వ్యభిచారాన్ని ప్రశ్నించిన పాపానికి విశాఖపట్నంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తమ అక్రమ కార్యకలాపాలను నిలదీసిన ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో తెగబడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆ చౌరస్తాలో ఏ మాత్రం బెరుకు బెంకు లేకుండా కత్తులతో పొడిచి రాడ్డుతో కొట్టి పరారయ్యారు. దీంతో ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇంత జరుగుతున్నా అక్కడి వారు కనీసం స్పందించకపోవడం దారుణం. వివరాల్లోకి వెళితే జీవీఎంసీ 15వ వార్డు అశోక్నగర్కు చెందిన పెద్దాడ సురేష్ (30) పెయింటర్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఆశీలమెట్టలోని ద్వారకా వైన్స్ షాపు వద్ద ఉన్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, రాడ్డులతో చేసి పరారయ్యారు.
విశాఖలో రెచ్చిపోయిన దుండగులు
Published Sat, Dec 30 2017 9:54 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement