భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు పీఎస్ఎల్వీ సీ45 (పీఎస్ఎల్వీ–క్యూఎల్) ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం 6:27 గంటలకు కౌంట్ డౌన్ను ప్రారంభమయ్యింది.