polavaram
-
పవన్ కల్యాణ్ ఇలాంటి సైకోలను తయారుచేసి పంపించాడా?
సాక్షి, ఏలూరు: పోలవరం(Polavaram)ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై(Janasena MLA Chirri BalarajuJanasena MLA Chirri Balaraju) అసమ్మతి గళాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే, జనసేన నాయకుల తీరుపై ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఆవేదనతో శు క్రవారం ఒక సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని ప్రకటించిందని, ఇక్కడ మాత్రం జనసేన మండల ప్రెసిడెంట్ ట్రాక్టర్కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నా రని ఆ సెల్ఫ్ లో ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఇలాంటి సైకో ఎమ్మెల్యేను తయారు చేసి ఇక్కడికి పంపించాడా అంటూ ప్రశ్నించారు. ప్రతి కార్యకర్త కూడా ఇటువంటి సెల్ఫీ వీడియోలు పెట్టి చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు చేరేలా చూడాలని చెప్పారు. బోర్ వేసుకోవాలన్నా, వృద్ధాప్య పింఛన్ కావాలన్నా, బెల్ట్ షాపు పెట్టుకోవాలన్నా లంచాలు వసూలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే కంటే గత ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎంతో బెటర్ అంటూ చెప్పారు. ఆఖరికి పొలంలో బోరు వేసుకోవాలన్నా రూ.25 వేలు లంచంగా అడుగుతున్నారంటూ తెలిపారు. బెల్ట్ షాపు పెట్టుకోవాలంటే రూ.1.50 లక్షలు, వీఆర్వోల బదిలీకి రూ.10 వేల నుంచి రూ.లక్ష, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ భూములు మార్చుకుంటే రూ.10 వేల చొప్పున వసూలు చేస్తున్నారంటూ వివరించారు. రాత్రి సమయానికి ఆ కార్యకర్త మరో వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోను తాను గతంలో మనస్పర్థలు ఉన్నప్పుడు చేశానని, దానిని కొంతమంది కా వాలనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని, అటువంటి వారిపై కేసు పెడతానంటూ ఆ కార్యకర్త అందులో పేర్కొనడం గమనార్హం. -
పోలవరం ప్రాజెక్ట్ ను నాశనం చేశారు: వైఎస్ జగన్
-
పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
-
పవన్ను ప్రశ్నిస్తున్నా.. కూటమి ఎంపీలకు సిగ్గులేదా?: చలసాని
సాక్షి, విజయవాడ: ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్. గతంలో ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ను మేము ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి అంటూ ఘాటు విమర్శలు చేశారు.ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..‘తెలుగు వారి ఆత్మగౌరవం మరో మారు ఢిల్లీలో తాకట్టుపెట్టారు. ఆంధ్రుల జీవ నాడి పోలవరాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోంది. 41.5 ఎత్తులో మీటర్లకు నీటిని పరిమితం చేయడం అన్యాయం. 155 అడుగుల ఎత్తున నీటి నిల్వ ఉంటేనే ప్రాజెక్టు ప్రయోజనం ఉంటుంది. ఎంపీలంతా ఏం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో ప్రశ్నించారు. పవన్ను మేం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం.. కూటమి ఎంపీలకు సిగ్గు, శరం లేదా?.వైఎస్ జగన్ కేంద్రం ఒత్తిడికి తలొంచి ఉంటే 12,500 కోట్లు పోలవరానికి ఎప్పుడో వచ్చేవి. కానీ, పోలవరానికి అన్యాయం జరగకూడదని జగన్ ఒప్పుకోలేదు. కేంద్రంలో చంద్రబాబు ప్రభావమేమీ లేదు. కూటమి ఎంపీలు కేంద్రానికి చిడతల భజన చేసుకోండి. దమ్ముంటే కేంద్రాన్ని ప్రశ్నించేందుకు మాతో కలిసి రండి. పోలవరం హక్కులను సాధించుకోలేకపోతే మీరంతా ఆంధ్రా ద్రోహులుగా మిగిలిపోతారు. అమరావతి విషయంలో కూటమి నేతలు ఎందుకు స్వీట్లు పంచుకుంటున్నారో అర్ధం కావడం లేదు. అమరావతికి 15వేల కోట్లు ముష్టివేశారు. ప్రపంచబ్యాంకు షరతులకు తలొగ్గి అమరావతికి అప్పు తెచ్చారు.ఉత్తర భారత అహంకారం నశించాలన్న మాటలు పవన్ కళ్యాణ్ మర్చిపోయారా?. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ పవన్ గొంతు చించుకున్నారు. యువతకు అన్యాయం జరుగుతుంటే పవన్ ఎందుకు మాట్లాడటం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నవాళ్లు ఆంధ్రా ద్రోహులే. ఉత్తర భారత బీజేపీ పార్టీ మనకు తీరని ద్రోహం చేస్తోంది. తెలుగు జాతి ఇప్పటికైనా మేలుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
-
సాగునీళ్లూ షాక్ కొడతాయా?
‘‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత...’’. తెలుగు నాట ఇదొక సామెత. చేతలు గడప దాటకుండానే మాటల్ని కోటలు దాటించే కోతల రాయుళ్లపై ఇటువంటి సామెతలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎడాపెడా విసురుతున్న మాటల ఈటెల్నీ, పలుకుతన్న పద జాలాన్నీ చూస్తుంటే ఈ సామెతలు సరిపోవనిపిస్తున్నది. ‘విజన్–2047’ పేరుతో ఆయన అట్టహాసంగా ఓ డాక్యుమెంట్ను ఇటీవల విడుదల చేశారు. ఈ విజన్ దెబ్బకు ఇంకో ఇరవై మూడేళ్లలో ఏపీ స్టేట్ ‘ఏక్ నంబర్ స్టేటస్’ చేరుకోనున్నదని ఆ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు. ‘ఏక్ నంబర్ స్టేటస్’ వస్తున్నప్పుడు స్పెషల్ స్టేటస్ ఎందుకనుకున్నారేమో గానీ, ఆ డాక్యుమెంట్లో అటువంటి ప్రస్తావన లేదు.చంద్రబాబు పార్టీకి గానీ, యెల్లో మీడియాకు గానీ ఇలా గొప్పలకు పోవడం, డప్పు వాయించుకోవడం కొత్తేమీ కాదు. కానీ, వారు ప్రగల్భాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. జనం మీదకు తేనె పూసిన కత్తుల్ని విసురుతున్నారు. విష గుళికలకు విజన్ లేబుళ్లు వేస్తున్నారు. కాకుల్ని కొట్టి, గద్దల్ని మేపే సామాజిక దుర్నీతి ఆయన తాజా విజన్ నిండా పరుచుకున్నదనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఆ విజన్ డాక్యుమెంట్ మీద ఇంకా పూర్తి స్థాయి చర్చ ప్రారంభం కాక ముందే, అందులోంచి ఆయన ఓ జలపాత దృశ్యాన్ని బయటకు తీశారు. అరుంధతీ నక్షత్రం మాదిరిగా యెల్లో మీడియా దాన్ని ప్రజలకు చూపెట్టింది. ఈ నక్షత్రానికి ఆయన ‘తెలుగుతల్లికి జలహారతి’ అని నామకరణం కూడా చేసుకున్నారు.ఈ ‘జలహారతి’ పథకం తన ‘మానస పుత్రిక’ని కూడా బాబు ప్రకటించుకున్నారు. ‘విజన్ డాక్యుమెంట్’లో పండంటి రాష్ట్రానికి పది సూత్రాలని చెప్పుకున్నారు. ఆ పది సూత్రాల్లో ఒకటి ‘జలభద్రత’. నదుల అనుసంధానం ద్వారా ‘జలభద్రత’ కల్పించాలన్న ఒక అంశానికి కొనసాగింపుగా ఈ ‘జలహారతి’ పథకాన్ని ప్రకటించారు. ఈ విజన్ను కొంత లోతుగా తరచి చూస్తే, ఇందులో ఎంత ప్రజావ్యతిరేకత దాగి ఉన్నదో, పెత్తందారీతనపు ఫిలాసఫీ ఎలా ఇమిడి ఉన్నదో అవగతమవుతుంది.2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే, నాటి ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. జల వనరుల అధికార్లు,ఇంజినీర్లతో పలు దఫాల సమీక్ష, సాంకేతిక అంశాల పరిశీలన తర్వాత ఒక సమగ్ర నివేదిక (డీపీఆర్)ను జగన్ ప్రభుత్వం తయారు చేసింది. పోలవరం కుడి కాల్వ ప్రవాహ సామర్థాన్ని పెంచి, ఈ కొత్త ప్రాజెక్టుకు అవసరమైన నీటిని కూడా దాని ద్వారా తరలించి ప్రకాశం బరాజ్కు చేర్చాలని నిర్ణయించారు. అక్కడి నుంచి సాగర్ కుడి కాల్వను ఉపయోగించుకొని, బొల్లాపల్లి దగ్గర కొత్తగా నిర్మించే రిజర్వాయర్కు చేరుస్తారు. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దగ్గరికి చేర్చాలి. ఇదీ ప్రాజెక్టు.ఈ ప్రాజెక్టు వల్ల సాగర్ కుడి కాలువతో పాటు, వెలిగొండ, తెలుగుగంగ, ఎస్సార్ బీసీ, గాలేరు–నగరి తదితర ప్రాజెక్టుల కింద ఉన్న 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం జరు గుతుంది. అదనంగా ఏడున్నర లక్షల ఎకరాల ఆయకట్టు చేరుతుందనీ, 80 లక్షల జనాభాకు తాగునీటి వసతి లభిస్తుందనీ అంచనా వేశారు. ఇందులో నదుల అనుసంధానానికి సంబంధించిన అంశం ఇమిడి ఉన్నందువల్ల అనుసంధానం కేంద్రం బాధ్యత కనుక ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని ప్రధాన మంత్రికి జగన్ మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధాని సూచన మేరకు ‘కేంద్ర జలసంఘం’ అనుమతి కోసం 2022లోనే రాష్ట్రం ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ను సమర్పించింది.అదిగో అదే డీపీఆర్ను ఇప్పుడు బయటకు తీసి తన మానస పుత్రికగా చంద్రబాబు ప్రకటించుకున్నారు. నామకరణ మహోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. అయితే ఇందులో ఒక్క మార్పు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంచడం ద్వారా బనకచర్లకు కూడా వరద రోజుల్లో రోజుకు రెండు టీఎమ్సీల చొప్పున తరలించాలన్నది గత ప్రభుత్వ ప్రతిపాదన. చంద్రబాబు సర్కార్ ఇక్కడ మార్పు చేసింది. పోలవరం ప్రాజెక్టుకు దిగువన తాడిపూడి పాయింట్ దగ్గర ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, కుడి కాల్వకు సమాంతరంగా మరో కాలువను తవ్వి, నీటిని తరలించాలని ప్రతిపాదించింది.ఎత్తిపోతల పంపుల కోసం, కరెంట్ కోసం అదనపు ఖర్చు. మరో కాలువ తవ్వడానికి భూసేకరణ ఒక ప్రధాన సమస్య. అదనపు ఖర్చు కూడా. జగన్ పథకాన్ని యథాతథంగా కాపీ చేయకుండా ఈ ఒక్క మార్పును ఎందుకు చేసినట్టు? అదనపు ఖర్చు వల్ల అదనపు కమిషన్ లభిస్తుందన్న కండూతి ఒక కారణం కావచ్చు. దీంతోపాటు ఇంకో విమర్శ కూడా వినిపి స్తున్నది. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 45.72 మీటర్లకు బదులుగా 41.15 మీటర్లకే పరిమితం చేయడానికి బాబు సర్కారు అంగీకరించిందనీ, ఈ మేరకు కేంద్ర కేబినెట్లో కూడా నిర్ణయం జరగిందనీ ఇటీవల సాక్షి మీడియాలో ప్రము ఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తాడిపూడి ఎత్తి పోతల నిర్ణయం కూడా దాన్ని నిర్ధారిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వను పరిమితం చేస్తే కుడి కాలువ ఆయకట్టుకే సరిపోను నీటిని అందివ్వలేదనీ, అటువంట ప్పుడు ఇక బనకచర్లకు తరలింపు ఎలా సాధ్యమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనుక ప్రాజెక్టు దిగువన కూడా వరద రోజుల్లో ప్రవాహం ఉన్నప్పుడు ఎత్తిపోయడానికి ఈ పథకాన్ని మార్చి ఉండవచ్చని తెలుస్తున్నది. ఇంకొక ముఖ్యమైన మార్పు సిసలైన గేమ్ ఛేంజర్ వంటి అంశం మరొకటి ఉన్నది. నదుల అనుసంధానం కింద ఈ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం కోరింది. కానీ, చంద్రబాబు ఆలోచన మరో విధంగా ఉన్నది. ఈ పాజెక్టును ప్రకటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అసలు విషయాన్ని కొద్దిగా ఆయన బయట పెట్టారు. ప్రాజెక్టు కోసం కేంద్రం నిధులిచ్చే అవకాశం లేదని చెబుతూ – ప్రైవేట్ వ్యక్తుల ద్వారా సేకరిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పదేళ్లదాకా వాటి నిర్వహణను కూడా ప్రైవేట్ వారికే అప్పగిస్తామన్నారు. ఇటీవలే గ్రామీణ రోడ్ల నిర్మాణం – నిర్వహణను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని చంద్రబాబు చెప్పిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ప్రైవేట్ వ్యాపారులు, సేవా దృక్పథంతో రోడ్లేయరు కదా! జనం తోలు వలిచి టోల్ వసూలు చేస్తారు. ఇక సాగునీటి సరఫరాకు కూడా అదే పద్ధతి రాబోతుందన్న మాట.ప్రాజెక్టులు నిర్మించి, నిర్వహించినందుకు ప్రభుత్వమే వారికి సొమ్ము చెల్లిస్తుందని ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చెబుతు న్నప్పటికీ అది నమ్మశక్యంగా లేదు. అంతటి ఆర్థిక సామర్థ్యమే ఉంటే, మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టుగా జలయజ్ఞంలోని అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నడుం కట్టేవారు. ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానంలో భాగం కనుక కేంద్ర నిధుల కోసం ఒత్తిడి చేసేవారు. పైగా తమ సంఖ్యా బలం మీద ఆధార పడిన ప్రభుత్వాన్ని ముక్కుపిండి ఒప్పించడం ఎంతసేపు? జగన్ సర్కార్ డీపీఆర్ను కాపీ కొట్టిన ప్రభుత్వం ఆయన అనుసరించిన వైఖరిని ఎందుకు అనుకరించడం లేదు?ఎందుకంటే, సంపూర్ణ ప్రైవేటీకరణ ఆయన విధానం కనుక. ప్రజలకు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదనీ, ప్రభుత్వ సేవలన్నిటికీ యూజర్ చార్జీలను వసూలు చేయాల్సిందేననీ గతంలోనే తన సిద్ధాంత పత్రాన్ని ఆయన రాసుకున్నారు కనుక. పాతికేళ్ల కింద ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మాదిరిగానే ‘విజన్ 2020’ని చంద్రబాబు ప్రకటించారు. అప్పుడు ఆకాంక్షించిన ఆర్థిక వృద్ధి జరిగిందా? కొందరు బలవంతులు మాత్రం మహాబలసంపన్నులుగా ఎదిగి పోయారు. ఆర్థిక అసమానతలు అమానవీయంగా పెరిగి పోయాయి. ఆ డాక్యు మెంట్కు కొనసాగింపే ‘విజన్ – 2047’. అంతేగాకుండా, కేంద్ర సర్కార్ ఇప్పటికే ప్రకటించిన ‘వికసిత్ భారత్–2047’కు అనుగుణంగా దీన్ని రూపొందించినట్టు స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారు. దొందూ దొందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్.చంద్రబాబు ప్రైవేటీకరణ పదజాలంలోకి కొత్త మాటలు వచ్చి చేరుతున్నాయి. గతంలో పీత్రీ (P3) మోడల్ను తానే ప్రతి పాదించాననీ, ఇప్పుడింకో ‘పీ’ని చేర్చి పీఫోర్ (P4)ని ప్రతిపా దిస్తున్నాననీ ఆయన చెప్పారు. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్లో పీపుల్ను కూడా చేర్చారట. ‘పీత్రీ’ని అమలు చేసినప్పుడు పబ్లిక్ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. లాభసాటిగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ఖాయిలా పట్టించి కోట్ల విలువైన వాటి ఆస్తులతో సహా 54 సంస్థలను పప్పుబెల్లాలకు తన వారికి కట్టబెట్టిన ఉదంతాన్ని మరిచిపోగలమా?ఇప్పుడు ఇంకో ‘పీ’ పేరుతో ప్రజల్ని చేర్చారు. ప్రజలు ఎలా భాగస్వాములు అవుతారు? ప్రైవేట్ ఆస్తులను ప్రజలకైతే అప్పగించరు కదా! ప్రజలే వారి దగ్గర ఉన్న భూముల్ని ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైవేట్ సేవలకు మెచ్చి నీటి పన్ను, బాట పన్ను, బడి పన్ను, దవాఖానా పన్ను వంటి వాటిని అవసరాన్ని బట్టి చెల్లించవలసి ఉంటుంది. తమ రెక్కల కష్టాన్ని సమర్పించు కోవాల్సి ఉంటుంది. ప్రజల భాగస్వామ్యానికి సంబంధించి ఇంతకంటే భిన్నమైన ప్రతిపాదనలైతే విజన్లో కనిపించలేదు. ఆంధ్రప్రదేశ్ అడ్రస్ను వెతుక్కుంటూ వేలకోట్ల పెట్టుబడులు పరుగెత్తుకొస్తున్నాయని విడతల వారీగా ప్రకటనలు గుప్పిస్తు న్నారు. తాజాగా చేసిన ప్రకటనలో రిలయన్స్వారు ‘కంప్రెస్డ్ బయోగ్యాస్’ ఉత్పాదన కోసం 65 వేల కోట్లు పెట్టుబడి పెడ తారనే, కళ్లు చెదిరే లెక్క కూడా చెప్పారు. అందుకోసం వారికి ఐదులక్షల ఎకరాల భూమిని అప్పగిస్తారట. ప్రతిగా కంపెనీ వాళ్లు రెండున్నర లక్షలమందికి ఉపాధి కల్పిస్తారట. అంత భూమిని పేదలకు అసైన్ చేస్తే అంతకంటే ఎక్కువమందే ఉపాధి పొందవచ్చు గదా అనే సందేహాలు అజ్ఞానులకు మాత్రమే కలుగుతాయి. ఆర్థిక నిపుణులు వాటికి సమాధానం చెప్పరు.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
‘పాలమూరు’పై నీలినీడలు
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు వరప్రదాయిని పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నీలినీడలు కము్మకున్నాయి. ప్రాజెక్టుకి నీటి కేటాయింపులను ప్రశ్నిస్తూ తాజాగా డీపీఆర్ను కేంద్ర జల సంఘం తిప్పిపంపడంతో ప్రాజెక్టు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఇప్పటికే తీవ్ర ఉల్లంఘనల ఆరోపణలతో పర్యావరణ అనుమతులిచ్చేందుకు కేంద్రం ససేమిరా నిరాకరిస్తుండగా, దీనికి నిధులు, పెండింగ్ బిల్లుల సమస్య తోడుకావడంతో ప్రాజెక్టు నిర్మాణం నీరసించిపోయింది. తాజాగా నీటి కేటాయింపుల అంశం తెరపైకి రావడంతో ప్రాజెక్టు భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది. ట్రిబ్యునల్ ఏమంటుందో..? పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకునే అవకాశాన్ని దశాబ్దాల కిందట గోదావరి ట్రిబ్యునల్ కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలు తమవేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ 45 టీఎంసీలకు తోడుగా మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీల జలాలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు కేటాయిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే దీనిని ఏపీ వ్యతిరేకిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన ఉమ్మడి ఏపీకి లభ్యతలోకి వచ్చిన 45 టీఎంసీల జలాల వినియోగంపై ఏ రాష్ట్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని ఏపీ ప్రభుత్వం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు పోలవరం నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు గతేడాది కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున ప్రాజెక్టు డీపీఆర్ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేయడంతో ట్రిబ్యునల్ తీసుకోనున్న నిర్ణయంపైనే ప్రాజెక్టు భవితవ్యం ఆధారపడి ఉంది. పనులు నత్తనడక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో ‘పాలమూరు’ను చేర్చింది. ఏటా రూ.6 వేల కోట్ల విలువైన పనులు పూర్తి చేసి వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ప్రస్తుత ఏడాది (2024–25)లో రూ.6130 కోట్లు, వచ్చే ఏడాది (2025–26) రూ.6313 కోట్ల పనులు చేయాలని నిర్దేశించుకుంది. అయితే గత ఏడాది కాలంలో రూ.4743 కోట్లు విలువైన పనులు మాత్రమే జరగడంతో నిర్దేశిత గడువు నాలుగేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లుల్లో రూ.1500 కోట్లు చెల్లించినప్పటికీ మరో రూ.1437 కోట్ల మేర బిల్లులను చెల్లించాల్సి ఉంది. ఒక్క ఎకరాకూ అందని నీరు శ్రీశైలం జలాశయం నుంచి 90 టీఎంసీల జలాలను తరలించి నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 1200 గ్రామాలకు తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. రూ.35,200 కోట్ల అంచనాలతో 2015 జూన్ 10న ప్రాజెక్టుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనపర అనుమతులు జారీ చేయగా, తర్వాత అంచనా రూ.55,086 కోట్లకు ఎగబాకింది. గత ప్రభుత్వం రూ.27,554 కోట్ల విలువైన పనులు చేయగా, మొత్తం రూ.32,297 కోట్లు విలువైన పనులు పూర్తిచేసినా, ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదు. ప్రాజెక్టుకు మరో రూ.22,789 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ఉద్దండాపూర్ పనులను అడ్డుకుంటున్న రైతులు... స్థానిక రైతులు, గ్రామస్తులు అడ్డుకోవడంతో ఈ ప్రాజెక్టు ఆరు రిజర్వాయర్లలో ఒకటైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ పనులు 2023 నవంబర్ నుంచి నిలిచిపోయాయి.ముంపునకు గురైన ఉద్దండాపూర్, వల్లూరు, పొలేపల్లి గ్రామాలతో పాటు శామగడ్డ, ఒంటిగుడిసె, చిన్నగుట్ట, రాగడిగుట్ట తండాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. తక్షణం రూ.30 కోట్ల పరిహారంగా చెల్లిస్తేనే పనుల పునరుద్ధరణ జరగనుంది. కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్పై మీమాంస గత ప్రభుత్వం ఉద్దండాపూర్ సహా 5 రిజర్వాయర్ల పనులను మాత్రమే ప్రారంభించింది. చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని విరమించుకుని ప్రత్యామ్నాయ మార్గంలో ఆయకట్టుకు సాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను నిర్మిస్తామని గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లభించని పర్యావరణ అనుమతులు పర్యావరణ అనుమతుల్లేకుండానే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టి తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినందుకు గాను పర్యావరణ పరిహారంగా రూ.528 కోట్లను చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు మరో రూ.300 కోట్ల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖలోని నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టుకు పలు షరతులతో పర్యావరణ అనుమతులు జారీ చేయాలని గతేడాది సిఫారసులు చేసింది.పర్యావరణ పునరుద్ధరణకు రూ.153 కోట్లతో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు పీసీబీ కేసును ఫైల్ చేసింది. తీవ్ర పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలుండడంతో, ఈఏసీ సిఫారసులు చేసినా కేంద్రం పర్యావరణ అనుమతులివ్వడం లేదు. -
చంద్రబాబు అవగాహనాలేమి వల్లే పోలవరం ఆలస్యం: అంబటి రాంబాబు
సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు అవగాహనారాహిత్యం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని వైఎస్సార్సీపీ సీనియర్నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం(డిసెంబర్16) తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.‘పోలవరంపై చంద్రబాబు అసత్యాలు మాట్లాడుతున్నాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి అసలు కారణం ఎవరు. కాఫర్డ్యామ్ నిర్మించకుండా డయాఫ్రమ్వాల్ కడతారా? చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని ప్రధాని మోదీ అనలేదా. టీడీపీ అవినీతి చేసిందని సాక్షాత్తూ ప్రధాని మోదీ పార్లమెంట్లో అనలేదా. 2018లోనే చంద్రబాబు పోలవరం పూర్తి చేస్తామన్నారు..అప్పుడెందుకు పూర్తి చేయలేకపోయారు?కేంద్రం రూ.12,157 కోట్లు విడుదల చేయడానికి వైఎస్సార్సీపీయే కారణం లోయర్కాఫర్ డ్యామ్, అప్పర్ కాఫర్ డ్యామ్ పూర్తి చేసింది మేమే. పోలవరం కీలక పనులు మా హయాంలోనే పూర్తయ్యాయి’అని అంబటి చెప్పారు. -
పోలవరం సర్వనాశనం.. ఎత్తు తగ్గించేశారు
-
మాకు అడ్డుచెప్పేదెవరు.. జనసేన నేతల కొత్త దందా!
సాక్షి, తూర్పుగోదావరి: ఏపీలో కూటమి పాలనలో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. అధికారం తమదే అన్న భావనలో తాము ఏది చేసినా చెల్లుతుందని కబ్జాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు తాము ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా దోపీడీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అడ్డు చెప్పిన వారిని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నాయకులు రెచ్చిపోతున్నారు. పోలవరం కాలువ గట్లపై జనసేన, టీడీపీ నేతలు మట్టిని తవ్వేస్తున్నారు. ఈ క్రమంలో పచ్చ నేతల దోపిడీని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో, మరింత రెచ్చిపోయిన ఎల్లో బ్యాచ్.. అడ్డు వచ్చిన స్థానికులనే చంపేస్తామని బెదిరింపులకు దిగారు.అయితే, స్థానికంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల అండతోనే అక్రమార్కులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి పోలవరం గట్లను కాపాడాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
పోలవరానికి ద్రోహం చేసి బుకాయింపు 'ఎత్తు'గడ!
సాక్షి, అమరావతి: కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడం ద్వారా జీవనాడి పోలవరానికి తీరని ద్రోహం చేసిన కూటమి సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంఅడ్డగోలుగా బుకాయిస్తోంది. తమకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలను వల్లె వేస్తూ తాము చేసిన ద్రోహాన్ని వైఎస్సార్సీపీ సర్కారుపై నెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అడ్డగోలుగా అబద్ధాలను వల్లె వేస్తోంది. వాస్తవాలు ఇవిగో..ప్రభుత్వంపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని ఫిబ్రవరి 29న కేంద్ర కేబినెట్కు నివేదిక ఇచ్చింది... మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది... అప్పట్లో అధికారంలో ఉన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. పోలవరం ఎత్తును తగ్గించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే!వాస్తవంపోలవరం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) రూ.55,548.87 కోట్లుగా ఖరారు చేసిందని.. దాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ(ఆర్సీసీ) రూ.47,725.75 కోట్లుగా లెక్కకట్టిందని పీఐబీ నివేదికలో పేర్కొంది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి(వ్యయ విభాగం) అధ్యక్షతన నిర్వహించిన కమిటీ చర్చల్లో ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు రెండో దశలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యాం, అనుబంధ పనులు పూర్తి చేయడం... 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పించడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 29న పీఐబీ కేంద్ర కేబినెట్కు నివేదిక ఇచ్చింది.ఈ నివేదికపై మార్చి 6న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుసుకున్న అప్పటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులు ఇస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అజెండాలో పోలవరంపై పీఐబీ ఇచ్చిన నివేదికను చేర్చలేదు. పీఐబీ ఇచ్చిన నివేదికకు భిన్నంగా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇవ్వాలనే అంశం ఆర్థిక శాఖ ప్రతిపాదనలో లేదు. దీనిపై నాటి సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. మరి జీవనాడి పోలవరానికి ద్రోహం చేసిందెవరు? కూటమి ప్రభుత్వమే కదా? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టును తొలి దశ, రెండో దశ అంటూ దశలవారీగా పూర్తి చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ చెప్పింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని పీపీఏ కుండబద్ధలు కొట్టింది.వాస్తవంవిభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దక్కించుకుంది. ఈ క్రమంలో తాగునీటి విభాగం వ్యయం రూ.4,068 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు ఇవ్వబోమని.. కేవలం నీటిపారుదల విభాగానికి అదీ 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనకు నాడు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు మాత్రమే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రధాని మోదీతో సమావేశమై.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పనకే రూ.33,168.24 కోట్లు వ్యయం అవుతుందని.. అలాంటప్పుడు రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలమని... తాజా ధరల మేరకు నిధులిచ్చి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు. తాగునీటి విభాగం, నీటిపారుదల విభాగం వేర్వేరు కాదని, రెండు ఒకటేనని.. తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ.. వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిశీలించాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సూచించారు. దీంతో 2021 జూలై 8న తాగునీటి వ్యయ విభాగాన్ని నీటిపారుదల విభాగంలో కలిపేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ అంగీకరిస్తూ.. ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఏదైనా ఓ ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాది కనీస నీటిమట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత క్రమంగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని 1986 మే 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ.. పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేయాలని సూచించింది. ఇదే అంశాన్ని సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ సమాధానంగా చెప్పింది. తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామంది. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం పీపీఏ చెప్పిన దాన్ని వక్రీకరించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ అడ్డగోలుగా అబద్ధాలు వల్లె వేసింది.ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఆ ప్రభుత్వం పాపమే కారణం. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనే వైఎస్ జగన్కు లేదు.వాస్తవంటీడీపీ హయాంలో స్పిల్వే, స్పిల్ ఛానల్.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 డిసెంబర్లో ఒకేసారి చేపట్టారని.. 2017 జూలై నాటికి 1,006 మీటర్లు.. 2018 జూన్ నాటికి 390.6 మీటర్లు పూర్తి చేశారని.. 2017లో గోదావరి వరదలు డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడం వల్ల కోతకు గురైందని.. 2018లో వరద ఉధృతికి మరింత దెబ్బతిందని తేల్చిచెబుతూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా నిమ్మలా? ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల.. ఆ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వ పాపాలు కారణం కాదా? కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా వైఎస్ జగన్ మళ్లించారు.కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను, ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ అనుసంధానాలను.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే శరవేగంగా ప్రధాన డ్యాంను పూర్తి చేస్తామని కేంద్రాన్ని వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో డయాఫ్రం వాల్ భవితవ్యంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో జీవనాడి పోలవరాన్ని జీవచ్ఛవంగా చేసిందెవరు? జీవనాడిగా మార్చిందెవరు?ప్రభుత్వంపోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేందుకు 2021లోనే జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై మేం అప్పట్లో శాసనసభ లోపలా.. బయటా పోరాటం చేశాం.వాస్తవంపోలవరం స్పిల్ వేను ఇప్పటికే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించామని.. కావాలంటే టేపు తీసుకొని వచ్చి కొలుచుకోవాలని అప్పట్లో శాసనసభలో నాటి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రధాన డ్యాంను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును తగ్గించాలనే ప్రతిపాదన లేనే లేదని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో అటు రాజ్యసభ.. ఇటు లోక్సభలో నాటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు రాతపూర్వకంగా కుండబద్ధలు కొట్టారు.రాజ్యసభలో నాటి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ 2023 మార్చి 27న అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తున్నామని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. లోక్సభలో 2023 డిసెంబరు 7న అప్పటి ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. దీన్ని బట్టి అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది వాస్తవం కాదా? అప్పట్లో బాబు చేసిన అసత్య ప్రచారాన్నే ఇప్పుడు కేంద్రం ఆయుధంగా మార్చుకుని నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసిందని నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోలవరం దగ్గర నటి లయ సందడి (ఫొటోలు)
-
చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం నాశనం: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి: అసలు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో బుధవారం(నవంబర్20) నిర్వహించిన మీడియా సమావేశంలో పోలవరం జాప్యం వెనుక అసలు విషయాలను వైఎస్ జగన్ వివరించారు. ‘ఇది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు తప్పిదం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయన్నది స్పష్టంగా చెప్పింది. పోలవరం వద్ద గోదావరి నది దాదాపు 2.5 కిలోమీటర్ల వెడెల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కద ప్రాజెక్టు కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్వే పనులు పూర్తి చేయాలి.కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్డ్యామ్ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్ డ్యామ్ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్ డ్యామ్ పనులు చేయాలి. నదికి అటు,ఇటు రెండు కాఫర్డ్యామ్ల పనులు మొదలుపెట్టాడు. అంటే ఒకవైపు స్పిల్వే పూర్తి చేయలేదు.మరోవైపు మెయిన్డ్యామ్కు ఫౌండేషన్ వేశారు. ఎందుకంటే అవన్నీ ఎర్త్వర్క్లు..కమీషన్లు వస్తాయి. సిమెంటు పనులైతే కమిషన్లు రావు. ఈలోగా సీజన్ వచ్చింది. కాఫర్డ్యామ్లు పూర్తి చేయలేదు. దాంతో నీరు పోవడానికి కాఫర్డ్యామ్పై రెండు గ్యాప్లు వదిలారు. అప్పుడేం జరిగింది. రెండున్నర కిలోమీటర్ల వెడల్పు ఉన్న నది, ఇక్కడికి రాగానే 400 మీటర్ల మేర తగ్గింది.ఆ ఉధృతికి ప్రాజెక్టు ఫౌండేషన్ అయిన డయాఫ్రమ్వాల్ పూర్తిగా దెబ్బతిన్నది. చంద్రబాబు హయాంలోనే 2018–19లోనే భారీ వరదలకు అన్నీ దెబ్బతిన్నాయి. అందుకే మేం రాగానే స్పిల్వే పూర్తి చేశాం. దాంతో నీరు క్లియర్గా వెళుతున్నాయి. కాఫర్డ్యామ్ మరమ్మతులు మేమే చేశాం. ఇక డయాఫ్రమ్వాల్ను ఏం చేయాలి? మళ్లీ కట్టాలా? వద్దా అనేది నిపుణులు తేల్చాలి.చంద్రబాబు తప్పిదం వల్లనే పోలవరం పనులు నాశనమయ్యాయి. అయినా అదే పనిగా దుష్ప్రచారం. ఆయన అనుకూల మీడియా వత్తాసు పలుకుతోంది’అని పోలవరంపై చంద్రబాబు మోసాలను వైఎస్జగన్ ఏకరువు పెట్టారు. -
కాఫర్ డ్యాం పనులు పూర్తికాకుండానే మెయిన్ డ్యాం పనులు మొదలు పెట్టారు
-
చంద్రబాబూ.. పోలవరంపై ఇన్ని అసత్యాలా?: అంబటి
సాక్షి,గుంటూరు : పోలవరంపై అసెంబ్లీలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై జరిగిన చర్చలో తాను చేసిన తప్పిదాలను వైఎస్సార్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు ఇంకా ఏమన్నారంటే..ఆనాడే ఎందుకు చేపట్టలేదు?:పోలవరం ప్రాజెక్టు ప్రతిపాదన 1941లోనే వచ్చింది. అంజయ్య హయాంలో 1981లో శంకుస్థాపన చేసి వదిలేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి, వెన్నెముక అంటున్న చంద్రబాబు, మరి వైఎస్సార్ వచ్చి పునాది వేసి, పనులు చేసే వరకు ఎందుకు స్పందించలేదు?. 1995లో మీరు సీఎం అయ్యారు. 2004 వరకు మీరు ఆ పదవిలో ఉండి కూడా, జీవనాడి ప్రాజెక్టు ఎందుకు చేపట్టలేదు? పునాది వేసి పనులు ఎందుకు చేపట్టలేదు? ఎందుకంటే, ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పం మీకు లేదు. కనీసం ఆ ఆలోచన కూడా మీకు లేదు. అదే వైఎస్సార్ 2004లో పనులు మొదలు పెట్టి, రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. కుడి, ఎడమ కాల్వలు తవ్వారు. కానీ దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆ తర్వాత ప్రాజెక్టును ఎవరూ పట్టించుకోలేదు.కేంద్రమే కడతామన్నా:2014లో రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. పనులు వారే పూర్తి చేస్తామన్నారు. కానీ, చంద్రబాబు ఏం చేశారు? తామే కడతామని తీసుకున్నారు. అసలు కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్టును అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ చేతుల్లోకి ఎందుకు తీసుకుంది? అది చరిత్రాత్మక తప్పిదం. దాని ఫలితమే ప్రస్తుత పరిస్థితి. 2016లో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు చంద్రబాబు చేసిన మరో తప్పిదం.. 2013–14 ధరలతో ప్రాజెక్టు పనులు చేస్తామని ఒప్పుకోవడం. అదెలా సాధ్యం?. అంటే కేవలం కమిషన్ల కోసం, తనవారికి పనులు అప్పగించడం ఆయన లక్ష్యం, ఉద్దేశం.అయినా అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తున్నారు.ఇంకా తెలంగాణ నుంచి ఏడు మండలాల విలీనం చేయడంలో తనది కీలకపాత్ర అంటున్నారు. కానీ, నిజానికి అది విభజన చట్టంలోనే స్పష్టంగా ఉంది. దానిపైనా చంద్రబాబు అసత్యాలు చెబుతూ, అది తన ఘనత అంటున్నారు.ప్రాజెక్టు పనులపై ఆనాడేమన్నారు?:పోలవరం ప్రాజెక్టు పనుల్లో 72 శాతం 2019 నాటికి చేశామని, ఆ తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 3.8 శాతం పనులే చేసిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. మరి, ఆనాడు చంద్రబాబు ఏమన్నారు? 2018లో పోలవరం నుంచి నీళ్లిచ్చిన తర్వాతే, 2019లో ఎన్నికలకు వెళ్తామన్నారు. అదే మాట అసెంబ్లీలో అప్పటి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు.మరి పనులు పూర్తి చేశారా? పనులు చేయకపోయినా, అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. భజన చేయించుకున్నారు.మాకు నాలెడ్జ్ లేదన్నారు. మరి మీకు?:నాపైనా చంద్రబాబుగారు విమర్శ చేస్తూ.. నాకు టీఎంసీలు, క్యూసెక్స్ తెలియవని, డయాఫ్రమ్ వాల్ అంటే తెలియదని అన్నారు. ఔను నేను ఇంజనీర్ను కాదు. కానీ, మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక, అన్నీ తెలుసుకున్నాను.మరి నీవు చాలా తెలివైనవాడివి కదా? గతంలో ఒకసారి ఏమన్నావ్?. ‘కాఫర్ డ్యామ్ లేకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మించాలని అనుకున్నాం’ అని చెప్పావు. అది ఎలా సాధ్యం అనుకున్నావు.ఇంకా చెప్పాలంటే చంద్రబాబు చేసిన అనేక తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు చాలా ఆలస్యం అయింది. ఆ ప్రాజెక్టు సర్వనాశనం అయింది. ఇది వాస్తవం.ఇదీ చంద్రబాబు తప్పిదం:అసలు ఏ ప్రాజెక్టు అయినా, కట్టేటప్పుడు నీరు మళ్లిస్తారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ. ఒక్కోసారి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. కానీ, చంద్రబాబు ఏం చేశారంటే, నీరు డైవర్ట్ చేసేలా అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్వే.. వాటిలో ఏదీ పూర్తి చేయకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టారు.డయాఫ్రమ్ వాల్ అంటే..ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యామ్ పునాది. అది ప్రాజెక్టు మధ్యలో ఉంటుంది. నదీ ప్రవాహం మళ్లించకుండా దాన్ని కట్టడం వల్ల, వరద ఉధృతికి అది కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్వాల్ను 2016లో గ్యాప్–2 లో ప్రారంభించి చరిత్రాత్మక తప్పిదం చేశారు.పోనీ, కాఫర్ డ్యామ్ అయినా పూర్తి చేశారా? అంటే అదీ లేదు. సగం పనులు చేశారు. నది డైవర్షన్ చేయకుండా, కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే, నదీ ప్రవాహానికి కొట్టుకుపోతుందని, దాని మధ్యలో గ్యాప్లు పెట్టారు. ఫలితంగా మీ హయాంలోనే డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం మొదలైంది. అది ఒక్కటే కాదు.. కాఫర్డ్యామ్ వాల్కు కింద ఉన్న జెట్ డ్రౌటింగ్. అది కూడా దెబ్బతినడం మొదలైంది.నిపుణుల నోట..అదే మాట:డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత.. ఏం చేయాలన్న దానిపై చర్చించి, దేశంలో ఉన్న నిపుణులతో అధ్యయనం చేయించాలని నిర్ణయించాం. ఆ మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే, కేంద్రం నిపుణుల కమిటీ వేసింది. అందులో ఇద్దరు అమెరికా, ఇద్దరు కెనెడాకు చెందిన వారు. వారు ఇక్కడికి వచ్చి, అన్నీ అధ్యయనం చేసి, కేంద్ర జల స«ంఘానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. వారు చెప్పిందేమిటంటే.. నదిని మళ్లించకుండా, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టాలనుకోవడం ఒక తప్పిదం. డయాఫ్రమ్ వాల్ను పూర్తి చేయడానికి కట్టిన కాఫర్ డ్యామ్లో గ్యాప్లు వదలడం మరో తప్పిదం అని వారు స్పష్టంగా చెప్పారు. అంటే, అన్ని అనర్థాలకు కారణం చంద్రబాబు, ఆయన ప్రభుత్వం. అయినా, చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అన్నింటినీ జగన్గారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలన్న ఆలోచన, ఇంట్రెస్ట్ లేదు. ఎంతసేపూ, ఆ పనుల్లో కమిషన్లు గుంజుకోవడం తప్ప.ఇదీ ఈ ఇరిగేషన్ మంత్రి నాలెడ్జ్:ఇప్పుడు ఒక ఇరిగేషన్ మంత్రి ఉన్నారు. ఆయనకు చాలా నాలెడ్జ్ ఉందంటారు. కానీ, ఆయన ఏమన్నారంటే.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చును, కేంద్రం రీయింబర్స్ చేస్తే, జగన్గారు డైవర్ట్ చేశారట. అది రాష్ట్ర ప్రభుత్వ నిధి. అంతకు ముందు ఖర్చు చేస్తే, కేంద్రం తిరిగి ఇచ్చింది. మరి ఆ నిధులు డైవర్ట్ చేయడం ఏమిటి? అదీ ఈ ఇరిగేషన్ మంత్రి పరిజ్ఞానం!ఎత్తు తగ్గింపు మరో తప్పిదం:చంద్రబాబు మరో ఘోర తప్పిదం చేశారు. దాన్ని భవిష్యత్తులో కూడా సరి చేసుకోలేం. ఆనాడు పోలవరం ప్రాజెక్టులో తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు రూ.12 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దాని కోసం మేము చాలా ప్రయత్నాలు చేశాం. దాంతో ఇటీవల కేంద్ర క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది. అయితే దానికి ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం చేశారు.పోలవరం ప్రాజెక్టు పనులను రెండు దశల్లో.. ఒకటి 41.15 మీటర్లు, రెండో దశలో 45.72 మీటర్ల అడుగులో నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. అది ప్రాజెక్టు మాన్యువల్లోనూ ఉంది. కానీ ఇప్పుడు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తూ, ప్రాజెక్టును కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ, ఆ నిధులు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆ మేరకు క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. అంటే ఇది టీడీపీ, బీజేపీ ప్రభుత్వ సంయుక్త నిర్ణయం.ఇదే నా సవాల్:కానీ, చంద్రబాబు ఏం అన్నారు? ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల ఎత్తులో నిర్మించాలని ప్రధానిగారు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒకవేళ అది నిజమైతే, క్యాబినెట్ నోట్ చూపండి. అది చూపితే, నేను క్షమాపణ చెప్పి, నోరు మూసుకుంటాను. ఇదే నా సవాల్. మీరు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల రాష్ట్రం చాలా నష్టపోతుంది. కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలం. 195 టీఎంసీల నీరు వాడుకోలేం. దాని వల్ల చాలా నష్టం. చాలా వాటికి నీరందదు. ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్టును సర్వనాశనం చేస్తున్నారు.మా హయాంలోనే వేగంగా పనులు:మా హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరిగాయి. స్పిల్వే పూర్తైంది.మా టైమ్లోనే ప్రాజెక్టు గేట్లు బిగించాం. నది మళ్లింపు చేశాం. అంటే, పైలట్ ఛానల్ కూడా పూర్తి చేశాం. రెండు కాఫర్ డ్యామ్లు కూడా మేమే పూర్తి చేశాం.కానీ చంద్రబాబు తన హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశానని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. దాన్ని తన ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.మరో విషయం:రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చాయంటే, అదంతా వైఎస్సార్ ఘనతే. వెలుగొండ కానీ, గుండ్లకమ్మ కానీ.. ఏదైనా ఆయన హయాంలోనే కట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి, అది సర్వనాశనం కావడానికి చంద్రబాబే కారకుడు. ప్రపంచంలో ఎవరూ కూడా, నది డైవర్షన్ లేకుండా, ప్రాజెక్టు కట్టరు. కానీ చంద్రబాబు ఆ పని చేశారు. దాన్ని సమర్థించుకోవడానికి ఇవాళ తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. -
‘పచ్చ ముఠా’ మట్టి మాఫియా
ద్వారకాతిరుమల: పోలవరం కాలువ గట్టుపై పచ్చ ముఠా పేట్రేగిపోతోంది. విలువైన గ్రావెల్ మట్టిని అక్రమంగా తవ్వి తెలుగు తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో కొందరు సాగిస్తున్న ఈ దందా రోజురోజుకు ఉధృతమవుతోంది. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురం, పరిసర ప్రాంతాల్లోని పోలవరం కుడి కాలువ గట్టుపై గ్రావెల్ మట్టి అక్రమ తవ్వకాలు గత కొన్నాళ్లుగా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రస్తుతం కాలువకు రెండు పక్కల గట్లపై పొక్లెయిన్లు పెట్టి, రాత్రీ పగలు తేడా లేకుండా యథేచ్ఛగా ఈ తవ్వకాలు జరుపుతున్నారు. టిప్పర్ల రాకపోకలు జరిగే సమయంలో గట్టుపై మట్టి పైకి లేచి, టిప్పర్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతుండటంతో, ఒక వాటర్ ట్యాంకర్ ద్వారా గట్టును తడుపుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి సుమారు 100 టిప్పర్లకు పైగా మట్టి బయటకు తరలిపోతోంది. ఒక్కో టిప్పర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.11 వేలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ మట్టి పొలసానిపల్లి, ఏలూరు, భీమవరం పరిసర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిపోతోంది. అనుమతులు ఉన్నాయంటూ దందా.. తవ్విన మట్టిని మరో ప్రాంతానికి తరలించాలంటే కచ్చితంగా ఇరిగేషన్, మైనింగ్ శాఖల అనుమతులు తప్పనిసరి. ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంలో తవ్వకాలు జరుపుతున్న పచ్చ నేతల్లో ఒకరు సుమారు 5 వేల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ శాఖ నుంచి అనుమతులు పొందారు. మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొందకుండానే తవ్వకాలు జరుపుతున్నారు. ఇదేంటని స్థానికులు ఎవరైనా ప్రశి్నస్తే మాకు అనుమతులు ఉన్నాయంటూ తమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి ముఖ్య ప్రజాప్రతినిధి అండదండలతో ఎం.నాగులపల్లి, లైన్ గోపాలపురంకు చెందిన ఆయన అనుచరులు ఈ దందాకు పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. తవ్వకాల వైపు కన్నెత్తి చూడని అధికారులు.. పట్టపగలు అక్రమ తవ్వకాలు సాగుతున్నా ఆ వైపు అధికారులెవరూ కన్నెత్తి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. అనుమతులు ఉన్నాయి మీకెందుకు రిస్క్.. మీ పని మీరు చూసుకోండి అని అధికారులు చెబుతున్నారట. అక్రమార్కులకు అధికారులు ఇలా కొమ్ముకాయడం దారుణమని పలువురు అంటున్నారు. ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో, అది కూడా మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. ఉప ముఖ్యమంత్రికి ఇవి కనబడవా.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఐఎస్ జగన్నాథపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని, అక్కడ జరిగిన గ్రావెల్ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాల్లో వైఎస్సార్సీపీ నాయకుల పాత్ర ఏమైనా ఉందేమో విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పోలవరం కాలువ గట్టుపై జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు ఆయనకు కనబడటం లేదా అని స్థానికులు ప్రశి్నస్తున్నారు. -
6న విదేశీ నిపుణుల బృందం పోలవరం పర్యటన
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను ఈనెల 6వ తేదీన విదేశీ నిపుణుల బృందం పరిశీలించనుంది. నాలుగు రోజుల పాటు ప్రాజెక్టు ప్రాంతంలో మకాం వేసి పనులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ, బావర్, మేఘ ఏజెన్సీ ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు తెలుసుకోనున్నారు.ప్రస్తుతం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య సీపేజ్ వాటర్ తొలగించే పనులు జరుగుతున్నాయి. నీటిని తొలగించిన ప్రాంతంలో శాండ్ ఫిల్లింగ్ పనులు చేస్తున్నారు. బృందం సభ్యులు కొత్త డయాఫ్రమ్వాల్ నిర్మాణంపై చర్చించిన అనంతరం తుది నివేదిక తయారు చేస్తారని అధికారులు తెలిపారు. -
మీ డబ్జా మీరు కొట్టుకోవడం కాదు: Buggana
-
పోలవరం ఎత్తు తగ్గింపు.. ఆత్మహత్యా సదృశ్యమే: సీపీఐ నారాయణ
సాక్షి, ఢిల్లీ: పోలవరం ఎత్తు తగ్గించడం ఆత్మహత్యా సదృశ్యమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎత్తు తగ్గించి నిర్మించడానికి ఇంత ధనం అవసరం లేదన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ను 45 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ నారాయణ ప్రశ్నించారు.పోలవరం 41 మీటర్లకు తగ్గితే బ్యారేజిగా మాత్రమే పనికివస్తుందని నారాయణ అన్నారు. ఉత్తరాంధ్రకు నీళ్లు రావు. మూసీ నది ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్కు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు.కాగా, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దానిని ఉత్త బ్యారేజిగ మార్చేశాయని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎత్తులో ప్రాజెక్టు కింద కొత్తగా 7.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదని, గోదావరి, కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం, గోదావరి–పెన్నా అనుసంధానం ప్రశ్నార్థకమవుతాయని చెబుతున్నారు.ఇదీ చదవండి: పోలవరం ఇక ఉత్త బ్యారేజే -
పోలవరం ఎత్తు తగ్గింపు బాబు కుట్రే: అనంత వెంకట్రామిరెడ్డి
సాక్షి,అనంతపురం:కరువు మండలాల ప్రకటనలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కేవలం 17 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే, అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ విషయమై శుక్రవారం(నవంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 63 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి. చంద్రబాబు రైతు ద్రోహి. వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతంతో చంద్రబాబు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు చంద్రబాబు కుట్రే. పోలవరం ఎత్తు 45.72 అడుగుల నుంచి 41 అడుగులకు కుదించాలని నిర్ణయించడం ద్రోహమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఏపీకి సాగు తాగు నీటి కష్టాలు వస్తాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు విభజన చట్టాన్ని ఉల్లంఘించటమే. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు చంద్రబాబే నైతిక బాధ్యత వహించాలి. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని ప్రధాని మోదీ గతంలో బాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు’అని అనంత వెంకట్రామిరెడ్డి గుర్తు చేశారు.ఇదీ చదవండి: అబద్ధాలు చెప్పడంలో ఆరితేరిన చంద్రబాబు -
పోలవరం ఎత్తు తగ్గించడంపై మార్గాని భరత్ స్ట్రాంగ్ రియాక్షన్
-
పోలవరంపై ‘సాక్షి’ ప్రశ్న.. మంత్రి నిమ్మల బుకాయింపు!
సాక్షి, విజయవాడ: పోలవరంపై సాక్షి అడిగిన ప్రశ్నకు మంత్రి రామానాయుడు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. కేంద్ర కేబినెట్ నోట్లో ఫేజ్ 1 ప్రస్తావన ఉందా..? అంటూ ప్రశ్నించగా తెల్లమొహం వేశారు. పోలవరం ఎత్తు తగించేందుకు అంగీకరించడంపై ప్రశ్నించగా.. కేంద్ర కేబినెట్ నోట్ చూపించకుండానే వెళ్లిపోయారు. 41.15 మీటర్ల ఎత్తుకి అంగీకారం తెలిపినట్టు ప్రకటించిన మంత్రి నిమ్మల.. ఫేజ్ 2 తర్వాత నిధులు వస్తాయంటూ బుకాయించారు.పోలవరంపై చంద్రబాబు సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది.కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కేబినెట్లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు 28వ తేదీన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు.ఇదీ చదవండి: పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్ ‘రహస్య’ రాజకీయం! -
పోలవరంపై మరో కుట్ర..
-
6 నుంచి 10 వరకు పోలవరంపై వర్క్ షాప్
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద వచ్చే నెల 6 నుంచి 10 వరకు వర్క్ షాప్ నిర్వహించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిద్ధమైంది. ఈలోగా ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో సీపేజీ నీటిని పూర్తిగా తోడివేయాలని పోలవరం అధికారులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. డయాఫ్రం వాల్ నిరి్మంచే ప్రాంతాన్ని సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తు వరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసి ప్లాట్ఫాంను సిద్ధం చేయాలని సూచించింది.6వ తేదీన అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనుంది. ఐదు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వర్క్ షాప్లో చర్చించి, నిర్ణయం తీసుకోనుంది. ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్కు ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించే విధానంతోపాటు గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యాం డిజైన్ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.సీడబ్ల్యూసీ ఆదేశం మేరకు కాఫర్ డ్యాంల మధ్య నీటిని తోడే పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా ముమ్మరం చేసింది. గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై ప్రధాన డ్యాం ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకున్న ప్రదేశాన్ని మే నాటికే సముద్ర మట్టానికి 16 మీటర్ల ఎత్తుతో ఇసుకను నింపి, వైబ్రో కాంపాక్షన్ చేసే పనులు పూర్తి చేసింది. సీపేజీ నీటిని పూర్తిగా తోడేశాక అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మరో మీటరు ఎత్తు పెంచడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగించే బెంటనైట్ మిశ్రమం, కాంక్రీట్ను వర్క్ షాప్లో పరీక్షల నిమిత్తం సిద్ధంగా ఉంచారు. -
నాలుగు ప్యాకేజీలు నలుగురికి!
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనుల టెండర్లలో పాతకథే పునరావృతమవుతోంది. టెండర్ నోటిఫికేషన్ జారీచేయకముందే ఏ ప్యాకేజీ పనులను ఎవరికి ఏ ధరకు అప్పగించాలో లోపాయికారీగా నిర్ణయించేస్తున్నారు. ఆ కాంట్రాక్టరుకే పనులు కట్టబెట్టేలా అధికారులకు కనుసైగ చేస్తున్నారు. కాంట్రాక్టు విలువ కంటే అధికధరకు కట్టబెట్టి.. ఖజానాపై భారం మోపి.. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి కమీషన్లు రాబట్టుకోవడానికి ఉన్నతస్థాయిలో మంత్రాంగం నడిచిందనే చర్చ జలవనరులశాఖ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దోపిడీకి అడ్డొస్తుందనే నెపంతో రివర్స్ టెండరింగ్ విధానాన్ని గతనెల 15న ప్రభుత్వం రద్దుచేసింది. 2019 మే 30కి ముందు అమల్లో ఉన్న పద్ధతి ప్రకారమే టెండర్లు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది.పోలవరం ఎడమకాలువలో నాలుగు ప్యాకేజీల్లో మిగిలిన రూ.787.38 కోట్ల విలువైన పనులకు నిర్వహించే టెండర్ల నుంచే పాతపద్ధతికి తెరతీశారు. టెండర్ నోటిఫికేషన్ జారీకి ముందే 2014–19 తరహాలోనే ముఖ్యనేత రంగంలోకి దిగారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన అధికారపార్టీ ఎమ్మెల్యే సంస్థకు రూ.293.66 కోట్లు, మిత్రపక్షానికి చెందిన తన సమీప బంధువైన ఎంపీ కుమారుడి సంస్థకు రూ.317.77 కోట్ల విలువైన ప్యాకేజీల పనులు.. మిగతా రూ.68.71 కోట్లు, రూ.107.84 కోట్ల విలువైన ప్యాకేజీల పనులను ఆదినుంచి ఆ స్థానంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించేలా మౌఖిక ఒప్పందం కుదిరినట్లు కాంట్రాక్టుసంస్థల వర్గాలు చెబుతున్నాయి. తాము సూచించిన వారికే పనులు కట్టబెట్టాలంటూ పోలవరం అధికారులకు సంకేతాలు పంపారు. 6న ఫైనాన్స్ బిడ్ పోలవరం ఎడమకాలువ నాలుగు ప్యాకేజీల పనులకు వేర్వేరుగా ఈ–ప్రొక్యూర్మెంట్ వెబ్సైట్లో శుక్రవారం రాత్రి పోలవరం అ«ధికారులు బిడ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేశారు. ఒకటో ప్యాకేజీ (0 కిలోమీటర్ల నుంచి 25.6 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనులకి రూ.68.71 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. మూడో ప్యాకేజీ (51.6 కిలోమీటర్ల నుంచి 69.145 కిలోమీటర్లు+1,009 మీటర్లు)లో మిగిలినపని అంచనా విలువను రూ.107.84 కోట్లుగా ఖరారు చేశారు.ఐదు, ఐదు (ఏ) ప్యాకేజీ (93.7 కిలోమీటర్ల నుంచి 111 కిలోమీటర్ల వరకు+1,351 మీటర్లు)లో మిగిలిన పనుల అంచనా విలువను రూ.293.66 కోట్లుగా, ఆరు, ఆరు (ఏ) ప్యాకేజీ (111 కిలోమీటర్ల నుంచి 136.78 కిలోమీటర్ల వరకు)లో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని రూ.317.17 కోట్లుగా నిర్ణయించారు. ఈ నాలుగు ప్యాకేజీ పనుల పూర్తికి 12 నెలలు గడువు పెట్టారు. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బిడ్ దాఖలు చేసుకోవచ్చు. టెక్నికల్ బిడ్ నవంబర్ 2న, ఫైనాన్స్ బిడ్ నవంబర్ 6న తెరిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు.ఖజానా దోపిడీకి రంగం సిద్ధంరాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 2014–19 మధ్య పనులకు నిర్వహించిన టెండర్లలో అధికశాతం టెండర్లను 4.85 శాతం అధిక ధరలకు కట్టబెట్టింది. అప్పట్లో 4.85 శాతం అధిక ధరను ‘ఫ్యాన్సీ’ నంబరు అంటూ కాంట్రాక్టు సంస్థలు, అధికారవర్గాలు వ్యంగ్యోక్తులు విసిరేవారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాన్సీ నంబరును పాటిస్తూ ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకు అధికధరకు పనులు అప్పగిస్తారా.. లేదంటే అంతకంటే ఎక్కువధరకు పనులు కట్టబెట్టి ఖజానాకు తూట్లు పొడుస్తారా అన్నది తేలాలంటే నవంబర్ 6 వరకు వేచిచూడాల్సిందే. -
Polavaram: గడువులోగా పూర్తి చేయకపోతే ఆ సొమ్ము రుణమే
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్మెంట్గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది. అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా.. » రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి. » కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి. » ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి. » విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం. » ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి. -
పోలవరం పూర్తికి గడువు రెండేళ్లే
సాక్షి, అమరావతి: ఏపీ జీవనాడి పోలవరం నిర్మాణం పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించింది. ప్రాజెక్టులో మిగిలిన పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. భారీ వరదల వల్ల ఏవైనా ఇబ్బందులు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగిస్తామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు.అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కేంద్రం ఈ గడువును విధించినట్లు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికార వర్గాలు తెలిపాయి. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన వరదను మళ్లించే స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు, ప్రధాన డ్యాం గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాం, జలాశయంతో కుడి, ఎడమ కాలువలను అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో కీలకమైన పనులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే పూర్తి చేసింది.వీటి నిర్మాణం పూర్తవడంతో గతంలో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్ స్థానంలో కొత్త వాల్ను ఒకే సీజన్లో నిర్మించడానికి, ప్రధాన డ్యాం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. గ్యాప్–1,2ల్లో ప్రధాన డ్యాం పనులు చేపట్టి.. 2026 మార్చికల్లా పూర్తి చేయవచ్చని తెలిపారు.41.15 మీటర్ల కాంటూర్ వరకు నీటిని నిల్వ చేసి, ఆయకట్టుకు నీరందించడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే రూ.12,157.53 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడు ప్రభుత్వం చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేస్తే రెండేళ్లలోగా ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.చంద్రబాబు తప్పులను సరిదిద్దిన జగన్కమీషన్ల కక్కుర్తితో కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబర్ 7న అర్ధరాత్రి అప్పటి సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. 2013–14 ధరల ప్రకారం కేవలం నీటి పారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇస్తే చాలని, ప్రాజెక్టును పూర్తి చేస్తామని అంగీకరించారు. ప్రొటోకాల్ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను నిర్మించి.. వాటి మధ్య డయాఫ్రం వాల్ వేసి.. దానిపై ప్రధాన డ్యాం నిర్మించాలి. కానీ.. చంద్రబాబు ప్రొటోకాల్ను తుంగలో తొక్కి కమీషన్లు అధికంగా వచ్చే పనులనే చేపట్టారు. వరద మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే 2018కే ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ నిర్మించారు. దీంతో అది 2018 వరదలకే దెబ్బతింది. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి చేతులెత్తేశారు. తర్వాత గోదావరి వరద జలాలు ఖాళీ ప్రదేశాల గూండా అధిక ఉధృతితో ప్రవహించడంతో డయాఫ్రంవాల్, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. 2019 మే 30న సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక.. కరోనా ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు చేసిన తప్పులను సరిదిద్దారు. స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని మళ్లించారు. ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంను పూర్తి చేశారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్ భవితవ్యాన్ని తేల్చి.. తాజా ధరల మేరకు నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. వైఎస్ జగన్ వినతికి సానుకూలంగా సమ్మతించిన కేంద్రం.. తాజా ధరల మేరకు పోలవరానికి నిధులిచ్చేందుకు గత ఏడాది జూన్ 5న అంగీకరించిన విషయం తెలిసిందే. -
బాబు చారిత్రక తప్పిదం వల్లే.. జీవనాడి.. జీవచ్ఛవం!
సాక్షి, అమరావతి: అవగాహనా రాహిత్యం.. ప్రణాళికా లోపం.. అస్తవ్యస్థ పనులు.. చారిత్రక తప్పిదాలు..! గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా తొలుత స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ పనులను చేపట్టడం! ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి చివరకు వాటిని కూడా పూర్తి చేయలేక చేతులెత్తేయడం! కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడంతో వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. వెరసి జీవనాడి లాంటి ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారు!! పోలవరంలో సీఎం చంద్రబాబు నిర్వాకాలపై మరోసారి తేల్చిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక సారాంశం ఇదీ! ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ ధ్వంసం కావడానికి.. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో విధ్వంసం చోటు చేసుకోవడానికి.. ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీటి లీకేజ్)కి ముమ్మాటికీ చంద్రబాబు చారిత్రక తప్పిదాలే కారణమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ‘సాక్షి’గా మరోసారి నిర్ధారణ అయింది. ఈమేరకు ఈ ఏడాది ఆగస్టు 12న తాము ఇచ్చిన నివేదికపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), రాష్ట్ర జలవనరుల శాఖ వ్యక్తం చేసిన పలు సందేహాలను నివృత్తి చేస్తూ ఈ నెల 20వ తేదీన పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చిన నివేదికలోనూ గతంలో పేర్కొన్న అంశాలనే అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది. పోలవరం నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడంపై సలహాలు, సూచనలు అందించేందుకు డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి. సిస్కో (యూఎస్ఏ), రిచర్డ్ డొన్నెళ్లీ, సీస్ హించ్బెర్గర్ (కెనడా)లతో కూడిన అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని పీపీఏ, సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29–జూలై 4 మధ్య పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి జలవనరులు, సీడబ్ల్యూసీ అధికారులతో చర్చించిన ఈ బృందం జూలై 7న ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అనంతరం పూర్తి స్థాయి నివేదికను 12న పీపీఏ, సీడబ్ల్యూసీలకు ఇచ్చింది. అయితే ఆ నివేదికలోని పలు అంశాలపై సందేహాలను వ్యక్తం చేస్తూ ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పటిష్టత, సీపేజీ, డయాఫ్రం వాల్ నిర్మాణం తదితరాలపై మరింత స్పష్టత ఇవ్వాలని అంతర్జాతీయ నిపుణుల కమిటీని సీడబ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ కోరాయి. ఈ క్రమంలో వాటిని నివృత్తి చేస్తూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ తాజాగా ఇచ్చిన నివేదికలో ప్రధానాంశాలు ఇవీ.. 2018 నాటికే జెట్ గ్రౌటింగ్ వాల్కు 27 చోట్ల భారీ చీలికలు⇒ గోదావరిపై గ్యాప్–2లో ప్రధాన డ్యాం నిర్మాణానికి వీలుగా 2,450 మీటర్ల పొడవున ఎగువ కాఫర్ డ్యాం నిర్మించాలి. వరద ఉద్ధృతి (ఫర్మియబులిటీ)ని పక్కాగా లెక్క వేస్తే.. ఎగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ను ఏ స్థాయి నుంచి తవ్వాలన్నది నిర్ణయించవచ్చు. కానీ ఎగువ కాఫర్ డ్యాం వద్ద ఫర్మియబులిటీని సెకనుకు కనిష్టంగా 5్ఠ10–2 మీటర్లు ఉండగా.. 5్ఠ10–4 నుంచి 5్ఠ10–5గా లెక్కగట్టారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించడం వల్ల జెట్ గ్రౌటింగ్ వాల్ను 20 మీటర్ల లోతు నుంచే నిర్మించారు. వాస్తవంగా ఆ వాల్ను 40 మీటర్ల లోతు నుంచి నిర్మించాలి. దీన్ని బట్టి చూస్తే ఇందులో కమీషన్ల దాహం స్పష్టమవుతోంది.⇒ 2018లో గోదావరి ప్రవాహం జెట్ గ్రౌటింగ్ వాల్ మీదుగానే ప్రవహించింది. ఆ వరద ఉద్ధృతికి జెట్ గ్రౌటింగ్ వాల్లో చెయినేజ్ 1,040 మీటర్ల నుంచి 1,330 మీటర్ల మధ్య 27 చోట్ల భారీగా చీలికలు ఏర్పడ్డాయి. వాటిలో బ్లాక్ కాటన్ సాయిల్ (నల్ల బంక మట్టి) వేసి మరమ్మతు చేసి 2018 డిసెంబర్లో ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించారు. ⇒ ఫర్మియబులిటీని తప్పుగా లెక్కించి తక్కువ లోతు నుంచి జెట్ గ్రౌటింగ్ వాల్ను నిర్మించడం వల్లే ఎగువ కాఫర్ డ్యాంలో సీపేజీ (ఊట నీరు) అధికంగా ఉందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ పునరుద్ఘాటించింది.ఆ చారిత్రక తప్పిదం వల్లే..⇒ పోలవరం వద్ద భూభౌగోళిక పరిస్థితుల రీత్యా నదికి ఆవల కుడివైపున స్పిల్వే నిర్మించి ప్రవాహాన్ని మళ్లించి.. నదికి అడ్డంగా నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యాం(ఎర్త్ కమ్రాక్ ఫిల్ డ్యాం)ను నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్ను ఆమోదించింది.⇒ సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ ప్రకారం తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయాలి. ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేసి వాటి మధ్యన ప్రధాన డ్యాం పనులు చేపట్టి పూర్తి చేయాలి. ⇒ కానీ.. 2016 డిసెంబర్లో చంద్రబాబు హయాంలో ఒకేసారి స్పిల్ వే, స్పిల్ ఛానల్, ప్రధాన డ్యాం డయాఫ్రం వాల్ పనులను ప్రారంభించారని నిపుణుల కమిటీ ఆక్షేపించింది. గోదావరికి అడ్డంగా 2016 డిసెంబర్ నుంచి 2017 జూలై వరకు చెయినేజ్ 1485.7 నుంచి 480 మీటర్ల వరకూ 1006 మీటర్లు.. 2017 డిసెంబర్ నుంచి 2018 జూన్ వరకూ చెయినేజ్ 480 నుంచి 89 మీటర్ల వరకూ 390.6 మీటర్ల పొడవున మొత్తం 1,396.6 మీటర్ల మేర ప్రధాన డ్యాం గ్యాప్–2లో డయాఫ్రమ్ వాల్ను నిర్మించారని పేర్కొంది.⇒ నదీ ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయక పోవడంతో 2018లో గోదావరి ప్రవాహాన్ని డయాఫ్రం వాల్ మీదుగా వదిలేశారని నిపుణులు కమిటీ గుర్తు చేసింది. ఆ ప్రభావం డయాఫ్రం వాల్పై పడకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రస్తావించింది. దాంతో డయాఫ్రం వాల్ నాలుగు చోట్ల 485 మీటర్ల పొడవున కోతకు గురై దెబ్బతిందని పునరుద్ఘాటించింది.ప్రణాళికాబద్ధంగా పనులు..⇒ నాడు చంద్రబాబు సర్కార్ హయాంలో గాడి తప్పిన పోలవరం పనులను 2019 మే 30న అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చక్కదిద్దింది. 2020లో ఎగువ, దిగువ కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్పై వరద ప్రభావం పడకుండా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టిందని అంతర్జాతీయ నిపుణుల కమిటీ గుర్తు చేసింది.⇒ 2019 వర్షాలు ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాపర్ డ్యాంలలో ఖాళీ ప్రదేశాలు వదలడం వల్ల కోతకు గురికాకుండా గత ప్రభుత్వం సమర్థంగా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. దీన్ని బట్టి చూస్తే 2018 వరదలలోనే డయాఫ్రమ్ వాల్ జెట్ గౌటింగ్ వాల్ దెబ్బతిన్నట్లు స్పష్టమవుతోంది.⇒ గోదావరి వరద ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేసింది. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనుల నాణ్యత ప్రమాణాల మేరకు ఉంది. ⇒ ఎగువ కాఫర్ డ్యాంను 42.5 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసి 2021 జూన్లోనే గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించింది. గోదావరికి గరిష్ట స్థాయిలో వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును 44 మీటర్లకు పెంచుతూ 2022లో పనులు చేపట్టి పూర్తి చేసింది.⇒ దిగువ కాఫర్ డ్యాంలో కోతకు గురైన ప్రాంతాన్ని జియో బ్యాగ్లలో ఇసుక నింపి పూడ్చింది. 2023 ఫిబ్రవరి నాటికి దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసింది. ⇒ ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు రెండూ పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. నిజాలను ప్రతిబింబించిన నివేదిక..ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్టు కట్టాలంటే తొలుత నదీ ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేస్తారు. ఆ తర్వాత కాఫర్ డ్యాంలు నిర్మించి నదీ ప్రవాహాన్ని స్పిల్ మీదుగా మళ్లిస్తారు. అప్పుడు ప్రధాన డ్యాం నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. తద్వారా వరదల్లోనూ పనులు కొనసాగించి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేస్తారు. కానీ.. పోలవరంలో మాత్రం చంద్రబాబు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్ను పూర్తి చేయకుండానే.. ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్ను పూర్తి చేసి చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యాం పనులు ప్రారంభించి వాటిని పూర్తి చేయలేక చేతులెత్తేశారు. కాఫర్ డ్యాంలకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేశారు. వాటి గుండా గోదావరి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో ఉద్ధృతి పెరిగి డయాఫ్రం వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకుంది. ఈ పాపం చంద్ర బాబుదేనని నీటిపారుదల రంగ నిపుణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదినుంచి స్పష్టం చేస్తుండగా.. అదే అంశాన్ని ఈ ఏడాది ఆగస్టు 12న ఇచ్చిన నివేదికలో అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. తాజాగా ఇచ్చిన నివేదికలోనూ అదే అంశాలను పునరుద్ఘాటించడం గమనార్హం.సకాలంలో కాఫర్ డ్యాంలు పూర్తి చేయకపోవడంతో..⇒ ఎగువ కాఫర్ డ్యాం పనులను 2018 డిసెంబర్లో ప్రారంభించిన టీడీపీ సర్కారు 100 నుంచి 1,780 మీటర్ల మధ్య 35 మీటర్ల ఎత్తుతో 2019 మార్చి నాటికి చేసి ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ దిగువ కాఫర్ డ్యాం పునాది జెట్ గ్రౌటింగ్ వాల్ను 10 మీటర్ల లోతు నుంచి వేసి.. 540 మీటర్ల పొడవున పనులు చేపట్టి 2019 మార్చి నాటికి సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసింది. ⇒ కాఫర్ డ్యాంలు, నిర్వాసితులకు పునరావాసం పనులు నత్తనడక సాగుతుండటం.. రుతు పవనాల కాలం సమీపిస్తుండటంతో కాఫర్ డ్యాంలలో వదిలిన ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయకుండా వదిలేయాలని 2019 మే 27న పీపీఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.⇒ 2019లో గోదావరి వరద ఎగువ కాఫర్ డ్యాం ఖాళీ ప్రదేశాల గుండా ప్రవహించడంతో వరద ఉద్ధృతి మరింత అధికమై ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురయ్యాయి. 30 మీటర్ల లోతుతో భారీ అగాధాలు ఏర్పడ్డాయని అంతర్జాతీయ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. -
పోలవరానికి ఈ ఏడాది ఎంత కావాలి?
పోలవరం ప్రాజెక్టు కనీస నీటి మట్టం (41.15 మీటర్ల కాంటూర్) స్థాయిలో ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టే పనులు, వాటికి ఎంత ఖర్చవుతుంది, ఎప్పుడు ఎంత విడుదల చేయాలో సమగ్ర ప్రతిపాదనలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. పీపీఏ, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)తో చర్చించి ఈ ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేసి, ఆ మేరకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్కు కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ ఇటీవల లేఖ రాశారు. - సాక్షి, అమరావతినాడు మోకాలడ్డిన చంద్రబాబువైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండగా పోలవరం పూర్తి చేయడానికి తాజా ధరల మేరకు, విభాగాల వారీగా పరిమితి విధించకుండా బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని ప్రధానిని కోరారు. అందుకు మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయాన్ని రీయింబర్స్ చేసేందుకు విభాగాల వారీగా విధించిన పరిమితి ఎత్తేశారు. తాజా ధరల మేరకు నిధులిచ్చేందుకు అంగీకరించారు. తొలి దశ పూర్తికి అవసరమయ్యే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దాంతో తొలి దశ పనులు పూర్తి, చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్ల ధ్వంసమైన గ్యాప్–2లో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణానికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు అంగీకరిస్తూ గతేడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నోట్ జారీ చేశారు. ఈ క్రమంలో పోలవరం తొలి దశ వ్యయాన్ని రూ.30,436.95 కోట్లుగా కేంద్ర జల్ శక్తి శాఖ ఖరారు చేసింది. 2014 ఏప్రిల్ 1 వరకూ చేసిన ఖర్చు రూ.4,730.71 కోట్లు పోనూ రూ.25,706.24 కోట్లు ఇవ్వాలని నిర్ధారించింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి 2024 ఫిబ్రవరి వరకు రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. ఇందులో రెండో దశ కింద చేపట్టిన పనులకు రూ.1,597.56 కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు పోనూ కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం, తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని తేల్చింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్కు జల్ శక్తి శాఖ ప్రతిపాదనలు పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఎన్డీఏలో చేరిన చంద్రబాబు.. ఆ నిధులు ఇస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని బీజేపీ పెద్దల చెవిలో ఊదారు. దాంతో ఆ ప్రతిపాదన పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్ ఆగస్టు 28న ఆమోదం తెలిపింది.నిధుల సంక్షోభం నుంచి గట్టెక్కించిన వైఎస్ జగన్విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టును కమీషన్ల కక్కుర్తితో 2016 సెప్టెంబరు 7న సీఎం చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయం మాత్రమే ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించారు. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని రీయింబర్స్ చేస్తామన్న ప్రతిపాదనకూ తలూపారు. 2013–14 ధరల ప్రకారం పాజెక్టు వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా లెక్కగట్టి.. 2024 ఏప్రిల్ 1 వరకూ ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లు పోనూ మిగతా రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిజానికి 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.55,656.87 కోట్లు. ఇందులో భూసేకరణ, పునరవాసానికే నికే రూ.33,168.23 కోట్లు అవసరం. కానీ.. రూ.15,667.9 కోట్లు ఇస్తే చాలు ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు అంగీకరించడంలో లోగుట్టు కమీషన్లే. ముడుపుల కోసం ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి ప్రాజెక్టును చంద్రబాబు విధ్వసం చేయడమే కాదు.. నిధుల సంక్షోభంలోకి కూడా నెట్టారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులను పరుగులు పెట్టించారు. ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు నిర్వాకాలను కేంద్రానికి వివరించారు. తాజా ధరల ప్రకారం నిధులిస్తేనే పోలవరాన్ని పూర్తి చేయడానికి సాధ్యమవుతుందన్న వైఎస్ జగన్ ప్రతిపాదనతో ప్రధాని మోదీ ఏకీభవించారు. ఇలా తాజా ధరల మేరకు నిధులు ఇచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించడం ద్వారా నిధుల సంక్షోభం నుంచి పోలవరాన్ని వైఎస్ జగన్ గట్టెక్కించారు.» గతేడాది జూన్ 5నే తొలి దశ, డయాఫ్రం వాల్కు రూ.12,911 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం» ఈ వివరాలను సమగ్రంగా పీపీఏ ద్వారా పంపండి» అప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏలో చేరిన చంద్రబాబు చేపట్టాల్సిన పనులు, వాటికయ్యే వ్యయాన్ని ఖరారు చేస్తాం» పోలవరానికి ఆ నిధులిస్తే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని విన్నపం» రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ వెల్లడి» దాంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టిన కేంద్ర కేబినెట్» రూ.12,157.53 కోట్లు విడుదలకు మార్చి 6న కేంద్ర కేబినెట్కు జలశక్తి శాఖ ప్రతిపాదన» అదే ప్రతిపాదనపై ఆగస్టు 28న ఆమోదం -
ఏపీకి పోలవరం జీవనాడి
-
‘కెన్–బెట్వా’లానే పోలవరం పరుగెత్తేది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రం చేపట్టి ఉంటే.. ఈ పాటికి ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు కేంద్రం శరవేగంగా పూర్తి చేస్తున్న కెన్–బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టే ఉదాహరణ అని అధికార వర్గాలు సైతం ఉదహరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం 2022–23, 2023–24లో రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. 2024–25 బడ్జెట్లో రూ.4000 కోట్లు కేటాయించి.. 2030 నాటికి పూర్తి చేసేలా శరవేగంగా అడుగులు వేస్తోంది. అంటే.. కెన్–బెట్వా అనుసంధానం ప్రాజెక్టుకు ఏడాదికి సగటున రూ.4,552.50 కోట్లు ఖర్చు చేసినట్లు స్పష్టమవుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం 2014–15 నుంచి ఇప్పటి వరకు పదేళ్లలో రూ.15,146.27 కోట్లు విడుదల చేసింది. అంటే.. ఏడాదికి కేవలం రూ.1,514.62 కోట్లు మాత్రమే ఇచ్చింది. కమీషన్ల కక్కుర్తితో నిర్మాణ ప్రోటోకాల్ను తుంగలో తొక్కిన చంద్రబాబు.. ఇష్టారాజ్యంగా పనులు చేపట్టడంతో పోలవరం ప్రాజెక్టులో విధ్వంసం చోటుచేసుకుంది. అంతర్జాతీయ నిపుణుల కమిటీ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. ఓ వైపు విధ్వంసం.. మరో వైపు నిధుల సమస్యతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఈ పాపమంతా ఆయనదేనని నీటి పారుదల రంగ నిపుణులు, అధికారులు స్పష్టం చేస్తున్నారు.కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టు ఇలాకెన్–బెట్వా నదుల్లోని మిగులు జలాలను మళ్లించి మధ్యప్రదేశ్లో 8.11 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్లో 2.51 లక్షల హెక్టార్లు వెరసి 10.62 లక్షల హెక్టార్లకు సాగునీరు, 62 లక్షల మందికి తాగునీరు (మధ్యప్రదేశ్లో 41 లక్షలు, ఉత్తరప్రదేశ్లో 21 లక్షలు) అందించేలా ఎన్డబ్ల్యూడీఏ(జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ) అనుసంధానం ప్రాజెక్టును ప్రతిపాదించింది. కేంద్రప్రభుత్వ సారథ్యంలో అనుసంధాన పనులు చేపట్టడానికి అంగీకరిస్తూ 2021 మార్చి 22న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో 90 శాతం కేంద్రం, పది శాతం(ఆయకట్టు, తాగునీరు ఆధారంగా దామాషా పద్ధతిలో) రాష్ట్రాలు భరించేలా ఒప్పందం కుదిరింది. ప్రాజెక్టు అంచనా వ్యయం 2021 డిసెంబర్ ధరల ప్రకారం రూ.44,605 కోట్లు. ఇందులో కేంద్రం వాటా రూ.39,317 కోట్లు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ల వాటా రూ.5,293 కోట్లు. ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం 2022 ఫిబ్రవరి 11న స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ)గా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్టు అథారిటీ (కేబీఎల్పీఏ)ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ సారథ్యంలో పనులు చేపట్టింది. 2022–23, 2023–24లో ప్రాజెక్టు పనుల కోసం రూ.9,105.01 కోట్లు ఖర్చు చేసింది. 2024–25 బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. 2030 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, ఆయకట్టుకు నీళ్లందించేలా పనులను వేగవంతం చేసింది. నదుల అనుసంధానంలో ఇదే మొదటి ప్రాజెక్టు.కమీషన్ల కోసం చట్టాన్ని తుంగలో తొక్కిన వైనంరాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం.. వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం సెక్షన్–90లో స్పష్టంగా పేర్కొంది. ఆ చట్ట ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఎస్పీవీగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని 2014 మే 28న ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ.. 2014 జూన్ 8 నుంచే కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికే అప్పగించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టేందుకు అంగీకరించడంతో 2016 సెప్టెంబరు 7న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రం.. రాష్ట్రానికి అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014 ఏప్రిల్ 1 నాటికి నీటి పారుదల విభాగం పనుల్లో మిగిలిన పనులకు అయ్యే వ్యయం రూ.15,667.90 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పినదానికీ చంద్రబాబు తలూపారు.ప్రాజెక్టు పనులకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే.. ఆ తర్వాత రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకూ అంగీకరించారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న చంద్రబాబు.. కమీషన్ల కోసం ప్రాజెక్టు నిర్మాణ ప్రోటోకాల్ను తుంగలో తొక్కారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్ వే ను పునాది స్థాయిలోనే వదిలేసి.. ప్రధాన డ్యామ్ పునాది డయా ఫ్రమ్ వాల్ పూర్తి చేసి చంద్రబాబు చారిత్రక తప్పిదం చేశారు. ఇది చాలదన్నట్టు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులు చేపట్టి.. వాటిని పూర్తి చేయలేక ఇరు వైపులా ఖాళీ ప్రదేశాలు వదిలేసి చేతులెత్తేశారు. దాంతో.. 2019, 2020లో గోదావరికి వచ్చిన భారీ వరదలు కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా అధిక ఉధృతితో ప్రవహించడం వల్ల డయా ఫ్రమ్ వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై భారీ అగాధాలు ఏర్పడ్డాయి. ఈ విధ్వంసానికి చంద్రబాబు సర్కార్దే పాపమని అంతర్జాతీయ నిపుణుల కమిటీ తేల్చి చెబుతూ ఈ నెల 12న సీడబ్ల్యూసీ, పీపీఏకు నివేదిక ఇచ్చింది. ఈ విధ్వంసం వల్లే పోలవరం పనుల్లో జాప్యం చోటు చేసుకుంటోంది. ప్రాజెక్టు నిర్మాణానికి 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,761.74 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం రూ.15,146.27 కోట్లు రీయింబర్స్ చేసింది. మరో రూ.1615.47 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది.జీవనాడిని గాడిలో పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో పోలవరం పనుల్లో చంద్రబాబు చేసిన తప్పులను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సరిదిద్దుతూ ప్రాజెక్టును గాడిలో పెట్టింది. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి.. 2021 జూన్ 11నే స్పిల్ వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున గోదావరి ప్రవాహాన్ని మళ్లించి వైఎస్ జగన్ రికార్డు సృష్టించారు. ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో పునాది డయా ఫ్రమ్ వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్.. జలాశయాన్ని కుడి, ఎడమ కాలువలతో అనుసంధానం చేసే కనెక్టివిటీస్, ఎడమ కాలువలో వరాహ అక్విడెక్టు సహా కీలకమైన పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న డయా ఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని తేల్చితే ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేస్తామంటూ 2022 డిసెంబర్ నుంచి కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికే రూ.33 వేల కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో 2013–14 ధరల ప్రకారం రూ.15,667.90 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని వైఎస్ జగన్ చెప్పిన వాస్తవాలతో ప్రధాని మోదీ ఏకీభవించారు. తాజా ధరల మేరకు ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేలా వైఎస్ జగన్ కేంద్రాన్ని ఒప్పించి నిధుల సమస్యను తప్పించారు. వైఎస్ జగన్.. వరద ప్రవాహాన్ని మళ్లించే పనులతోపాటు ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేసిన నేపథ్యంలో ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయా ఫ్రమ్ వాల్తో పాటు ప్రధాన డ్యామ్ పనులు చేపట్టడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకుండా, విధ్వంసం సృష్టించకుండా ఉండి ఉంటే.. 2022 డిసెంబర్ నాటికే పోలవరాన్ని వైఎస్ జగన్ పూర్తి చేసి ఉండే వారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
ఎల్లో మీడియా డ్రామా.. తుస్సుమనిపించిన అధికారులు
తూర్పుగోదావరి, సాక్షి: ధవళేశ్వరంలో పొలవరం ఆర్ అండ్ ఆర్ కార్యాలయం వద్ద ఫైల్స్ దగ్ధం అంటూ ఉద్దేశపూర్వక కథనాలతో ఎల్లో మీడియా హడావిడి చేసింది. అయితే దీనిపై అధికారులు వివరణ ఇచ్చి గాలి తీసేశారు. అవి ఫైల్స్ కావని, పనికిరాని కాగితాలని, వాటి మీద వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని అధికారులు వివరణ ఇచ్చారు.‘‘పోలవరం ఎల్ఎంసీ కార్యాలయంలో బీరువాల్లో నిరుపయోగమైన కాగితాలను మాత్రమే బయటపడేశాం. ఈ పేపర్లు ఆర్ అండ్ ఆర్ కు ఏ మాత్రం సంబంధించినవి కావు. సిబ్బంది తగలబెట్టిన కాగితాలు ఉపయోగం లేనివి మాత్రమే. అని ఆర్ అండ్ ఆర్ స్పెషల్ కలెక్టర్ సరళ తెలిపారు. అయితే పనికి రానివే అయినా అలా తగలబెట్టడం కరెక్ట్ కాదని ఆర్డీవో కేఎన్ జ్యోతి అంటున్నారు. ‘‘అవి ముమ్మాటికీ నిరుపయోగమైనవే. అవి ఫైల్స్ కావు. అన్ని సైన్ లేని జిరాక్స్ కాపీలు మాత్రమే. కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్నాయని బయటపడేసి దహనం చేశారు. అయితే అలా నిరుపయోగమైన కాగితాలను సైతం బహిరంగంగా కాల్చకూడదు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తాం. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఆర్డీవో జ్యోతి తెలిపారు.అనుమానాస్పద రీతిలో కాలి బూడిదైన ఫైల్స్ అంటూ.. సగం కాలిన పేపర్ల ఫొటోలతో ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర కూటమి అనుకూల మీడియా ఛానెల్స్ కథనాలు ఇచ్చాయి. అవి పోలవరం ఎడమ కాలువ భూ పరిహారం ఫైల్స్ అంటూ అందులో రాసుకొచ్చాయి. అధికారులు విషయం బయటకు చెప్పట్లేదని.. పోలీసులు వచ్చారంటూ ఊదరగొట్టాయి. ఈలోపు.. మీడియా ముందుకు వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్స్కు భద్రత లేకుండా పోయిందని.. వైఎస్సార్సీపీ హయాంలోని ఫైల్సే తగలబడి పోతున్నాయంటూ అసలు విషయం తెలియకుండా ఓ స్టేట్మెంట్ ఇచ్చేశారు. చివరకు అధికారుల వివరణతో ఎల్లో మీడియా డ్రామా అంతా ఉత్తదేనని తేలింది. -
కాలువ గట్లు గుల్ల!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లాలో కూటమి నేతలు పోలవరం కాలువ గట్లను గుల్ల చేస్తున్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు యంత్రాలతో కాలువ గట్లను తవ్వి మట్టి తరలిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ద్వారకా తిరుమల, ఉంగుటూరు మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో కాలువ గట్లను సగానికి పైగా తవ్వేశారు. అవసరమైతే మట్టి తరలించడానికి సొంతంగా రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. అయినా ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు కాలువ వైపు కన్నెత్తి చూడటం లేదు. అడ్డగోలు తవ్వకాలు ఇలా...ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులపల్లి, పంగిడిగూడెం, గుళ్లపాడులో టీడీపీ నాయకులు భారీగా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఎం. నాగు లపల్లిలో పోలవరం కుడి కాలువ గట్టును దాదాపు సగం తవ్వేశారు. దీంతో కాలువ పటిష్టతపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండటంతో వారం రోజులుగా తవ్వకాలు ఆపారు. గుళ్లపాడులో మాత్రం యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి రోజూ 100 నుంచి 130 వరకు టిప్పర్లు, 50కి పైగా ట్రాక్టర్లలో ఏలూరుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు మట్టిని తరలిస్తున్నారు. ఉంగుటూరు మండలం కంసాలిగుంటలో పోలవరం ఎడమ గట్టును తవ్వి మట్టిని తరలించేందుకు జనసేన నాయకుడు ఏకంగా రోడ్డు నిర్మించాడు.రూ.కోట్లలో ఆదాయంప్రభుత్వం అనుమతి పొందిన చోట మట్టి తవ్వకాల కోసం ఒక క్యూబిక్ మీటర్కు మైనింగ్ శాఖకు రూ.120, ఇరిగేషన్ శాఖకు రూ.110 చొప్పున మొత్తం రూ.230 చెల్లించాలి. టిప్పర్కు 18 క్యూబిక్ మీటర్ల వరకు మట్టి లోడ్ చేసి విక్రయిస్తున్నారు. ఈ లెక్కన క్యూబిక్ మీటరుకు రూ.230 చొప్పున ఒక లారీకి రూ.4,140 ప్రభుత్వానికి చెల్లించాలి. కానీ పైసా ఫీజు చెల్లించకుండానే అక్రమంగా పోలవరం కాలువ గట్లు తవ్వి వందలాది టిప్పర్లలో రోజూ మట్టిని తరలించి కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. -
పోలవరం మట్టిన పందికొక్కుల్లా తినేస్తున్నారు
-
చేతులెత్తేసిన ప్రభుత్వం.. జగన్ సీఎంగా ఉన్నప్పుడే బాగుండేది
-
జీవనాడికి జీరో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును గతంలో చంద్రబాబు చేసిన పాపాలు వెంటాడుతున్నాయనేందుకు తాజా బడ్జెట్లో కేంద్రం ఒక్క పైసా కూడా కేటాయించకపోవడమే నిదర్శనం. జల్ శక్తి శాఖకు కేంద్రం బడ్జెట్లో రూ.21,323.10 కోట్లు కేటాయించింది. గతేడాది కంటే రూ.1,806.18 కోట్లు జల్ శక్తి శాఖకు అదనంగా కేటాయించినా పోలవరానికి పైసా కూడా విదల్చలేదు. ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి సహకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నప్పటికీ నిధులు కేటాయించకపోవడానికి మాత్రం గతంలో చంద్రబాబు చేసిన పాపాలే కారణం. కమీషన్ల దాహంతో ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టి మరీ 2016 సెప్టెంబరు 7వతేదీ అర్ధరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు దక్కించుకున్నారు. 2013–14 ధరలతోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పారు. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని పెట్టిన ఖర్చును రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు తలూపారు. ఫలితంగా 2017–18 నుంచి బడ్జెట్లో పోలవరానికి కేంద్రం నిధులు కేటాయించడం లేదు.నిధుల గండంపోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులకు సంబంధించి తొలుత పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)కు వివరాలు సమర్పిస్తే పరిశీలించి సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)కి పంపుతుంది. సీడబ్ల్యూసీ వాటిని మదింపు చేసి కేంద్ర జల్ శక్తి శాఖకు పంపుతుంది. జల్ శక్తి శాఖ మరోసారి తనిఖీ చేసి కేంద్ర ఆర్థిక శాఖకు నివేదిస్తుంది. ఆర్థిక శాఖ సంతృప్తి చెందితే బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు సేకరించి ఎన్డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా ఏపీ ప్రభుత్వానికి రీయింబర్స్ చేయాలని నాబార్డును ఆదేశిస్తుంది. ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం వల్ల పోలవరానికి నిధుల సమస్య ఉత్పన్నమైంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై వడ్డీల రూపంలో పెను భారం పడుతోంది. అదే బడ్జెట్ ద్వారా కేటాయింపులు చేసి ఉంటే ఎలాంటి నిధుల సమస్య ఉత్పన్నమయ్యేది కాదని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.చారిత్రక తప్పిదాలే శాపంవిభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం వ్యయాన్ని భరించి తామే పూర్తి చేస్తామని విభజన చట్టం ద్వారా హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేసేందుకు 2014 మే 28న కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని ఏర్పాటు చేసింది. పీపీఏతో ఒప్పందం చేసుకుంటే ప్రాజెక్టు పనులు చేపడతామని నాడు చంద్రబాబు సర్కారుకు సూచించింది. కేంద్రమే కట్టాల్సిన పోలవరాన్ని తన బినామీలకు ఇప్పించుకునేందుకు నిర్మాణ బాధ్యతలు దక్కించుకున్న చంద్రబాబు చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డారు. 2014 ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని, బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చును తిరిగి చెల్లిస్తామని కేంద్రం విధించిన షరతులకు తలొగ్గారు. రూ.12,157.52 కోట్లకు మోకాలడ్డుపోలవరం పనులను దక్కించుకున్నాక కమీషన్లు వచ్చే పనులనే చంద్రబాబు చేపట్టారు. గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్వే కట్టకుండా ప్రధాన డ్యామ్ గ్యాప్–2లో డయాఫ్రమ్వాల్ నిర్మించి మరో చారిత్రక తప్పిదం చేశారు. ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాల గుండా 2019, 2020లో గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడంతో డయాఫ్రమ్వాల్ కోతకు గురై దెబ్బతింది. ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటు చేసుకుంది. అనంతరం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆ తప్పిదాలను సరిదిద్ది కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేసి 2021 జూన్ 11నే గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా 6.1 కి.మీ. పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యామ్తోపాటు ప్రధాన డ్యామ్ గ్యాప్–1లో డయాఫ్రమ్వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యామ్ నిర్మించారు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022 డిసెంబర్ నాటికే వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని అధికార వర్గాలు పలు దఫాలు స్పష్టం చేశాయి. బడ్జెట్ ద్వారా పోలవరానికి నిధులు విడుదల చేయాలన్న వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు 2021–22లో రూ.320 కోట్లు ఇచ్చిన కేంద్రం.. ఆ తర్వాత చంద్రబాబు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయడం లేదు. దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్ వ్యయాన్ని భరించడంతోపాటు తాజా ధరల మేరకు పోలవరానికి నిధులు ఇచ్చేలా కేంద్రాన్ని వైఎస్ జగన్ ఒప్పించారు. ఈ క్రమంలోనే తొలి దశ పనుల పూర్తికి రూ.12,157.52 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర కేబినెట్కు గత మార్చి 6న జల్ శక్తి శాఖ ప్రతిపాదన పంపింది. అప్పటికే ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు ఆ నిధులు మంజూరు చేస్తే రాజకీయంగా తనకు ఇబ్బందులు వస్తాయంటూ కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పక్కన పెట్టింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తేనే తొలి దశ పనులకు రూ.12,157.52 కోట్ల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. పోలవరం ప్రాజెక్టు పనుల వ్యయం (రూ.కోట్లలో)2017–18 ధరల ప్రకారం అంచనా వ్యయం55,656.87జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు చేసిన వ్యయం 4,730.71జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టు వ్యయం 4,124.64జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక నీటి పారుదల విభాగం కింద కేంద్రం ఇవ్వాల్సింది 46,801.52జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకూ కేంద్రం ఇచ్చింది 15,146.282017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు పూర్తికి ఇంకా అవసరమైన నిధులు 31,655.24 -
ఏపీకి మొండి చేయి.. చంద్రబాబు అట్టర్ ఫ్లాఫ్
-
పోలవరం ప్రాజెక్టు జాప్యానికి చంద్రబాబు పాపాలే కారణం..
-
చంద్రబాబు శ్వేతపత్రం వెనుక అసలు నిజం
-
పోలవరం కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు.. మరి మీరు ఎందుకు తీసుకున్నారు?
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టు విషయంలో తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. అబద్ధాలు, అసత్యాలతో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడాన్ని తూర్పారబట్టారు అంబటి రాంబాబు.ఈ మేరకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారంపై ఆధారాలతో సహా మీడియాకు వివరించారు అంబటి.అసలు స్పిల్వే చానల్ పూర్తి కాకుండా, అప్రోచ్ చానల్ పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యామ్ను ప్రారంభించి డయా ఫ్రం వాల్ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమన్నారు. దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టుని మీరు ఎందుకు వారి దగ్గర్నుంచి తీసుకున్నారని అంబటి ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్టుకు నిధులను ముందు రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందని, ఆపై మీరు ఇవ్వమని 2013-14 రేట్లతో 2016వ సంవత్సరంలో అంగీకరించడం ద్రోహం, చారిత్రాత్మక తప్పిదం కాదా? అని నిలదీశారు. 2018 సంవత్సరానికే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి చంద్రబాబు అపరభగీరథుడు అనిపించుకునే ప్రయత్నం చేసి.. ఇప్పుడు ఆ తప్పులను మా మీద రుద్దే యత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాపై మీరు చేస్తున్న విమర్శలు చూస్తుంటే ఆ ప్రాజెక్టును మీరు పూర్తి చేసేటట్లు లేరనే విషయం అర్థం అవుతుందని, మళ్లీ జగనే దాన్ని పూర్తి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.అంబటి రాంబాబు ఏమన్నారంటే...మా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో చిన్న తప్పుకూడా జరగలేదువైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదుకరోనా సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు ఆగలేదుజగన్ అంటే భయం కాబట్టే చంద్రబాబు దూషిస్తున్నారుముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు అహం పెరిగిందిపోలవరంపై చంద్రబాబుకు శ్రద్ధ లేదుపోలవరం ప్రాజెక్టు విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కృషి వెలకట్టలేనిదిఆయన హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక అనుమతులొచ్చాయివైఎస్సార్ ఎన్నో అనుమతులు తీసుకొచ్చారువైఎస్సార్ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమైందిపోలవరం ప్రాజెక్టు అంత తేలికగా అర్థం కాదు కాబట్టే చాలా స్టడీ చేసి నిర్ణయానికి వచ్చాంపదేపదే జగన్ను దూషించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారుఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకోవాలని జగన్ అంటే బాబుకు భయంమీరు చేసిన తప్పిదాల వల్లే పోలవరం సర్వనాశనం అయ్యిందనే విషయాన్ని కచ్చితంగా నిరూపించగలందీనికి సంబంధించి నిపుణులను కనుక్కోండివాస్తవం ఏంటో చెప్పండి అని అడగండిడయా ఫ్రమ్ వాల్ ఎందుకు కొట్టుకుపోయిందో అడగండిమీకు చెప్పడానికి వారు భయపడతారు కూడా.. ఎందుకంటే మీరు నాల్గోసారి ముఖ్యమంత్రి కాబట్టిబాబు హయాంలోనే డయా ఫ్రం వాల్ కొట్టుకుపోయిందిపదే పదే దూషిస్తూ జగన్పై నింద వేసే ప్రయత్నం చేస్తున్నారువైఎస్సార్ కలలుగన్న ప్రాజెక్టు కాబట్టే పూర్తి తపనతో పని చేశాంచంద్రబాబు చేసిన తప్పులు వల్లే పోలవరం ప్రాజెక్ట్ నాశనంప్రోటోకాల్ పాటించకపోవడం వల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యంపోలవరం జాతీయ ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందిఅసలు కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేపట్టింది..దీనికి సమాధానం చెప్పండిఈ ప్రాజెక్టు మీరు తీసుకోవడానికి గల కారణాలేంటి?కమీషన్లు కొట్టేయడానికే తీసుకున్నారువేల కోట్ల ప్రాజెక్టు కాబట్టే కేంద్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది.జాతీయ ప్రాజెక్టు అయినటువంటి పోలవరాన్ని నీ కరప్షన్ కోసం తీసుకోవడం జరిగిందనే విషయం అందరికీ తెలుసుకాంట్రాక్టర్లకు ఎక్కువ సొమ్ముకు ప్రాజెక్టును ఇచ్చావంటే దాంట్లో అర్థమేంటిఅందులో కమీషన్లు కొట్టేదామనే కదా చంద్రబాబుఇది ఏ కాంట్రాక్టర్కైనా అర్థమవుతుందిడబ్బులు కాజేయడం కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తీసుకున్నాడని ఆనాటి ప్రధాని, ఇప్పటి ప్రధాని, మీ సహచరుడు నరేంద్ర మోదీనే చెప్పారుపోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని మోదీనే వ్యాఖ్యానించారంటే అందులో అర్థమేంటి? -
జగన్ పై నింద మోపే ప్రయత్నం... అబద్ధాలు, అర్ధసత్యాలతో పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రం
-
పోలవరం లో చారిత్రాత్మక తప్పిదాలు కళ్ళకు కట్టినట్టు వివరించిన అంబటి
-
జీవనాడి సాక్షిగా నిజాలు గోదాట్లోకి
సాక్షి, అమరావతి: పోలవరం సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు వాస్తవాలను గోదాట్లో కలిపేశారు. 2014–19 మధ్య అధికారంలో ఉండగా కమీషన్లకు ఆశ పడి తాను చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టులో జరిగిన విధ్వంసం.. ఫలితంగా పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెడుతూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు. చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతూ.. కరోనా లాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తిచేసి 2021 జూన్ 11నే గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిమీల పొడవున వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేయకుండా ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్–2లో 1,396 మీటర్ల పొడవున డయాఫ్రమ్వాల్ నిర్మించడం ద్వారా చంద్రబాబు సర్కార్ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని.. ఆ తప్పు జరిగి ఉండకపోతే 2022 నాటికే అప్పటి సీఎం వైఎస్ జగన్ పోలవరాన్ని పూర్తి చేసి ఉండేవారని సాగునీటిరంగ నిపుణులు, అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు తొలిసారిగా పోలవరం పనులను సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. చారిత్రక తప్పిదంతో కోతకు గురైన డయాఫ్రమ్ వాల్⇒ విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిర్మించాల్సిన పోలవరాన్ని కమీషన్లకు ఆశ పడి దక్కించుకున్న చంద్రబాబు సర్కార్ ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళికను తుంగలో తొక్కింది. సులభంగా చేయగలిగి, కాంట్రాక్టర్లకు అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యత ఇచ్చింది. ⇒ ప్రపంచంలో ఎక్కడైనా వరదను మళ్లించేలా స్పిల్వే, కాఫర్ డ్యామ్లు కట్టాకే ప్రధాన డ్యామ్ పనులు చేపడతారు. 2014–19 మధ్య పోలవరంలో చంద్రబాబు సర్కార్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. గోదావరి వరదను మళ్లించే స్పిల్వే పునాది స్థాయి కూడా దాటలేదు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను ప్రారంభించనే లేదు. కానీ.. డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రమ్వాల్ పనులను 2017లో ప్రారంభించి 2018 జూన్ 11 నాటికి పూర్తి చేశారు. 35 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పింస్తామంటు హామీ ఇచ్చి 2018 నవంబర్లో ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను ప్రారంభించారు. ఇదే ప్రధాన డ్యామ్గా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించారు. ⇒ 2019 ఫిబ్రవరి నాటికి కూడా నిర్వాసితులకు పునరావాసం కల్పింంచకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ, సీడబ్ల్యూసీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్త⇒ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్ల పనులు చేయాలని ఆదేశించింది. అయితే పునరావాసం కల్పింంచలేక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేసి పనులు ఆపేశారు. ⇒ 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడంతో అదే ఏడాది మే 30న సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. జూన్ రెండో వారంలోనే గోదావరికి వరద ప్రారంభమైంది. అంటే.. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టడానికి, గోదావరి వరద ప్రారంభం కావడానికి మధ్య కేవలం 10 నుంచి 12 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ వ్యవధిలో కాఫర్ డ్యామ్లలో ఖాళీ ప్రదేశాలను భర్తీ చేయడం ఎలా సాధ్యమన్నది చంద్రబాబే చెప్పాలి. ⇒ గోదావరికి 2019లో భారీగా వరదలు వచ్చాయి. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 2.4 కి.మీ. వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. కాఫర్ డ్యామ్లు వదిలిన 800 మీటర్ల ఖాళీ ప్రదేశానికి కుచించుకుపోయి ప్రవహించాల్సి రావడంతో వరద ఉద్ధృతి పెరిగి డయాఫ్రమ్వాల్లో నాలుగు చోట్ల కోతకు గురై 485 మీటర్ల పొడవున దెబ్బతింది. ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై గ్యాప్–1లో 35 మీటర్ల లోతు, గ్యాప్–2లో 26 నుంచి 36.50 మీటర్ల లోతుతో కూడిన అగాధాలు ఏర్పడ్డాయి. ⇒ వీటిన్నింటినీ అధ్యయనం చేసిన ఐఐటీ–హైదరాబాద్, నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ సంస్థలు మానవ తప్పిదం వల్లే పోలవరంలో విధ్వంసం చోటుచేసుకుందని తేల్చి చెప్పాయి. అంటే ఆ తప్పిదం చేసింది చంద్రబాబేనని తేల్చాయని సాగునీటిరంగ నిపుణులు పేర్కొంటున్నారు. విధ్వంసం వల్లే పనుల్లో జాప్యంనాడు చంద్రబాబు చారిత్రక తప్పిదాన్ని వైఎస్ జగన్ అధికారంలో ఉండగా సరిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు. కేంద్ర జల్శక్తి శాఖ, పీపీఏ, సీడబ్ల్యూసీ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు సర్కార్ నిబంధనలకు విరుద్ధంగా నామినేషన్ పద్ధతిలో నవయుగకు అప్పగించిన రూ.2,917 కోట్ల విలువైన కాంట్రాక్టు ఒప్పందాన్ని 2019 జూలైలో వైఎస్ జగన్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. తద్వారా ఖజానాకు రూ.783.44 కోట్లు ఆదా చేశారు. గోదావరి వరద తగ్గాక 2019 నవంబర్లో వడివడిగా పనులు ప్రారంభించారు. అయితే 2020 మార్చి నుంచి 2021 చివరి వరక కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోన గోదావరి వరదను మళ్లించేలా స్పిల్వేను 48 గేట్లు బిగించడంతో సహా ఎగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ చానల్ను పూర్తి చేశారు. 2021 జూన్ 11న గోదావరి వరదను స్పిల్వే మీదుగా 6.1 కి.మీ.ల పొడవున మళ్లించారు. దిగువ కాఫర్ డ్యామ్లో కోతకు గురైన ప్రాంతాన్ని సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు చేపట్టి పూర్తి చేశారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి కావడంతో ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో చేరిన నీటిని తోడివేసి వరదల ఉద్ధృతి వల్ల ఏర్పడిన అగాధాలను సీడబ్ల్యూసీ మార్గదర్శకాల మేరకు ఇసుకతో పూడ్చి వైబ్రో కాంపాక్షన్ చేస్త యథాస్థితికి తెచ్చారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో సమాంతరంగా కొత్తగా డయాఫ్రమ్వాల్ నిర్మించాలా? లేదంటే దెబ్బతిన్న చోట్ల ‘యూ’ ఆకారంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి అనుసంధానం చేయాలా? అనే విషయాన్ని సీడబ్ల్యూసీ తేల్చలేదు. సాంకేతికపరమైన ఈ అంశాన్ని తేల్చితే పనులు చేపట్టి వేగవంతంగా ఈసీఆర్ఎఫ్ పనులు పూర్తి చేస్తామని 2022 డిసెంబర్ నుంచి గత ప్రభుత్వం కేంద్ర జల్శక్తి శాఖ, సీడబ్ల్యూసీని కోరుత⇒ వచ్చింది. డయాఫ్రమ్ వాల్సహా ప్రాజెక్టు డిజైన్లపై కాంట్రాక్టు సంస్థ ఒక అంతర్జాతీయ ఏజెన్సీ సహకారం తీసుకోవాలని, తాము కూడా ఒక అంతర్జాతీయ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని.. రెండు సంస్థలు ఏకాభిప్రాయం వ్యక్తం చేసిన డిజైన్ను ఆమోదించి పనులు చేయాలని సీడబ్ల్యూసీకి చెబుత⇒ వచ్చింది. నాడు చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే విధ్వంసం జరిగేదే కాదని.. ఇప్పుడు పనుల్లో జాప్యానికి అదే కారణమవుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక 2029 నాటికే.. వరదల ప్రభావం వల్ల నవంబర్ వరక⇒ పోలవరం పనులు చేపట్టడానికి సాధ్యం కాదు. డయాఫ్రమ్ వాల్ భవితవ్యాన్ని సీడబ్ల్యూసీ తేల్చితే నాలుగు సీజన్లలో పోలవరాన్ని పూర్తి చేయవచ్చని అధికారులు చెబుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నాటి టీడీపీ సర్కారు తప్పిదాలను వైఎస్ జగన్ చక్కదిద్దినప్పటికీ పోలవరాన్ని 2029 నాటికి గానీ పూర్తి చేయలేమని చంద్రబాబు అంగీకరించారని సాగునీటిరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాఫర్ డ్యామ్ల లీకేజీల పాపం బాబు సర్కార్దే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులు చేపట్టడానికి వీలుగా లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి జెట్ గ్రౌటింగ్ చేయాలి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడం కోసం గోదావరి నదిలో ఇసుక ఫరి్మయబులిటీ విలువను 2018లో అప్పటి కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ తప్పుగా మదింపు చేసింది. దాన్నే పరిగణనలోకి తీసుకుని 30 నుంచి 35 మీటర్ల లోతువరక⇒ స్టోన్ కాలమ్స్ వేసి జెట్ గ్రౌటింగ్ చేయకుండా కేవలం 20 మీటర్ల లోతు వరక⇒ జెట్ గ్రౌటింగ్ చేసేలా డిజైన్లు రూపొందించింది. నవయుగ సంస్థ ఆ మేరకే జెట్ గ్రౌటింగ్ చేసి కాఫర్ డ్యామ్ల నిర్మాణం చేపట్టింది. జెట్ గ్రౌటింగ్ నిబంధనల మేరకు చేసి ఉంటే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లలో లీకేజీ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తన హయాంలో జరిగిన ఈ తప్పిదాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేందుకు సీఎం చంద్రబాబు యతి్నంచడం గమనార్హం. రూ.12,157.53 కోట్లకు మోకాలడ్డు పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకునే క్రమంలో 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేస్తానని 2016 సెపె్టంబరు 7న చంద్రబాబు కేంద్రానికి హామీ ఇచ్చారు. 2013–14 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లే. ఇందులో 2014 ఏప్రిల్ 1 వరకు చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లుపోను మిగతా రూ.15,667 కోట్లే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే 2017–18 ధరల ప్రకారం పునరావాసం, భూసేకరణ వ్యయమే రూ.33,168.23 కోట్లు ఉంది. అందువల్ల రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని, తాజా ధరల మేరకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని 2019 మే 30 నుంచి పలుదఫాలు ప్రధాని మోదీని అప్పటి సీఎం వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. దానికి ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని ఆదేశాల మేరకు తొలి దశ పూర్తికి రూ.12,157.53 కోట్లు అవసరమని కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చింది. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని మార్చి 6న కేంద్ర కేబినెట్కు ప్రతిపాదన పంపింది. అప్పటికే బీజేపీతో పొత్తు కుదరడంతో పోలవరానికి నిధుల విడుదల ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ ముందు పెట్టవద్దని, తమకు రాజకీయంగా ఇబ్బందులు వస్తాయంటూ చంద్రబాబు అడ్డుపుల్ల వేశారు. దీంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ ఆ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేయలేదు. ప్రస్తుతం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఆ ప్రతిపాదనపై కేంద్ర కేబినెట్తో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య తీరుతుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సాంకేతిక సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం సీడబ్ల్యూసీ ద్వారా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేయడం ద్వారా ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని సాగునీటిరంగ నిపుణులు సూచిస్తున్నారు. -
మారని చంద్రబాబు తీరు.. పోలవరం కట్టుకథలపై వైఎస్సాఆర్సీపీ కౌంటర్
ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నేతలు స్పందించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ను సందర్శించిన అనంతరం వాస్తవాలను మాట్లాడకుండా ఏవో కట్టు కథలు చెప్పడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ను 72 శాతం పూర్తి చేశాం. డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు.ఈ ప్రాజెక్ట్పై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం. అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం పూర్తికి 4 ఏళ్ళు పడుతుందని అధికారులు అంటున్నారు’ అని చంద్రబాబు మీడియా ముందు మాట్లాడారు. మరి అసలు వాస్తవాలను పక్కనపెట్టిన చంద్రబాబుకు వైఎస్సార్సీపీ నేతలు పలు ప్రశ్నలు సంధించారు.1)ఖర్చు 18శాతం అయితే 72 శాతం ఎలా పూర్తి చేస్తారు?పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారు తెదేపా హయాంలోనే 72 శాతం పూర్తి..డయాఫ్రమ్ వాల్ను గత ప్రభుత్వం కాపాడుకోలేదు.ఈ ప్రాజెక్టుపై నేను వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించాఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణం.అన్నీ సవ్యంగా జరిగితేనే పోలవరం పూర్తికి 4 ఏళ్ళు పడుతుందని అధికారులు అంటున్నారు చంద్రబాబుపోలవరం కోసం బాబు హయాములో రాష్ట్రం పెట్టిన ఖర్చు 10వేల కోట్లు అని ఆంధ్ర జ్యోతి రాసింది. 55 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్ లో 10వేల కోట్లు అంటే 18 శాతం ఖర్చు చేసి 72 శాతము పూర్తి చేశాను అంటే ఎట్లా?2)డయాఫ్రమ్వాల్గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు పూర్తి చేశాక ప్రధాన డ్యామ్ పునాది డయాఫ్రమ్వాల్ నిర్మించాలి. కానీ.. నాటి సీఎం చంద్రబాబు వరద మళ్లింపు పనులు పూర్తి చేయకుండానే ..డయాఫ్రమ్వాల్ పనులను ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలకు నామినేషన్పై సబ్ కాంట్రాక్టుకు అప్పగించారు. పనులు చేసిన ఆ సంస్థలకు రూ.400 కోట్లు బిల్లులు చెల్లించి.. కమీషన్లు వసూలు చేసుకున్నారు.ఆ తర్వాత రూ.2,917 కోట్ల విలువైన పనులను ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు నామినేషన్పై కట్టబెట్టారు. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి కాఫర్ డ్యామ్లు పూర్తి చేయాలని కేంద్రం నిర్దేశించింది. పునరావాసం కల్పించే పనుల్లో కమీషన్లు రావనే నెపంతో ఎగువ కాఫర్ డ్యామ్లో ఒక వైపున 400 మీటర్లు, మరో వైపున 350 మీటర్ల వెడల్పుతో ఖాళీలు పెట్టి, ఆ తర్వాత చేతులెత్తేశారు చంద్రబాబు2019 లో గోదావరి వరద కాఫర్ డ్యామ్ ఖాళీ ప్రదేశాలగుండా అధిక ఒత్తిడితో ప్రవహించడం వల్ల డయాఫ్రమ్వాల్ దెబ్బతింది.దీనికి చంద్రబాబు తప్పిదమే కారణమని హైదరాబాద్ ఐఐటీ నివేదిక ఇచ్చింది.సీఎం జగన్ 2019 మే 30న అధికారం చేపట్టారు. 2019 జూన్లో గోదావరికి వరదలు వచ్చాయి. నవంబర్ వరకూ గోదావరి వరదెత్తింది.వరదలు తగ్గాక ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను సీఎం జగన్ పూర్తి చేశారు. స్పిల్ వే అప్రోచ్ ఛానల్ కూడా జగన్ పూర్తి చేశారు.3)ఈ ప్రాజెక్టును వందసార్లు సమీక్షించారట.. 30 సార్లు సందర్శించారట!కమీషన్ ల కోసం వారం వారం పోలవరం అని మా మీద వత్తిడి తెచ్చాడు బాబు అని పోలవరం కాంట్రాక్టర్ కొడుకు రంగారావు ఇటీవల చెప్పాడు4)ఏజెన్సీలను మార్చడమే ప్రాజెక్టు ఆలస్యానికి కారణమా?మీరు పోలవరం కాంట్రాక్టర్ రాయపాటికి మార్చి రామోజీ వియ్యంకుడు అయిన నవయుగ కు టెండర్ ద్వారా కాకుండా నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టు ఇస్తే ...జగన్ ఓపెన్ టెండర్ పిలిచి రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ కోట్ చేసిన ఆసియా లోనే పెద్ద కంపెనీ అయిన మేఘా ఇంజినీరింగ్ కు ఇచ్చారు5)జగన్ నే సాక్షి లో రాసి పెట్టుకో అని బీరాలు పోలేదా?2018కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇస్తాం అని మీ మీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా చౌదరి నిండు అసెంబ్లీలో కోయలేదా’ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు.. చంద్రబాబు చేస్తున్న అసత్య ప్రచారంపై ధ్వజమెత్తుతున్నారు. -
బాబు మార్క్ కథలు మళ్లీ షురూ..!
బాబు గారు మళ్లీ గళమెత్తారు. తనదైన శైలిలో తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నాలకు మరో దఫా శ్రీకారం చుట్టారు. పోలవరం నిర్మాణం విషయంలో తాను చేసిందంతా సక్రమమేనని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి హోదాలో సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన ఆయన ఆ తరువాత ఓ మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని తేల్చేశారు. డయాఫ్రామ్ వాల్ మరమ్మతులకు రూ.2000 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని కూడా ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలోనే కొన్ని సత్యాలకు బోలెడన్ని అసత్యాలు జోడించి గత తప్పులన్నింటినీ కప్పిపెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా.. తప్పు ఇతరులపైకి నెట్టేందుకూ కృషి చేశారు. అయితే 2014-19 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు చేసిన పలు తప్పిదాలు.. తీసుకున్న నిర్ణయాలే పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాకపోయేందుకు కారణమన్నది నిపుణులు చాలామంది చెప్పే విషయం.ప్రాజెక్టు నిర్మాణంలో స్పిల్ వే నిర్మాణం మొదట చేపట్టి ఆ తరువాత అవసరానికి అనుగుణంగా కాఫర్ డ్యామ్ కట్టడం ఇంజినీరింగ్ పద్ధతి. అయితే చంద్రబాబు మాత్రం ముందు కాఫర్ డ్యామ్ కట్టేలా నిర్ణయం తీసుకున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని నిపుణులు చెబుతున్నా పట్టించుకోలేదు. ప్రాజెక్టుకు సంబంధించిన చాలా కీలకమైన నిర్మాణ పనులన్నింటినీ పక్కనబెట్టి ఆఘమేఘాల మీద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేపట్టారు. ఫలితంగా 2020లో వచ్చిన వరదకు కాఫర్ డ్యామ్ బాగా దెబ్బతింది. మళ్లీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాఫర్ డ్యామ్ డిజైన్లను కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ 2017లో తిరస్కరించినా పట్టించుకోని చంద్రబాబు ఫిబ్రవరి నెలలో డయా ఫ్రమ్ వాల్ నిర్మాణానికి, గేట్ల నిర్మాణ పనులు మొదలుపెట్టడం గమనార్హం.కాఫర్ డ్యామ్ ఎత్తును 41 మీటర్ల వరకూ పెంచుకోవచ్చునని జల వనరుల శాఖ అనుమతిచ్చిన తరువాత దిగువభాగంలో ఊటను నియంత్రించేందుకు షీట్ ఫైల్స్ వాడతామని కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ ప్రతిపాదించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి.అయితే ఈ షీట్ ఫైల్స్ ద్వారా ఊటను నియంత్రించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ట్రాన్స్ట్రాయ్ డిజైన్లను తిరస్కరించి కొత్త డిజైన్లను రూపొందించిమని ఆదేశించింది.వాస్తవం ఇలా ఉంటే.. చంద్రబాబు మాత్రం 2019 మే నెలలో గద్దెనెక్కిన జగన్ ప్రభుత్వం కాఫర్ డ్యామ్ (డయాఫ్రమ్ వాల్)ను కాపాడలేకపోయారని విమర్శించడం గమనార్హం.పోలవరం స్పిల్ వే బ్రిడ్జికి సంబంధించి 14 బ్లాకుల్లో ట్రూనియన్ స్తంభాలు విఫలమయ్యాయి. అప్పర్ కాఫర్ డ్యామ్ నిర్మాణం కారణంగా గ్యాప్-1లోని అప్రోచ్ ఏరియా పూర్తిగా దెబ్బతినింది. పైగా ఈ అప్పర్ కాఫర్డ్యామ్ కట్టినందుకు 2019లోనే వరదనీరు స్పిల్ వేను దాటి మరీ ప్రవహించింది. ఫలితంగా అప్పటివరకూ చేపట్టిన స్పిల్ వే ఛానల్ పనులు వృథా అయ్యాయి. స్పిల్ వేలో చేరి నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు దాదాపు రెండు నెలల సమయం పట్టిందంటేనే బాబు గారి నిర్ణయం వల్ల జరిగిన నష్టం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.2019, 2020లలో గోదావరికి వచ్చిన వరదలు ఎగువప్రాంతాల్లోని నీట మునిగేందుకు కారణమయ్యాయి. కాఫర్ డ్యామ్ నిర్మాణం వల్ల వరద నీరు వెనక్కు వెళ్లిపోవడం దీనికి కారణం.2014- 2019 మధ్యకాలంలో పోలవరం నిర్మాణంపై చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కాఫర్ డ్యామ్లు (అప్పర్, లోయర్) నిర్మాణం పూర్తి కాకున్నా... వాటిని తమ ప్రభుత్వ ఘన విజయాలుగా చాటుకున్నారు. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానళ్లలో జరిగిన మార్పులు కూడా బాబుగారి డాంబికాలకు అద్దం పట్టే నిర్ణయాలే.మూల లంక ప్రాంతంలో డంప్ యార్డ్ కోసం ఏడాదికి రెండు పంటలు పండే సుమారు 200 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడమే కాకుండా.. బాధితులకు పరిహారం సైతం చెల్లించలేదు.తొలి పర్యటన నుంచి పక్కా ప్రణాళికతో..2019లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా 2019 జూన్ 20న పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తొలుత వరదను మళ్లించేలా స్పిల్ వేను పూర్తి చేయడం, ఆ తర్వాత ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, సమాంతరంగా నిర్వాసితులకు పునరావాసం, కాఫర్ డ్యామ్ల మధ్య ఈసీఆర్ఎఫ్ను చేపట్టి వరదలోనూ పనులు కొనసాగించడం ద్వారా 2022 నాటికి పూర్తి చేసేలా అదే రోజు కార్యాచరణ రూపొందించారు.ఆలోగా కుడి, ఎడమ కాలువలు, అనుసంధానాలు, డిస్ట్రిబ్యూటరీల పనుల పూర్తికి ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ సర్కారు నామినేషన్ పద్ధతిలో అధిక ధరలకు కట్టబెట్టిన పనులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించడం ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రచార్భాటాలకు దూరంగా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ 2020 ఫిబ్రవరి 28, డిసెంబర్ 14న క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తి చేసేలా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా..!పోలవరం ప్రాజెక్టును గత సీఎం వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానా నుంచే ఇచ్చి, మరొకవైపు నిర్వాసితులకు పునరావసం కల్పించారు. కరోనా కష్టకాలంలోనూ రికార్డు సమయంలో స్పిల్ వే ను పూర్తి చేశారు. సీడబ్యూసీ మార్గదర్శకాల మేరకు దెబ్బతిన్న పనులు సైతం చేపట్టారు.గతేడాది జూలైలో ఎంత పెద్ద వరద వచ్చినా తట్టుకునేలా ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 44 మీటర్లకు పెంచడంతో పాటు దిగువ కాఫర్ డ్యామ్ను పూర్తి చేశారు. -
అక్కడ గాజు గ్లాస్ ముందే పగిలిందా..?
ఎన్నికల ఫలితాల డేట్ దగ్గరపడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలో దిగింది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్ఆర్సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గల్లంతు ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య...వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డాక...టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్కు ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే..వైఎస్ఆర్సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని..జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.పోలవరం నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసినవారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతీ గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటలకొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికివారు గెలుపు తమదే అంటూ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుక బడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా అలలారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రులు నేడు ఆధునిక సౌకరర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ. 665.77 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్ కే ఓటేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్ షాకు తెలుసు. కూటమిలో పార్ట్నర్ కాబట్టే అమిత్ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. పోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్కు ఉంది. పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం..ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందితప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జలల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణచంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చిందిల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడిందిప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారుపయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతు తెలిపారుచట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా.?వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలిచంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణటీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలిబిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది? -
పేరుకే రిజర్వుడు నియోజకర్గం.. పెత్తనమంతా వారిదే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే.. కలిసికట్టుగా పనిచేసుకుంటాం.. జనసేనకు ఇస్తే మేం సహకరిస్తామని టీడీపీ ఇన్చార్జి.. అలాగే టీడీపీకి ఇస్తే సహకరిస్తామని జనసేన నేతలు స్థానికంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీల ముఖ్యులకు చెప్పారు. కట్ చేస్తే.. పోలవరం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. మొదటి రెండు మూడు రోజులు వ్యవహారమంతా బాగానే ఉంది. ఆ తరువాత నుంచి అసలు గొడవకు తెర లేచింది. జనసేన అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలంటూ ఆ పార్టీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కాన్వాయ్ని అడ్డగించి మరీ ఘెరావ్ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. పొత్తులు.. కత్తులు పోలవరంలో పొత్తు పార్టీల్లోని నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు ధృతరాష్ట్ర కౌగిలిలో గడిపిన రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకునే స్థాయికి చేరడం వెనుక ఇద్దరు అభ్యర్థులను నడుపుతున్న రెండు సామాజిక వర్గాలే ప్రధాన కారణమనే చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పోలవరం ఇన్చార్జిగా బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్చార్జిగా చిర్రి బాలరాజు కొనసాగుతున్నారు. పేరుకే ఇది రిజర్వుడు నియోజకవర్గం. జనసేనలో పవన్కళ్యాణ్ సామాజికవర్గం, టీడీపీలో చంద్రబాబు సామాజికవర్గం నేతలదే ఇక్కడ ఆధిపత్యం. రెండు సామాజిక వర్గాల నేతలు ఎవరికి సూచిస్తే ఆయా పార్టీ అభ్యర్థులుగా ఇప్పటివరకు రాజకీయం నడిచింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మొడియం శ్రీనివాస్ 2019లో టికెట్ కోల్పోయారు. 2019లో బొరగం శ్రీనివాస్కు సీటు దక్కగా ఆయన ఓటమి పాలయ్యాడు. అయినా ఇన్చార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలో బాబు సామాజికవర్గ నేతల సహకారంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న చిర్రి బాలరాజు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో పొత్తులతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో పోలవరంలో చిచ్చు రేగింది. పొత్తులకు ముందు వరకు టీడీపీ సీటు కోసం ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్లు ప్రయత్నించారు. జనసేనకే టికెట్ అని ప్రకటించడంతో ఇద్దరూ రెండు రోజుల పాటు హడావుడి చేసి సర్దుకున్నారు. నిరసనల పర్వం జనసేన టికెట్ ఖరారుకు ముందు టీడీపీ దెందులూరు ఇన్చార్జి చింతమనేని ప్రభాకర్, పోలవరం టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి చిర్రి బాలరాజులు జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారు. జనసేన టికెట్ తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అని, ఇబ్బంది లేదని మా ట్లాడుకుని వచ్చారు. ఆ తరువాత రెండు రోజులకు జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించారు. భీమవరంలో అప్పటివరకు టీడీపీ నేతగా ఉన్న పులపర్తి రామాంజనేయులుకు జనసేన కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించిన రీతిలో అవకాశం దక్కుతుందేమోనని బొరగం ఆశ పడ్డారు. అయితే జనసేన నేతకు టికెట్ ఇవ్వడంతో బాబు సామాజికవర్గ నేతల వర్గీయులతో కలిసి బొరగం వర్గీయులు నిరసనలకు తెరతీశారు. ఆ సామాజిక వర్గ నేతల వద్దకు వెళ్లలేం ప్రతి పనికీ పవన్కళ్యాణ్ సామాజికవర్గ నేతల వద్దకు తాము వెళ్లలేమని, అందుకే టికెట్ మార్చి టీడీపీ అభ్యర్థికి ఇవ్వాలంటూ బొరగం వర్గీయులు తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబునాయుడు క్యాంప్ వద్ద ధర్నాకు దిగి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడం పోలవరంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అభ్యర్థి మార్పు ఉంటుందని టీడీపీ బలంగా నమ్ముతుండగా, జనసేన అభ్యర్థి మాత్రం టీడీపీ, బీజేపీ నేతలు ఎవరూ లేకుండానే పది రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్యాదవ్ పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు నిర్వహించిన సభలకు హాజ రుకావడం మరో చర్చగా మారింది. -
నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి
సాక్షి, అమరావతి: చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆదివారం నాడు ఉమ్మడిగా ఒకే వేదిక నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు ఏం మాట్లాడతారోనని రాజకీయ పరిశీలకులతో పాటు రాష్ట్రంలో చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఎందుకటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి నిష్క్రమించాక మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయించారు. ప్రధాని పర్యటన సమయంలో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని ఉద్ధేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... దానికి బదులు ప్రధాని మోదీ సైతం తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారు.. ఈయన ఏమన్నారంటే... 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీనుద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి ► ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి’ –మార్చి 29, 2018న రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు. ► ‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ జీ, మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు’ – ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు ► మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా లేదు. మీకంటే వాళ్లే నయం. కాటన్ దొర ఇచ్చిన నీళ్లయినా తాగుతున్నాం. నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాజకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోయారు – 2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ► ‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి’. – 2018 జూన్ 9న నెల్లూరు సభలో చంద్రబాబు ► ‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్దార్. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయేమో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు’. – 2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు ► ‘కేంద్రం సహకారం అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి టీడీపీకి లేదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారన్నది మీ అందరికీ తెలుసు.‘ ► ‘ఏపీలో పరిస్థితి బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్ర మాదిరిగా ఉంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ది చెందాలన్నది మా ఆలోచన అయితే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు’ – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ. ► దేశం కోసం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెలాంటి బెరుకు లేదు.ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు(చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు.– 2019 మార్చి 2న విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ. ► ‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశా. భయమనేది నా జీవితంలో లేదు’. – 2018లో మార్చి 6 తేదీన విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు. ► ‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ పెట్టలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఎప్పుడైనా మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా? మీరు ఒక్కరే దేశాన్ని కాపాడతారా? ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా? –2018 మార్చి 7న సమావేశంలో చంద్రబాబు. ► ‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’. – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. ► ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు’. – 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు. ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు ► ‘లోకే శ్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం’ ► ‘ప్రజలారా మీరే చెప్పండి. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన ఆయన కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. కానీ ఆయనలాంటి సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. ఇదంతా యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు’ ► ‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నాకంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటారు. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడు తక్కువ చేయలేదు. అవును మీరు సీనియర్. కూటములు మార్చడంలో. కొత్త కూటములు కట్టడంలో. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో. ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. ►‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం’. – 2019 ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. -
మళ్లీ జగనే రావాలి.. పోలవరం నిర్వాసితుల పాదయాత్ర..
-
పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: నాగిరెడ్డి
-
కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్న చంద్రబాబు
-
CM Jagan: ఏపీకి జలాభిషేకం
సాక్షి, గుంటూరు: కడలి పాలవుతున్న నదీ జలాలను బంజరు భూములకు మళ్లించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా దివంగత వైఎస్సార్ జలయజ్ఞం చేపట్టగా ఆయన తనయుడు సీఎం జగన్ ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నారు. ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా జలయజ్ఞం ఫలాలను రైతులకు అందిస్తున్నారు. కోవిడ్, ఆర్థిక ఇబ్బందుల్లోనూ సాగునీటి పనులను పరుగులెత్తించారు.రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 2019, 2020, 2021, 2022 ఖరీఫ్, రబీతో కలిపి ఏటా కోటి ఎకరాలకు సీఎం జగన్ నీళ్లందించారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా రాష్ట్రంలో ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడంతో రైతులు భారీ ఎత్తున పంటలు సాగు చేశారు. రికార్డు స్థాయిలో ధాన్యపు దిగుబడులతో ఏపీని మళ్లీ దేశ ధాన్యాగారం (రైస్ బౌల్ ఆఫ్ ఇండియా)గా సీఎం జగన్ నిలిపారు.♦ వైఎస్సార్ చేపట్టిన సంగం, నెల్లూరు బ్యారేజ్లలో మిగిలిన పనులను సీఎం జగన్ పూర్తి చేసి 2022లో జాతికి అంకితమిచ్చారు.♦ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి నీటిని ఎత్తిపోసి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 77 చెరువులను నింపడం ద్వారా లక్కవరం ఎత్తిపోతల పథకాన్ని సీఎం జగన్ పూర్తి చేసి సెప్టెంబరు 18న జాతికి అంకితం చేశారు.♦ గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్ను పూర్తి చేసి నవంబర్ 30న జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు 20 వేల క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారు.♦ వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగంలో మిగిలిన 2.833 కి.మీ. పనులను 2021 జనవరి 13 నాటికే సీఎం జగన్ పూర్తి చేశారు. రెండో సొరంగంలో మిగిలిన 7.698 కి.మీ.లో 7.506 కి.మీ. పనులు పూర్తయ్యాయి. మిగిలిన 192 మీటర్ల పనులు పూర్తి చేసి సొరంగాలను జాతికి అంకితం చేయనున్నారు. ♦విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కమీషన్ల దాహంతో పోలవరాన్ని నీరుగార్చారు. జగన్ అధికారంలోకి వచ్చాక అప్రోచ్ ఛానల్, స్పిల్వే, స్పిల్ ఛానల్, ఫైలట్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి 2021లో గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా మళ్లించారు. బాబు అవినీతితో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో అగా«దాలను పూడ్చి యధాస్థితికి తెచ్చే పనులను వేగవంతం చేశారు. నీటి పారుదలలో రికార్డు♦ కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.♦ గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.♦ తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. ♦ గత నాలుగున్నరేళ్లలో ఆరు రిజర్వాయర్లలో గరిష్ట స్థాయిలో నీటి నిల్వకు మార్గం సుగమం చేయడం ద్వారా నీటి పారుదల రంగ చరిత్రలో సీఎం జగన్ రికార్డు సృష్టించారు. -
Polavaram: ఏపీ హైకోర్టు నుంచి బదిలీకి సుప్రీం నో
సాక్షి, ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఓ పిటిషన్ వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు సదరు పిటిషన్ను బదిలీ చేయాలన్న కేంద్రం విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. ఏపీ హైకోర్టుకే వెళ్లాలని సూచిస్తూ కేంద్రం వేసిన పిటిషన్ను సోమవారం కొట్టేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఖర్చు భరించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ ఏపీ హైకోర్టులో కాంగ్రెస్ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలంటూ కేంద్రం 2019లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని కేంద్రం తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. దీనికి నిరాకరించిన ధర్మాసనం ఏపీ హైకోర్టుకే వెళ్లాలని సూచిస్తూ.. పిటిషన్ను కొట్టివేసింది. -
పోలవరం ప్రాజెక్టుపై పిచ్చి రాతలు..బయటపెట్టిన కొమ్మినేని
-
నామినేషన్పై అడ్డగోలు లూటీ!
సాక్షి, అమరావతి: అటు పేదలకు పథకాలు అందకూడదు.. ఇటు ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకూడదు!! ఇదీ ఈనాడు దుర్బుద్ధి! ఇదే లక్ష్యంగా అస్మదీయులకు అడ్డగోలుగా.. అంటూ ఓ బురద కథనాన్ని పాఠకులపైకి వదిలింది. ఓ నిర్మాణ కంపెనీకి ప్రభుత్వం అంతులేని మేలు చేస్తోందంటూ రామోజీ అక్కసు వెళ్లగక్కారు. గత సర్కారు హయాంలోనూ ఇదే కంపెనీ కాంట్రాక్టు పనులు చేసిన విషయం ఆయనకు గుర్తులేదా? రామోజీ, యనమల బంధుగణం నవయుగ, పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్పై పనులను దక్కించుకుని అంచనాలు పెంచేసి బిల్లులు కాజేయడం నిజం కాదా? నాటి సీఎం చంద్రబాబు అండతో ప్రజాధనాన్ని కొల్లగొట్టడం రామోజీకి తప్పుగా తోచలేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేపట్టినా వ్యతిరేకించడం దివాళాకోరుతనం కాదా? అయినా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అందుకు అనుగుణంగా పనులు చేపడతాయి. అది కూడా తప్పుబట్టే వారిని ఏమనుకోవాలి? ఈనాడు ఆరోపణ: బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ గ్యారెంటీలా? వాస్తవం: మీడియా ముసుగులో బురద చల్లుతున్న ఇదే రామోజీ గతంలో మధ్యవర్తిత్వం నడిపి పట్టిసీమ, పురుషోత్త పట్నం లాంటి పథకాలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా + 22 శాతంతో అధిక రేట్లకు కట్టబెట్టారు. అప్పుడు ఇదే గుత్తేదారు చంద్రబాబుకు అస్మదీయుడని ఆయనకు ఎందుకు అనిపించలేదు? పోలవరంలో రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్కి నిబంధనలకు విరుద్ధంగా రూ.1,333 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టినప్పుడు రామోజీకి ఫైనాన్స్ కోడ్ గుర్తు రాలేదా? వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అదే పనిని రివర్స్ టెండర్ల ద్వారా 12.60 శాతం తక్కువ వ్యయంతో మేఘా సంస్థకు పారదర్శకంగా కేటాయించి రూ.660 కోట్లను ఆదా చేసింది. 22 శాతం అదనంతో రూ.257.39 కోట్లను చంద్రబాబు లూటీ చేస్తే అది తప్పుకాదా రామోజీ? ఈనాడు ఆరోపణ: అస్మదీయుల బిల్లుల చెల్లింపులకు అడ్డగోలుగా గ్యారెంటీలు వాస్తవం: గత ప్రభుత్వంలోనూ ఇదే కాంట్రాక్టు సంస్థ పట్టిసీమ సహా వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేసింది. మరి రామోజీకి అప్పుడు అంతా సవ్యంగానే కనిపించింది కదా? మేఘా ప్రతిపాదనలకు అధికారులు సై.. వాస్తవం: మేఘా కంపెనీ పోలవరంతోపాటు కీలకమైన వెలిగొండ టన్నెల్ పనులు చేస్తోంది. పోలవరం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖజానా నుంచి రూ.1,319 కోట్లు పోలవరం పనులకు వ్యయం చేసింది. మేఘా దాదాపు రూ.1,200 కోట్ల మేర పనులు చేసింది. పోలవరం పనులు పునఃప్రారంభించే సీజన్ ఆరంభం కావడంతో డబ్బులు రీయింబర్స్ చేయాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించేలోగా పనులను వడివడిగా చేపట్టి కొలిక్కి తేవాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ నేపథ్యంలో మేఘా నిధుల కోసం బ్యాంకుల నుంచి లోన్ తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి కోరింది. ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా షరతులతో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. బ్యాంకు విధించే వడ్డీ తదితర రుసుములను పూర్తిగా మేఘానే భరించాల్సి ఉంటుంది. న్యాయపరమైన అన్ని అంశాలకు సైతం కంపెనీనే బాధ్యత వహించాలి. ఇటువంటి కఠిన షరతుల మధ్య మేఘా ప్రతిపాదన పరిశీలనలో ఉంది. -
పోలవరం నిర్వాసిత కాలనీలపై ఈనాడు తప్పుడురాతలు
-
ఔననదు.. కాదనదు!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్ కెనాల్ను జాతీయ జలమార్గం క్లాస్–3 ప్రమాణాల మేరకు నిర్మించాలని సూచించిన ఇన్ల్యాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ).. ఆ పనులకయ్యే నిధులపై మాత్రం స్పందించడం లేదు. ఇప్పటికే పోలవరం స్పిల్ వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను పూర్తి చేసి.. వరద ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం ఈసీఆర్ఎఫ్ డ్యామ్పై దృష్టి పెట్టింది. జలాశయం పూర్తయితే నావిగేషన్ కెనాల్, టన్నెల్ నిర్మాణం చేపట్టడం అతి పెద్ద సవాల్గా మారుతుంది. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్ర నౌకాయాన శాఖ, ఐడబ్ల్యూఏఐ దృష్టికి తీసుకెళ్లింది. అయినా ఆ రెండు సంస్థలు మాత్రం నిధుల మంజూరుపై స్పష్టత ఇవ్వట్లేదు. 90 శాతం పనులు పూర్తి.. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులను 2004–05లోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు(ఎఫ్ఎస్డీ)తో 1.423 కి.మీ.ల పొడవుతో అప్రోచ్ ఛానల్.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్ లాక్లు, 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్ఎస్డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్ఎస్డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్ లాక్ల పనులను దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్ టన్నెల్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అలాగే.. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్ కెనాల్ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది. జాతీయ జల మార్గంలో స్థానం.. ధవళేశ్వరం–భద్రచాలం స్ట్రెచ్(అఖండ గోదావరి)ను జాతీయ జలమార్గం–4లో అంతర్భాగంగా 2016లో ఐడబ్ల్యూఏఐ ప్రకటించింది. ఈ జలమార్గాన్ని క్లాస్–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. క్లాస్–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్ కెనాల్ను నిర్మించాలంటే.. 1.423 కి.మీ.ల పొడవున అప్రోచ్ ఛానల్ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్ఎస్డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో 3 నావిగేషన్ లాక్లు, 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీతో 3.84 కి.మీ.ల పొడవున నావిగేషన్ కెనాల్.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్ఎస్డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్ టన్నెల్ పనులను చేపట్టాలి. ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుంది. ఉలుకూపలుకు లేని ఐడబ్ల్యూఏఐ.. నిధులిస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకసార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యయాన్ని ఐడబ్ల్యూఏఐ భరించాలని సీడబ్ల్యూసీ, కేంద్ర జల్ శక్తి శాఖలు కూడా స్పష్టం చేశాయి. ఐడబ్ల్యూఏఐ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర నౌకాయాన శాఖ, సీడబ్ల్యూసీ, రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి సమావేశాలు నిర్వహించి.. నిధులు మంజూరు చేయాలని ఐడబ్ల్యూఏఐకి తేల్చిచెప్పారు. అయినా కూడా ప్రతి సమావేశంలోనూ జాతీయ ప్రమాణాల మేరకు పోలవరం నావిగేషన్ కెనాల్ పనులు చేయాలని ఐడబ్ల్యూఏఐ ఉన్నతాధికారులు నిర్దేశిస్తారేగానీ.. నిధులిచ్చే అంశాన్ని మాత్రం ఎటూ తేల్చడం లేదు. -
పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం
-
పోలవరం తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తేల్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేస్తూ శుక్రవారం కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి నివేదిక పంపినట్లు సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్విందర్సింగ్ వోరా వెల్లడించారు. ఇప్పటికే పోలవరం తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. ఇందులో భాగంగా జూన్ 5న కేంద్ర ఆర్థికశాఖ మెమో కూడా జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోకి అదనంగా 36 గ్రామాలు వస్తాయని తేలింది. ఆ గ్రామాల ప్రజలకు తొలిదశ కిందే పునరావాసం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ఆ మేరకు సవరించిన ప్రతిపాదనలను రూపొందించాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో తొలిదశలో మిగిలిన పనుల పూర్తికి రూ.17,148 కోట్లు అవసరమంటూ సవరించిన వ్యయ ప్రతిపాదనలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా సీడబ్ల్యూసీకి పంపింది. వాటిని పరిశీలించిన సీడబ్ల్యూసీ తొలిదశ పూర్తికి రూ.15,661 కోట్లు అవసరమవుతాయని లెక్కగట్టింది. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత నిధుల విడుదల.. సీఎం జగన్ చేసిన విజ్ఞప్తి.. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లు విడుదల చేసేందుకు జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ అంగీకరించింది. 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి సూత్రప్రాయంగా కూడా అంగీకరించింది. ఆ గ్రామాల ప్రజలకు పునరవాసం కల్పించడానికి అదనంగా రూ.2,749.85 కోట్లు అవసరమని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది. మొత్తం రూ.15,661 కోట్లను విడుదల చేయాలని కేంద్ర జల్శక్తి శాఖకు శుక్రవారం సిఫార్సు చేసింది. కేంద్ర జల్శక్తి శాఖ ఆ మేరకు పోలవరానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు సిఫార్సు చేయనుంది. దీని ఆధారంగా కేంద్ర కేబినెట్కు జల్శక్తి, ఆర్థిక శాఖలు ప్రతిపాదన పంపనున్నాయి. దీనిపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తే పోలవరం తొలిదశ పూర్తికి అవసరమైన నిధులు విడుదలకు మార్గం సుగమం అవుతుంది. దశల వారీగా పోలవరంలో నీటినిల్వ.. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు కాగా.. గరిష్ట నీటినిల్వ 194.6 టీఎంసీలు. కొత్తగా నిరి్మంచే ఏ ప్రాజెక్టులోనైనా సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం ఆ ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది దాని పూర్తినిల్వ సామర్థ్యంలో 1/3వ వంతు.. మరుసటి ఏడాది 2/3వ వంతు, తర్వాత పూర్తిస్థాయిలో నీటినిల్వ చేయాలి. లీకేజీలుంటే వాటికి అడ్డుకట్ట వేసి ప్రాజెక్టుకు భద్రత చేకూర్చాలన్న ఉద్దేశంతోనే సీడబ్ల్యూసీ ఈ మార్గదర్శకాలను రూపొందించింది. వీటి ప్రకారం పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలిఏడాది 41.15 మీటర్లలో, తర్వాత దశల వారీగా నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ గరిష్ట నీటి మట్టం 45.74 మీటర్లలో నీటినిల్వ చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. కేంద్రాన్ని ఒప్పించిన సీఎం జగన్.. నిజానికి.. కేంద్రమే నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కమీషన్ల కక్కుర్తితో 2013–14 ధరల ప్రకారమే పూర్తిచేస్తామని 2016, సెప్టెంబరు 7న నాటి సీఎం చంద్రబాబు అంగీకరించి పనులను దక్కించుకున్నారు. అప్పటి ధరల ప్రకారం పోలవరం వ్యయం రూ.20,398.61 కోట్లు ఇచ్చేందుకు అప్పట్లో కేంద్ర మంత్రివర్గం అంగీకరించింది. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లు మినహాయించి మిగతా అంటే రూ.15,667.91 కోట్లు ఇస్తామని తేల్చింది. 2014, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.14,969.37 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇక రూ.698.54 కోట్లు మాత్రమే మిగిలాయి. కానీ.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునారావాసానికే రూ.33,168.23 కోట్లు అవసరం. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తుచేస్తూ.. 2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఖరారు చేసిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి, నిధులు విడుదల చేసి, ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని ప్రధాని మోదీని కోరారు. ఈ క్రమంలోనే తొలిదశ పూర్తికి అడ్హక్గా రూ.పది వేల కోట్లు ఇచ్చి.. ప్రాజెక్టు ఫలాలను ముందస్తుగా రైతులకు అందించేందుకు సహకరించాలని సీఎం జగన్ చేసిన వినతిపై ప్రధాని సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కేంద్ర జల్శక్తి, ఆర్థిక శాఖలను ఆదేశించారు. -
పోలవరం పనుల్లో మరో కీలక ఘట్టం పనులు పూర్తి
-
గోదావరిపై లిఫ్ట్ ఇరిగేషన్ ఘనత నాదే
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్/మధురపూడి/సీతానగరం: గోదావరిపై ఉన్న ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చిన ఘనత తనకే దక్కుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్య టనలో భాగంగా మంగళవారం సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన ఆయన అనంతరం కోరుకొండ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆవ భూముల్లో రూ.500 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రాష్ట్రంలో జే–ట్యాక్స్ నడుస్తుంటే రాజానగ రంలో జక్కంపూడి ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. బ్లేడ్ బ్యాచ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబును పక్కన పెట్టు కుంటావా జగన్ అని ప్రశ్నించారు. ముని కూడలిలో గతంలో శిరోముండనానికి గురైన యువకుడితో మాట్లాడించారు. పురుషోత్త పట్నం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పురుషోత్తపట్నం ఒక చరిత్రని, రెండులక్షల రైతుల జీవితాన్ని మార్చే ప్రాజెక్టుకు నీళ్లు అందించాలన్న ప్రాజెక్టును నాశనం చేశారన్నారు. తాను కట్టడం వల్లే దానిని వాడకూడదని జగన్ ఆలోచిస్తున్నాడన్నారు. ప్రజావేదికను కూల్చినట్టు ప్రాజెక్టు కూలిస్తే ఇక్కడి ప్రజలు తాటతీస్తారని హెచ్చరించారు. పోలవరంపై చేతులెత్తేశారు రాజమహేంద్రవరంలో సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మాణమంటున్న సీఎం జగన్ దీనిని నిర్మించలేనని చేతులెత్తేసి, కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలంటున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రమే నిధులిస్తుందని, మనం చేయాల్సిందల్లా ఎలాంటి ఆరోపణలు తప్పులు చేయకుండా, వారి సూచనల ప్రకారం ప్రాజెక్ట్ నిర్మించడమేనని చెప్పారు. వైఎస్ జగన్ చేసిన పనుల వల్లే కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ మొత్తం పోయాయన్నారు. చేయాల్సిన నాశనంచేసి, ఇప్పుడు కేంద్రమే నిర్మించాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్ట్ నిర్మాణాలు ఎందుకు దెబ్బతిన్నాయనే దానిపై హైదరాబాద్ ఐఐటీ ఒక నివేదిక ఇచ్చిందని తెలిపారు. అందులో 14 కారణాలు చెబితే.. 13 కారణాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనమేనని తేల్చాయని పేర్కొన్నారు. -
అసంపూర్తిగా వదిలేసి అబద్ధాలా?
పోలవరం రూరల్: దివంగత వైఎస్సార్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కళ్లార్పకుండా అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లు, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్వేని పూర్తి చేయకుండా, నీళ్లు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్ను నిర్మించడం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమన్నా రు. నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబు నిర్వాకాలే కారణమన్నారు. ఈ కారణంగానే 2019, 2020 వరదలకు డయాఫ్రమ్వాల్ దెబ్బతిందన్నారు. ప్రాజెక్టులు, వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు ఎన్నికల భయంతో పర్యటనలు తలపెట్టారని విమర్శించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్బాబులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరి హయాంలో ఎప్పుడెలా పనులు జరిగాయో నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. పోలవరం పనులు ఎక్కడా ఆగలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. దెబ్బతిన్న డయాఫ్రమ్వాల్ ప్రాంతంలో ఇసుక నింపి జెట్ గ్రౌటింగ్ పనులు చేపట్టామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, గేట్లు, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్లను తాము పూర్తి చేశామన్నారు. తాము పూర్తి చేసిన స్పిల్వేపై నడుస్తూ చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలా డుతున్నారని దుయ్యబట్టారు. టీడీపీ సర్కారు ప్రాజెక్టు నిర్మాణంపై దృష్టి పెట్టకుండా బస్సు యాత్రలు, భజనలకే ప్రాధాన్యం ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ ప్రశ్నలకు జవాబివ్వు బాబూ.. తాను అడిగే మూడు ప్రశ్నలకు జవాబు చెప్పాలని చంద్రబాబుకు అంబటి సవాల్ విసిరారు. ‘జాతీయ ప్రాజెక్టు పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే కేటాయించి పూర్తి చేయాలని విభజన చట్టంలో ఉన్నా నాడు ప్రధాని మోదీ, గడ్కరీ కాళ్లు పట్టుకుని పనులు ఎందుకు దక్కించుకున్నారు? 2013–14 ధరల ప్రకారం పూర్తి చేస్తానంటూ ఎందుకు ఒప్పుకున్నారు? 2018కి ప్రాజెక్టును పూర్తిచేసి అప్పగిస్తానని శాసనసభలో చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేదు?’ అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలన్నీ ఒక్కొక్కటిగా సరిదిద్దుతూ సీఎం జగన్ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన సందర్భాలు లేవన్నారు. 1986లో 36 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందన్నారు. ఎత్తు తగ్గిస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. డ్యామ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం దశలవారీగా మూడు దశల్లో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తారన్నారు. ఎస్ఈ నరసింహమూర్తి, అడ్వైజర్ గిరిధర్రెడ్డి, ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జెడ్పీటీసీ కలుం హేమకుమారి, వైఎస్సార్సీపీ మండల అ«ధ్యక్షుడు మురళీకృష్ణ, తహసీల్దార్ బి.సుమతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
2025 ఖరీఫ్కు పోల‘వరం’
పోలవరం నిర్మాణంలో మా ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు. ప్రజలకు మంచి చేయడమే మా సంకల్పం. ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో నేను ఒకటే చెప్పా.. అయ్యా! మీరే బటన్ నొక్కండి.. నేరుగా మీరే నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు పంపించండి..! మేమే చేయా లని ఆరాట పడటం లేదు. క్రెడిట్ ఎవరికి వచ్చినా ఫర్వా లేదు. నాకు కావాల్సిందల్లా మంచి జరగాలి. ఇంతకన్నా నాకు వేరే అవసరం లేదని చెప్పా. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పోలవరం ప్రాజెక్టును 2025 ఖరీఫ్ కల్లా కచ్చితంగా పూర్తిచేసే పరిస్థితి వస్తుంది. 2025 జూలై, ఆగస్టులో 41.15 మీటర్ల పరిధిలో నీటిని నిల్వ చేసే పరిస్థితి కూడా ఉంటుంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు, నిధులకు సంబంధించిన విషయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ వారికి అర్థమయ్యే రీతిలో చెప్పామన్నారు. ఇవన్నీ చేసిన నేపథ్యంలో వారిలో కొంత కదలిక వచ్చి సానుకూల వాతావరణంతో ధరలను రివైజ్ చేసి ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసేలా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. పోలవరం ముంపు ప్రాంతం కాంటూరు లెవల్ 41.15 మీటర్ల పరిధిలో ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఎన్నికలకు ముందే ఆరేడు నెలల్లోగా నష్టపరిహారం అందుతుందన్న నమ్మకం ఉందని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వంపై గట్టిగా ఒత్తిడి తెస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం అల్లూరి సీతారామ రాజు, ఏలూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్ బాధితులను స్వయంగా కలుసుకుని క్షేత్రస్థాయిలో అమలైన సహాయ చర్యలను పరిశీలించారు. కూనవరం, గొమ్ముగూడెంలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. బుద్ధి లేకుండా బాబు సంతకాలు.. పోలవరం డ్యామ్ను మూడు సంవత్సరాల్లో మూడు దశల్లో పూర్తిగా నింపుతారు. అందులో మొదటి స్టేజ్.. మొదటి ఏడాది 41.15 మీటర్ల వరకు నింపుతారు. దశలవారీగా నింపడం ద్వారా ఒక్కో దశలో ఏవైనా లీకేజీలు ఉంటే వాటికి మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. మూడు సంవత్సరాల్లో మూడు ఫేజ్ల్లో డ్యామ్ను నింపాలని సీడబ్ల్యూసీ నిబంధనల్లో ఉంది. 41.15 మీటర్ల వరకు నింపితే కటాఫ్ అయిపోయే గ్రామాలు ఇంకా ఉంటాయి. వాటిని ఫస్ట్ ఫేజ్లోకి తేకుంటే ఆ ఊళ్లకు వెళ్లటానికి ఇబ్బంది అవుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి లైడార్ సర్వే నిర్వహించి 32 గ్రామాల్లో 48 హ్యాబిటేషన్లను (ఆవాస ప్రాంతాలు) మళ్లీ యాడ్ చేయించాం. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం కిందా మీదా పడుతున్నాం. మన ఖర్మకొద్దీ ఇదంతా ఎందుకు మొదలైందంటే గత ప్రభుత్వం 2013–2014 రేట్లతోనే పోలవరాన్ని పూర్తి చేస్తామని అండర్ టేకింగ్ ఇచ్చింది. దీంతో అంతకంటే ఎక్కువ డబ్బులివ్వమని, నాటి మీ ముఖ్యమంత్రే ఇందుకు ఒప్పుకుని సంతకం చేశారని కేంద్ర ప్రభుత్వం మొండికేసింది. నేను నేరుగా ప్రధాని, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి వారికి అన్ని రకాలుగా నచ్చచెప్పా. 2013–14 రేట్ల ప్రకారం ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి చేయాలంటే ఎలా సాధ్యం? ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు కూడా మారిపోతాయి. గత ప్రభుత్వంలో చంద్రబాబు బుద్ధి లేకుండా సంతకం చేశాడు గానీ మీరైనా ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే కార్యక్రమం చేశా. శ్రీశైలం ప్రాజెక్టు ఎంతతో స్టార్ట్ చేశారు? ఎంతతో పూర్తైంది? ఈ నెలాఖరు కల్లా శుభవార్త! ఇవన్నీ వివరించిన తరువాత వారిలో (కేంద్రం) కొంత కదలిక వచ్చింది. సానుకూల వాతావరణం వచ్చింది. ఇప్పుడు ఉన్న రేట్లకు మళ్లీ రివైజ్ చేసి ప్రాజెక్టును పూర్తిచేసేలా అడుగులు వేశాం. ఇది జరగాలంటే కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. దీనికోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎస్టిమేట్స్ తయారు చేసి సెంట్రల్ వాటర్ కమిషన్కు ఇప్పటికే పంపించింది. వాళ్లు మరో వారంలో అప్రూవల్ ఇస్తారు. ఆ తర్వాత జల్శక్తి శాఖ వద్దకు వస్తుంది. అనంతరం కేబినెట్లో పెడుతుంది. దేవుడు ఆశీర్వదిస్తే నాకు తెలిసి బహుశా ఈ నెలాఖరు కల్లా కేబినెట్కు ఇది వచ్చే కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపితే పోలవరం తొలి ప్రాధాన్యతా పనుల కోసం రూ.17 వేల కోట్లు మనకు ఇచ్చేందుకు ఆమోదం లభిస్తుంది. దీనివల్ల అత్యంత ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి. డ్యామ్ పూర్తి హైట్కు కంప్లీట్ అవుతుంది. 41.15 మీటర్ల వరకు నీళ్లు నింపేందుకు ఆర్ అండ్ ఆర్ పూర్తిగా అందుతుంది. లైడార్ సర్వే ద్వారా గుర్తించిన 48 ఆవాస ప్రాంతాలను కూడా మొదటి పునరావాస ప్రాధాన్యత కింద ఆమోదించాలని కోరాం. దాని తర్వాత రెండో ఏడాది సెకండ్ ఫేజ్, అనంతరం మూడో ఏడాది మూడో దశ ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతోంది కాబ ట్టి! బహుశా జగనే కడితే మొదట మీకు (నిర్వా సితులకు) ఇచ్చి తర్వాత ప్రాజెక్టు గురించి ఆలోచన చేసేవాడినేమో! కేంద్ర ప్రభుత్వం డబ్బు లు ఇస్తోంది కాబట్టి ఫేజ్ ప్రకారం జరగాల్సిందే. 20 వేల కుటుంబాల తరలింపు! నేను కూడా అనుకున్నంత వేగంగా చేయలేక పోయిన పని ఒకటి ఉంది. అది పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ఇప్పించడం. అది నా చేతుల్లో ఉండే పని కాకపోవడంతో కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధార పడాల్సి వస్తోంది. వాళ్ల మీద ఒత్తిడి తెస్తూ అడుగులు ముందుకు వేస్తున్నా. ఏదైనా టైమ్ రావాలి. ఇవన్నీ జరిగేదాకా వారు డబ్బులివ్వరు. డబ్బులు ఇవ్వకపోతే పని జరగదు. పని జరగకపోతే, డబ్బులు ఇవ్వకపోతే మనం కూడా ఇవ్వలేం. ఈ వాస్తవాన్ని కూడా మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరు కల్లా కేంద్ర కేబినెట్ ఆమోదం లభించి రూ.17 వేల కోట్లకు అప్రూవల్ వస్తే 41.15 మీటర్లకు, 48 హ్యాబిటేషన్లకు సంబంధించి రూ.5,200 కోట్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తాం. గట్టిగా ఒత్తిడి తెచ్చి వచ్చే జనవరికల్లా ఆర్ అండ్ ఆర్ పూర్తయ్యేలా చూస్తాం. మన ప్రభుత్వం రాక ముందు కేవలం 3 వేల కుటుంబాలను మాత్రమే తరలించారు. గత నాలుగేళ్లలో ఇప్పటికే 12 వేల కుటుంబాలను షిఫ్ట్ చేశాం. మరో 8 వేల కుటుంబాలను అంటే మొత్తంగా 20 వేల కుటుంబాలను తరలిస్తున్నాం. తరలించాల్సిన 8 వేల కుటుంబాల కోసం రూ.800 కోట్లు డబ్బులు అవసరం. మనమే కిందమీద పడి ఎలాగో చేసేస్తాం. బహుశా ఈ నెలాఖరుకో లేకపోతే వచ్చే నెలకల్లా పూర్తి చేస్తాం. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, ఎంపీ కోటగిరి శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ప్రజాప్రతినిధులు , అధికారులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో వరద బాధితులతో సీఎం వారికి మిగతా రూ.3.5 లక్షలు ఇస్తాం పోలవరం ప్రాజెక్టుకు తొలుత నాన్న (వైఎస్సార్) హయాంలో భూసేకరణ జరిగినప్పుడు రూ.లక్ష, రూ.లక్షన్నరకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి నేను రూ.5 లక్షలు ఇస్తానని చెప్పా. ఆ మిగిలిన రూ.3.5 లక్షలు కచ్చితంగా ఇస్తాం. మీ బిడ్డ వల్ల నష్టపోయామనే మాట ఎక్కడా వినప డదని చెబుతున్నా. మీ బిడ్డ మంచే చేస్తాడు. చెడు మాత్రం ఎప్పుడూ చేయడని గుర్తు పెట్టుకోండి. కేంద్రం రూ.6.8 లక్షలకు తోడు రాష్ట్రం రూ.3.2 లక్షల ప్యాకేజీ ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6.8 లక్షల ప్యాకేజీకి తోడు రూ.3.2 లక్షల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనమే ఇస్తాం. ఇప్పటికే జీవో జారీ చేశాం. దీనికి మీ బిడ్డ కట్టుబడి ఉన్నాడని తెలియజేస్తున్నా. దేవుడు ఆశీర్వదిస్తే కేంద్రం నుంచి జరగాల్సిన మంచి ఆరేడు నెలల్లోనే జరుగుతుందన్న నమ్మకం ఉంది. మీ బిడ్డ మీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాడు. బాబు ఘోర తప్పిదాలు గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదం స్పిల్వే కట్టకుండా డయాఫ్రం వాల్ కట్టారు. మొదట స్పిల్వే పూర్తి చేసి నీళ్లు డైవర్ట్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యామ్ కట్టాలి. కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత డయాఫ్రం వాల్ తర్వాత వెనకాల కట్టాలి. అలా చేస్తే డ్యామేజ్ అనేది జరగదు. మన ఖర్మ కొద్దీ ఆ రోజుల్లో కేవలం కాంట్రాక్టర్లకు మంచి చేయడం కోసమే పనులు చేపట్టి ప్లానింగ్ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేశారు. స్పిల్వే పనులు అసంపూర్తిగా వదిలేశారు. కాబట్టే నీళ్లు అటువైపు నుంచి డైవర్ట్ చేయలేకపోయారు. నీళ్లు డైవర్ట్ చేయలేకపోయారు. కాబట్టి అటువైపు పంపించలేకపోయారు. పైగా అది పూర్తి కాకుండానే మధ్యలో కాఫర్ డ్యామ్ మొదలు పెట్టారు. వరదలకు డయాఫ్రం వాల్ కోతకు గురైంది. కొత్త డయాఫ్రం వాల్ నిర్మిస్తాం ఇప్పుడు నిపుణులు అధ్యయనం చేసిన తర్వాత కొత్త డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా మనం కాఫర్డ్యాంలు పూర్తిచేశాం. స్పిల్వే పూర్తిచేసి దానిమీదుగా నీళ్లు పంపిస్తున్నాం. ఇవన్నీ మనం చేయగలిగాం. గత సర్కారు నిర్వాకాల కారణంగా ప్రాజెక్టు మనం అనుకున్నంత స్పీడ్లో ముందుకు వెళ్లలేకపోయింది. వీటన్నింటినీ అధిగమించి ఇప్పుడు దేవుడి దయ వల్ల గాడిలో పడింది. 2025 ఖరీఫ్కల్లా కచ్చితంగా పోలవరం పూర్తి చేసి నీళ్లు నిల్వ చేసే పరిస్థితి వస్తుంది. -
ఎప్పుడు ఏ బాధ వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుంది: సీఎం
-
విభజన హామీలకు ప్రైవేటు మెంబర్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్రామ్ శుక్రవారం లోక్సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనాలతో సహా పలు హామీల అమలుకు సంబంధించిన అంశాలను ఆయన బిల్లులో పొందుపరిచారు. అనంతరం ఏపీ భవన్లో భరత్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను అమలుచేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారని.. ద్రవ్య బిల్లు అని చెప్పడంతో లోక్సభలో ప్రవేశపెట్టామని తెలిపారు. బిల్లులో ప్రత్యేక హోదాను ప్రధానంగా ప్రస్తావించామని, వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రైల్వేజోన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు తప్పిదాలను సవరిస్తూ ఏపీకి రావాల్సినవి తీసుకొస్తున్నామని భరత్ వివరించారు. అలాగే, పోలవరం సవరించిన అంచనాల ఆమోదానికి సంబంధించి లోక్సభాపక్షనేత మిథున్రెడ్డి మరో బిల్లు ప్రవేశపెడతారని భరత్రామ్ తెలిపారు. ప్రజాప్రయోజన బిల్లులకే పార్లమెంటులో మద్దతిస్తున్నామన్నారు. ప్రైవేటు మెంబరు బిల్లులు ఎందుకు ప్రవేశపెడుతున్నామో కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్ తెలిపారు. ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి బేసిన్లో ఒక పెట్రో కెమికల్ రిఫైనరీ తీసుకురావాల్సి ఉందని, దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలన్నారు. గోడ మీద పిల్లిలా టీడీపీ.. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ వ్యవహారం గోడ మీద పిల్లిలా ఉందని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై పార్లమెంటులో ప్రశ్నలు వేసి టీడీపీ ఎంపీలు అభాసుపాలయ్యారన్నారు. లోకేశ్కు ధైర్యముంటే తనపై ఎంపీగా పోటీచేయాలని సవాల్ విసిరారు. -
పోలవరం ప్రాజెక్టులో తాగునీటి విభాగం ఖర్చూ భరిస్తాం
సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన విజ్ఞప్తులకు కేంద్రం అంగీకరించింది. ప్రాజెక్టులో కేవలం సాగు నీటి విభాగం పనులకే నిధులిస్తామని, తాగు నీటి విభాగం ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లూ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. సీఎం జగన్ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంది. తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసింది. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లు నిధులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ఈ విషయం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా ప్రాజెక్టులో దెబ్బతిన్న చోట్ల మరమ్మతులకు అదనంగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన వ్యయ విభాగం నిరభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు. అదేవిధంగా తాగు నీరు కాంపొనెంట్ ఖర్చును కూడా ఇవ్వడానికి అభ్యంతరం లేదని సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. వేధింపుల నిరోధక చట్టంలో బాధితులకూ శిక్షలా? వేధింపుల నిరోధక చట్టంలో ఫిర్యాదుదారులను శిక్షించే పరిస్థితి కూడా ఉండడంతో బాధితులు ముందుకు రావడంలేదని, దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం లోక్సభ ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నించారు. దీనికి కేంద్ర ఎంఎస్ఎంఈ సహాయ మంత్రి భాను ప్రతాప్ వర్మ స్పందిస్తూ.. లైంగిక వేధింపులపై బాధిత మహిళలు చేసే ఫిర్యాదులను అంతర్గత కమిటీ అన్ని కోణాల్లో క్షుణ్నంగా దర్యాప్తు చేసిన మీదటే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వలు ఇండియన్ మినరల్స్ ఇయర్ బుక్ – 2021 ప్రకారం ఏపీలో 47.17 టన్నుల బంగారు నిల్వల సామర్ధ్యం ఉన్నట్లు కేంద్ర గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. దీంట్లో 5.3 టన్నుల నిరూపిత, సంభావ్య నిల్వలు, 41.87 టన్నుల మిగిలిన వనరులు ఉన్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనల ప్రకారం రామగిరి, పెనకచర్ల బంగారు క్షేత్రాలు, జోనగిరి షిస్ట్ బెల్ట్, సౌత్ చిగర్గుంట – బిసనట్టం గోల్డ్బెల్ట్లో బంగారు నిల్వలు గుర్తించారు. విశాఖ ఉక్కును సెయిల్లో విలీనం ప్రతిపాదన లేదు సెయిల్లో విశాఖ ఉక్కు పరిశ్రమను విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. కాగా ఆత్మనిర్భర భారత్లో భాగంగా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్(పీఎస్యూ) విధానానికి అనుగుణంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.(ఆర్ఐఎన్ఎల్) షేర్హోల్డింగ్లో 100% పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం పొందిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. -
పోలవరం కాంట్రాక్టర్ని మార్చొద్దన్నా మార్చేశారు
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ను మార్చొద్దని ఎంతచెప్పినా వినకుండా సీఎం జగన్ మార్చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. తమ హయాంలో పెట్టిన కాంట్రాక్టర్ సమర్థంగా పనిచేస్తున్నారని పీపీఏ చెప్పినా వినలేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ చేశారని, జీవనాడి అయిన ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, రివర్స్ పోకడల వల్లే పోలవరం ప్రాజెక్టు సర్వనాశనమైందన్నారు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడానికి సీఎం మూర్ఖపు నిర్ణయాలే కారణమని చెప్పారు. తమ హయాంలో పోలవరం ప్రాజెక్టుపై రూ.11,537 కోట్లు ఖర్చుచేస్తే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.4,611 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. ప్రతిపక్ష నేతగా పోలవరం ముంపు బాధితులకు పరిహారంపై ప్రగల్భాలు పలికిన జగన్, ఇప్పుడు వారిని ముంచేశారని విమర్శించారు. వైఎస్ చేసిన పనుల వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైందన్నారు. 2009 వరకు ఎలాంటి పురోగతి లేదని, మొత్తం ప్రాజెక్టుని వైఎస్ సమస్యల సుడిలోకి నెట్టేశారని విమర్శించారు. వాటన్నింటినీ సరిదిద్ది తాను ప్రాజెక్టు పనులు ప్రారంభించానని చెప్పారు. తమ హయాంలో 72శాతం పనులు పూర్తిచేస్తే, వైఎస్సార్సీపీ వచ్చాక కేవలం నాలుగుశాతం మాత్రమే చేశారని పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు సకల వసతులతో కాలనీలు నిరి్మస్తానని చెప్పి నాలుగేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టులను దారిలో పెట్టడానికి నిర్దిష్ట కాలపరిమితితో పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్దకు వెళ్లి వాళ్ల బాగోతాన్ని బట్టబయలు చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
పోలవరం నిధులపై అభ్యంతరం చెప్పలేదు
పోలవరం ప్రాజెక్ట్లో 41.15 మీటర్ల వరకూ నీటిని నింపడానికి రూ.10,911.15 కోట్లు వరద నష్టం రూ.2 వేల కోట్లు నిధులకు ఆర్థిక శాఖ అభ్యంతరం చెప్పలేదని జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జనవిశ్వాస్ బిల్లుకు మద్దతు లోక్సభలో కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన జన విశ్వాస్ సవరణ బిల్లు, 2022కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ బీవీ సత్యవతి మాట్లాడుతూ.. దేశంలో జీవన సౌలభ్యానికి బిల్లు ఎంతో తోడ్ప డుతుందన్నారు. బిల్లులో కొన్ని మార్పులను ఎంపీ సత్యవతి సూచించారు. తిట్టలేదు.. అవాస్తవాల ప్రచారంపై ప్రశ్నించానంతే: ఎంపీ ఎంవీవీ తనతో పాటు తన కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగేలా మీడియాతో మాట్లాడిన వ్యవహారంలో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కేవలం ప్రశ్నించాను తప్ప అసభ్య పదజాలంతో తిట్టలేదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. తనపై చేసిన అసత్య ప్రచారంపై రఘురామను నిలదీశానని, వాస్తవాలు తెలియకుండా ఇష్టానురీతిన ఎలా మాట్లాడుతారని ప్రశ్నించినట్టు తెలిపారు. ఈ నెల 20న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్సభ వాయిదా పడిన అనంతరం సెంట్రల్ హాల్లో తనను అసభ్య పదజాలంతో తిడుతూ.. చంపేస్తాననే ధోరణిలో బెదిరింపులకు పాల్పడ్డారంటూ స్పీకర్ ఓంప్రకాశ్ బిర్లాకు ఎంపీ రఘురామరాజు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై ఎంవీవీ సత్యనారాయణ స్పందిస్తూ.. ఆయన ఆరోపణలు పూర్తిగా అవాస్తమని కొట్టిపారేశారు. తన కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఉదంతంపై రఘురామ తలాతోక లేని ఆరోపణలు చేశారని విమర్శించారు. -
5 ప్రాధాన్య ప్రాజెక్టులు ఈ ఏడాది పూర్తికావాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణాల ప్రగతిపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకు విడుదలైన, ఖర్చుచేసిన నిధులు.. చేసిన, చేయాల్సిన పనులు.. నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. ముందు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు, పునరావాస ప్యాకేజీకి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన పనులను సమీక్షించిన ఆయన గడువు ప్రకారం పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అవుకు టన్నెల్, గొట్టా బ్యారేజి నుంచి హిర మండలం ఇరిగేషన్ ప్రాజెక్టు, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, గొట్టా బ్యారేజి రిజర్వాయర్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2 ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ ఐదు ప్రాజెక్టులను ఈ ఏడాదిలో పూర్తిచేసి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చుక్కల భూముల తొలగింపు పనులు వేగవంతం 22–ఎ జాబితా నుంచి చుక్కల భూములను తొలగింపు పనులను వేగవంతం చేయాలని సీఎస్ జవహర్రెడ్డి రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం రాష్ట్ర సచివాలయంలో సి.సి.ఎల్.ఎ., ఐ.టి.ఇ.– సి, జి.ఎస్.డబ్లు్య.ఎస్ అధికారులతో సమావేశమయ్యారు. 22–ఎ జాబితా నుంచి చుక్కలు, అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు, జగనన్న సురక్ష కింద ధ్రువీకరణపత్రాల జారీ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22–ఎ జాబితా నుంచి ఇంకా దాదాపు 7,558 ఎకరాల చుక్కల భూములను తొలగించాల్సి ఉందని చెప్పారు. ఆ పనులను వేగవతం చేయాలని రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్, సి.సి.ఎల్.ఎ. సాయిప్రసాద్ను ఆదేశించారు. అనాధీనం, బ్లాంక్, హెల్డు ఓవర్ భూముల తొలగింపు పనులపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలన్నారు. గ్రామ సేవా ఈనామ్ భూముల విషయంలో దేవదాయ శాఖ క్లియరెన్సు పొందాలని సూచించారు. 20 సంవత్సరాలకు పైబడి అసైన్డు భూములను అనుభవిస్తున్న వారికి ఆ భూమిపై పూర్తి హక్కు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా అసైన్డు భూములను, ఒరిజనల్ అస్సైనీలను, వారి వారసులను ధ్రువీకరించే పనులనుపైన కూడా ప్రత్యేకదృష్టి సారించాలని చెప్పారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు చర్యలు ఏపీలోని రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సాహితీ ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదం అనంతరం తీసుకున్న చర్యలపై బుధవారం రాష్ట్ర సచివాలయంలో పలు శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ప్రమాదకర రసాయన పరిశ్రమలను వెంటనే మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. పరిశ్రమలు, ఫైర్ తదితర విభాగాల అధికారులతో ప్రతిఏటా తప్పకుండా ఆయా పరిశ్రమలను తనిఖీ చేయాలన్నారు. ప్రతి ఏటా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఎక్కడైనా లోపాలుంటే వెంటనే నోటీసులిచ్చి వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. సాల్వెంట్ పరిశ్రమలను నిర్వహించే వ్యక్తుల సామర్థ్యాన్ని, భద్రతకు తీసుకుంటున్న చర్యలను పూర్తిగా పరిశీలించాకే లైసెన్స్లు జారీ చేయాలన్నారు. -
పోలవరం నిర్వాసితులకు పునరావాసంపై రామోజీ అసత్య వార్తలు
-
గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్/ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద ప్రవాహం 7,59,015 క్యూసెక్కులకు పెరిగింది. దాంతో నీటి మట్టం 38.9 అడుగులకు చేరింది. పోలవరం ప్రాజెక్టు వద్దకు ఎగువ నుంచి వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం నుంచి 7,62,000 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్లోకి 6,86,660 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి మట్టం 9.40 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 9,900 క్యూసెక్కులను వదులుతూ మిగులుగా ఉన్న 6,76,760 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువన వరద పెరిగిన నేపథ్యంలో బుధవారం ధవళేశ్వరం బ్యారేజ్కి చేరే ప్రవాహం పెరగనుంది. గోదావరిలో ఎగువన తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్లోకి 5,79,730 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావం వల్ల బుధవారం, గురువారం బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో గోదావరిలో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. -
Fact Check: హామీ అమలు చేస్తున్నా హాహాకారాలేనా?
సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టువల్ల ప్రయోజనం పొందే రైతులకు దీటుగా ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం వైఎస్ జగన్ పునరావాసం కల్పిస్తుండటాన్ని చూసి ఓర్వలేని రామోజీరావు ‘ఈనాడు’లో ఎప్పటిలాగే రోతరాతలతో యథేచ్ఛగా విషం చిమ్మారు. సర్వస్వం త్యాగంచేసిన నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా వారిని రోడ్డున పడేసి.. ప్రాజెక్టు ప్రోటోకాల్ను తుంగలో తొక్కి కొడుకు వియ్యంకుడి సంస్థతో కలిసి ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ పనులను రామోజీరావు, చంద్రబాబు చేపట్టి ప్రజాధనాన్ని దోచుకుని, పంచుకు తిన్నారన్నది బహిరంగ రహస్యం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. చంద్రబాబు చేసిన ఘోర తప్పిదాలను సరిదిద్దుతూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టును పూర్తిచేస్తుంటే రామోజీరావు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. కాంట్రాక్టు నుంచి రామోజీ కొడుకు వియ్యంకుడి సంస్థను జగన్ తప్పించడంతో తమ డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో)కి అడ్డుకట్ట పడిందనే రామోజీరావు అక్కసు సోమవారం ‘ఈనాడు’లో ‘గోదాట్లో కలిసిన జగన్ హామీ’ శీర్షికన ప్రచురించిన కథనంలోని ప్రతి అక్షరంలోనూ కన్పిస్తుంది. ఆ క్షుద్ర పాత్రికేయంలోని ఆరోపణలు, వాస్తవాలు ఇవీ.. ఈనాడు ఆరోపణ: నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వలేదు.. పునరావాస కాలనీలకు తరలించలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగంచేస్తే రోడ్డున పడేస్తారా? వాస్తవం: రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు అంగీకరించడంతో.. 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిపోయిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో 2014, ఏప్రిల్ 1 నాటికి రూ.4,730.71 కోట్లు వ్యయం చేశారని.. మిగిలిన రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామంటూ 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్ధిక శాఖ తెగేసిచెబితే.. దానికి చంద్రబాబు తలూపారు. అందులో భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.9,477 కోట్లే. భూసేకరణ చట్టం–2013 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.28,172.21 కోట్లు. అలాంటప్పుడు రూ.9,477 కోట్లతోనే భూసేకరణతోపాటు 373 ముంపు గ్రామాల్లోని 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే. నిర్మాణ బాధ్యతలు దక్కగానే రామోజీరావు కొడుకు వియ్యంకుడి సంస్థకు నామినేషన్పై పనులు కట్టబెట్టిన చంద్రబాబు.. ప్రాజెక్టు ప్రోటోకాల్ను తుంగలో తొక్కి.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యమిచ్చి కమీషన్లు దండుకున్నారు. ఈ క్రమంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల పనులు చేపట్టారు. పునరావాసం కల్పించకుండా కాఫర్ డ్యామ్లు నిర్మిస్తూ తమను ముంచేస్తున్నారంటూ కేంద్ర జల్శక్తి శాఖ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)కు నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర జల్శక్తి శాఖ.. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ కాఫర్ డ్యామ్ల పనులు చేయాలని అప్పట్లో చేసిన సూచనలను చంద్రబాబు తోసిపుచ్చారు. కమీషన్లు రావనే నెపంతో పునరావాసం పనులు చేపట్టకుండా.. కాఫర్ డ్యామ్ల పనులు మధ్యలోనే ఆపేసి చేతులెత్తేశారు. ఇప్పుడు చెప్పండి రామోజీ.. సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను రోడ్డున పడేసి వియ్యంకుడితో కలిసి పోలవరంలో దోచుకుంది మీరు, చంద్రబాబు కాదా? ఈనాడు: తొలిదశ పునరావాసానికీ దిక్కులేదు. ఆందోళనలో 24 వేల కుటుంబాలు, ఊళ్లు. మాట తప్పను.. మడమ తిప్పను అనే సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాటనూ ఇప్పటికీ నిలబెట్టుకోలేదు. వాస్తవం: ప్రాజెక్టులో 41.15 మీటర్ల పరిధిలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని తొలుత గుర్తించారు. ఇందులో 2014–2019 మధ్య 3,073 నిర్వాసిత కుటుంబాలకు రూ.96.80 కోట్లను పరిహారంగా అందించారు. 3,066 ఇళ్లను రూ.96.60 కోట్లతో నిర్మించి పునరావాసం కల్పించారు. అంటే.. ఐదేళ్లలో కేవలం రూ.193.4 కోట్లు వెచ్చించి 3,073 కుటుంబాలకు మాత్రమే చంద్రబాబు సర్కార్ పునరావాసం కల్పించినట్లు స్పష్టమవుతోంది. కానీ, జగన్ సీఎం అయ్యాక పునరావాసంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ► 2019, మే 30 నుంచి ఇప్పటివరకూ 10,720 కుటుంబాలకు పునరావాస పరిహారంగా రూ.722.27 కోట్లు చెల్లించారు. ► రూ.1,006.15 కోట్ల వ్యయంతో పునరావాస కాలనీల్లో 11,575 ఇళ్లను నిర్మించారు. 8,878 కుటుంబాలను కాలనీలకు తరలించి పునరావాసం కల్పించారు. ► అంటే.. నాలుగేళ్లలో.. అందులో కరోనా విపత్తువల్ల రెండేళ్లు తీవ్ర ఇబ్బందులున్నా సరే రూ.1,728.42 కోట్ల వ్యయంతో 8,878 కుటుంబాలకు సీఎం జగన్ పునరావాసం కల్పించినట్లు స్పష్టమవుతోంది. ► నిర్వాసితులకు పునరావాసం కల్పించడా నికి బాబు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే జగన్ నాలుగేళ్లలోనే తొమ్మిది రెట్లు అధికంగా ఖర్చుచేశారన్నది స్పష్టమవుతోంది. ► మిగిలిన 8,228 కుటుంబాలకు నాలుగు నెలల్లో పునరావాసం కల్పించేందుకు జగన్ సర్కారు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రూ.830.14 కోట్ల బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ► జగన్ ఇచ్చిన హామీ మేరకు పోలవరం నిర్వాసిత కుటుంబాలకు రూ.పది లక్షల నగదు ప్యాకేజీ ఇచ్చేందుకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ 2021, జూన్లో జారీచేసిన జీఓ–224 అమలుకు కూడా సిద్ధమైంది. ఈనాడు: ‘ప్రధాని అపాయింట్మెంట్ తీసుకున్నాను.. మీ కష్టాలను ప్రధానికి వివరించి.. మీరే బటన్ నొక్కి నిర్వాసితులకు ఖాతాల్లో పరిహారం జమచేయాలని ప్రధానిని కోరుతా’ అని 2022, జూలై 28న పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలుపుకోలేదు. వాస్తవం: జగన్ 2022, ఆగస్టు 22న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమై.. వాస్తవంగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ.28,172.21 కోట్లని.. కానీ, 2016లో నాటి సీఎం చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం రూ.15,667.9 కోట్లకే పూర్తిచేస్తానని అంగీకరించారని.. కానీ, ఆ ధరలతో ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమని మరోసారి వివరించారు. 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నగదు పరిహారాన్ని వారి ఖాతాల్లోనే నేరుగా జమచేయాలని ప్రధానిని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. నిర్వాసితుల పునరావాసంతో సహా తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్లను అదనంగా ఇచ్చేందుకు అంగీకరిస్తూ జూన్ 5న కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో 41.15 కాంటూర్ పరిధిలోకి 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలింది. అందులో నివసిస్తున్న 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.4,223 కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో తొలిదశ పనుల పూర్తికి రూ.17,144 కోట్లు విడుదల చేయాలని జూలై 5న ప్రధానిని సీఎం జగన్ మరోసారి కోరారు. నిర్వాసితులకు జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే నీకెందుకంత కడుపుమంట రామోజీ?. అప్పుడు, ఇప్పుడూ అవే గ్రామాలు.. భద్రాచలం వద్ద గోదావరికి వరద వచ్చే సమయంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ కుక్కునూరు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మించక ముందు కూడా అనేక గ్రామాలు ముంపునకు గురయ్యేవి. ఆ గ్రామాల ప్రజలను రెవిన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలించేవారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తివేసి, వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. అంటే నీటిని ఏమాత్రం నిల్వచేయడంలేదని స్పష్టమవుతోంది. ప్రాజెక్టు కట్టనప్పుడు ఏ గ్రామాలైతే ముంపునకు గురయ్యేవో ఇప్పుడు అవే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ గ్రామాల ప్రజలను రెవిన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. -
పోలవరం వద్ద పెరుగుతున్న వరద.. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
సాక్షి, ఏలూరు జిల్లా : ఎగువను కురుస్తున్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరిలో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వే వద్ద 32.390 మీటర్ల నీటిమట్టం పెరిగింది. వరద పోటెత్తడంతో డ్యాం 48 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. స్పిల్ వే గేట్ల నుంచి 7 లక్షల 43 వేల 352 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్ వే దిగువన 24 మీటర్లకు గోదావరి నీటిమట్టం చేరింది. గోదావరి వరదల నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ 1800 233 1077 జంగారడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 9553220254 కుక్కునూరు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 7013128597,9848590546 వేలేరుపాడు తహశీల్దార్ కార్యాలయం కంట్రోల్ రూమ్ నంబర్ 6309254781 తూ.గో. జిల్లా: ధవళేశ్వరంలో గోదావరి ఉధృతి కొనసాగుతోంది. కాటన్ బ్యారేజ్ వద్ద 10.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 8.48 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. డెల్టా కాల్వలకు 11వేల క్యూసెక్కులు విడుదల చేశారు అధికారులు. చదవండి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ వదలని వాన.. వరదలా.. -
వరద గోదారి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, దాని ఉప నదులు జలకళ సంతరించుకున్నాయి. ఎగు వన గోదావరిలోకి ప్రవాహాలు పెరుగుతుండగా.. కాళేశ్వరం దిగువన ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు, వాగుల నీటి చేరికతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. మేడిగడ్డ వద్ద వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. దీనితో అధికారులు గురువారం మధ్యాహ్నమే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇక్క గురువారం రాత్రి 8 గంటల సమయానికి 9,79,347 క్యూసెక్కుల ప్రవాహంతో వరద నీరు 44.1 అడుగులకు చేరింది. శుక్రవారం తెల్లవారు జాము సమయానికి నీటి మట్టం రెండో ప్రమాద హెచ్చరిక అయిన 48 అడుగులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో నది తీర ప్రాంత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రా లకు తరలిస్తున్నారు. ఇక ఎగువ గోదావరిలోనూ వరద పెరిగింది. మహారాష్ట్రలో, రాష్ట్రంలోని పరీ వాహక ప్రాంతంలో వానలతో శ్రీరాంసాగర్ ప్రాజె క్టులోకి 59,165 క్యూసెక్కుల వరద చేరుతోంది. వచ్చిన వరద వచ్చినట్టుగానే.. ప్రాణహితలో వరద ఉధృతి పెరుగుతోంది. దీనితో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోకి చేరుతున్న 5,37,140 క్యూసెక్కులను వచ్చింది వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఈ వరదకు దిగువన ఇంద్రావతి జలాలు తోడై సమ్మక్క (తుపాకులగూడెం) బ్యారేజీలోకి 8,76,940 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ మొత్తాన్నీ విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తాలిపేరు, కిన్నెరసాని సైతం పొంగి ప్రవహిస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టు దాదాపు గరిష్ట మట్టానికి చేరగా.. తాలిపేరు 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. వీటితోపాటు శబరి జలాలు కూడా కలసి గోదావరి మహోగ్ర రూపం దాల్చుతోంది. భద్రాచలం వద్ద వరద నీటి మట్టం గంట గంటకూ పెరుగుతోంది. దీనితో కొత్తగూడెం కలెక్టరేట్, భద్రాచలం సబ్ కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం భద్రాచలం రానున్నారు. వరద మట్టం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. పోలవరానికి పెరిగిన వరద భద్రాచలం నుంచి పోలవరం ప్రాజెక్టులోకి గోదా వరి ప్రవాహం పెరిగింది. గురువారం రాత్రి ఏడు గంటలకు పోలవరం ప్రాజెక్టులోకి 5,99,490 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 48 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో నీటిని దిగువకు వదిలేస్తున్నారు. నీటి మట్టం స్పిల్వే ఎగువన 31.88 మీటర్లు, దిగువన 23.3 మీటర్లుగా.. ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద 32.55 మీటర్లు, దిగువ కాఫర్ డ్యామ్ వద్ద 22.73 మీటర్లుగా నమోదైంది. పోలవరం నుంచి నీరంతా ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,800 క్యూసెక్కులను విడుదల చేస్తూ, మిగతా నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత గోదావరి, దాని ఉప నదుల పరీవాహక ప్రాంతంలో గురు, శుక్రవారాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. లోతట్టు ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. గోదావరితోపాటు ఉప నదులు, వాగుల ప్రవాహాలతో ప్రభావం పడేచోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కృష్ణా ఉప నదులకూజలకళ మహారాష్ట్ర, కర్ణాటకలతోపాటు రాష్ట్రంలోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వానలతో కృష్ణా నది ఉప నదుల్లోనూ వరద ప్రారంభమైంది. ఎగువన కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టులోకి 32,146 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటి నిల్వ 32.24 టీఎంసీలకు చేరింది. ఆ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 97 టీఎంసీలు అవసరం. దీని దిగువన ఉన్న నారాయణ పూర్ డ్యామ్లోకి ఇంకా వరద మొదలవలేదు. ఇక కృష్ణా ఉపనది మలప్రభ నుంచి మలప్రభ ప్రాజెక్టులోకి 10,437 క్యూసెక్కులు, ఘటప్రభ ఉప నది నుంచి ఘటప్రభ ప్రాజెక్టులోకి 20,813 క్యూసెక్కులు వరద వస్తోంది. భద్ర నది నుంచి భద్ర రిజర్వాయర్లోకి 4,227 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి తుంగభద్ర డ్యామ్లోకి 9,536 క్యూసెక్కులు ప్రవాహాలు ఉన్నాయి. బీమా నదిపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 12,925 క్యూసెక్కులు చేరుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ నిండితే ప్రధాన కృష్ణా నదిలోకి వరద మొదలుకానుంది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని.. నెలాఖరు నాటికి ప్రధాన నదిలో ప్రవాహాలు పెరుగుతాయని అధికారులు చెప్తున్నారు. కాగా, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో వానలతో కృష్ణా ఉప నది అయిన మూసీలో వరద ఉధృతి పెరిగింది. మూసీ ప్రాజెక్టులోకి 2,125 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి 1,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. -
పోలవరం పనులు పరిశీలించిన పీపీఏ సీఈవో
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు పనులను పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈవో శివనందన్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈసీఆర్ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్) ప్రాంతంలో గోతులు పడిన ప్రదేశంలో ఇసుకతో నింపి వైబ్రో కంపాక్షన్ చేసిన పనులను ఆయన తనిఖీ చేశారు. రానున్న వరదల కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈఎన్సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్ బాబు, ఎస్ఈ నరసింహమూర్తి, మేఘ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోంది: మంత్రి అంబటి
తాడేపల్లి: పోలవరం ప్రాజెక్టుపై ఎల్లోమీడియా విషం చిమ్ముతోందని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దాని కాంట్రాక్టు రామోజీరావు బంధువు నుంచి పోయిందని కక్ష కట్టారని అన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయాలనే తపనతో సీఎం జగన్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. కరోనా టైంలో కష్టాలు వచ్చినా కీలక నిర్మాణాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. లోయర్ కాఫర్ డ్యాం, అప్పర్ కాఫర్ డ్యాం, స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ నిర్మాణం పూర్తి చేసిన ఘనత జగన్దని చెప్పారు. డయా ఫ్రం వాల్ నిర్మాణం వరదల వల్ల కొట్టుకుపోలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు. కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం, కమిషన్ల వలనే కొట్టుకుపోయిందన్నారు. ఆ విషయాలను రామోజీ ఎందుకు రాయటం లేదు? అని ప్రశ్నించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్కి మరమ్మత్తు చేయటమా? కొత్తది నిర్మాణమా అనే దానిపై సీడబ్ల్యుసీ ఆలోచిస్తోందని చెప్పారు. కాఫర్ డ్యాంలు పూర్తి కాకుండా డయాఫ్రం వాల్ కట్టొచ్చని మీ పత్రికలో రాయగలరా? అని ప్రశ్నించారు. పయ్యావుల కేశవ్కి లోకేష్ కన్నా తక్కువ బుర్ర ఉందని, అందుకే పిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. రూ.900 కోట్లు మాయం అయ్యాయని వాపోతున్నారు.. ఆర్.ఈ.సీ. కాంట్రాక్టును ఒకసారి చదువుకుంటే వాస్తవాలు తెలుస్తాయని మంత్రి అంబటి తెలిపారు. అన్నిస్థాయిల్లోనూ పనులను చెక్ చేసిన తర్వాతనే నిధులు విడుదల చేశారని వెల్లడించారు. చట్టం ప్రకారమే నిధులు విడుదల చేశారని, అందులో తప్పేమీలేదని అంబటి చెప్పారు. పవన్ ఏకపత్నీవ్రతుడు: అంబటి 'పవన్కళ్యాణ్ నిన్న తణుకు సభలో మరోసారి ఊగిపోయాడు. ఆయన పెళ్ళిళ్ల గురించి మాట్లాడితే ఆయనకు కోపం వస్తుంది. కానీ నిత్యం ఆయన పక్కనే ఉండే నాదెండ్ల మనోహర్కు మాత్రం ఏ కోపం రాదు. ఆయన ఒక కార్మిక వీరుడు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి జనసేన ఆఫీస్కు రహస్య సొరంగ మార్గం తవ్వడానికి పని చేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల మనోహర్. 'మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్' ఆవరించింది అంటే పవన్కళ్యాణ్కు కోపం వచ్చింది. ఇక నుంచి పెళ్ళిళ్ల గురించి ఎత్తం. అందుకు బదులుగా, ఒక్కోసారి ఒక్కో పెళ్ళి చేసుకున్న‘ఏకపత్నీ వ్రతుడు పవన్కళ్యాణ్గారు’ అని మాత్రమే అంటాం. అప్పుడు ఆయనకు చాలా ఆనందంగా ఉంటుంది.' అని మంత్రి అంబటి అన్నారు. వారిపై ఎందుకంత కడుపు మంట?.. 'వాలంటీర్ల వ్యవస్థ మీదు ఎందుకంత కడుపు మంట? వారు ఇతర ప్రాంతం, ఇతర రాష్ట్రాల నుంచి రాలేదు కదా? ఆ 50 ఇళ్లలో నుంచి వచ్చిన వారే కదా? అలాంటి వారిపై ఒక ఏకపత్నీవ్రతుడు, మరో ముసలాయన పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. వారు గౌరవ వేతనం రూ. 5 వేలు మాత్రమే తీసుకుని ఎంతో సేవ చేస్తున్నారు. మీకు నిజంగా వారి పట్ల చిత్తశుద్ధి ఉంటే.. మీరు వస్తే వారికి లక్ష జీతం ఇస్తామని చెప్పండి. లేదా వారిని తీసేస్తామని చెప్పండి' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 1000సార్లు జగన్నామస్మరణ చేయండి.. 'ఇక నుంచి సీఎం జగన్ను ఏకవచనంతోనే పిలుస్తానని పవన్ అన్నాడు. దాంతో మేము బాధ పడ్డామని, ఆయన బాధ పడిపోతున్నాడు. పవన్, ఆ శపథం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 373 సార్లు సీఎం జగన్ను ఏకవచనంతో సంబోధించాడు. అయ్యా, 1000 సార్లు అలా జగన్ పేరు ఉచ్ఛరించండి. మీరు చేసిన పాపాలన్నీ పరిహారం అవుతాయి.' అని మంత్రి అంబటి పేర్కొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు పెట్టేది మహిళా శక్తి కాదు.. మయా శక్తి: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి -
ఏది నిజం?: కమీషన్లు అందటం లేదనే.. రామోజీ నేలబారు రాతలు
అసలింతకీ రామోజీరావుకు ఏం కావాలి? పోలవరం ప్రాజెక్టు పూర్తికావటమా... లేక ఎక్కడికక్కడ పనులు ఆగిపోవటమా? దీనికి ఆగిపోవటమే ఆయనకు కావాలన్న సమాధానం తేలిగ్గానే వచ్చేస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచి్చన దగ్గర్నుంచీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రామోజీరావు ‘ఈనాడు’లో అచ్చోసిన దుర్మార్గపు కథనాలు అన్నీఇన్నీ కావు. ఇంకేముంది ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడే అవకాశం లేదని కొన్నాళ్లు... కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశం లేదని కొన్నాళ్లు... ఎత్తు తగ్గించి కట్టేస్తున్నారని కొన్నాళ్లు... ఇలా పదేపదే విషాన్ని చిమ్ముతూనే వస్తున్నారు. చిత్రమేంటంటే... రామోజీ అంచనాలకు భిన్నంగా పోలవరం వేగంగా ముందుకెళుతోంది. చంద్రబాబు వీసమెత్తయినా పట్టించుకోని పునరావాసాన్ని కూడా వైఎస్ జగన్ భుజాలకెత్తుకుని ప్రాజెక్టును నడిపిస్తున్నారు. కేంద్రాన్ని పదేపదే అభ్యర్థిస్తూ... రావాల్సిన నిధుల్ని రాబట్టుకుంటున్నారు. ఇదిగో... ఇదే ‘ఈనాడు’ కడుపు మంటను పెంచేస్తోంది. కాంట్రాక్టరుగా తన వియ్యంకుడిని తప్పించేసి మరీ ప్రాజెక్టును పూర్తి చేస్తుండటాన్ని రామోజీరావు జీర్ణించుకోలేకపోతున్నారు. ‘పోలవరం నిధుల కోసం... జగన్ నేల చూపులు– బేల మాటలు’ అంటూ సోమవారం ప్రచురించిన కథనం కూడా ఇలాంటిదే!!. మరి దీన్లో నిజానిజాలెంత? ఏది నిజం? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చేది ఇక రూ.12,911.15 కోట్లనేనని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర కేబినెట్లో 2017లో ఆమోదించిన మొత్తానికి అదనంగా... రూ.12,911.15 కోట్లే ఇస్తామని పేర్కొంది. దీనికన్నా పైసా ఎక్కువరాదు. వాస్తవం: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి, ఆరి్థక శాఖ మంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లను కలుస్తూనే ఉన్నారు. కలిసిన ప్రతి సందర్భంలోనూ పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం కేంద్ర జలసంఘం ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ఆ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే గతేదాది జనవరి 3న ప్రధాని మోదీతో సమావేశమైనపుడు... ప్రాజెక్టు తొలి దశను సత్వరమే పూర్తి చేసి, రైతులకు ముందస్తు ఫలాలు అందించడానికి తాత్కాలికంగా రూ.10 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. దీనికి మోదీ సానుకూలంగా స్పందించి... జల్ శక్తి, ఆర్థిక శాఖలకు తగు ఆదేశాలిచ్చారు. కేంద్ర జల్ శక్తి శాఖ సూచన మేరకు తొలి దశ పూర్తికి రూ.10,911.15 కోట్లు అవసరమని పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వాటిని జల్ శక్తి శాఖ ఆమోదించింది. అయితే చంద్రబాబు ఘోర తప్పిదం వల్ల దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ను సరిదిద్దడానికి, ఈసీఆర్ఎఫ్ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటానికి రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందని గత మార్చి 5న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. దాంతో తొలి దశ పూర్తికి రూ.12,911.15 కోట్లు (10,911 ప్లస్ 2వేలు) విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ జూన్ 5న అంగీకరించింది. అదీ కథ. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టుకు 2013–14 ధరల ప్రకారం.. 2014, ఏప్రిల్ 1 నాటికి ఇరిగేషన్ కాంపొనెంట్ ఖర్చులో మిగిలిన మొత్తం అంటే రూ.15,667.9 కోట్లకు మించి ఇచ్చేది లేదని, ఆ తర్వాత పడే అదనపు భారంతో కేంద్రానికి సంబంధం లేదని 2017 మార్చి 15న కేంద్రం ఒక తీర్మానాన్ని ప్రతిపాదించగా... దాన్ని కేబినెట్ ఆమోదించింది కూడా. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16,128.78 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.14,418.39 కోట్లు రీయింబర్స్ చేసింది. అంటే 2017, మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం పోలవరానికి ఇక విడుదల చేయాల్సింది రూ.1249.51 కోట్లే. ఈ నేపథ్యంలో... తొలి దశ పూర్తిచేయడానికి అవసరమైన రూ.12,911.15 కోట్లు విడుదల చేయాలంటే.. 2017, మార్చి 15 నాటి కేబినెట్ తీర్మానాన్ని సవరించాలి. ఆ మేరకు ప్రతిపాదన పంపాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆరి్థక శాఖ సూచించిందే తప్ప ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన నిధులు ఇవ్వబోమని గానీ.. ఇచ్చేది ఇక ఇంతేననిగానీ ఆర్థిక శాఖ నోట్లో ఎక్కడా లేదు. రామోజీరావు మాత్రం ఇచ్చేది ఇక ఇంతేనని కేంద్ర ఆర్థిక శాఖ నోట్లో పేర్కొన్నట్లు తప్పుడురాతలు రాసేశారు. చంద్రబాబులా రామోజీది కూడా చంద్రబాబు తరహా బ్రీఫ్డ్ మీ ఇంగ్లీషే అయితే.. ట్యూషన్ పెట్టించుకోవాలి గానీ తనకు అర్థమైనదే వాస్తవమన్న రీతిలో రాసేస్తే ఎలా? అజా్ఞనంతో తప్పుడురాతలు అచ్చేస్తే ఎలా? ఈనాడు ఆరోపణ: పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో నిధులివ్వబోమని కేంద్రం చెప్పినా సీఎం వైఎస్ జగన్ నోరెత్తడం లేదు. లోక్సభలో బీజేపీకి కావాల్సినంత బలం ఉన్నా రాజ్యసభలో లేదు. రాజ్యసభలో ఉన్న రాజకీయ బలాన్ని పోలవరం నిధులు, ప్రత్యేక హోదా సాధనకు సీఎం వైఎస్ జగన్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? వాస్తవం: విభజన చట్టం ప్రకారం పోలవరాన్ని కేంద్రమే నిరి్మంచాలి. కానీ.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమీషన్ల కోసం రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ... దాని నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని 2014, జూన్ నుంచి 2016, సెపె్టంబరు 6 వరకూ నాటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరుతూ వచ్చారు. చివరకు కేంద్రం మంజూరు చేశాక యనమల రామకృష్ణుడు బావమరిదికి, రామోజీరావు వియ్యంకుడికి ఈ కాంట్రాక్టు పనులు నామినేషన్పై కట్టబెట్టేశారు. భారీగా కమీషన్లు దండుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దోహదపడే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి మరీ పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకున్న క్రమంలో చంద్రబాబు చేసిన ఇంకో ఘోరమైన తప్పిదమేంటంటే... 2013–14 నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని 2016, సెపె్టంబరు 7న అంగీకరించడం. మరి ఆ మూడేళ్లలో ధరలు పెరిగి ఉండవా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా? 2016, సెపె్టంబరు 26న పోలవరానికి నాబార్డు నుంచి రూ.1981.54 కోట్ల రుణాన్ని విడుదల చేస్తూ.. ఇకపై బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు రుణం రూపంలోనే నిధులు విడుదల చేస్తామని.. 2018, డిసెంబర్లోగా ప్రాజెక్టును పూర్తి చేయలేకపోతే.. విడుదల చేసిన నిధులను రుణంగా పరిగణిస్తామంటూ కేంద్రం పెట్టిన మెలికకు సైతం చంద్రబాబు తల ఊపేశారు. 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ.. కేంద్ర జలశక్తి శాఖకు పంపిన మెమొరాండంలో 2014, ఏప్రిల్ 1 నాటికి నాటికి పోలవరం ప్రాజెక్టులో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకు అయ్యే (ఇరిగేషన్ కాంపొనెంట్) వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని పునరుద్ఘాటించింది. ఆ తర్వాత ఐదున్నర నెలలకు 2017, మార్చి 15న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో.. 2014, ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్టు పనుల్లో మిగిలిపోయిన నీటిపారుదల విభాగం పనులకయ్యే వంద శాతం వ్యయాన్ని మాత్రమే ఇస్తామని.. అది ఎంతన్నది పోలవరం ప్రాజెక్టు అథారిటీ మదింపు చేస్తుందని.. ఆ ప్రకారమే నిధులిస్తామని స్పష్టం చేసింది. ఆ సమావేశంలో ఉన్న టీడీపీకి చెందిన మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి నోరు మెదపలేదు. 2014, ఏప్రిల్ 1 నాటికి నీటిపారుదల విభాగం వ్యయంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే రీయింబర్స్ చేస్తామని.. అంతకంటే అంచనా వ్యయం పెరిగితే .. దాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని 2017, మే 8న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ లేఖ రాసినా సరే... చంద్రబాబు స్పందించలేదు. 2016, సెపె్టంబరు 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమొరాండం ప్రకారం... 2014, ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయ ప్రతిపాదనలను సీడబ్ల్యూసీకి పంపామని.. వాటిని ఆమోదించి.. నిధులిస్తే ప్రాజెక్టును పూర్తి చేస్తామని 2018, జనవరి 12న నాటి సీఎం చంద్రబాబు ప్రధానికి లేఖ రాశారు. 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ ఆమోదించిన నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు. ఇందులో ఏప్రిల్ 1, 2014 నాటికి చేసిన వ్యయం రూ.4,730.71 కోట్లను మినహాయిస్తే కేవలం రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినా.. చంద్రబాబు దానికి అంగీకరించారు. 2017–18 ధరల ప్రకారం భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయమే రూ. 33,168.23 కోట్లు. అలాంటిది కేవలం రూ.15,667.9 కోట్లు ఇస్తే పోలవరాన్ని పూర్తి చేస్తామని చంద్రబాబు ఎలా అంగీకరించారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే అంశాన్ని నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శాసనసభలో పలు మార్లు ఎత్తిచూపుతూ.. భూసేకరణ చట్టం 2013 ప్రకారం పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.33,168.23 కోట్లని.. అలాంటిది కేంద్రం ఇస్తామన్న రూ.15,667.9 కోట్లతో ఎలా పూర్తి చేస్తారని నిలదీస్తే.. నాటి సీఎం చంద్రబాబు వాటిని తోసిపుచ్చుతూ వచ్చారు. అంటే చంద్రబాబుకు కావాల్సింది కమీషన్లు తప్ప ప్రాజెక్టు పూర్తవటం కాదు. అందుకే రాష్ట్రమే చేపట్టేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... ప్రత్యేక హోదా అడగబోమని తాకట్టుపెట్టేశారు. అంచనా వ్యయాన్ని సవరించకున్నా నోరు మెదపలేదు. ఆఖరికి పునరావాసం ఊసెత్తకుండా కేవలం ఇరిగేషన్ కాంపొనెంట్ మాత్రమే ఇస్తామన్నా... సై అనేశారు. అసలు పునరావాసం లేకుంటే ప్రాజెక్టు ఉంటుందా? ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే పేదలకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి, వారికి తగిన పరిహారం ఇవ్వకుంటే వారు అక్కడి నుంచి వెళతారా? వారు వెళ్లకపోతే ప్రాజెక్టు పూర్తి చేసినా నీటిని నిల్వ చేయగలరా? నీటిని నిల్వ చేసే పరిస్థితి లేనపుడు ఎంత ఎత్తు కడితే లాభమేంటి? మరి పునరావాస నిధుల ఊసెత్తకుండా చంద్రబాబు ఎందుకు నోరుమూసుకున్నారు నిజానికి ఎలాంటి ప్రాజెక్టు అయినా... ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినా కాలం గడుస్తున్న కొద్దీ ముందుగా వేసిన అంచనా వ్యయం పెరుగుతుంది. అది నాగార్జున సాగర్కైనా.. శ్రీశైలానికైనా కూడా!!. పోలవరానికైనా అంతే. 2013–14లో ఉన్న ధరలు ఇప్పుడెందుకు ఉంటాయి? అన్నిరకాల సామగ్రి, లేబర్ చార్జీలు అప్పటితో పోలిస్తే రెట్టింపుకన్నా ఎక్కువే పెరిగాయి. కానీ చంద్రబాబు నాయుడు నాటి ధరల ప్రకారం నిధులిస్తే చాలని ఏకంగా లేఖ రాసేయటంతో... ఇప్పుడు తాజా ధరల ప్రకారం నిధులడిగిన ప్రతిసారీ కేంద్రం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అసలు చంద్రబాబు ఇలా ఎందుకు చేశారంటే... ఆయనకు కమీషన్లు వస్తే చాలనుకున్నారు కనక. చంద్రబాబు నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నిధుల కొరత ఎదురవుతోందన్నది నిజం. ç2017–18 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన సవరించిన అంచనా వ్యయం రూ.55,656.87 కోట్లకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. నిధులు విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక శాఖ, జల్ శక్తి శాఖ మంత్రులను సీఎం వైఎస్ జగన్ కోరుతూ వస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ.. పోలవరం ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్తోపాటు సీఎం వైఎస్ జగన్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి, కేంద్ర ఆర్థిక, జల్ శక్తి శాఖ అధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ చర్చల వల్ల 2014–15 నాటి రెవెన్యూ లోటు రూ.10,421 కోట్లను ఇటీవల కేంద్రం విడుదల చేసింది. పోలవరం తొలి దశ పూర్తికి అవసరమైన రూ.12,911.15 కోట్లను విడుదల చేయడానికి అంగీకరించింది. ప్రత్యేక హోదాను ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు సీఎం వైఎస్ జగన్ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇవేవీ కని్పంచడం లేదా రామోజీ? ఈనాడు ఆరోపణ రెండో దశ పునరావాసానికి రాష్ట్రం ఏమీ చేయలేదని సీఎం స్వయంగా ప్రకటించారు. రాష్ట్రం నిధులు ఇచ్చే పరిస్థితుల్లో లేదని చెప్పారు. వాస్తవం: కొత్తగా నిర్మించే ఏ ప్రాజెక్టులోనైనా నీటిని నిల్వ చేయాలంటే.. ఐఎస్(ఇండియన్ స్టాండర్డ్) ఆపరేషన్ ఆఫ్ రిజర్వాయర్స్ గైడ్ లైన్స్, కేంద్ర జలసంఘం నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఒకేసారి గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేయకుండా.. మూడు దఫాలుగా నిల్వ చేసుకుంటూ పోవాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తొలి ఏడాది 41.15 మీటర్ల వరకూ నీటిని నింపి.. ప్రాజెక్టులో అన్ని భాగాలను పరిశీలిస్తారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుతారు. ఆ తర్వాత 44 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నింపి, లోటుపాట్లు ఏవైనా ఉత్పన్నమైతే వాటిని సరిదిద్దుతారు. ఆనక 45.72 మీటర్లలో అంటే గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేస్తారు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ పలు మార్లు శాసనసభ వేదికగా స్పష్టం చేశారు. తొలుత 41.15 మీటర్ల వరకూ నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తామని.. ఆ తర్వాత దశలవారీగా పునరావాసం కల్పించి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేస్తామని ఉద్ఘాటించారు. ప్రాజెక్టు ఎత్తు ఏమాత్రం తగ్గదని.. కావాలంటే పూర్తయ్యాక టేపు తెచ్చుకుని కొలుచుకోవాలని చంద్రబాబు, రామోజీరావు ఎల్లో మీడియాకు సవాల్ విసిరారు. ఇదే అంశంపై అటు లోక్సభ, ఇటు రాజ్యసభలో కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్పందిస్తూ.. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క ఇంచు కూడా తగ్గదని, నిర్వాసితులు అందరికీ పునరావాసం కల్పించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన లైడార్ సర్వేలో పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూర్ పరిధిలో అదనంగా 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలటంతో ఆ గ్రామాల ప్రజలకూ పునరావాసం కల్పించడానికి రూ.5,122 కోట్ల నిధులివ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అభ్యరి్థంచారు. దీనికీ కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. దీన్ని బట్టి చూస్తే ప్రాజెక్టు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసానికయ్యే పూర్తి వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టమవుతుంది. అయినా సరే.. రామోజీరావు పదే పదే విషం చిమ్ముతున్నారు. -
బాధ్యులెవరంటూ బండ అబద్ధాలు..!
సాక్షి, అమరావతి: పోలవరంలో గైడ్ బండ్ జారడానికి దారితీసిన కారణాలను తేల్చేందుకు సీడబ్ల్యూసీ మాజీ ౖౖచైర్మన్ ఏబీ పాండ్య నేతృత్వంలో కేంద్ర జల్ శక్తి శాఖ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ అసలు ఇప్పటిదాకా నివేదిక ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో గైడ్ బండ్ను పరిశీలించిన అనంతరం కారణాలను గుర్తించేందుకు మరికొన్ని పరీక్షలు అవసరమని కమిటీ పేర్కొంది. ఈ క్రమంలో గైడ్ బండ్కు తాత్కాలిక మరమ్మతులు, శాశ్వతంగా పటిష్టం చేయడంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశం జరిగింది. జల్ శక్తి శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్సింగ్ వోరా, నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, పోలవరం సీఈ సుధాకర్బాబు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈలోగానే గైడ్ బండ్ కుంగడానికి బాధ్యులెవరో తేల్చి కఠిన చర్యలు తీసుకోవాలని జల్ శక్తి శాఖ ఆదేశించినట్లు ఈనాడు రామోజీ అచ్చేశారు. ఆ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి ఆయన చెవిలో చెప్పారా? లేదంటే ఆ సమావేశంలో ఎక్కడైనా బల్ల కింద నక్కి విన్నారా? బాధ్యతా రాహిత్యంగా కథనాలను ప్రచురించారు. ఈనాడు ఆరోపణ: గైడ్ బండ్ను 4 నెలల్లోనే పూర్తి చేయాలనేది తొలి ప్రణాళిక. అలాంటిది ఏడాదికిపైగా పట్టింది. ఇలా ఆలస్యం కావడం వల్లే నిర్మాణ ప్రదేశంలో మార్పులు జరిగి గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నాయి. వాస్తవం: గోదావరి సహజ మార్గాన్ని స్పిల్వే మీదుగా మళ్లించడానికి వీలుగా స్పిల్వే ఎడమ వైపు స్క్యూబండ్ నిర్మి ంచాలని సీడబ్ల్యూసీ, డీడీఆర్పీ తొలుత ప్రతిపాదించాయి. సీడబ్ల్యూపీఆర్ఎస్ (సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్)లో నిర్వహించిన అధ్యయనంలో స్క్యూబండ్ నిర్మిస్తే స్పిల్వేకు ఎడమ వైపున వరద ఉద్ధృతి సెకనుకు 13.6 మీటర్లకు పెరిగి సుడిగుండాలకు దారి తీస్తుందని తేలింది. దీనిపై 2019 మార్చి 26న నిర్వహించిన డీడీఆర్పీ 12వ సమావేశంలో స్క్యూబండ్ స్థానంలో గైడ్ బండ్ నిర్మి ంచాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అప్రోచ్ చానల్కు సమాంతరంగా 500 మీటర్ల పొడవున గైడ్ బండ్ నిర్మి స్తే వరద ఉద్ధృతి సెకనుకు 3 నుంచి 6.5 మీటర్లకు తగ్గుతుందని 2021 మార్చి 23న జరిగిన డీడీఆర్పీ 17వ సమావేశంలో సీడబ్ల్యూపీఆర్ఎస్ నివేదించింది. ఆ మేరకు గైడ్ బండ్ డిజైన్ రూపొందించాలని డీడీఆర్పీ ఆదేశించింది. దీంతో 2021 మార్చిలో గైడ్బండ్ నిర్మి ంచే ప్రాంతంలో ఎనిమిది చోట్ల ఈసీపీటీ(ఎలక్ట్రో కోన్ పినట్రేషన్ టెస్ట్) నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్ 12న రిటైనింగ్ వాల్, మే 15న స్టోన్ కాలమ్స్తో గైడ్ బండ్ డిజైన్లను సీడబ్ల్యూసీకి రాష్ట్ర జలవనరుల శాఖ సమర్పించింది. రిటైనింగ్ వాల్ డిజైన్ను 2021 ఏప్రిల్ 30, స్టోన్ కాలమ్స్తో కూడిన గైడ్ బండ్ డిజైన్ను 2021, మే 24న సీడబ్ల్యూసీ ఆమోదించింది. గైడ్ బండ్లో మొత్తం 13,762 స్టోన్ కాలమ్స్కుగానూ 8,388 కాలమ్స్ను 2021 మే 25 నుంచి జూన్లోపే కాంట్రాక్టు సంస్థ పూర్తి చేసింది. రిటైనింగ్ వాల్లో మొత్తం 105 ప్యానళ్లకుగానూ 35 ప్యానళ్లను 2021 మే నెలలో పూర్తి చేసింది. జూలైలో వరదలు వచ్చాయి. వరదలు తగ్గాక 2021 డిసెంబర్లో మళ్లీ పనులను ప్రారంభించింది. 2022 మార్చికి రిటైనింగ్ వాల్, ఏప్రిల్కు స్టోన్ కాలమ్స్ను పూర్తి చేసింది. గైడ్ బండ్ పనులను 2022 ఏప్రిల్ 12న ప్రారంభించింది. వరదలు వచ్చేలోగా గైడ్ బండ్ను +35 మీటర్ల ఎత్తుకు పూర్తి చేయాలని 2022 జనవరిలో పీపీఏ నిర్దేశించింది. ఆ ప్రకారం +34 మీటర్ల ఎత్తు వరకూ గైడ్ బండ్ను పూర్తి చేశారు. గతేడాది ఎన్నడూ లేని విధంగా జూలై 10న గోదావరికి లక్ష క్యూసెక్కుల వరద వ చ్చింది. జూలై 17 నాటికి అది 25 లక్షల క్యూసెక్కులకు చేరింది. దీంతో పీపీఏ నిర్దేశించిన విధంగా వరద తగ్గాక మిగిలిన కొద్దిపాటి పనిని చేపట్టి ఈ ఏడాది ఏప్రిల్కు పూర్తి గైడ్ బండ్ +51.32 మీటర్ల ఎత్తుతో పూర్తి చేసింది. ఈనాడు ఆరోపణ: గైడ్ బండ్ కుంగడానికి డిజైన్ పరంగా, నిర్మాణపరంగా వైఫల్యం. వాస్తవం: జాతీయ ప్రాజెక్టు పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పీపీఏ, సీడబ్ల్యూసీ, డీడీఆర్సీ, సీఎస్ఆర్ఎంఎస్, వ్యాప్కోస్, జీఎస్ఐ అజమాయిషీ ఉంటుంది. నిపుణుల పర్యవేక్షణలో నిర్మాణంలో లోపాలకు అవకాశమే ఉండదు. నాణ్యత పరీక్షలు నిర్వహించి ««ధ్రువీకరించాకే పనులు చేస్తారు. గైడ్ బండ్ అంటే.. నీటి ప్రవాహానికి మార్గ నిర్దేశం చేయడానికి ప్రత్యేకంగా నిర్మించే వంతెనలాంటి కట్టడాన్ని గైడ్ బండ్ అంటారు. పోలవరం ప్రతిపాదిత ప్రాజెక్టు వద్ద ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా గోదావరి సహజ ప్రవాహాన్ని అప్రోచ్ చానల్ ద్వారా మళ్లించి స్పిల్ వే నిర్మించారు. తద్వారా స్పిల్ వే ఎడమ వైపున వరద ఉధృతి ఎక్కువగా ఉంటుందని, దీంతో సుడిగుండాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని గుర్తించారు. స్పిల్ వే కు కూడా కొంత ఇబ్బంది ఉంటుందని భావించారు. ఆ సమయంలో నీటి వేగాన్ని తగ్గించి, సుడిగుండాల నివారణ కు రాళ్లు, మట్టితో స్పిల్ వే కు ఎగువన ఎడమ వైపున గైడ్ బండ్ను నిర్మించారు. ఒక్క మాటలో చెప్పాలంటే స్పిల్ వే పొడవునా నీటి ప్రవాహ వేగం ఒకేలా ఉండేందుకే దీనిని నిర్మించారు. నిపుణులంటూ ఊహాగానాలా.. ఇప్పుడు చెప్పండి రామోజీ.. పనుల్లో ఎక్కడ జాప్యం జరిగింది? గైడ్ బండ్ను 4 నెలల్లోనే నిర్మించాలన్నది తొలి ప్రణాళికని మీకు మీరే ఊహించుకున్నారా? నిర్మాణంలో జాప్యం వల్లే గైడ్ బండ్, రిటైనింగ్ వాల్ దెబ్బ తిన్నట్లు ప్రాథమికంగా తేల్చిన నిపుణుడు మీరేనా? వరద తగ్గాక అప్రోచ్ చానల్ గైడ్ బండ్ వద్ద మట్టి తవ్వకం పనులు చేస్తున్నప్పుడు రిటైనింగ్ వాల్ 144 మీటర్ వద్ద వంగినట్లు, గైడ్ బండ్ 51.32 మీటర్ల నుంచి జారినట్లు జూన్ 3న అధికారులు గమనించారు. ఆ వెంటనే సీడబ్ల్యూసీకి తెలిపారు. దీనిపై జూన్ 5న సీడబ్ల్యూసీ చైర్మన్ కుస్విందర్సింగ్ వోరా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మేరకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టాక గైడ్ బండ్ జారలేదు.