పోలవరం ప్రాజెక్టును 2021 నాటికి పూర్తి చేసి తీరతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆపలేదని కేవలం కాంట్రాక్టర్లను మాత్రమే రద్దు చేశామని తెలిపారు. పోలవరంపై కేంద్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలు ఇచ్చామని, నూతన కాంట్రాక్టర్లచే నవంబర్ నుంచి పనులు పారదర్శకంగా మొదలవుతాయని పేర్కొన్నారు.