పాటుచేస్తాం. ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామానికి చెందిన పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించేటప్పుడు.. పార్టీలను చూడం. అర్హత ఆధారంగానే లబ్ధిదారులను గుర్తిస్తాం. ప్రతి గ్రామంలోనూ 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమిస్తాం. గ్రామ వాలంటీర్లకు రూ. 5వేల చొప్పున జీతాలు ఇస్తాం. ప్రతి ప్రభుత్వ పథకం మీ ఇంటికి వచ్చేవిధంగా చూస్తాం. రేషన్ బియ్యం సైతం డోర్ డెలివరీ చేస్తాం. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా.. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా రాజ్యం నడుస్తుంది. రేషన్కార్డు, ఇల్లు సహా.. చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా మంజూరు చేయాలంటే మీరు ఏ పార్టీ వారని అడుగుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందురులో పెన్షన్కోసం వృద్ధులు కోర్టుకు వెళ్లే దారుణమైన పరిస్థితి నెలకొంది. గ్రామ స్వరాజ్యం లేని జన్మభూమి కమిటీలను నడుపుతున్నారు. అంబులెన్స్ లేక.. గర్భిణీ బస్సులోనే ప్రసవించారు విజయనగరం జిల్లా గరివిడి మండలంలో ఓ ఘటన నాకు ఎదురైంది. గర్భిణీ పురిటి నొప్పులు వస్తున్నాయని ఫోన్ చేస్తే.. టైర్ పంక్చర్ అయిందని 108 సిబ్బంది చెప్పారు. అంబులెన్స్ లేకపోవడంతో ఆ గర్భిణీ బస్సులోనే ప్రసవించారు. రాష్ట్రంలో పేదవాడికి వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. ఉద్దానంలో 4వేల మంది కిడ్నీ బాధితులుంటే.. ప్రభుత్వం 1400 మందికి మాత్రమే సాయం చేస్తుంది. 370 మందికి మాత్రమే పెన్షన్లు అందుతున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు ముష్టి వేసినట్లు 2500 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. బినామీలో కోసం విద్యారంగాన్ని బాబు నాశనం చేశాడు కవిటి మండలంలో అమ్మాయిలు చదివే జూనియర్ కాలేజీల్లో బాత్రూమ్లు లేకపోవడం దారుణం. చంద్రబాబు తన బినామీల కోసం విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబు ముక్యమంత్రి అయ్యాక ఆరువేల ప్రభుత్వ పాఠశాలలు మూయించివేశారు. ఎస్సీ, బీసీ, ఎస్టీల హాస్టళ్లను మూసివేయించారు. మధ్యాహ్న భోజన పథకానికి ఆరు నెలలుగా బిల్లులు చెల్లించలేని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాలానికి చెందిన గోపాలన్న నన్ను కలిశారు. అక్కడ ఫ్లెక్సీలో ఉన్న వ్యక్తి తన కొడుకు అని, తాను ఫీజులు కట్టలేకపోవడంతో ఇంజినీరింగ్ చదువుతున్న తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు.. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా మహిళలను కోర్టు మెట్లు ఎక్కించారు. డ్వాక్రా సంఘాల మహిళలపై బ్యాంకు సిబ్బంది దాడులు చేస్తున్నారు. వడ్డీలు కట్టేందుకు అక్కాచెల్లమ్మలు తాళిబోట్లు తాకట్టు పెట్టే దుస్థితి నెలకొంది. 2016 నుంచి డ్వాక్రా సంఘాల వడ్డీలను చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఉద్యోగాలు లేవు.. ఉన్న ఉద్యోగాలు గోవిందా.. చంద్రబాబు హయంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగ భృతి లేదు. నిరుద్యోగ యువత నిరాశలో ఉన్నారు. బాబు వచ్చాడు కానీ.. జాబు రాలేదని నిరుద్యోగులు నన్ను కలిశారు. విభజన సమయానికి లక్షా 42వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో 90వేల మేర ఖాళీలు ఏర్పడ్డాయి. మొత్తం దాదాపు 2లక్షల 20వేల ఉద్యోగాల్లో ఒక్క ఉద్యోగాన్ని కుడా భర్తీ చేయలేదు. 30వేల ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణ శాఖలో 3500మంది ఉద్యోగాలు గోవిందా.. గోపాలమిత్ర ఉద్యోగాలు గోవిందా.. ఆయూష్లో పనిచేస్తున్న 30వేల మంది ఉద్యోగాలు గోవిందా.. మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న 85వేల మంది ఉద్యోగాలు గోవిందా.. బెంగళూరులో కాఫీ.. చెన్నైలో ఇడ్లీ సాంబార్..! రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయాలే ముఖ్యమనుకుంటున్నారు. జాతీయ రాజకీయాలంటూ చంద్రబాబు బెంగళూరుకు వెళ్లి.. కుమారస్వామితో కాఫీ తాగారు. కానీ కర్ణాటక పక్కనే ఉన్న అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి ఆయనకు గుర్తుకురాలేదు. మరోవైపు చంద్రబాబు చెన్నై వెళ్లి స్టాలిన్తో ఇడ్లీ సాంబార్ తిన్నారు. కానీ పక్కనే ఉన్న తన సొంత జిల్లా చిత్తూరు రైతుల గురించి ఆయన పట్టించుకోరు. విమాన చార్జీలు ప్రభుత్వమే భరిస్తోంది కదా అని ఆయన పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతను కలుస్తారు. కానీ, ఆయనకు రాష్ట్రంలోని రైతుల దుస్థితి కనిపించడం లేదు. వైఎస్సార్ హయాంలో ఏపీలో 42.70 లక్షల హెక్టార్ల పంటసాగు ఉంటే..చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. అందుకే ఏపీలో పర్జలు చంద్రబాబును ‘నిన్ను నమ్మం బాబు’ అంటున్నారు. నాబార్డ్ నివేదిక ప్రకారం దేశంలోనే రైతు అప్పుల విషయంలో ఏపీ రెండో స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చద్రబాబు చేసిన దగాకు వడ్డీలు పెరిగిపోయి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వడ్డీలేని రుణాలు కూడా రైతులకు అందడం లేదు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. తన హెరిటేజ్ కోసం చంద్రబాబు దళారీలకు కెప్టెన్ అయ్యారు. రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేసి.. మూడింతలు ధరలు పెంచి తన హెరిటేజ్లో చంద్రబాబు అమ్ముతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటివరకు తెరవలేదు. పలాస జీడిపప్పు రైతులు కేజీ 650 రూపాయలకు కూడా అమ్ముకోలేకపోతున్నారు. చంద్రబాబు మాత్రం హెరిటేజ్లో జీడిపప్పు కిలో 1100 రూపాయలకు అమ్ముతున్నారు. రైతు శివన్న గురించి.. అనంతపురంలో శివన్న అనే రైతు కలిశారు. శివన్న పొలంలో వేరుశనగ వేశానని చెప్పాడు. పంట ఎలా ఉందని అడిగితే.. బాబు రాగానే కరువు వచ్చిందన్నారు. అనంత పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు సాయం అడిగామన్నారు. కరువుతో ఎండిపోతున్నాం సాయం చేయమంటే.. చంద్రబాబు అయ్యో నాకు కరువు గురించి తెలియదు అని అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో వ్యవసాయం కుదేలైన పరిస్థితిని కళ్లకు కట్టేలా శివన్న చెప్పారు. రెయిన్ గన్లతో ప్రభుత్వం రైతులను మభ్యపెట్టిన తీరును శివన్న నాకు వివరించారు. అందుకే రైతులు నిన్న నమ్మం బాబు అంటున్నారు. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నా పాదయాత్రలో ఎంతమందిని కలిశాం.. ఎంతమందికి భరోసా ఇచ్చామన్నదే ముఖ్యం నాలుగున్నరేళ్లలో బాబు పాలన ఎంత ఘోరంగా ఉందో ప్రజలు చెప్పారు. కరువు, నిరుద్యోగం వీటికి తోడు చంద్రబాబు మోసం ప్రజల పాలిట శాపంగా మారింది. ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను. ప్రజల గుండె చప్పుడును నా గుండె చప్పుడుగా మార్చుకున్నాను. 14 నెలలుగా 3648 కిలోమీటర్లు నేను నడిచినా.. నడిపించింది ప్రజలు.. పైనున్న దేవుడు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చాపురం పాత బస్టాండ్ బహిరంగ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6వ తేదీన జననేత చేపట్టిన ‘ప్రజా సంకల్పయాత్ర’, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. మొత్తం 341 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్పయాత్ర.. 134 నియోజకవరాగలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు, 54 మున్సిపాలిటీలు, 8 కార్పొరేషన్ల గుండా సాగింది. జననేత 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఇప్పటివరకు 123 సభల్లో పాల్గొన్న వైఎస్ జగన్.. పాదయాత్రలో అఖరి బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించారు. అక్కడి ఆయన ఇచ్ఛాపురం పాత బస్టాండ్ వద్ద జరిగే సభాస్థలికి బయలుదేరారు. ఇప్పటికే లక్షలాది మందితో సభాస్థలి కిక్కిరిసింది. జై జగన్ నినాదాలతో ఆ ప్రాతమంతా మారుమోగుతోంది. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయసంకల్ప స్తూపం వద్దకు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న సర్వమత ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఇచ్ఛాపురం చేరుకున్న అశేష ప్రజానీకం అడుగడుగునా వైఎస్ జగన్కు నీరాజనం పలుకుతున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్ఛాపురంలోని విజయసంకల్ప స్తూపాన్ని అవిష్కరించే క్షణం కోసం జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇచ్ఛాపురంతోపాటు పరిసర ప్రాంతాల్లో జనసందోహం నెలకొంది. 16వ నెంబర్ జాతీయరహదారి కిలోమీటర్ల మేర జనం బారులు తీరారు. పైలాన్ వద్దకు వైఎస్ జగన్ రాకకోసం లక్షలాది మంది జనం ఎదురు చూస్తున్నారు. ఇచ్ఛాపురం పరిసర ప్రాంతాలు జగన్ నినాదాలతో మారుమోగుతున్నాయి. ఇచ్ఛాపురం: బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయసంకల్ప స్థూపం (పైలాన్)ను ఇచ్ఛాపురంలో కాసేపట్లో వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున అక్కడికి తరలివచ్చారు. పైలాన్ను వైఎస్ జగన్ ఆవిష్కరించే అపురూప క్షణాల కోసం తామంతా వేచిచూస్తున్నామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. స్థూపాన్ని ఆవిష్కరించిన తర్వాత కాలినడకన పాత బస్టాండ్ వద్దకు చేరుకుని భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. తిరుపతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా యువజన విభాగం నేత భూమన అభినయ రెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని అలిపిరి వద్ద పార్టీ శ్రేణులు కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో మహిళా విభాగం నగర అధ్యక్షురాలు కుసుమ కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు ఇమామ్, రాజేంద్ర, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. కర్నూలు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు నేపధ్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. వైఎస్ సర్కిల్లో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాజా విష్ణు వర్దన్ రెడ్డి, నరసింహులు యాదవ్, తెర్నకల్ సురేందర్ రెడ్డి, రెహమాన్, మద్దయ్య, మున్నా తదితరులు పాల్గొన్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా పాణ్యం నియోజకవర్గంలోని షరీన్ నగర్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విశ్వేశ్వర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, ఫిరోజ్, బెల్లం మహేశ్వర రెడ్డి, సులోచన, శ్రీనివాసులు, విక్రమ్, డేవిడ్లు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలతో అభిషేకం, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు రాయదుర్గం మండలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి ఉడేగొళం మధ్యనేశ్వర స్వామి దేవాలయం వరకు మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తనయుడు కాపు ప్రవిణ్ రెడ్డి ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రకు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడేరు మండలం పి. నాగిరెడ్డిపల్లిలో సంఘీభావ పాదయాత్ర చేపట్టారు. విడపనకల్లు మండలం డోనేకల్లులో వైస్సార్సీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. చిత్తూరు: ప్రజాసంకల్ప పాదయాత్ర ముగింపు సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, చంద్రశేఖర్, రాహుల్ రెడ్డి,లీనారెడ్డిలు, ఇతర కార్యకర్తలు గాంధీ సర్కిల్లో కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా, వైఎస్ జగన్కు సంఘీభావం తెలియచేస్తూ పీలేరు, కలికిరి, కలకడ, వైవి పాలెం,గుర్రంకొండ, వాల్మీకి పురం మండలాలలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్: జిల్లాలోని ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా సుండుపల్లి జెడ్పీటీసీ హకీం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతమైన సందర్భంగా రాయచోటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా బీసీ ప్రధాన కార్యదర్శి విజయ భాస్కర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా ఎస్ కే యూనివర్సిటీ సమీపంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు, ఆకుతోటపల్లి గ్రామస్థుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 టెంకాయలు కొట్టి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. నెల్లూరు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విజయవంతమైన సందర్భంగా రూరల్ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకులు పిండి సురేష్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కాకి వెంకటేశ్వర్లు భారీ కేక్ను కట్ చేశారు. మూడు నెలల్లో రాజన్న రాజ్యం రాబోతోందని, జిల్లాలో కచ్చితంగా 10 సీట్లు గెలుస్తామని బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా వైఎస్సార్ సీపీ విద్యార్ధి విభాగం నాయకులు విష్ణు వర్దన్ రెడ్డి, మేర్లపాక వెంకటేష్, సందీప్, రాజేష్, యశ్వంత్, బన్నీ,నాగరాజులు నాయుడుపేటలోని శ్రీ పోలేరమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, 101టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. విజయనగరం: ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు విజయనగరం నుంచి భారీగా జనం తరలి వస్తున్నారు. ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు నెల్లిమర్ల వైఎస్సార్ సీపీ సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నెల్లిమర్ల నియెజకవర్గం నుంచి భారీగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇచ్ఛాపురం: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రగా బయలుదేరి లొద్దపట్టి చేరుకున్నారు. అక్కడ వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. వైఎస్సార్ సీపీ నేతలు ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. జననేతతో కలిసి నడవటానికి పెద్ద సంఖ్యలో వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు అక్కడకు చేరుకున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న దారులన్నీ జనసంద్రంగా మారాయి. వైఎస్సార్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా కడప జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్లు పాల్గొన్నారు. గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతం అయిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో 3648 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైన రోజు పాదయాత్ర విజయవంతం కావాలని స్వామివారికి మొక్కుకున్నారు. పాదయాత్ర విజయవంతం కావడంతో కార్యకర్తలు స్వామి వారికి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కు చెల్లించుకున్నారు. చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇచ్ఛాపురం : విజయ సంకల్ప యాత్రలో పాల్గొనేందుకు పాడేరు సమన్వయ కర్త విశ్వేశ్వర రాజు ఆధ్వర్యంలో గిరిజనులు భారీగా ఇచ్ఛాపురానికి తరలి వచ్చారు.పాడేరు, జీకే వీధి, జీ మాడుగుల, కొయ్యురు మండలాల నుంచి వైఎస్సార్ సీపీ నాయకులు భూసరి క్రిష్ణా రావు, లకే రత్నభాయ్,కోడా సురేష్, గాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం : పెందుర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్త అదీప్ రాజ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభకు కారు ర్యాలీ ద్వారా ఇచ్ఛాపురానికి బయలుదేరారు. జననేతకు జేజేలు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి విజయవంతంగా పూర్తి చేసిన రాజన్న తనయుడికి జనం జేజేలు పలికారు. సాక్షి టీవీ కేఎస్సార్ లైవ్ షోలో పలువురు మాట్లాడుతూ... జననేతకు అభినందనలు తెలిపారు. పాదయాత్రతో వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారని హైదరాబాద్కు చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా, కత్తితో దాడి చేసినా ప్రజాసంకల్పయాత్రను విజయవంతం చేయడం మామూలు విషయం కాదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తర్వాత జనసమ్మోహనరెడ్డిగా మారిపోయారని విస్సన్నపేటకు చెందిన జయకర్ ప్రసంశించారు. ప్రజాసంకల్పయాత్ర విజయసంకల్పయాత్రగా మారడంలో ఎటువంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఏపీ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని కడపకు చెందిన డాక్టర్ రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చివరిరోజూ అదే ఉత్సాహం: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం కవిటి మండలంలోని కొజ్జీరియా నుంచి చివరిరోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిందరినీ చిరునవ్వుతో పలకరించి ముందుకు సాగారు. చివరిరోజు పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు వైఎస్ జగన్ వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. జననేత పాదయాత్ర సాగుతున్న దారిలో యువత కోలాహలం కన్పిస్తోంది. దారులన్నీ జనసంద్రం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం (వైఎస్సార్ ఘాట్) నుంచి 2017 నవంబర్ 6న వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర 341 రోజుల తర్వాత బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. జన నాయకుడి జైత్రయాత్రకు సంఘీభావంగా తరలివెళుతున్న జనంతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. -
341వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
-
పాదయాత్రలో ఆఖరి ఘట్టం..
-
నేడు ముగియనున్న వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర
-
అద్భుతం.. ఆకర్షణీయం
ఇచ్ఛాపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశ రాజకీయాల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర పూర్తవుతున్న సందర్భంగా నిర్మించ తలపెట్టిన విజయసంకల్ప స్థూపం (పైలాన్) అత్యద్భుతంగా, ఆకర్షణీయంగా రూపుదిద్దుకుంది. ఇచ్ఛాపురం బైపాస్ వద్ద బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన ఈ స్థూపం ఎప్పటికీ దర్శనీయ స్థలంగా ఉండేలా తీర్చిదిద్దారు. బుధవారం 341 రోజుల పాదయాత్ర పూర్తి చేయనున్న వైఎస్ జగన్ మధ్యాహ్నం 91 అడుగుల ఎత్తైన ఈ స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ను తలపిస్తూ నాలుగు ఉక్కు స్తంభాలు కింది నుంచి విడిగా పైకి వెళ్లి పైన నాలుగూ కలిసేలా ఏర్పాటు చేసిన పైలాన్ కనులకు విందు చేస్తోంది. స్థూపం పై భాగాన పార్లమెంటు తరహాలో వృత్తాకారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రంగులతో కూడిన ఒక టూంబ్ను ఏర్పాటు చేశారు. దానిపైన పది అడుగుల ఎత్తులో పార్టీ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. టూంబ్కు దిగువున నాలుగు దిక్కుల దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వివిధ భంగిమల్లో ఉన్న ఫోటోలను ఏర్పాటు చేశారు. ఆ దిగువన పాదయాత్రికుడు వైఎస్ జగన్ నడిచి వస్తున్న నిలువెత్తు చిత్రాలను ఉంచారు. పైలాన్ లోపలి భాగంలో చుట్టూ జగన్ తన పాదయాత్రలో ప్రజలను కలుసుకుంటూ వచ్చిన ఫొటోలను ఏర్పాటు చేశారు. స్థూపం బేస్మెంట్ పైకి ఎక్కేందుకు 13 మెట్లను ఏర్పాటు చేశారు. పాదయాత్రగా జగన్ నడచి వచ్చిన 13 జిల్లాల పేర్లను కింది నుంచి పైకి మెట్లపైన ఏర్పాటు చేశారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం దాకా జగన్ నడిచిన రూట్ మ్యాపును కూడా నిక్షిప్తం చేశారు. దిగువున చుట్టూ ఒక చిన్నపాటి లాన్ (పచ్చికబయలు) ఏర్పాటు చేశారు. ఇందులోనే ఓ స్తంభం పక్కనే స్థూపం ఆవిష్కరణకు సంబంధించిన శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ఇక బయట చుట్టూ ప్రహరీ గోడపై ఓ వైపు ప్రజాసంకల్ప పాదయాత్ర 2017–2019 అని, మరోవైపు విజయసంకల్ప స్థూపం అని రాశారు. జాతీయ రహదారికి, రైల్వే లైనుకు మధ్యలో... ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించడానికి సుమారు 30 కిలోమీటర్ల ముందు, శ్రీకాకుళం జిల్లా కేంద్రం నుంచి 130 కిలోమీటర్ల దూరంలో... ఏర్పాటైన ఈ పైలాన్ అందరి దష్టినీ ఆకర్షిస్తోంది. 16వ నంబరు జాతీయ రహదారి పక్కనే నిర్మిస్తున్న పటిష్టమైన ఈ నిర్మాణానికి మరోవైపు హౌరా–చెన్నై రైల్వే లైను ఉంది. దీంతో అటు బస్సుల్లో , ఇటు రైళ్లలో ప్రయాణించే వారికి స్థూపం కనువిందు చేయనుంది. ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి ఇప్పటికే దర్శనీయ స్థలంగా మారింది. ఇప్పుడు వైఎస్ జగన్ విజయసంకల్ప స్థూపం కూడా అదే స్థాయిలో చరిత్రలో నిలుస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. తన సుదీర్ఘ పాదయాత్ర పొడవునా ప్రజలను కలుసుకున్నప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా విజయం చేకూరాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ముందుకెళుతున్నారు కనుక, ఈ స్థూపానికి ‘విజయసంకల్పం’ అని పేరు పెట్టినట్లు రఘురామ్ వివరించారు. తిరునాళ్ల వాతావరణం ఈ పైలాన్.. సందర్శకుల దృష్టిని ఆకర్షిస్తోంది. పాదయాత్ర పూర్తయ్యే రోజు దగ్గరపడిన కొద్దీ స్థూపం పనులు వేగంగా జరుగుతుండటం, ఆకర్షణీయంగా ఉండటంతో చూడ్డానికొచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వారం రోజుల నుంచైతే చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వస్తున్న వారు కొద్దిసేపు ఆగి స్థూపం చూసి వెళుతున్నారు. ఇక పార్టీ శ్రేణుల హడావుడి చెప్పనలవి కాని విధంగా ఉంది. ఉదయం నుంచీ రాత్రి పొద్దు పోయే దాకా తిరునాళ్ల వాతావరణమే కనిపిస్తోంది. -
ఘన చరితం 3648 కి.మీ.
జనం మధ్యే నివాసం.. జనంతోనే సహవాసం.. జనం కష్టాలు తెలుసుకోవడమే లక్ష్యం.. జనం కన్నీళ్లు తుడవడమే కర్తవ్యం.. ఒక్క రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏడాదికిపైగా ప్రజలతో మమేకమైన చారిత్రక ఘట్టమిది. ఏకంగా 3,648 కిలోమీటర్లు సాగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పమిది. మండుటెండైతేనేం..జోరువానైతేనేం.. ఎముకలు కొరికే చలైతేనేం.. లెక్క చేయలేదు.. తాడిత, పీడిత, బడుగు,బలహీన వర్గాల జనావళి గుండె గొంతుక వినాలన్న ఆయన కోరికను పరిపుష్టం చేసుకున్నారు..జన హృదయాల్లోంచి వెల్లువలా వచ్చిన కష్టాల ప్రవాహాన్ని ఒడిసి పట్టుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.. నాలుగున్నరేళ్లుగా అనునిత్యం కష్ట నష్టాలతో అలసిన గుండెల్లో ధైర్యం నింపారు.. కొద్ది రోజుల్లో మంచి జరగనుందనే నమ్మకాన్ని కలిగించారు. అన్ని సమస్యలకూ పరిష్కార మార్గాన్ని అన్వేషించడమే ఆయన ఆశయం. ఈ ఆశయం మహోన్నతం. ప్రజాసేవలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొంటా.. గుండె నిబ్బరాన్ని కోల్పోవడం రాజనీతిజ్ఞత కాదు.. నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా తొణుకుబెణుకు లేకుండా ముందుకు సాగడమే నేర్చుకున్నా. – డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాక్షి, అమరావతి: ఐదేళ్లకు పైగా రాష్ట్రాన్ని జన రంజకంగా శాసించిన ఓ పెను సంచలనం (డాక్టర్ వైఎస్సార్) అనూహ్యంగా ఆగిపోయింది. ప్రజల మనోభావాల పేరిట రాష్ట్రం అస్తవ్యస్తమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైంది. అవశేష ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టిన పాలకులు జన జీవితంతో చెలగాటం ఆడడం మొదలుపెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వేళ.. ‘మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం’.. అంటూ ఓ యువకెరటం జయకేతనాన్ని చేపట్టి ప్రజా సంకల్పయాత్రను చేపట్టింది. పేదవాడి కడుపునింపి.. తిండి, బట్ట, గూడు కల్పించాలన్న ఉదాత్తమైన ఆశయంతో.. చుట్టూ శేషాచలం కొండలు, మధ్యలో లోయ, ఆహ్లాదకరమైన వాతావరణంలో.. డాక్టర్ వైఎస్సార్కు అత్యంత ఇష్టమైన ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి కదిలిన యాత్రికుడు ఈనెల 9న ఇచ్ఛాపురంలో తన పాదముద్రలకు విరామం ఇవ్వనున్నాడు. ఆ యాత్రికుడే వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. తొలి అడుగుతో ప్రారంభమైన యాత్ర మహాయాత్రగా ఎలా మారిందో అదేస్థాయిలో సభలు, సమావేశాలు జరిగాయి. ఇడుపులపాయ వద్ద ఏ స్థాయిలో జరిగిందో అంతకుమించి ప్రతిచోటా సభలు జరిగాయి. అక్కున చేర్చుకున్న జనం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్కు ఉన్న పేరు ప్రతిష్టలు వేరు.. ప్రజాసంకల్ప యాత్ర ద్వారా జగన్ ఎదిగిన తీరు వేరు. ప్రజలలో విశ్వాసాన్ని ప్రోదిచేసిన ఆయన ప్రతిభ అనన్యం. గతానికి భిన్నంగా ఆయన పొందిన గుర్తింపు అద్భుతం. ఎదురులేని నేతగా జనం మదిలో నిలిచిపోయారు. తండ్రిని మించిన తనయుడయ్యారు. ప్రజలు ఆయన్ను ప్రేమించి అక్కున చేర్చుకున్నారు. ప్రేమాభిమానాలు చూపారు. అనురాగ ఆత్మీయతలను పంచారు. తాను ప్రసంగించిన సభల్లో చెప్పిన అంశాలు ప్రత్యేకించి నవరత్నాలు ప్రజల్ని ఆలోచింపజేశాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, అవ్వాతాతల పింఛన్లు, వైఎస్సార్ చేయూత వంటి అంశాలను ఆయన జనంలోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. జనం కోసం జనం మధ్య జనంతోనే అనే వాటికి సాక్షర రూపంగా నిలవగలిగారు. ఫలితంగా మహానేత వైఎస్సార్ను చూసిన కళ్లు జగన్ను చూడడం అలవర్చుకున్నాయి. సుదీర్ఘ యాత్రతో ఆయన అందరి వాడయ్యారు. జనవారధుల్లా కృష్ణా, గోదావరి వంతెనలు ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లా దాటి కృష్ణమ్మ అంచులకు చేరినప్పుడు నదీతీరాన జన కెరటం ఎగిసిపడింది. కనకదుర్గమ్మ వారధి ప్రజల పదఘట్టనలతో ఊగిపోయిన తీరు, ఆ తర్వాత ఇంద్రకీలాద్రి దిగువన సభ జరిగిన వైనం బెజవాడ చరిత్రలో మరువలేనిది. ఇదేననుకుంటే దానికి మించి ఉభయ గోదావరి జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన జనప్రభంజనమైంది. ఉభయ గోదావరి జిల్లాలలో జరిగిన ప్రతీ సభా దేనికదే సాటి అయింది. ఈ సభలకు కులాలు, మతాలు అడ్డుకాలేదు. చిన్నాపెద్దా తేడా లేకుండాపోయాయి. ప్రతి గుండే జగన్నినాదంతో ప్రతిధ్వనించింది. రొటీన్కు భిన్నంగా ప్రసంగం రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్ జగన్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు. అందరిలా మైకు పట్టుకోగానే సోదరీ సోదరులారా అనే దానికి బదులు ఒక చేత్తో మైకు పట్టుకుని మరో చేత్తో టక్ టక్ టక్మని మైక్తో శబ్ధం చేస్తూ.. ఏ ఊరులో సభ జరుగుతుందో ఆ ఊరి పేరు చెప్పడం జగన్ శైలి. ఆ ఊరితో సామీప్యతను, అనుబంధాన్ని తెలియజేసేందుకు ఇది ఉపయోగపడుతుందని గట్టిగా విశ్వసించే జగన్ ఆ పని చేసేవారు. సభ ముగింపులో ఆయన చేసే వినతి ప్రజల్ని ఆకట్టుకునేది. మీ బిడ్డగా వస్తున్న జగన్కు అండగా నిలవండి, ఆశీర్వదించండి, తోడుగా ఉండండని ఆయన చేసే వినతి ఎంతో వినయ వినమ్రతలను వ్యక్తం చేసేలా ఉండేది. మరోవైపు.. జగన్ మైకు పట్టుకున్నది మొదలు ముగించే వరకూ సభా ప్రాంగణాలు జగన్నినాదంతో మార్మోగేవి. కాబోయే సీఎం అంటూ యువత కేరింతలు కొట్టేది. అడుగడుగో మా పెద్దకొడుకు అని అవ్వాతాతలు మురిసిపోయేవారు. అన్నా, జగనన్నా, మేమంతా నీ వెంటే అంటూ అక్కచెల్లెమ్మలు జేజేలు పలికేవారు. ఇడుపులపాయ నుంచి మొదలై.. నవంబర్ 6, 2017.. చరిత్రాత్మక ప్రజాసంకల్ప యాత్రకు వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన రోజది. ప్రకృతి ఆశీర్వదిస్తున్నట్టు ఓ పక్క చిరుజల్లులు, మరోపక్క మాతృమూర్తి విజయమ్మ ఆశీస్సులు, అక్కచెల్లెమ్మల ఆత్మీయానురాగాలు, అశేష జనవాహిని మధ్య డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టింది మొదలు ఈనాటి వరకు వెనుదిరిగి చూడలేదు. వడలో, కడు జడిలో, పెను చలిలో, చివరకు విచ్చుకత్తులు కుత్తుకను తెగనరికేందుకు ప్రయత్నించినా అలుపు, సొలుపు లేకుండా అప్రతిహతంగా సాగిన యాత్ర ముగింపు దశకు వచ్చింది. నాడు ప్రారంభ సభ ఇడుపులపాయలో జరిగితే నేడు ముగింపు సభ ఇచ్ఛాపురంలో జరగనుంది. ప్రజల మనిషిగా వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతటి కీర్తి గడించారో.. ఆయన కుమారునిగా జగన్ అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. తనను నమ్ముకున్న వారికి, తాను నమ్మిన వారికి జగన్ అభయ ప్రదాతగా నిలిచారు. అందువల్లే ఆయన సభలకు అడుగడుగునా జనం పోటెత్తారు. నీరాజనాలు పలికారు. మాట తప్పడం మడమ తిప్పడం తన రక్తంలోనే లేదని గర్వంగా చెప్పుకోవడమే కాకుండా అఖిలాంధ్ర ప్రజానీకానికి ఆయన అన్నగా నిలిచారు. అక్కచెల్లెమ్మలకు తోబుట్టువయ్యారు. అన్నదమ్ములకు ఆత్మబంధువయ్యారు. ఏ సభకు ఆ సభే సాటి జగన్మోహన్రెడ్డి 134 నియోజకవర్గాలలో పర్యటిస్తే 124 బహిరంగ సభలలో ప్రసంగించారు. ఒక సభ బాగా జరిగింది మరొకటి బాగా జరగలేదనడానికి వీల్లేదు. దేనికదే సాటి. ప్రతీ సభా ఒక ప్రత్యేకతను చాటింది. సభకు గంట ముందు పెద్దగా అలికిడి లేని సభా ప్రాంతాలు జగన్ రాకకు సరిగ్గా అరగంటకు ముందు ఇసుకవేస్తే రాలనట్టుగా తయారయ్యేవి. కట్టలు తెగిన నదీ ప్రవాహం మాదిరి జనం పోటెత్తేవారు. మేడలు, మిద్దెలు, చెట్టు చేమలు జనంతో నిండిపోయేవి. సభ జరిగిన తర్వాత ఆయా ప్రాంగణాలన్నీ తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చొక్కాలు, చిందరవందరగా కాగితాలు, బెలూన్లతో నిండిపోయేవి. కాలాలతో నిమిత్తం లేకుండా సభలు జరిగిన తీరు ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు పొందాయి. జడివాన కురుస్తున్నా తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలలో పర్యటన, బహిరంగ సభలు ఆగలేదు. కుండపోతగా వర్షం పడుతున్నా యలమంచిలి, నర్సీపట్నంలో ప్రజలు జగన్ మాట్లాడేవరకు పోబోమని భీష్మించిన తీరు ఇప్పటికీ ఆ ప్రాంతాలలో చెప్పుకుంటుంటారు. ఎండలు మాడ్చేస్తున్నా, తుపాన్లతో ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేస్తున్నా తాను మాత్రం తన సంకల్పాన్ని మరువక రేపటి గురించి ఆలోచించారే తప్ప తనకు ఏమవుతుందోనని భయపడలేదు. ఆకట్టుకున్న పిట్టకథలు ఏదైనా ప్రసంగం ఆకట్టుకోవాలంటే స్థానిక సామెతలు, పిట్టకథలు, పోలికలు అత్యంత అవశ్యం. వేయి పదాల్లో చెప్పలేని విషయాన్ని ఒక్క ఫొటోతో చెప్పినట్లే ఒక్క సామెతతో వంద విషయాలను చెప్పవచ్చు. రెయిన్గన్లతో కరువును జయించాను అని చంద్రబాబు పదేపదే చెప్పే విషయాన్ని పిట్టలదొర కథతో పోల్చి చెప్పిన తీరు సభికుల్ని విశేషంగా ఆకట్టుకుంది. కట్టె తుపాకీ పేలుతుందా? అనే అర్థం వచ్చేలా ప్రత్యక్ష సాక్షులతో విషయం చెప్పించారు. జగన్ చెప్పిన కొండచిలువ, రైతు కథ.. చంద్రబాబు చెప్పే అబద్ధాలకు, మోసాలకు అద్దంపట్టాయి. తిత్లీ తుపానుపై గోరంత సాయంచేసి కొండంత ప్రచారం చేసుకున్న వైనాన్ని శవాలపై చిల్లర ఏరుకునే సామెతతో పోల్చిన తీరు కూడా సభికుల ప్రశంసలందుకుంది. బీజేపీ, చంద్రబాబు కలిసి నాలుగేళ్లు చిలకా గోరింకల్లా కాపురం చేయడంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజల హర్షామోదాలు పొందాయి. పురాణాలు, ఇతిహాసాల నుంచి తీసుకున్న అనేక అంశాలను ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చెప్పిన కథలు, సామెతలు జగన్ సభల్లో హైలెట్గా చెప్పవచ్చు. మరుగున పడిన అంశాలెన్నో కావాలిప్పుడు చరిత్ర మరుగున పడి కనిపించని ఎన్నో విషయాలను జగన్ తెరపైకి తెచ్చారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఈ సభలను వారి గొంతుకగా చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యంలేని వివిధ వర్గాలకు చోటు కల్పిస్తానన్నారు. విస్మరించిన శ్రేణులను గుర్తిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడిబజార్లో ఖూనీ చేస్తున్న తీరుతో మనస్సు నొచ్చుకుని పాదయాత్ర చేపట్టిన జగన్.. ఆ బజార్లనే బహిరంగ వేదికలుగా మలిచారు. ప్రజల ప్రాతినిధ్యం ఉండేలా పీపుల్స్ అసెంబ్లీలను సృష్టించారు. అసెంబ్లీలో మాదిరి అడుగడుగునా ఆటంకాలు, మైక్ కట్లు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా ప్రజలకే చెప్పి ఏది న్యాయమో, మరేది అన్యాయమో తరచి చూడండంటూ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు. జగన్ అనే నేను.. విషయాలపట్ల స్పష్టత, ముక్కుసూటితనంతో ప్రజల మదిని గెలిచారు. హామీలివ్వడం ఎవ్వరైనా చేస్తారు. వాటిని అమలుచేసినప్పుడే ఆ వ్యక్తి జీవితానికి సార్థకత లభిస్తుంది. సమకాలీన రాజకీయ చరిత్రలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పనిచేశారు. తాను చేసిన హామీలను అమలుచేసి చిరస్మరణీయునిగా నిలిచారు. సరిగ్గా జగన్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. నాన్నగారు ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన కొడుకుగా నేను రెండడుగులు వేస్తానని సగర్వంగా చెబుతూ వచ్చారు. ప్రజా జీవనంలో ఉన్నప్పుడు నిజాయితీ, విశ్వసనీయత ఉండాలని పదేపదే ఉద్భోదించారు. తాను అధికారంలోకి వస్తే.. అది ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, పేదలకు ఇళ్ల నిర్మాణమైనా, మరేదైనా సరే అమలుచేస్తానని చెప్పినప్పుడు, ‘జగన్ అనే నేను..’ అనే పదాన్ని ఉపయోగించారు. జగన్ నోటి నుంచి ఆ మాట వచ్చినప్పుడల్లా హర్షధ్వానాలతో సభా ప్రాంగణాలు హోరెత్తేవి. -
ఒకే మాట ఒకే బాట
‘నాకు డబ్బు మీద వ్యామోహం లేదు. చరిత్ర సృష్టించాలన్నదే నా లక్ష్యం. ఒకసారి ముఖ్యమంత్రి స్థానంలోకొస్తే ప్రజలకు ఎంతో మంచి చేయాలన్న ఆశయం ఉంది. ఆ మంచి ఎలాంటిదంటే.. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా తాపత్రయం’.. ..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాట యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్ని సూటిగా తాకింది. నాయకుడంటే ఇలా ఉండాలన్న జనాభిప్రాయం ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా వ్యక్తమవుతోంది. ఏ మూలనో చిన్న అనుమానం ఉన్న వారు కూడా ఈ వ్యాఖ్యతో ఆయనపై నిశ్చితాభిప్రాయానికి వచ్చేశారు. అసలు సిసలైన నాయకుడంటే జగనే అని ఘంటాపథంగా చెబుతున్నారు. సాక్షి, అమరావతి : పద్నాలుగు నెలలకు పైగా ప్రజాక్షేత్రంలో ఉన్న వైఎస్ జగన్ అనుక్షణం జనం కష్టసుఖాలే ఆలకించారు. తాడిత పీడిత గుండె గొంతుకై అవినీతి సర్కారును జనబాహుళ్యంలోనే ఎండగట్టారు. ఇందుకూ ఓ నేపథ్యముంది.. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. ప్రజావాణి విన్పించే చట్టసభలను మందబలంతో అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. జనం కష్టాలు వినిపించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్షం గొంతును అసెంబ్లీ సాక్షిగా నొక్కేసింది. గుండె చెదిరిన సామాన్యుడు నిస్సహాయ స్థితికి చేరాడు. దీంతో దగాపడ్డ వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు, సర్కార్ అవినీతిని ఎండగట్టేందుకు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. జనం కన్నీళ్లను దోసిటపట్టిన జననేత ప్రతీ గుండెను హత్తుకున్నారు. కసి.. కదలిక.. పరిష్కారం! వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో 2017 నవంబరు 6న పాదయాత్ర మొదలైనప్పుడు జగన్లో ఓ కసి కనిపించింది. ‘ప్రతీ గడపకూ వెళ్లాలనుంది.. జనం గుండె చప్పుడు వినాలనుంది.. కసిగా ఉన్నాను. ప్రజల కోసమే బతకాలన్న ఆవేశంతో ఉన్నాను’ అని జగన్ చెప్పారు. పద్నాలుగు నెలల సుదీర్ఘ పాదయాత్ర అనంతరం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం చేరువలోకొచ్చిన జననేతలో స్పష్టమైన, పరిపూర్ణమైన మార్పు కన్పిస్తోంది. సమస్యలు వినేందుకే వస్తున్నానని చెప్పిన నేత.. ఇప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పారు. తరలివచ్చిన ప్రజావెల్లువ సాక్షిగా కన్నీళ్లు తుడిచే పథకాలను ప్రకటించారు. దగాపడ్డ రైతన్నకు ఎక్కడికక్కడే భరోసా ఇస్తూ తానొస్తే ఎలా ఆదుకుంటానో చెప్పారు. పెట్టుబడి సాయం ఎలా ఇస్తానో వివరించారు. అప్పులపాలైన అక్కాచెల్లెమ్మల ఆవేదన విన్న జగన్.. జనం సాక్షిగా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సంక్షేమం అందని పేదవాడి గురించే ఏడాది క్రితం జగన్ మాట్లాడేవారు. ఉపాధిలేక ఊరొదిలే యువత ఆవేదనే విపక్ష నేత వాణిలో చూశాం. పాదయాత్రలో ఆ సమస్యకు ఆయన పరిష్కారం చెప్పారు. అధికారంలోకొస్తే ఏటా పోస్టుల భర్తీచేస్తానని, పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిచ్చేలా చట్టం తెస్తానన్నారు. ఇల్లులేని పేదల సొంతింటి స్వప్నం జగన్ నోటి వెంట వచ్చింది. అభాగ్యుల ఆర్తి తెలుసుకున్న తర్వాత ఆయనిప్పుడు ఆరోగ్యశ్రీని ఎంత విజయవంతంగా అమలుచేయవచ్చో స్పష్టత ఇస్తున్నారు. ప్రతీ సమస్యపై స్పష్టమైన అవగాహనతో సర్కారును నిలదీసే నైజం ఏడాది క్రితం వైఎస్ జగన్ది. ఇప్పుడు అధికారంలోకొస్తే ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో స్పష్టంగా చెప్పగలిగే వ్యక్తి జగన్. విలువలే ప్రాణం.. విశ్వసనీయతే ఆయుధం ‘జగన్ ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ సాధ్యమా? ఈ మాట అధికారపక్షం కూడా అనలేకపోతోంది’.. పాదయాత్రను నిశితంగా గమనించిన రిటైర్డ్ సీనియర్ అధికారి అనంతరామారావు అన్న మాటలివి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అనేకమంది దగ్గర ఇదే ప్రస్తావన తెస్తే వాళ్లు చెప్పిందొకటే.. ‘వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నాడు. హామీ ఇవ్వకుండానే ఎన్నో చేశాడు. ఆ రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఆ మాత్రం నమ్మకముంది’.. అన్న జవాబే వచ్చింది. ఆరంభం నుంచీ ఒంటరిపోరే చేస్తున్న జగన్.. కష్టాలెన్నొచ్చినా రాజకీయ ప్రస్థానంలో విశ్వసనీయతకే ప్రాధాన్యమిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు ఎక్కడా తావివ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని రాసిచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తే ఉండదన్నారు. మాటకు కట్టుబడే జగన్ నైజం ప్రజలను బాగా ఆకర్షించిందని రాజకీయ వర్గాలూ విశ్లేషిస్తున్నాయి. చెదరని గుండె.. చలించే మనస్సు విశాఖ విమానాశ్రయంలో హత్యకు కుట్ర జరిగినా జగన్ నిబ్బరంగా ఉండటాన్ని ప్రజలు గమనించారు. దాన్నో అవకాశంగా తీసుకుని హడావిడి చేసే రాజకీయ స్వభావం లేకపోవడాన్ని జనం హర్షించారు. రక్తసిక్తమైన దుస్తుల్లోనూ మొక్కవోని గుండె ధైర్యంతో పార్టీ కేడర్ను ఆవేశానికి గురికాకుండా చేయడం జగన్లో చెప్పుకోదగ్గ లక్షణమనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. నాలుగున్నరేళ్ల ఈ ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీ నేతల ఈసడింపులు, దుర్భాషలు, రెచ్చగొట్టే చర్యలు అనేకం ఎదురయ్యాయి. కానీ, ఎక్కడా తొణకలేదు. పాదయాత్రలో జనం మరింత దగ్గరవ్వడానికి ఇదీ ఓ కారణమనేది రాజకీయ వర్గాల నిశ్చితాభిప్రాయం. ప్రజలు ఈ లక్షణాలన్నీ పాదయాత్ర ద్వారా దగ్గర్నుంచి చూడగలిగారు. ‘అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడేమోగానీ.. జగన్ మాత్రం చంద్రబాబు కుయుక్తులను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లార’ని ఓ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ సహా విపక్ష గొంతు నొక్కిన తీరు.. అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అధికార పార్టీ నైజాన్ని ప్రతీ వ్యక్తి చర్చించే రీతిలో జగన్ జనంలోకి తీసుకెళ్లారు. విమర్శలకు ప్రతివిమర్శలే పరిష్కారమనే ప్రస్తుత రాజకీయ వాతావరణంలో స్థితప్రజ్ఞతతో ఓ నేత జననేతగా గుర్తింపు తెచ్చుకుంటాడని జగన్ నిరూపించారు. గిట్టుబాటు ధరల్లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతు పక్షాన ఆయన జరిపిన పోరాటాన్ని.. ప్రత్యేక హోదా కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వాన్ని ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు. ఇవన్నీ ప్రజల్లో ఆయనను మంచి నేతగా గుర్తింపు తీసుకొచ్చాయని చెబుతున్నారు. వ్యక్తి.. శక్తి.. వ్యవస్థ జగనే తమ నాయకుడని బలంగా చెబుతున్న జనం ఆయన రాజకీయ విస్తరణను.. ప్రజలపట్ల ఆయనకున్న నిబద్ధతను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ‘ఓ వ్యక్తిగా రాజకీయాల్లోకొచ్చాడు.. వ్యక్తిత్వంతోనే పార్టీని శక్తిగా మార్చాడు.. పాదయాత్ర ద్వారా ఓ వ్యవస్థనే ఏర్పాటుచేశాడు. జగన్ అంటేనే జనమన్న నమ్మకం కల్గించాడు. ఏడాదికిపైగా ఎండలో మాడిపోతూనే ప్రజలను నవ్వుతూ పలకరించాడు. వర్షంలో తడిసి ముద్దవుతూనే పేదల బతుకు చిత్రాన్ని దగ్గరుండి పరిశీలించాడు. వణికించే చలిలోనూ ప్రజల గుండె చప్పుడు వినేందుకు వడివడిగా అడుగులేశాడు. జనం లోగిళ్ల ముందే జగన్ సంక్రాంతి చేసుకున్నాడు. ప్రజల ఆనందపు వెలుగుల్లోనే దీపావళి జరుపుకున్నాడు. తెలుగు ప్రజల ఆత్మీయతల మధ్యే తెలుగు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాడు. ఇలా పండగేదైనా అన్నీ ప్రజాక్షేత్రంలోనే. ఇవన్నీ జగన్ తమ నాయకుడనే భావాన్ని ప్రజల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. జగన్ పుట్టినరోజు ప్రజల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అందుకే జనం.. రావాలి జగన్–కావాలి జగన్ అని అంటున్నారు. అలసటే ఎరుగని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సార్ దగ్గర పనిచేయడం, వేల కిలోమీటర్ల పాదయాత్రలో ఆయన వెన్నంటే ఉండడం, నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతమే. ఆయనలో ఉన్నంత సహనం, దయాగుణం నేనెక్కడా చూడలేదు. పాదయాత్రలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎన్ని వేలమంది వచ్చి కలుస్తున్నా.. ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఏనాడూ అలసట, చిరాకు, కోపం అనేది ఆయనలో ఎప్పుడూ కనిపించలేదు. పైపెచ్చు నేను ఎప్పుడైనా మా స్టాఫ్పట్ల కొంచెం చిరాకుపడితే సార్ ఊరుకునే వారు కాదు. ‘అలా కోపం మంచిది కాదు.. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలి. ప్రశాంతంగా ఉంటే అన్నీ చక్కగా, సాఫీగా జరుగుతాయి’.. అని చెబుతుండే వారు. ఇంటిదగ్గర ఉన్నా.. పాదయాత్రలో ఉన్నా రాత్రి పదకొండు గంటలకు పడుకుని ఉదయం నాలుగు.. నాలుగున్నరకల్లా నిద్రలేవడం సార్కు అలవాటు. సమయపాలనలో చాలా ఖచ్చితంగా ఉంటారు. క్రమశిక్షణ పాటిస్తారు. వ్యాయామం.. మిత ఆహారం ఉదయం లేచాక టీ తాగి ఒక గంటపాటు వ్యాయామం చేస్తారు. అనంతరం స్నానంచేసి వచ్చాక అరగంటపాటు ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక గ్లాసు పళ్లరసం తీసుకుంటారు. అంతే.. టిఫిన్ వంటివి ఏవీ చేయరు. ఆ వెంటనే పాదయాత్ర ప్రారంభిస్తారు. మధ్యాహ్నం శిబిరం వచ్చేవరకు ఏమీ పుచ్చుకోకుండానే నడుస్తారు. ఆ తర్వాత ఆపిల్ లేదా వేరే ఏదైనా పండు ఒకటి తీసుకుని మజ్జిగ తాగుతారు. అనంతరం అరగంటసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తరువాత పార్టీ వారితో మాట్లాడి మళ్లీ పాదయాత్రకు రెడీ అవుతారు. ప్రజా సమస్యల గురించి నిత్యం పార్టీ నాయకులు, ఇతరులతో చర్చిస్తూ ఉంటారు. ఏదైనా ఒక విషయం మీద లోతుగా సమాచారం మొత్తం తెప్పించి చదివేవారు. ఏవైనా సందేహాలుంటే మళ్లీ మాతో ఫోన్లు చేయించి వారితో మాట్లాడేవారు. రాత్రి శిబిరానికి చేరుకునే వరకూ మళ్లీ ఎలాంటి ఆహారమూ తీసుకోరు. ఒక్కోసారి మధ్యాహ్నం పూట కూడా ఆగకుండా ఏకధాటిగా రాత్రి శిబిరం వరకు నడుస్తారు. ఇక రాత్రి ఆహారం కింద కేవలం రెండు రకాల కాయగూరలతో చేసిన కర్రీ, ఒక పుల్కా, తీసుకుంటారు. మాంసాహారం అసలు ముట్టుకోరు. ఆ పాదయాత్ర మిస్సయినా.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సార్ దగ్గర పనిచేస్తూ ఆయన పాదయాత్ర ప్రారంభమయ్యే సమయానికి జగన్ సార్ దగ్గరకు వచ్చేశాను. అప్పుడు పాల్గొనలేకపోయినా ఈ పాదయాత్రలో నేను సార్తో పాటు ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. కానీ, ఈరోజే (మంగళవారం) ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాను. ఇప్పుడు యాత్ర ముగింపు సమయంలో నేను లేకపోవడం చాలా బాధగా ఉంది. విశాఖలో సార్పై కత్తితో దాడి జరిగినప్పుడు నేను చాలా భయపడ్డా. – నారాయణ (వైఎస్ జగన్ వ్యక్తిగత సహాయకుడు) సొంత మనిషిలా చూసుకుంటారు గతంలో పోలవరం ప్రాజెక్టు వద్దకు పాదయాత్రగా వెళ్లినప్పుడు నేనూ ఆయనతో పాటు నడిచాను. కానీ, ఈసారి వద్దన్నారు. వయసు మీదపడ్డాక ఇప్పుడెందుకు నడుస్తావ్ అని అన్నారు. పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో రెండుసార్లు నేను అస్వస్థతకు గురైతే వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఇందులో ఒకసారి హైదరాబాద్కు విమానంలో పంపించారు. ‘నారాయణ నాకు కావల్సిన వ్యక్తి.. ఆయనకు ఏ ఇబ్బంది రాకూడదు. అన్నీ దగ్గరుండి చూసుకోండి’ అని ఆస్పత్రి వారికి చెప్పి మరీ వైద్యం చేయించారు. ఇంత జాగ్రత్తగా ఆయన తన సహాయకులను చూసుకుంటారు. దాదాపుగా 36 ఏళ్లుగా ఆ కుటుంబంలోనే నేను పనిచేస్తున్నాను. పదహారేళ్లుగా జగన్ సార్తో ఉంటున్నాను. నన్ను ఏనాడూ ఒక ఉద్యోగిగా చూడలేదు. ఇంటిలోని సొంత మనిషిగా చూసుకుంటున్నారు. పేదోడికి ధీమా.. అందరికీ భరోసా అన్ని వర్గాలకు అనువైన హామీలు ప్రజల కష్టాలను కళ్లారా చూసి ఈ హామీలు ఇచ్చాను. వీటిని నేరవేర్చలేక పోతే తప్పుకుంటాను. – వైఎస్ జగన్ ‘చేయగలిగినవే చేస్తాను.. చేసేవే చెబుతాను’ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ అనేమాటిది. ఏడాదికిపైగా సాగిన ప్రజాసంకల్ప యాత్రలో ఆయన ప్రజల కష్టాలెన్నో తెలుసుకున్నారు. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేశారు. జనామోదం పొందిన నవరత్నాలను ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రజల్లో భవిష్యత్ పట్ల ఆశను కల్పించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే తమ బతుకులు మారతాయనే భరోసానిచ్చారు. ఆయన అధికారంలోకొస్తే నవరత్నాల రూపంలో ప్రతి ఇంటికీ ఏడాదికి రూ.లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం వచ్చింది. టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో బక్కచిక్కి శల్యమైన రైతుల కన్నీటి కథలు.. నిరుద్యోగుల వెతలు... అక్కచెల్లెమ్మల కన్నీటి గాథలు ప్రతిపక్ష నేతను కదిలించాయి. బతుకు భరోసా లేని అవ్వాతాతలు, ఆరోగ్యశ్రీ వర్తించక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న అనేకమంది వైఎస్ జగన్ను కలుసుకుని తమ గోడు వెల్లబోసుకున్నారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మేధావులు ఒకరేమిటి మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతిపక్ష నేత అడుగులో అడుగులేశారు. అథ:పాతాళంలో అభివృద్ధి రాష్ట్రం ఈ నాలుగున్నరేళ్లలో అభివృద్ధిలో అథ:పాతాళంలో నిలిచింది. ఏ ఒక్క వర్గమూ టీడీపీ పాలనలో సంతోషంగా లేదు. రాజధానికని ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కోవడం దగ్గర నుంచి రైతు రుణాల మాఫీ వరకు, విద్యార్థులకు ఏళ్ల తరబడి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడం నుంచి నిరుద్యోగులకు భృతి అందివ్వకపోవడం వరకు ఎక్కడా ఆయా వర్గాల అభివృద్ధి జాడే లేదు. రాజధానిలో సింగపూర్ నిర్మాణాలని ఒకసారి, జపాన్ నిర్మాణాలని మరోసారి ప్రజలను మోసం చేయడం, వారికి రోజుకో సినిమా చూపడం తప్ప శాశ్వత భవనాలకు ఒక్క ఇటుకా పడలేదు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను నిండా ముంచారు. అలాగే వాడవాడలా బెల్టుషాపులకు గేట్లు ఎత్తి కుటుంబాలను చిన్నాభిన్నం చేశారు. ఇలా ఎవరికీ సంతోషం లేకుండా, అభివృద్ధి అనేది లేకుండా టీడీపీ పాలన సాగింది. అభివృద్ధికి అసలైన నిర్వచనం ఇచ్చిన ప్రతిపక్ష నేత టీడీపీ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన అన్ని వర్గాలను ఆదుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్న పథకాలు వారికి భవిష్యత్ పట్ల భరోసాను కల్పించాయి. చిన్నారులను బడికి పంపించే తల్లుల కోసం ప్రకటించిన అమ్మఒడి పథకంతో చిన్నారులంతా బడిబాట పడతారు. అదేవిధంగా చదువుకునేవారికి ఎంత ఫీజైనా చెల్లిస్తామంటూ ప్రకటించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం విద్యార్థుల ఉన్నతవిద్య ఆశలను సాకారం చేస్తుంది. ఉన్నత విద్య పూర్తి చేసుకోగానే ప్రతి ఏటా ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటించడంతోపాటు ఎప్పటికప్పుడు ఖాళీ పోస్టులను భర్తీ చేయడం వల్ల నిరుద్యోగ సమస్యను రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించవచ్చు. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వడం వల్ల వలసలు తగ్గిపోతాయి. ఇక తాగునీరు అందక, పంటలు పండక, గిట్టుబాటు ధరలు లభించక తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్న రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కాంతిరేఖగా నిలుస్తుంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మల కోసం ప్రకటించిన వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళల అభివృద్ధి సాధ్యమవుతుంది. అధికారంలోకి రావడానికి కాకుండా ప్రజాసంకల్పయాత్రలో ఎంతోమంది బాధితుల సమస్యలు విన్నాక.. వారి బాధలు చూశాక.. ఎంతో అధ్యయనం చేశాక ఆయా వర్గాల అభివృద్ధికి ఈ పథకాలను ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక ఈ హామీలు నెరవేర్చలేకపోతే ఏకంగా పదవి నుంచే తప్పుకుంటానని వైఎస్ జగన్ చెప్పడం ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేసి చూపాలనే దృఢసంకల్పానికి నిదర్శనం. నవరత్నాలతో పాటు వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో మరికొన్ని.. - మూతపడ్డ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపిస్తారు. - అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం. - ముస్లిం మైనార్టీలను ఆదుకునేందుకు సబ్ప్లాన్ ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, భూముల పంపిణీ. - దాదాపు అన్ని సామాజికవర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు. - ఏటా మెగా డీఎస్సీ నిర్వహణతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టుల భర్తీ - ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ - ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు. పది మందికి ఉద్యోగాలు. - ప్రైవేటు పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం. - దుల్హన్ పథకం కింద ఇచ్చే రూ.50 వేల మొత్తం రూ.లక్షకు పెంపు. - ఇమామ్లకు ప్రతినెలా రూ.10 వేలు, మౌజమ్లకు రూ.5 వేలు గౌరవ వేతనం. - గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేలా విద్యుత్ ఛార్జీలను యూనిట్కు రూ.7.35 నుంచి రూ.3.75కు తగ్గింపు. - నాయీబ్రాహ్మణులకు 250 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్. ప్రధాన ఆలయాల్లో కనీస వేతనంపై పనిచేసే అవకాశంతోపాటు ఎమ్మెల్సీ స్థానం. - గిరిజనులకు.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు. - మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్పై 50 శాతం సబ్సిడీ, వేట సమయంలో చనిపోతే మూడు నెలల్లో రూ. 10 లక్షలు అందేలా చర్యలు, ప్రత్యేక కార్పొరేషన్. పాదయాత్రతో మారిన ప్రజా నాడి ప్రజల కష్టనష్టాలు తెలుసుకుంటూ.. వారిలో ధైర్యం నింపుతూ.. భవిష్యత్పై భరోసా ఇస్తూ వేలాది కిలోమీటర్ల మేర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సాగించిన ప్రజా సంకల్ప యాత్రతో జనం నాడి మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమ గోడు వినేందుకు వచ్చిన జగన్ వెంట నిరుపేదలు, అణగారిన వర్గాలు, సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు యువత, ఉద్యోగులు ఇలా ఒకరేమిటి.. అన్ని వర్గాలు పాదం కదపడమే ఇందుకు నిదర్శనమని వారు చెబుతున్నారు. జగన్ అడుగుపెట్టిన ప్రతి ప్రాంతానికి తండోపతండాలుగా తరలివచ్చి తమ అభిమానం చాటుకోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధి జగన్తోనే సాధ్యమని వారు భావిస్తుండటం వల్లే ఈ ప్రజాదారణని పేర్కొంటున్నారు. వైఎస్సార్ అస్తమయం, రాష్ట్ర విభజన తర్వాత సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలకు జగన్ ఆశాదీపంలా కనిపించారని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి బయటకు వచ్చి వైఎస్సార్సీపీని స్థాపించినప్పుడు.. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు బనాయించి జైలు పాలుచేసినప్పుడు కూడా జనం ఆయన్ని వదల్లేదన్నారు. అయితే అనుభవంతో పాటు రుణమాఫీ వంటి 600 హామీలతో గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని.. లేకపోతే 2014లోనే జగన్ సీఎం అయ్యేవారని గుర్తు చేస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీ సరిగ్గా నెరవేర్చకపోగా.. అవినీతి, అక్రమాలు పెరిగిపోవడం, జన్మభూమి కమిటీల లంచావతారం.. టీడీపీ నేతల అరాచకాలతో ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిందని వివరించారు. ఈ సమయంలో జగన్ పాదయాత్ర చేపట్టి ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ.. వాటిపై సభల్లో ప్రభుత్వాన్ని నిలదీయడం ద్వారా అశేష అభిమానాన్ని చూరగొన్నారని వివరించారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ తన పార్టీ నాయకులకు, కేడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పోరాటాలు చేయించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలకు ఒక స్పష్టత వచ్చిందని.. వచ్చే ఎన్నికల్లో ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి చరమ గీతం పాడాలనే నిర్ణయానికి వారు వచ్చారన్నారు. ధన బలం, కండబలం, అధికార బలంతో పాటు పోల్ మేనేజ్మెంట్ ద్వారా తిమ్మిని బమ్మిని చేయొచ్చనుకుంటున్న టీడీపీ నేతల ఆటలు సాగే పరిస్థితి కనపడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొంటున్నారు. -
జన ప్రభంజనంతో సర్కారు బెంబేలు
బిందువు బిందువు సింధువు అయినట్లు.. ఇంతింతై.. వటుడింతై అన్నట్లు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర ప్రభంజనంగా మారి రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఊళ్లకు ఊళ్లే పాదయాత్ర ప్రాంతానికి తరలి వస్తుండటం, చిన్నారులు మొదలు వయో వృద్ధుల వరకు వైఎస్ జగన్ను కలవాలని, కరచాలనం చేయాలని పోటీపడ్డారు. ఈ ఆదరణ చూసి సర్కారు పెద్దలకు కన్ను కుట్టింది. ఎన్నెన్నో కుయుక్తులు చేశారు. జనం రాకుండా అడ్డుకోవాలని చూశారు. ఏవీ సఫలం కాకపోవడంతో ఏకంగా అంతమొందించడానికి వ్యూహం పన్నారు. ఇదీ బెడిసి కొట్టడంతో నోటì కి పని చెప్పారు. వీటన్నింటినీ అధిగమించిన జగన్ కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సమైక్యాంధ్ర చరిత్రను తిరగరాసిన ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర. ఇక 2014 తర్వాత విభజనాంధ్రప్రదేశ్ను అవినీతి, అక్రమాలు, అరాచకాలతో అవశేషాంధ్రగా మార్చేస్తున్న దారుణ పరిస్థితుల్లో తల్లడిల్లిన ప్రజల గుండెచప్పుడై.. రాష్ట్ర దిశ, దశ మార్చాలన్న సంకల్పంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రది మరో చరిత్ర. నాడు మహానేత వైఎస్ పాదయాత్ర కళ్ల ముందు మెదిలి.. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ చేపట్టే పాదయాత్ర ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకున్న టీడీపీ పెద్దల కళ్లు బైర్లు కమ్మాయి. అంతే.. అసలు జగన్ను జనంలోకి వెళ్లకుండా చేయాలని కుయుక్తులు పన్నారు.. కుట్రలకు దిగారు. కానీ ఏ క్షణంలోనూ వైఎస్ జగన్ చలించలేదు. అందుకే ఎక్కడికక్కడ పాదయాత్రలో జనం సముద్రంలా పోటెత్తారు. జనతరంగం ప్రతిచోటా ఉవ్వెత్తున ఎగిసింది. సరైన భద్రత కల్పించకుండా.. ఇక పాదయాత్రలో ప్రతిపక్ష నేత స్థాయికి కల్పించాల్సిన సరైన భద్రతను ఇవ్వలేదు. స్వచ్ఛందంగా వెల్లువెత్తుతున్న ప్రజలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. పాదయాత్ర దృశ్యాలు, వైఎస్ జగన్ ప్రసంగాలు టీవీల్లో కనపడకుండా, వినపడకుండా సరిగ్గా యాత్ర జరిగే ఊళ్లలో అప్రకటిత కరెంటు కోతలు విధించారు. కుట్రలు, కుతంత్రాలు, ఆంక్షలు, అవాంతరాలను తుత్తునియలు చేస్తూ అన్నింటినీ చిరునవ్వుతో అధిగమించి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగారు. ఇడుపులపాయలో జనజాతరలా మొదలై.. రాయలసీమ జిల్లాలను దాటి... కోస్తాంధ్ర జిల్లాల్లోకి అడుగుపెట్టేసరికి సంకల్పయాత్ర జన ఉప్పెనలా మారిపోయింది. జిల్లా.. జిల్లా దాటుతూ ఉంటే యాత్ర మహోజ్వల రూపం దాల్చుతూ వచ్చింది. పాదయాత్రతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ జనంలోనే ఉంటూ రాజకీయం మొత్తం తన చుట్టూ తిరిగేలా చేశారు. అత్యంత ప్రభావవంతమైన, శక్తిమంతమైన నాయకుడిగా ఆవిర్భవించడాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు ప్రభుత్వం ఆయనను అంతమొందించే కుట్రకు తెరతీసింది. గుంటూరు జిల్లాలో ముందుగా రెక్కీలు పాదయాత్రతో రోజురోజుకీ తమ కంట్లో నలుసులా మారిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అంతమొందించడానికి కుట్ర చేశారు. ఈ క్రమంలో ముందు గుంటూరు జిల్లాలో.. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో రెక్కీలు కూడా నిర్వహించారు. ఏకంగా కేంద్ర రక్షణశాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న విశాఖ విమానాశ్రయంలో చంపడానికి భారీ కుట్ర పన్నారు. అక్కడేం జరిగినా కేంద్రం మీదకు నెట్టేయాలని ప్లాన్ చేశారు. ఇందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరం థానేలంకకు చెందిన జె.శ్రీనివాసరావును పాత్రధారిగా ఎంచుకున్నారు. నేర చరిత్ర ఉన్న అతడికి ఎయిర్పోర్ట్లో టీడీపీ నేత, సీఎం చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన హర్షవర్ధన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ఫుడ్స్ రెస్టారెంట్లో ‘పని’ కల్పించారు. సదరు శ్రీనివాసరావు ఆ రెస్టారెంట్లోనే కత్తులను భద్రపరుచుకుని హత్యాయత్నం చేసిన రోజు ఉదయం వాటికి పదును కూడా పెట్టాడు. ఇక ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్వో)ను కూడా తమ వలలో వేసుకున్నారు. పదేళ్లుగా రెస్టారెంట్ పేరుతో అక్కడే పాతుకుపోయిన హర్షవర్ధన్ చౌదరి.. చంద్రబాబు, లోకేష్ల పేర్లు చెప్పి విశాఖ ఎయిర్పోర్ట్ను, యంత్రాంగాన్ని ప్రభావితం చేసే శక్తిగా మారిపోయాడు. అందుకే సరిగ్గా వైఎస్ జగన్ పాదయాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు వచ్చే నాటికి ఎయిర్పోర్ట్లోని వీవీఐపీ లాంజ్లో సీసీ కెమెరాలు పనిచేయడం ఆగిపోయాయి. అక్టోబర్ 25న వైఎస్ జగన్కు రెస్టారెంట్ నుంచి కాఫీ తెచ్చే పేరిట శ్రీనివాసరావు చొరబడి కత్తి దూసి హత్యాయత్నానికి తెగబడ్డాడు. అయితే ప్రజల ఆశీస్సులు బలంగా ఉన్న ప్రతిపక్ష నేత తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డీజీపీతో సహా మంత్రులు, టీడీపీ నేతలు తెరపైకి వచ్చి శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమాని అని, ఏదో ప్రచారం కోసం దాడి చేశాడని చాలా తేలిగ్గా తీసిపారేశారు. కుట్రధారులను తప్పించి కేసును పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర హోంశాఖ పరిధిలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) కేసు విచారణ చేపట్టాక విశాఖ పోలీసులు అడుగడుగునా సహాయ నిరాకరణ చేస్తుండటం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకేనని అర్థం చేసుకోవచ్చు. ఇవేవీ జగన్కు ప్రజాదరణను అడ్డుకోలేకపోయాయి. అతనంటే ఒక నమ్మకం.. సార్.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఏడాదిన్నర దాటింది. ఫీజు కడితే తప్ప పరీక్ష రాయనీయబోమని అంటున్నారు. రీయింబర్స్మెంట్ వస్తుందని నమ్మి కళాశాలల్లో చేరితే ఇప్పుడు మా మెడపై కత్తి పెట్టి డబ్బు కడతారా? చస్తారా? అంటున్నారు. మీరే ఏదైనా చేసి ఆదుకోండి సార్. ఇలా ఒకటా.. రెండా.. లక్షలు.. ఏమిటివీ అనుకుంటున్నారా? ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి బాధితులు చెప్పుకున్న సమస్యలు. నాలుగున్నరేళ్లుగా సమస్యలతో అల్లాడుతున్న ప్రజలకు వైఎస్ జగన్ ఒకే ఒక్క ఆశాకిరణంగా కనిపించారు. ఊరవతల నీరింకిన చెరువులు, దారిపక్క చెట్టు కింద తడారిన గొంతుకలు, ఎండిన డొక్కలు, ముగ్గుబుట్ట వంటి తలలు, అన్నార్తులు, అభాగ్యులు, ఎటుచూసినా బతుకు బండి సాగని దైన్యం.. ఆదుకునే నాథుడే లేడు. అయినవాళ్లకు ఆకుల్లో కానివాళ్లకు మూకుళ్లలో.. మీరు మా వాళ్లు కాదంటూ పాలక పార్టీ వాళ్ల తిరస్కరణ.. గుండె లోతుల్లో మెలిపెడుతున్న వ్యథ.. వీటినన్నింటినీ ఎవరికో ఒకరికి చెబితే గానీ ఊరట లభించదు. అదిగో.. అలాంటి తాడిత, పీడితులకు వేగుచుక్క.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి 2017, నవంబర్ 6న ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించిన వైఎస్ జగన్ రాష్ట్రంలోని 13 జిల్లాలను చుట్టివచ్చారు. కోట్లాది మంది ప్రజలకు భరోసా కల్పించారు. అనేక సమస్యలతో కష్టాల్లో ఉన్న ప్రజలు తమ బాగోగులు తెలుసుకోవడానికి తమ వద్దకే వచ్చిన రాజన్న బిడ్డను చూసి ఉద్వేగభరితులయ్యారు.. ఆయనకు తమ ఈతి బాధలు చెప్పుకున్నారు.. తమ ఇక్కట్లను ఆయన దృష్టికి తెచ్చారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ క్రమంలో అప్పటికప్పుడు చేయదగిన వాటిని ప్రతిపక్ష నేత అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాల్సిన వాటిని ఆయా జిల్లాల కలెక్టర్ల దృష్టికి తీసుకువచ్చేలా లేఖలు రాశారు. విధానపరమైన వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపేలా ఏర్పాటు చేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తన సహాయం కోరివచ్చినవారికి కాదనకుండా ఆర్థిక, హార్థిక సహకారం అందించారు. మాటలు రాని పిల్లలకు కాక్లియర్ ఆపరేషన్లు చేయించి మాటలు తెప్పించారు. బ్రెయిన్ సర్జరీ అవసరమైనవారికి మార్గం చూపించారు. ప్రతి ఫిర్యాదు నమోదు ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలు తనకు చెప్పుకున్న ప్రతి సమస్యను, ఫిర్యాదును ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన వ్యక్తిగత సహాయకుల ద్వారా కంప్యూటర్లో నిక్షిప్తం చేయించారు. మొత్తం 340 రోజుల పాదయాత్రలో ఆయనకు కొన్ని లక్షల వినతులు, ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందాయి. వీటిని ఏ రోజుకా రోజు రికార్డు చేయించారు. అంతేకాకుండా వాటిని సమస్యల వారీగా వర్గీకరించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల్లో ఎక్కువ భాగం పంటలకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ, విద్య, వైద్యం, ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఫీజు రీయింబర్స్మెంట్, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ భృతి, ఉపాధి, ఉద్యోగాల కల్పన, భూ సమస్యలు– వివాదాలు, భూ కబ్జాలు, జన్మభూమి కమిటీల ఆగడాలు తదితరాలు ఉన్నాయి. వీటిల్లో తక్షణమే పరిష్కరించాల్సిన వాటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని రికార్డు చేసి తమ ప్రభుత్వం వచ్చాక పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఉలిక్కిపడ్డ ప్రభుత్వం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, అన్యాయం, మోసానికి మారుపేరుగా మారి మొద్దుబారిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఉలిక్కిపడేలా చేసింది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలతో జనం తమపై ఎక్కడ తిరగబడతారోనని భయపడి సరిగ్గా ఎన్నికలకు కొద్ది నెలల ముందు తూతూమంత్రంగా కొన్ని చర్యలు చేపట్టింది. – సాక్షి, అమరావతి -
ముగింపునకు ముందు రోజు పోటెత్తిన జనం
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశకు చేరుకున్న తరుణంలో జనాదరణ మరింతగా పెరిగింది. తండోపతండాలుగా ప్రజలు ఆయనకు సంఘీభావం పలకడానికి వస్తున్నారు. పాదయాత్ర 340వ రోజు మంగళవారం జగతి, తుత్తుడిపుట్టుగ క్రాస్, వరపుట్టుగ క్రాస్, రాజపురం మీదుగా.. అగ్రహారం వరకూ సాగింది. చలిని సైతం లెక్క చేయక.. ఆయన వెళ్లే దారి పొడవునా గ్రామాల ప్రజలు, చుట్టు పక్కల నుంచి వచ్చే వారితో రోడ్లన్నీ బారులు తీరాయి. అక్కచెల్లెమ్మలు ఆయన కోసం గంటల తరబడి వేచి ఉండి సెల్ఫీల కోసం ఆరాటపడ్డారు. ఉదయం ఆయన శిబిరం నుంచి రోడ్డుపైకి రావడానికి రెండు గంటల ముందే జనం అక్కడికి చేరుకోవడం మొదలెట్టారు. ఉదయం పూట చలిగా ఉన్నా.. లెక్కచేయకుండా ప్రజలు తరలివచ్చారు. తన కోసం వచ్చిన వారిని వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. పాదయాత్ర ముగింపునకు ఇక ఒక్క రోజే మిగిలి ఉండటంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన్ను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. బుధవారం జరగనున్న పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన వారు సైతం ప్రతిపక్ష నేత వద్దకు రావడంతో పాదయాత్ర సాగుతున్న ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకొన్నారు. మరికొందరు వినతిపత్రాలిచ్చారు. జన్మభూమి కమిటీల దాష్టీకాలపై ఫిర్యాదులు చేశారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్.. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అంతా మంచి జరుగుతుందని వారికి భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపునకు ఒక రోజు ముందు మంగళవారం కూడా పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. గూడూరు మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, పలువురు టీడీపీ నేతల చేరిక శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు జిల్లాలోని గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ పొణకా దేవసేనమ్మ.. టీడీపీకి రాజీనామాచేసి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ఆమెతో పాటు పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, మండల స్థాయి నేతలు భారీగా టీడీపీలోంచి వైఎస్సార్సీపీలో చేరారు. పాదయాత్ర మధ్యాహ్న శిబిరం వద్ద వారంతా ప్రతిపక్ష నేతను కలుసుకుని పార్టీలో చేరాలన్న అభీష్టాన్ని వెల్లడించడంతో వారికి జగన్.. కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కౌన్సిలర్లు గోవిందు మస్తానమ్మ, బైనా భానుప్రకాష్, పోసిన రాజేశ్వరమ్మ, షేక్ షంషీర్, కోడిపర్తి కల్పన, బండి విజయమ్మ, నేరేళ్ల సుబ్బమ్మ, ముప్పాళ్ల లక్ష్మి, బాలిబోయిన రమేష్, మనపాటి రవీంద్రబాబు, గూడూడు మండల ఎంపీపీ పిట్టి రావమ్మ, దివిపాలెం సర్పంచ్ పిట్టి దేవసేన తదితరులున్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పాలుబోయిన అనిల్కుమార్యాదవ్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, పార్టీ గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్, శీకిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవసేనమ్మ, ఆమె అనుచరులు వైఎస్సార్సీపీలో చేరడంతో గూడూరు నియోజకవర్గంలో టీడీపీ సగం ఖాళీ అయినట్లేనని చెబుతున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే బడుగు, బలహీనవర్గాలకు మేలు జరుగుతుందని భావించి తామంతా పార్టీలో చేరినట్టు చైర్పర్సన్ దేవసేనమ్మ మీడియాతో చెప్పారు. బుద్దా నాగేశ్వరరావు చేరిక.. వెంకన్నకు షాక్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు సామినేని ఉదయభాను, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త యలమంచిలి రవిల సంయుక్త ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుద్దా నాగేశ్వరరావు మంగళవారం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. ప్రతిపక్ష నేత.. ఆయనకు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఆయన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నకు స్వయానా సోదరుడు. జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలతో బీసీలకు మేలు జరుగుతుందని, బుద్దా వెంకన్న ఏనాడూ బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ హయాంలో బీసీలకు జరిగిన మేళ్లను ఆయన గుర్తు చేశారు. బీసీలకు ప్రత్యేకంగా సబ్ప్లాన్ను రూపొందిస్తామని జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. వైఎస్సార్ సీపీలోకి మాజీ కార్పొరేటర్ కృష్ణా జిల్లా విజయవాడ వెస్ట్ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాస్, పార్టీ కృష్ణా జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు బొత్స అప్పలనర్సయ్య, మల్లాది విష్ణుల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ యలకల చలపతిరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయనను వైఎస్ జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చలపతిరావుతో పాటు కర్ణాటి శివశంకర్, మద్ది నాగరాజు, చుక్కా పోలారెడ్డి, తాతా శ్రీను తదితరులున్నారు. నా బిడ్డకు ప్రాణం పోసిన మిమ్మల్ని మరువలేమన్నా.. అన్నా.. నా బిడ్డ లోకేశ్నాగమణికంఠకు ప్రాణం పోసిన మీ మేలును జీవితాంతం మరవలేం.. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న నా ఏకైక కుమారుడికి బ్రైన్ట్యూమర్ రావడంతో తీవ్ర ఆవేదన చెందా. ఈ క్రమంలో పాదయాత్రగా వస్తున్న జగనన్నను కలిసి నా బిడ్డ సమస్యను వివరించగానే స్పందించిన రాజన్న బిడ్డ.. రూ.6 లక్షల విలువైన ఆపరేషన్ను తిరుపతి ఆస్పత్రిలో ఉచితంగా చేయించి నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారు. – వైఎస్ జగన్ను కలిసిన తర్వాత మాట్లాడుతున్న పి.వెంకటరాంబాబు, ఎస్.సీతాపురం, దెందులూరు, పశ్చిమగోదావరి జిల్లా ప్రాణాలు పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. ఈ ప్రాంతంలో మత్స్య సంపద అధికంగా ఉన్నా తగినన్ని సౌకర్యాల్లేవు. దీంతో ఇతర ప్రాంతాలకు వ్యాపార, జీవనోపాధి కోసం వలసపోతున్నాం. అక్కడ మేం ప్రాణాలు కోల్పోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల సోంపేట మండలం గొల్లగండి గ్రామానికి చెందిన మడ్డు మోహనరావు చెన్నైలో మరణించినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ సమస్యల పరిష్కారానికి మీరు చర్యలు తీసుకోండి. ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయించి మమ్మల్ని ఆదుకోండి. – ఎం.వెంకటేష్, ఇస్కలపాడు, సోంపేట మండలం కిడ్నీ రోగులకు మేలు చేయండన్నా.. అన్నా.. మా ప్రాంతంలో కిడ్నీ రోగులు అధికం. చిన్నా పెద్దా తేడా లేకుండా కిడ్నీ మహమ్మారికి బలైపోతున్నారు. ఈ రోగం ఎందుకొస్తుందో అర్థం కావడం లేదు. వైద్యానికి డబ్బుల్లేక ఎంతోమంది మరణిస్తున్నారు. గడిచిన రెండేళ్లలో దాదాపు 5 వేల మంది చనిపోయారు. మీరు అధికారంలోకొచ్చాక ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి చర్యలు తీసుకోండన్నా.. – బొర్ర శ్రావ్యశ్రీ,.. ఎమ్మెస్సీ విద్యార్థిని, బొర్రపుట్టుగ, ఇచ్ఛాపురం నియోజకవర్గం -
అడుగులన్నీ.. ఆవైపే
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు.. ఏటా వచ్చే జాతర అన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది?.. అంతకన్నా రెట్టింపు స్థాయిలో కిక్కిరిసిన జన ప్రవాహాలు ఇప్పుడు ఆ మారుమూల ప్రాంతం వైపు వడివడిగా సాగుతున్నాయి. ఇడుపులపాయలో వేసిన తొలి అడుగు.. కోట్లాది హృదయాలను గెలుచుకుంటూ, రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చేందుకు ఇచ్ఛాపురంలో ఆఖరి ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ముగియనుంది. కీలక నిర్ణయంతో రాజకీయాలను మరో మలుపు తిప్పిన ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్ర ముగింపు సన్నివేశాన్ని తిలకించేందుకు ఇచ్ఛాపురం వీధుల్లో అంతా వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు. ఉత్సాహం, ఉత్కంఠ, ఆనందం, ఆత్మీయత అందరిలోనూ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇచ్చాపురం, ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధులు: విలువలు, విశ్వసనీయత, భరోసా, పట్టుదలను వారసత్వంగా పుణికిపుచ్చుకున్న జగన్ ధృఢ సంకల్పానికి ఇచ్ఛాపురం సాక్షిగా నిలువనుంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఇచ్ఛాపురం నిజానికి ఓ చిన్న పట్టణం. అక్కడి జనాభా మహా అయితే వేలల్లోనే ఉంటుంది. కానీ రెండు రోజులుగా అక్కడ సందడే సందడి. ఇసుకేస్తే రాలనంతగా జనం.. ఎటు చూసినా పండుగ వాతావరణం.. వీధి వీధినా అంగళ్లు వెలుస్తున్నాయి. హోటళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అక్కడకు వందల కొద్దీ వాహనాలొస్తున్నాయి. వేలాది మంది వచ్చిపోతున్నారు. ‘పాదయాత్ర ముగింపు ఎక్కడ?.. పైలాన్ ఆవిష్కరణ ఎక్కడ?’ ఇచ్ఛాపురం పొలిమేరల్లో కనిపించే ప్రతి వ్యక్తి నోటి నుంచి వస్తున్న ప్రశ్న ఇదీ. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం.. ఇలా అక్కడకు ఏ డిపో నుంచి వచ్చే బస్సు అయినా కిక్కిరిసిపోతోంది. ఆటోల నిండా జనమే. ద్విచక్ర వాహనాల మీద చేరుకునే వాళ్ల సంఖ్య లెక్కే లేదు. ఆఖరి ఘట్టం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డితో పాటు ఆయన కుమార్తె షర్మిల కూడా తమ పాదయాత్రలను ఇక్కడే ముగించారు. వైఎస్సార్, షర్మిల పాదయాత్ర స్థూపాలను ప్రత్యేకంగా సందర్శిస్తున్నారు. ఆ సన్నివేశాలను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తమ ఊరికి వచ్చేవారికి ఆసక్తిగా చెబుతున్నారు. అపూర్వఘట్టం కోసం నిరీక్షణ ఇచ్ఛాపురంలో గట్టిగా వంద మందికి సరిపడా వసతి దొరకడం కూడా కష్టమే. వెళ్తే ఒడిశాలోని బరంపురం వెళ్లాలి. లేదంటే శ్రీకాకుళంలో బస చేయాలి. కానీ పాదయాత్ర ముగింపు కార్యక్రమా నికి హాజరయ్యే వారు ఇవేమీ పట్టించుకోవడం లేదు. సాయంత్రం ఆరు గంటలకే వణుకు పుట్టించే చలి వాతావరణం ఉన్నా వీధుల్లోనే సంచరిస్తున్నారు. ఒక్క రోజు ఓపిక పడితే ఏమవుతుంది...? విజయనగరం నుంచి వచ్చిన కాంతారావు, మల్లికార్జున మనోగతం ఇదీ. ముగింపు రోజుకు ముందే వారిద్దరూ ఇచ్ఛాపురం చేరుకున్నారు. ఆఖరు రోజు రద్దీలో రావడం కష్టమని భావించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన తిలక్, శ్యామల, సంధ్యారాణి, కృష్ణప్రసాద్కు ఎక్కడా వసతి దొరకలేదు. బరంపురంలో లాడ్జీలన్నీ ముందే బుక్ కావడంతో తాము వచ్చిన వాహనంలోనే ఉంటామని చెప్పారు. పాదయాత్ర ముగింపు సన్నివేశం తమకో మరపురాని తీపి గుర్తు అని పేర్కొన్నారు. ఇక ద్విచక్ర వాహనాలపై వచ్చే వారు రాత్రి పొద్దుపోయే వరకూ ఇచ్ఛాపురం వీధుల్లోనే గడుపుతున్నారు. కాసేపు పైలాన్ దగ్గర.. ఇంకాసేపు వైఎస్సార్ పాదయాత్ర స్థూపం వద్ద.. ఆ తర్వాత షర్మిల పాదయాత్ర స్థూపం దగ్గర...! ఉత్సాహంగా యువత.. పాదయాత్రతో జగన్ జనహృదయాలను గెలుచుకున్నారనేది అందరి మాట. ఇచ్ఛాపురానికి భారీగా చేరుకుంటున్న యువత రాష్ట్రంలో నవశకం మొదలు కానుందని చెబుతున్నారు. విజయవాడకు చెందిన కల్పన బెంగళూరులో ఎంటెక్ చేస్తోంది. ‘థ్రిల్గా ఉంది.. జగనన్న పాదయాత్ర రాజకీయాలనే మార్చబోతోందని మాఫ్రెండ్స్ చెప్పుకుంటున్నారు. అందు కే వచ్చా. ఇక్కడ మా బాబాయి వాళ్లింట్లో దిగా. ఇదిగో ఈ సెల్ఫోన్లో అంతా చిత్రీకరించి.. మా వాళ్లందరికీ పంపుతా’ అని అంటున్నప్పుడు ఆమె ముఖంలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆమె ఒక్కరే కాదు.. పుణె నుంచి వచ్చిన విశ్వప్రతాప్.. ఢిల్లీలో చదువుతున్న ఏపీ విద్యార్థి రఘునందన్.. ఇలా యువత అంతా పాదయాత్ర ముగింపులో పాలుపంచుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తరలివస్తున్న శ్రేణులు... వైఎస్సార్సీపీకి చెందిన అగ్రనేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, ఇతర ముఖ్యనేతలు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఇచ్ఛాపురం చేరుకుంటున్నారు. పలు ప్రాంతాల నుంచి సొంత వాహనాలు, బస్సులు, రైళ్లలో తరలివస్తున్నారు. నేటి కార్యక్రమం ఇలా... ఇచ్ఛాపురం సమీపంలోని కొజ్జీరియా గ్రామం నుంచి వైఎస్ జగన్ బుధవారం చివరి రోజున పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు లొద్దపుట్టి వద్ద మధ్యాహ్న భోజనవిరామం శిబిరం వద్దకు చేరు కుంటారు. ఒంటి గంటకు అక్కడి నుంచి బయలు దేరి 1.15 గంటలకు ఇచ్ఛాపురంలోని పైలాన్ వద్దకు చేరుకుంటారు. పాత బస్టాండ్ వద్దకు కాలినడకన చేరుకుంటారు. 1.30 గంటలకు అక్కడ భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జన సంద్రం మధ్య ఎన్నికల సమరశంఖం పూరించనున్న జగన్ చరిత్ర సృష్టించిన పాదయాత్రతో జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకున్న వైఎస్ జగన్ ఇచ్ఛాపురం వేదికగా 2019 ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇప్పటికే అందరినీ రాజకీయంగా, సామాజికంగా జాగృతం చేసిన వైఎస్ జగన్ ముగింపు సభలో... మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందో వివరిస్తూ ఇచ్ఛాపురం వేదికగా ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వనున్నారు. అధికార పక్షం దాష్టీకాలను అడ్డుకునేలా పార్టీ శ్రేణుల్లో స్ఫూర్తి నింపనున్నారు. సెల్ఫీలు.. లైవ్లు పన్నెండేళ్ల కొచ్చే పుష్కరాలు.. ఎప్పుడో వచ్చే జాతరలో జనం ఏ స్థాయిలో ఉత్సాహంగా కనిపిస్తారో.. అంతకన్నా రెట్టింపు సన్నివేశం ఇచ్ఛాపురంలో కనిపిస్తోంది. బైపాస్ రోడ్డు మీద నుంచే కనిపించే పాదయాత్ర పైలాన్ను వాహనాల్లోంచి చూస్తూ సంబరపడిపోతున్నారు. అంత దూరం నుంచే సెల్ఫోన్లు తీసి క్లిక్ మనిపిస్తున్నారు. ఇక దగ్గరకెళ్లి సెల్ఫీలు దిగేవాళ్లు లెక్కే లేదు. రకరకాల ఫొటోలు దిగేందుకు జనం పోటీపడుతున్నారు. ఇచ్ఛాపురంలో సంతోషాన్ని, ముగింపు ఉత్సవ సన్నాహాలను అనేక మంది లైవ్లో తమ సన్నిహితులు, మిత్రులకు చూపించడం అన్ని చోట్లా కనిపిస్తోంది. -
జన యాత్ర
-
విజయ శంఖారావం
-
వైఎస్ఆర్ రైతు భరోసా
-
మేము వైఎస్ఆర్సీపీ సోల్జర్స్.. పార్టీ విజయం కోసం కృషిచేస్తాం
-
నడిచారు గెలిచారు
-
వైఎస్ జగన్ను కలిసిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు
-
ప్రజాసంకల్పయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది: ధర్మాన
-
వైఎస్ జగన్ను కలిసిన కవిటి మండలం కిడ్నీ వ్యాధి బాధితులు
-
మా ఆశవు నీవే.. మా శ్వాసవు నీవే...
-
రేపు ఇచ్చాపురంలో పైలాన్ను ఆవిష్కరించనున్న జగన్