చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి | Rahul Gandhi Launch Parliament Election Campaign | Sakshi
Sakshi News home page

చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి

Published Wed, Mar 6 2019 7:33 AM | Last Updated on Fri, Mar 22 2024 11:17 AM

రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ ప్రచార భేరీ మోగించనుంది. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి సమర శంఖం పూరించనుంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు చేవెళ్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభ నుంచి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇక ఈ వేదికగా ఇప్పటికే ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రజలకు వాగ్దానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేసింది. పార్లమెంట్‌ ఎన్నికలపై గత రెండు నెలలుగా ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పోటీలో నిలిచే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement