ప్రజల సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 339వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని తలతంపర నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి బల్లిపుట్టుగ, కుసుంపురం, బొరివంక మీదుగా బెజ్జిపుట్టుగ, జగతి వరకు వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగిస్తారు.