Parliament elections
-
దిస్సనాయకే విజయం సంపూర్ణం
సెప్టెంబర్లో శ్రీలంక అధ్యక్షునిగా అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, తాజాగా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం మూడింట రెండొంతుల సీట్లు గెలుచుకున్నారు. శ్రీలంక 77 సంవత్సరాల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం ఇది. మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయినప్పటికీ, వాళ్ల పార్టీ సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. అదే కారణంగా ఇండియా పట్ల వ్యతిరేకత చూపింది. కానీ ఈ ఎన్నికల్లో ఆయనకు అన్ని వర్గాల ఆదరణ లభించడం, ఆయన కూడా ఇండియాతో సత్సంబంధాలకు ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. చైనా, ఇండియాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరువురి మధ్య సమతుల్యత పాటించగలమనీ ప్రకటించటం గమనించదగ్గది.శ్రీలంక అధ్యక్షునిగా గత సెప్టెంబర్లో అనూహ్య విజయం సాధించిన అనూర కుమార దిస్సనాయకే, ఈనెల 15న వెలువడిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచారు. ఇది శ్రీలంక 77 ఏళ్ల చరిత్రలోనే ఎవరికీ లేని ఘన విజయం. అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు పోలైన ఓట్లు 55.89 శాతం కాగా, ఇపుడు మరొక సుమారు 10 శాతం పెరిగాయి. పార్లమెంట్ మొత్తం స్థానాలు 225 కాగా, ఆయన పార్టీ జనతా విముక్తి పెరమున (జేవీపీ) నాయకత్వాన గల నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్పీపీ) కూటమి గెలుచుకున్నవి 159. ఇందులో ప్రత్యక్ష ఎన్నికలు జరిగిన 196 సీట్లు, శ్రీలంక రాజ్యాంగం ప్రకారం ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి కిందకు వచ్చే 29 సీట్లు ఉన్నాయి. ఆ విధంగా మొత్తం 225లో ఎన్పీపీ బలం 160 అవు తున్నది. అయితే, అధ్యక్ష ఎన్నికలలో దిస్సనాయకేకు తమిళుల స్థావరం అనదగ్గ శ్రీలంక ఉత్తర భాగమైన జాఫ్నా, తమిళులతో పాటు ముస్లింలు గణనీయంగాగల తూర్పు ప్రాంతాలలో, రాజధాని కొలంబో నగరంలో ఎక్కువ ఆదరణ లభించలేదు. సజిత్ ప్రేమదాస నాయకత్వంలోని సామగి జన బలవేగాయ (ఎస్జేబీ) వంటి ప్రతి పక్షాలు, ఇల్లంకి తమిళ అరసు కచ్చి (ఐటీఏకే) వంటి తమిళ పార్టీలు అక్కడి ఓట్లను తెచ్చుకున్నాయి. ప్రేమదాస పార్టీ సుమారు 33 శాతం ఓట్లు, మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్ఎల్ఎఫ్ఫీ) 17 శాతం ఓట్లు సంపాదించగలిగాయి. ఇపుడు పార్లమెంట్లో ప్రేమదాస పార్టీ 40 సీట్ల స్థాయిలో నిలదొక్కుకుని ప్రతిపక్ష హోదా పొందనుండగా, తమిళుల పార్టీ ఆరుకు, రణిల్ పార్టీ ఫ్రంట్ నాలుగుకు, మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్ష పార్టీ రెండుకు పరిమితమయ్యాయి.తమిళ ఈలమ్కు వ్యతిరేకంవాస్తవానికి జేవీపీ లోగడ రెండుమార్లు ప్రభుత్వంపై భారీ ఎత్తున సాయుధ తిరుగుబాట్లు జరిపిన మార్క్సిస్టు–లెనినిస్టు పార్టీ అయి నప్పటికీ, సింహళ జాతివాదం విషయంలో తీవ్ర వైఖరి తీసుకుంది. తమిళ ఈలంను వ్యతిరేకించటమే గాక, రాజీవ్గాంధీ – జయవర్ధనే మధ్య 1987లో జరిగిన ఒప్పందం ప్రకారం తమిళ ప్రాంతాలకు ఇండియాలోవలె కనీసం ఒక మేర ఫెడరల్ అధికారాలకు సైతం ససేమిరా అన్నది. ఇండియాపట్ల జేవీపీ వ్యతిరేకతకు కారణాలలో ఈ 1987 ఒప్పందంతో పాటు, రాజీవ్గాంధీ అక్కడకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ (ఐపీకేఎఫ్) పేరిట సైన్యాన్ని పంపటం వంటివి ప్రధాన మైనవి. నేను శ్రీలంక వెళ్లినపుడు జేవీపీ నాయకులు కొలంబో శివార్లలోని తమ ప్రధాన కార్యాలయంలో ఈ మాటలు స్వయంగా చెప్పారు. ఈలం పోరాటంతో నిమిత్తం లేకుండా కూడా, తమిళులకు ఇండియా సానుభూతి ఎల్లప్పుడూ ఉండటం, శ్రీలంక మధ్య ప్రాంతా లలోని తమిళ తేయాకు తోటల కూలీలకు శ్రీలంక పౌరసత్వం కోసం ఇండియా పట్టుబట్టడం వంటివి ఇతర కారణాలు. నిజానికి తేయాకు తోటల తమిళులు ఎల్టీటీఈ, ఈలం లక్ష్యానికి పెద్ద మద్దతుదారులు కారు. వారి సమస్యలు వేరే. ఈ విషయాలు జేవీపీకి కూడా తెలుసు. అయినప్పటికీ అనుమానాలు తొలగిపోలేదు. ఇదే తరహా అను మానాలు తూర్పున బట్టికలోవా, పశ్చిమాన రాజధాని కొలంబో ప్రాంతాలలో తగినంత సంఖ్యలోగల ముస్లిముల పట్ల కూడా ఉన్నాయి. తమిళులకు ఇండియా వలె, ముస్లిములకు పాకిస్తాన్ మద్దతు ఉందనేది వారి మరొక ఆరోపణ.సాహసించి పార్లమెంటు రద్దుఎన్నికల సందర్భంలో ఈ చర్చ అంతా ఎందుకంటే, ఈ విధమైన దీర్ఘకాలపు విభేదాలు ఉండినప్పటికీ తమిళులు, ముస్లిములు పార్ల మెంట్ ఎన్నికలలో తమ సంప్రదాయిక పార్టీలను, ఇతర జాతీయ పార్టీలను తిరస్కరించి దిస్సనాయకే కూటమిని బలపరచటం. ఈ మార్పులోని రహస్యమేమిటి? ఒకటి, ఉన్నత వర్గాలను మినహాయిస్తే అన్ని తరగతుల, అన్ని ప్రాంతాల సామాన్య ప్రజలు సంప్రదాయిక, పెద్ద పార్టీలతో విసిగిపోయారు. రెండు, తాము దేశాన్ని బాగుపరచ గలమన్న దిస్సనాయకే మాటను నమ్మారు. శ్రీలంకలో రాజ్యాంగం ప్రకారం ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష విధానం ఉంది. అయినప్పటికీ పూర్తి స్థాయి క్యాబినెట్ నియామకానికి, కొన్ని విధాన నిర్ణయాలకు పార్లమెంట్ ఆమోదం అవసరం. అందుకు పార్లమెంట్లో ఆధిక్యత, వీలైతే మూడింట రెండు వంతుల మెజారిటీ కావాలి. లేనిదే దిస్సనాయకే అధ్యక్ష ఎన్నికల సమయంలో ప్రజల కిచ్చిన హామీలను సరిగా అమలు పరచలేరు. పాత పార్లమెంట్లో 225 స్థానాలలో గల మూడంటే మూడు స్థానాలతో చేయగలిగింది శూన్యమైనందున, వెంటనే సాహసించి పార్లమెంట్ను రద్దు చేశారు. దేశంలో మార్పులు తెచ్చేందుకు మూడింట రెండు వంతుల ఆధిక్యత నివ్వవలసిందిగా ప్రజలను కోరారు. చివరకు ఆ విధంగానే తీర్పు చెప్పారు ప్రజలు. శ్రీలంకలో పదవీ కాలం ఇండియాలో వలెనే అయిదేళ్ళు. మార్పులు తెచ్చేందుకు దిస్సనాయకేకు తగినంత సమయం ఉందన్నమాట. ఏదెంత జరుగుతుందన్నది అట్లుంచితే, 55 సంవత్సరాల వయసుగల ఆయనను విద్యార్థి దశ నుంచి గమనిస్తున్న వారికి, ఆయన ఆలోచనలు, ఆచరణ పట్ల మాత్రం ఎటువంటి సందే హాలు ఉన్నట్లు కనిపించదు.ఇండియాతో సత్సంబంధాలు?దిస్సనాయకే ప్రభుత్వం చేయవలసింది చాలా ఉంది. 2022లో ప్రజల నుంచి విస్తృతమైన నిరసనలకు కారణమైన ఆర్థికరంగ దివాళాను సరిదిద్దటం, ధరల నియంత్రణ, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం అందులో ప్రధానమైనవి. దానితోపాటు ప్రజలపై పన్నుల భారం తగ్గిస్తామనీ, స్థానిక వ్యాపారులను ఆదుకోగలమనీ, అవినీతిపై కఠిన చర్యలుండగలవనీ, ప్రభుత్వంలో వృథా ఖర్చులు లేకుండా చూడగలమనీ కూడా అన్నారాయన. కానీ రుణభారం తక్కువ కాక పోగా, అధ్యక్షుడైనప్పుడు తక్షణ అవసరాల కోసం ఐఎంఎఫ్ నుంచి 2.9 బిలియన్ డాలర్ల కొత్త అప్పు తీసుకున్నారు. చైనాతో సత్సంబంధాలు గతం నుంచే ఏ పార్టీ పాలించినా ఉండగా, ఇండియా విమర్శ కుడైన దిస్సనాయకే ఈ పరిస్థితుల దృష్ట్యా ఇండియాతోనూ సత్సంబంధాలకు, ఆర్థిక సహకారానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు పెట్టారు. తన ఎన్నికకు ముందే భారతదేశాన్ని సందర్శించి ఆయన, ఆ తర్వాత విదేశాంగ మంత్రి విజిత హెరాత్ను కూడా పంపారు. భారత ప్రభుత్వం అవసరమైన హామీలనిచ్చింది కూడా. తాము చైనా, ఇండి యాలలో దేనికీ ప్రత్యేకంగా అనుకూలమో, వ్యతిరేకమో కాదనీ, ఇరు వురి మధ్య సమతుల్యత పాటించగలమని దిస్సనాయకే మొదట్లోనే ప్రకటించటం గమనించదగ్గది. ఇప్పటికే విదేశాంగ మంత్రితోపాటు, ప్రజాసేవలో సుదీర్ఘ అనుభవంగల హరిణి అమరసూరియను ప్రధానిగా నియమించిన ఆయన, కేబినెట్ను కూడా ఏర్పాటు చేశారు. విధాన ప్రకటనలు, బడ్జెట్ను తెచ్చినపుడు పూర్తి స్పష్టత వస్తుంది.ఇవన్నీ చేసినా తమిళులు, ముస్లిముల సమస్యలు ప్రత్యేకమైనవి గనుక అందుకు పరిష్కారాలను కనుగొనటం ఒక సవాలు. ప్రభాకరన్ మరణం తర్వాత ఈలం నినాదం లేకుండా పోయిందిగానీ, వారికి భూములు, భాష, సమానావకాశాలు, వివక్షల తొలగింపు, పౌర హక్కులు వంటి సమస్యలు నేటికీ కొనసాగుతున్నాయి. ముస్లిములకు కూడా తమపట్ల వివక్ష వంటి సమస్యలున్నాయి. తేయాకు తోటలలో పనిచేసే తమిళుల సమస్యలు వేరే. వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఇవి క్రమంగానైనా పరిష్కార మార్గంలో సాగని పక్షంలో ఏదో ఒక రోజున తిరిగి సమస్యల రూపంలో ముందుకొస్తాయి. వీటన్నింటినీ గమనిస్తూ కొత్త ప్రభుత్వం శ్రీలంక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదని ఆశించాలి.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో NPP విక్టరీ
కొలంబో: ద్వీపదేశం శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకే నేతృత్వంలోని ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం ఉదయం నుంచి వెలువడుతున్న ఫలితాల్లో ఎన్పీపీ కూటమి.. ఇప్పటికే మూడింట రెండో వంతు సీట్లను దక్కించుకుని మెజారిటీని చేరుకుంది.225 మంది సభ్యులున్న లంక పార్లమెంట్లో.. ఇప్పటిదాకా 123 సీట్లను ఎన్పీపీ కైవసం చేసుకుంది. సుమారు 62 శాతం ఓట్ల లెక్కింపు పూర్తైందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 2022లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న తర్వాత శ్రీలంకలో ఇది తొలి పార్లమెంట్ ఎన్నిక. సెప్టెంబరు 21న జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో 50శాతం ఓట్లు సాధించలేకపోయారు అనుర కుమార దిస్సనాయకే. దీంతో.. ‘నేషనల్ పీపుల్స్ పవర్’ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన పరీక్షగా నిలిచాయి.దేశాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన విధానాల అమలుకు 113 సీట్లైనా(సాధారణ ఆధిక్యం) సాధించేందుకు ప్రయత్నిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఎన్పీపీ కూటమికి ఎంతో దోహదపడింది. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన విక్రమసింఘె ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోగా.. రాజపక్సే సోదరులు.. మహింద, గొటబాయ, చమల్, బసిల్ ఎవరూ కూడా బరిలో దిగలేదు.శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో.. మొత్తం 1.70కోట్లకు పైగా ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్య ఓట్ల ఆధారంగా ఎంపీలను ఎన్నుకొంటారు. ప్రతి ఓటరు ముగ్గురు అభ్యర్థులకు తమ ప్రాధాన్యాలను కేటాయించవచ్చు. అయితే.. మొత్తం 225 పార్లమెంట్ సీట్లలో 196 స్థానాలకు మాత్రమే ఎంపీలను ఇలా ఎన్నుకొంటారు. 196 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 8,821 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మిగతా 29 సీట్లను నేషనల్ లిస్ట్ సీట్లుగా పిలుస్తారు. వీటిని పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల గ్రూప్లకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలు/గ్రూప్లకు దక్కిన ఓట్ల శాతం ఆధారంగా వీటిని కేటాయిస్తారు. -
అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు
టోక్యో: అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నేడు ప్రధానిగా ప్రమాణం చేయనున్న ఇషిబా సోమవారం మాట్లాడారు. ‘‘ నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తా’’ అని అన్నారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెల్సిందే. దీంతో ఫుమియో కిషిద వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. మంగళవారం ప్రమాణస్వీకారం కోసం ఎల్డీపీ ముఖ్యనేతలంతా సిద్దమవుతున్న వేళ ఇషిబా తదుపరి ఎన్నికలపై ముందే ఒక ప్రకటనచేయడం గమనార్హం. -
బ్రిటన్ ప్రధానమంత్రిగా కియర్ స్టార్మర్... పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం... రిషి సునాక్ రాజీనామా.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
కేంద్ర మంత్రివర్గంలో చోటు పొందడం అంటే అది ఒక అత్యున్నత స్థానానికి చేరుకున్నట్లు లెక్క. దేశం అంతటిని ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. ముగ్గురు బీజేపీకి చెందినవారు కాగా, ఇద్దరు టీడీపీవారు. తెలుగుదేశం పార్టీ నాలుగు మంత్రి పదవులు ఆశించినా రెండు మాత్రమే లభించాయి. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు చోటు లభించింది.వీరిలో అనూహ్యమైన పేరు వర్మ అని చెప్పాలి. కొంతకాలం క్రితం వరకు ఆయన ఏపీలో ఒక సాధారణ నేత. భీమవరం ప్రాంతంలో బాగా తెలిసిన వ్యక్తే అయినా, ఇంత వేగంగా ఆయన కేంద్ర మంత్రివర్గంలో సభ్యుడు అవుతారని ఎవరూ ఊహించలేదు. రాజకీయాలలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో చెప్పలేమనడానికి వర్మ ఒక ఉదాహరణ అవుతారు. ఆయన మొదటి నుంచి భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు. ఆయన టీవీ షోలలో బీజేపీ తరపున చర్చలలో పాల్గొంటుండేవారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. తదుపరి పార్టీ రాష్ట్ర నాయకుడుగా కొనసాగుతున్నారు.తెలుగుదేశంతో పొత్తు కుదిరిన తర్వాత బీజేపీకి కేటాయించిన నరసాపురం నుంచి ఎంపీ పదవికి పోటీచేయాలని వైఎస్సార్సీపీ దూరం అయిన సిట్టింగ్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు గట్టి ప్రయత్నం చేశారు. ఆయన కూటమిలోని మూడు పార్టీలలో ఏదో ఒక పక్షం సీటు ఇస్తుందని ఆశించారు. బీజేపీ అధిష్టానం ఆయన వైపు మొగ్గు చూపలేదు. ఆయన బీజేపీ సభ్యుడు కాదని అందువల్లే టిక్కెట్ ఇవ్వలేదని ఆ పార్టీవారు చెప్పినా, అది సాకు అని చాలా మంది భావించారు. దాంతో రఘురామ టీడీపీలో చేరి ఉండి స్థానం నుంచి పోటీచేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.వర్మ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. నరసాపురంలో క్షత్రియ వర్గానికి చెందిన నేతకు టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ ఉన్న వారిలో ఈయనే ప్రముఖుడుగా తెరపైకి వచ్చారు. బహుశా వర్మ కూడా ఊహించి ఉండకపోవచ్చు. వర్మను మార్చించాలని కొంతమంది ప్రయత్నం చేయకపోలేదు. అయినప్పటికీ, పార్టీ కోసం నిలబడిన వ్యక్తిగా వర్మ వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. తద్వారా పార్టీలో కష్టపడి పనిచేసేవారికి, సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నవారికి అవకాశాలు వస్తాయన్న నమ్మకం కలిగించారు. వర్మ ఇక్కడ నుంచి గెలుస్తారా? లేదా? అనే సంశయం తొలుత ఉన్నప్పటికీ, వైఎస్సార్సీపీ తన అభ్యర్ధిగా బీసీ నేతను ఎంపిక చేసుకోవడం వర్మకు కలిసి వచ్చిందని చెప్పాలి.నరసాపురంలో ఎక్కువసార్లు క్షత్రియవర్గం వారే ఎంపీలు అవుతూ వచ్చారు. ఆ సామాజికవర్గం తక్కువ సంఖ్యలోనే ఉన్నా, వారి పలుకుబడి చాలా పెద్దదిగా భావిస్తారు. అదంతా వర్మకు ప్లస్ పాయింట్ అయింది. మనిషి కూడా సౌమ్యుడుగా పేరొందారు. అన్నీ కలిసి వచ్చి వర్మ ఎంపీగా గెలుపొందడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు. ఇది కలయో, నిజమో అనుకునేంతలోనే ఈ రాజకీయ పరిణామాలు జరిగిపోయాయి. రాజకీయాలలో కాకలు తీరిన సీ.ఎమ్ రమేష్, పార్టీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిలను కాదని వర్మవైపు బీజేపీ మొగ్గుచూపి కేంద్రంలో స్థానం కల్పించారు. ఒకరకంగా రమేష్, పురందేశ్వరిలకు కాస్త అసంతృప్తి కలిగించే అంశమే అయినా, దాని గురించి మాట్లాడకపోవచ్చు.పురందేశ్వరి కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరి 2014, 2019లలో పోటీచేసినా గెలవలేకపోయారు. అయినా పార్టీలో జాతీయ స్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించారు. తదుపరి ఆమెను ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దాంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. మాజీ సీఎం ఎన్.టి రామారావు కుమార్తెగా కూడా ఆమె అందరికి తెలిసిన నేతగా ఉన్నారు. తెలుగుదేశంతో పొత్తు కుదర్చడంలో ఆమె గట్టి ప్రయత్నం చేశారు. అందుకు అధిష్టానం కూడా అంగీకరించింది. ఆమె రాజమండ్రి నుంచి పోటీచేసి విజయం సాధించారు. ఆమెకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చాలా మంది అనుకున్నారు. కారణం ఏమో కానీ ఆమెకు అవకాశం రాలేదు. స్పీకర్ లేదా, డిప్యూటి స్పీకర్ వంటి పదవి ఏదైనా వస్తుందా అని ఆమె మద్దతుదారులు ఆశిస్తున్నారు.ఇక మరో కీలకమైన నేత సీఎం రమేష్. ఆయన రాజకీయ జీవితం అంతా తెలుగుదేశంతో ముడిపడి ఉంది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత మనిషిగా గుర్తింపు పొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ పరాజయం తర్వాత వ్యూహాత్మకంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉంటూ చంద్రబాబు ప్రయోజనాలను పరిరక్షించడంలో ముఖ్యభూమిక పోషించారని చాలామంది విశ్వసిస్తారు. అలాగే టీడీపీతో పొత్తు పెట్టుకునేలా అధిష్టానాన్ని తనదైన శైలిలో ప్రభావితం చేశారని చెబుతారు. ఆ తర్వాత ఆయన వ్యూహాత్మకంగా అనకాపల్లి స్థానాన్ని ఎంపిక చేసుకుని బీజేపీ టిక్కెట్ సాధించగలిగారు.కడప జిల్లాకు చెందినవారైనప్పటికీ, తన అంగ, అర్ధ బలంతోపాటు, అక్కడ ఉన్న టీడీపీ నేతలంతా తనకు బాగా తెలిసినవారే కావడంతో ఆయనకు కలిసి వచ్చింది. ఫలితంగా ఆయన విజయం సాధించిన తర్వాత కచ్చితంగా ఆయనకున్న పలుకుబడి రీత్యా కేంద్ర మంత్రి పదవి పొందుతారని చాలామంది భావించారు. కానీ బీజేపీ అధిష్టానం ఆయనకు పదవి ఇవ్వలేదు. తెలుగుదేశం పక్షాన కింజారపు రామ్మోహన్ నాయుడు మూడోసారి లోక్ సభకు ఎన్నికై మోదీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదా పొందారు. ఇది అరుదైన విషయమే. ముప్పై ఆరేళ్ల వయసులోనే ఈ స్థాయికి రావడం గొప్ప సంగతే.రామ్మోహన్ నాయుడు తండ్రి ఎర్రన్నాయుడు కూడా కేంద్రంలో యునైటెడ్ ప్రంట్ టైమ్ లో మంత్రి పదవి చేశారు. వాజ్ పేయి ప్రభుత్వ టైమ్ లో స్పీకర్ అవుతారని భావించారు. కానీ ఆ పదవి జి.ఎమ్.సి బాలయోగిని వరించింది. బాలయోగి అనూహ్య మరణం తర్వాత ఆ పదవి వస్తుందని ఆశించారు. కానీ గుజరాత్ పరిణామాల నేపథ్యంలో పదవి తీసుకోవడానికి చంద్రబాబు అంగీకరించలేదు. దాంతో ఎర్రన్నాయుడు కు మళ్లీ అవకాశం రాలేదు. ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడుకు పదవి దక్కడం విశేషం. తండ్రి రాజకీయ వారసత్వంతో పాటు, కేంద్రంలో పదవి కూడా దక్కించుకున్నారు. తెలుగుతోపాటు ఆంగ్లం, హిందీ భాషలలో పట్టు ఉండడం ఈయనకు కలిసి వచ్చే పాయింట్ అని చెప్పాలి. యువకుడు, పార్టీకి కట్టుబడి పనిచేయడం ప్లస్ అయింది. టీడీపీ ఎంపీలలో వరసగా మూడుసార్లు ఎంపీ అయిన వ్యక్తి ఈయనే. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన నేతగా గుర్తింపు పొందారు. గుంటూరు నుంచి ఈసారి గల్లా జయదేవ్ పోటీచేయకపోవడంతో రామ్మోహన్ కు పోటీ లేకపోయిందని చెప్పవచ్చు. గుంటూరు నుంచి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కు కూడా కేంద్రంలో పదవి రావడం విశేషం. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఈయనకు చాన్స్ వస్తుందన్న భావన ఏర్పడింది. దానికి తగ్గట్లే టీడీపీ నాయకత్వం ఈయనకు అవకాశం కల్పించింది. ఆరువేల కోట్ల సంపద కలిగిన నేతగా ప్రచారంలో ఉన్న ఈయన కేంద్రంలో మంత్రి అయ్యారు. జనసేన నుంచి వి. బాలశౌరి కేంద్ర మంత్రి అవుతారని ప్రచారం జరిగినా ఎందుకో కాలేకపోయారు. ఆయన గతంలో వైఎస్సార్సీపీ ఎంపీగా ఉండేవారు. ఈ ఎన్నికలలో జనసేన నుంచి మచిలీపట్నంలో గెలుపొందారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి తీసుకోవడానికి ప్రస్తుతం సిద్దపడలేదని, అందుకే బాలశౌరికి అవకాశం రాలేదని మీడియాలో వార్తలు వచ్చాయి.తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పదవి దక్కించుకున్నారు. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అంబర్ పేట నుంచి ఓటమి చెందడమే ఈయనకు వరం అయింది. ఆ తర్వాత 2019 లోక్ సభ ఎన్నికలలో సికింద్రాబాద్ నుంచి పోటీచేసి విజయం సాధించడం, మోదీ మంత్రి వర్గంలో చోటు దక్కడం జరిగిపోయాయి. ఆ రకంగా ఈయన రాజకీయ భవిష్యత్తు మారిపోయింది. పార్టీ కార్యకర్తగా జీవితాన్ని ఆరంభించి కేంద్రంలో క్యాబినెట్ హోదాకు ఎదిగిన నేత ఈయన. ప్రజలతో మమేకం అవడం ద్వారా ఆదరణ చూరగొన్నారు. మరో నేత బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం లభించింది. బీసీ వర్గానికి చెందిన ఈయన రాజకీయ ప్రస్తానం కరీంనగర్ మున్సిపల్ రాజకీయాల నుంచి కావడం విశేషం.అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పొందినా, తదుపరి కరీంనగర్ నుంచి లోక్ సభకు ఎన్నికవడం, ఆ తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కావడం ఒక సంచలనం. ఫైర్ బ్రాండ్ గా అనతికాలంలోనే పేరొందిన ఈయన అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంపై పెద్ద పోరాటాలే సాగించారు. ఈయనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం అందరిని ఆశ్చర్యపరచింది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలు దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఏర్పడింది. దానిని గుర్తించిన పార్టీ నాయకత్వం పార్టీలో జాతీయ హోదా కల్పించింది. తిరిగి ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చింది.సీనియర్ నేత డీకే అరుణ, మరో నేత ఈటల రాజేందర్ లు కూడా కేంద్రంలో పదవులు ఆశించారు. కానీ దక్కలేదు. కిషన్ రెడ్డికి పదవి ఇచ్చినందున అరుణకు అవకాశం ఉండదు. అలాగే బండి సంజయ్ కు లభించిన తర్వాత ఈటలకు చాన్స్ రాదు. కాకపోతే ఈటలకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతోంది. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయని చెప్పడానికి ఈటల రాజకీయ జీవితం కూడా ఉదాహరణే. కేసీఆర్ ప్రభుత్వం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత జరిగిన పరిణామాలలో ఆయన గడ్డు పరిస్థితి ఎదుర్కున్నారు. ఒక షెల్టర్ గా ఉంటుందని భావించి బీజేపీలో చేరారు. అది ఆయనకు కలసి వచ్చింది. గత శాసనసభ ఎన్నికలలో ఓటమి చెందినా, మల్కాజిగిరి నుంచి ఎంపీ కాగలిగారు.మొత్తం మీద చూస్తే బీజేపీలో మొదటి నుంచి ఉన్న నేతలకే మోదీ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు అందుకే పదవులు దక్కాయి. దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేష్, డి.కె అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు కావడం గమనార్హం. టీడీపీ నుంచి ఒక బీసీ నేతకు, బీజేపీ నుంచి మరో బీసీ నేతకు అవకాశం వచ్చింది. ముగ్గురు అగ్రవర్ణాల వారికి మంత్రి పదవులు దక్కాయి. వీరందరికి అభినందనలు చెబుదాం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై: వీకే పాండ్యన్
ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్ ప్రకటించారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. -
ఇకపై.. తెలంగాణలో ఆ పార్టీలే కీలక పాత్ర పోషించనున్నాయా?
తెలంగాణలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సగం మోదం, సగం ఖేదం దక్కింది. కాంగ్రెస్ పార్టీకి పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాలు వస్తాయని ఆ పార్టీ అంచనా వేసినా, ఎనిమిదితోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. గతంలో నాలుగు సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఎనిమిదికి పెరగడం విశేషం. ఈ పార్టీకి శాసనసభలో కూడా ఎనిమిది మందే ఎమ్మెల్యేలు ఉన్నారు. కచ్చితంగా బీజేపీకి ఇది మేలి మలుపువంటిదే.2028 శాసనసభ ఎన్నికలలో గట్టిగా పోటీ పడడానికి ఈ ఫలితం ఉపకరిస్తుంది. బీఆర్ఎస్కు పార్లమెంటు ఎన్నికలు పూర్తి నిరాశ మిగిల్చాయి. పార్టీకి భవిష్యత్తు మీద ఆశ ఉన్నా, జనంలో పట్టు సాధించడానికి చాలా శ్రమపడవలసి ఉంటుంది. కాంగ్రెస్ సంగతి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరిగిన తొలి ముఖ్యమైన ఎన్నికలు. ఇందులో పదికి పైగా సీట్లు వచ్చి ఉంటే ఆయనకు పార్టీలో మంచి పేరు వచ్చేది. కానీ ఎనిమిది సీట్లే వచ్చాయి. అయినా ఫర్వాలేదు. ఎందుకంటే బీజేపీకి కూడా అన్ని సీట్లే వచ్చాయి కనుక. ఒకవేళ బీజేపీకి ఒక్క సీటు ఎక్కువ వచ్చినా కాంగ్రెస్కు చికాకుగా ఉండేది. అంతవరకు కాంగ్రెస్కు, రేవంత్కు మోదం కలిగించే అంశమే.అయినా ఎమ్మెల్యేల సంఖ్య రీత్యా చూస్తే కాంగ్రెస్కు ఇది కొంత ఇబ్బంది కలిగించే ఫలితంగానే చూడాలి. అరవైనాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్కు ఎనిమిది సీట్లే. కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీకి ఎనిమిది సీట్లు అన్న వ్యాఖ్య సహజంగానే వస్తుంది. రేవంత్కు ఎక్కడ సమస్య వస్తుందంటే ఆయన ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ అసెంబ్లీ సీటు ఉన్న మహబూబ్నగర్ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నేత డీకే అరుణ విజయం సాధించడం. ఆమెను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డారు. అయినా ఓడించలేకపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి ఓటమి చెందారు. కొందరు కాంగ్రెస్ నేతలే సహకరించలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నైతిక ప్రభావం రేవంత్పై కొంత ఉటుంది.అలాగే గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి లోక్ సభ స్థానం నుంచి బీజేపీ నేత ఈటెల రాజేందర్ గెలిచారు. ఇది కూడా ఆయనకు అసంతృప్తి కలిగించేదే. ఎందుకంటే ఈ రెండు సీట్లను కాంగ్రెస్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అదే టైమ్లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న ప్రాంతంలోని నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో గెలిచింది. అంటే రేవంత్ కన్నా స్థానికంగా తామే బలవంతులమన్న సంకేతాన్ని వీరు ఇచ్చారు. మాజీ మంత్రి కే జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఏకంగా రికార్డు స్థాయిలో 5.80 లక్షల ఓట్ల ఆధిక్యతతో నవిజయం సాధించడం ఒక సంచలనం. నల్గొండ కాంగ్రెస్కు గట్టి స్థావరమే అయినా, ఈ స్థాయిలో గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు.భువనగిరిలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంకు సన్నిహితుడుగా పేరొందారు. సికింద్రాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పక్షాన మరోసారి గెలిచి తన సత్తా చాటారు. ఈ నియోజకవర్గంలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు బీఆర్ఎస్ గెలిచినా, ఈ ఎన్నికలలో కిషన్ రెడ్డి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. మల్కాజిగిరిలో లోకసభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంటే బీజేపీ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందిన ఈటెల రాజేందర్కు అదృష్టం కలిసి వచ్చింది. బీఆర్ఎస్ బలం అంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందన్న అభిప్రాయం కలుగుతుంది. కాంగ్రెస్ను వ్యతిరేకించే బీఆర్ఎస్ నేతలు తమకు ఏదైనా అవసరం వస్తే షెల్టర్గా ఉపయోగపడుతుందన్న భావనతో బీజేపీకి పరోక్షంగా సహకరించి ఉండాలి. లేదా ప్రజలలో బీఆర్ఎస్, కాంగ్రెస్ల కన్నా బీజేపీ బెటర్ అన్న భావన ఏర్పడి ఉండాలి. కాంగ్రెస్కు మహబూబ్నగర్తో పాటు మల్కాజిగిరి సీటులో ఓటమి ఎదురవడం పార్టీలో చర్చ అవుతుంది. ఇప్పటికిప్పుడు రేవంత్ను ఎవరూ ఏమి అననప్పటికి, కాలం గడిచే కొద్ది జరిగే పరిణామాలలో కాంగ్రెస్ నేతలే దెప్పి పొడిచే అవకాశం ఉంటుంది. అందువల్ల బీఆర్ఎస్ తనను బలి చేసుకుని బీజేపీకి సాయపడిందని రేవంత్ వ్యాఖ్యానించారు.2019 ఎన్నికలలో నాలుగు సీట్లే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎనిమిది తెచ్చుకుందని ఆయన చెప్పవచ్చు కానీ కేవలం మాట వరసకు సమర్ధించుకోవడమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉందన్న సంగతి మర్చిపోకూడదు. కాంగ్రెస్ పార్టీ గత శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం మైనస్గా ఉంది. దాని ప్రభావం కొన్ని ఏరియాలలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల వంటి పార్లమెంటు సీట్లలో చోట్ల బీజేపీ పాగా వేసింది. ఈ స్థానాలలో కాంగ్రెస్ పట్టు సాధించలేకపోయింది. ఇది ఆ పార్టీకి బలహీనతగానే ఉంటుంది. కాంగ్రెస్ ఈ స్థానాలలో నిలబెట్టిన ఫిరాయింపుదారులంతా ఓటమిపాలయ్యారు.సికింద్రాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేయగా, బీఆర్ఎస్ మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా చేవెళ్ల నుంచి, మరో బీఆర్ఎస్ నేత పీ మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజిగిరి నుంచి పోటీచేసి పరాజయం చెందారు. వరంగల్ లో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచారు. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు రఘురామిరెడ్డి ఊహించిన రీతిలో ఘనంగా గెలిచారు. మరో మాజీ మంత్రి బలరాం నాయక్ మహబూబబాద్లో విజయం సాధించారు. పెద్దపల్లిలో ఎమ్మెల్యే జి వివేక్ కుమారుడు వంశీకృష్ణ, నాగర్ కర్నూలులో సీనియర్ నేత మల్లు రవి గెలుపొందారు. ఈ ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలలో బీజేపీ విజయానికి సూచిక అని కిషన్ రెడ్డి అన్నప్పటికీ అది అంత తేలికకాదు.ప్రస్తుతం 38 అసెంబ్లీ సీట్లు ఉన్న బీఆర్ఎస్ ఈ పార్లమెంటు ఎన్నికలలో ఆశలు వదలుకుంది. అందువల్లే వారు అసలు గెలవలేకపోయారు. వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్ ఏ రకంగా ప్రజలను ప్రభావితం చేయగలుగుతారన్న దానిపై కూడా బీజేపీ విజయావకాశాలు ఉంటాయి. బీజేపీకి ఇంకా పూర్తి స్థాయిలో క్యాడర్ లేదు. ఈ నాలుగేళ్లలో ఎంతవరకు పెంచుకుంటారో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ఒక వేవ్ మాదిరి మెదక్ తదితర చోట్ల గెలిచారు. మెదక్లో బీజేపీ నేత రఘునందనరావు విజయం సాధించారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి, ఎంపీ అయ్యారు. కేసీఆర్, హరీష్రావు ప్రాతినిద్యం వహిస్తున్న సిద్దిపేట, గజ్వేల్ శాసనసభ నియోజకవర్గాలు ఈ ఎంపీ సీటు పరిధిలోనే ఉన్నప్పటికీ బీజేపీ గెలవడం వారికి కాస్త అప్రతిష్టే అని చెప్పక తప్పదు.ఇంతవరకు బీఆర్ఎస్ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తోంది. కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్లు మరోసారి గెలవడం ద్వారా బీజేపీ పట్టు నిలబెట్టుకున్నట్లయింది. ఎప్పటి నుంచో ఎంపీ కావాలని ఆశపడుతున్న కాంగ్రెస్ నేత టీ జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన మాజీ ఎంపీ జీ నగేష్ గెలుపు సాధించారు. మహబూబ్నగర్లో గెలిచిన డీకే అరుణ సీనియర్ నేతగా ఉన్నారు. ఆమె బీజేపీలో చేరి టిక్కెట్ సంపాదించారు. ఆ పార్టీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాదని ఈమెకు సీటు ఇచ్చింది. ఇక చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గెలుపొంది గతంలో కోల్పోయిన పట్టును తిరిగి పొందారు. ఈయనది ఒకరకంగా వ్యక్తిగత విజయంగా చెప్పుకోవచ్చు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి హైదరాబాద్ నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు.ఈ మొత్తం ప్రక్రియలో బాగా దెబ్బతిన్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. లోక్ సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కేసీఆర్ బస్ యాత్ర ద్వారా ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సభలకు జనం బాగానే వచ్చారు. అయినా ఒక్క సీటు కూడా రాకపోవడం వారికి బాధాకరమైన విషయమే. కాకపోతే ఇదేమీ ఊహించని విషయం కాదు. ఇప్పుడు వారు పార్టీ పునర్మిర్మాణంపై దృష్టి పెట్టవలసి ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి తిరిగి పార్టీని పెంపొందిస్తేనే వచ్చే శాసనసభ ఎన్నికలలో నెగ్గే అవకాశం ఉంటుంది.బీజేపీ ఇంకా పుంజుకుంటే బీఆర్ఎస్కు గడ్డు కాలమే అవుతుంది. ఈ లోగా బీజేపీ లేదా కాంగ్రెస్తో పొత్తులోకి వెళితే అప్పుడు రాజకీయాలు మరోరకంగా ఉంటాయి. దానిపై అప్పుడే ఒక కంక్లూజన్కు రాలేము. కాంగ్రెస్, బీజేపీలకు చెరి సమానంగా సీట్లు రావడం ద్వారా ఈ రెండుపార్టీలే భవిష్యత్తు తెలంగాణ రాజకీయాలలో మెయిన్ ప్లేయర్లుగా ఉంటాయా అనే చర్చ జరగవచ్చు. కానీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను అంత తొందరగా తీసివేయలేం.ఫీనిక్స్ పక్షి మాదిరి మళ్లీ పైకి లేస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేయడం బాగానే ఉంది కానీ, అందుకు చాలా వ్యూహాలు అమలు చేయవలసి ఉంటుంది. మళ్లీ జనంలో బీఆర్ఎస్పై విశ్వాసం పెంచుకోగలగాలి. కాంగ్రెస్, బీజేపీలకన్నా తామే బెటర్ అని ప్రజలలో నమ్మకం కలిగించగలగాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ తన వాగ్దానాలలో మరికొన్నిటిని అయినా అమలు చేసి ప్రజలలో పరపతి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టడానికి బీజేపీ కాచుకు కూర్చుని ఉంటుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వెల్డన్ గురు..
సాక్షి, తిరుపతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మద్దెల గురుమూర్తి విజయం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫలితాలన్నీ కూటమి అభ్యర్థులకే అనుకూలంగా వస్తుండడంతో తిరుపతి పార్లమెంట్ కూడా బీజేపీ అభ్యర్థే గెలుస్తారని ధీమాగా అనుకున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి చేసిన కృషిని, ఆయన మంచితనంపై అసత్యాలు, అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసినా.. ఓటర్లు మద్దెల గురుమూర్తికే పట్టం కట్టారు. ఊహించని విధంగా తిరుపతి ఎంపీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడంపై కూటమి నేతలు జీరి్ణంచుకోలేకపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే తిరుపతి పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాద్ పరాజయం పాలవ్వగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గొప్ప గెలుపు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘క్రాస్’ చేయాలని చూసి బోల్తా పడిన కూటమి.. తిరుపతి ఎంపీ నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మద్దెల గురుమూర్తికి అనుకూలంగా భారీస్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగిందనేది స్పష్టం అవుతోంది. ప్రజల కష్టం తెలిసిన వ్యక్తి ఎంపీ కావడంతో నియోజకవర్గానికి ఏదో ఒక మంచి చేయాలనే తపనతో పని చేశారనేది గురుమూర్తికి ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. కూటమి ఎంపీ అభ్యర్థి చేసిన దు్రష్పచారాలు ఫలించలేదు. క్రాస్ ఓటింగ్ చేయించి గట్టెక్కాలని భావించారు. కానీ గురుమూర్తి మంచితనం, కృషి ముందు కూటమి కుట్రలు ఏవీ పనిచేయలేదు. అదెలా అంటారా? తిరుపతి లోక్సభ పరిధిలోని తిరుపతిలో 60,255 ఓట్లు, శ్రీకాళహస్తిలో 41,979, సూళ్లూరుపేటలో 28,362, వెంకటగిరిలో 15,454, గూడూరులో 19,915, సర్వేపల్లిలో 15,994 ఓట్ల తేడాతో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఈ మెజారిటీలను చూస్తే కూటమి అభ్యర్థే ఘనవిజయం సాధించాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైఎస్సార్సీపీ వైపే మొగ్గుచూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజారిటీ వచ్చింది. ఈ మెజారిటీతో పాటు కూటమి అభిమానులు తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యరి్థని గెలిపించుకున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీ అభ్యర్థులంతా గెలిచి, ఎంపీ అభ్యర్థి ఓడిపోవడంపై రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురవుతున్నారు. తిరుపతి జిల్లాకు పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ఎంపీ గురుమూర్తి గత మూడేళ్లుగా అనేక ప్రయత్నాలు చేశారు. కంపెనీల చుట్టూ తిరుగుతూ వారిని జిల్లావ్యాప్తంగా తిప్పి కంపెనీలు, కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన వసతులు అన్ని తామే సమకూర్చగలమని విన్నవించారు. తద్వారా ప్రజల్లో గురుమూర్తి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నిస్వార్థంగా ప్రజలకు ఎంతో కొంతమేలు చేయాలనే తత్వం, ఆ కష్టానికి ప్రజల ఆశీర్వాదం మళ్లీ లభించింది. వైఎస్సార్సీపీ అభ్యర్థులు చాలామంది ఓడిపోయినా గురుమూర్తి గెలిచారంటే అది ఆయన కష్టాలకు తగిన ఫలితమే అని పలువురు చర్చించుకుంటున్నారు. ఎంపీగా గురుమూర్తి అధికారాన్ని పదిమందికి సాయం చేయడంతో పాటు కార్యకర్తలకు, ఓటర్లకు దగ్గర కావడమే ఆయనకు విజయానికి కారణమని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కలిసొచ్చిన అంశాలు ఇవే.. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో 2021 ఉప ఎన్నికల్లో గురుమూర్తి తొలిసారి రాజకీయ ప్రవేశం చేసి తిరుపతి ఎంపీగా 6,2 6,108 ఓట్లు సాధించారు. తన సమీప ప్రత్యరి్థ, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీపై 2,71,592 లక్షల మెజారీ్టతో గెలుపొందారు. 👉 ఎంపీగా గత మూడేళ్ల కాలంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సహకారంతో తిరుపతి పార్లమెంట్ అభివృద్ధికి విశేష కృషి చేశారు. 👉 గత మూడేళ్లలో ఎంపీగా గురుమూర్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 👉 తిరుపతి పరిధిలో కొత్త జాతీయ రహదారుల ఏర్పాటు, పులికాట్ సరస్సు పరిధిలోని గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు. రోడ్ల నిర్మాణానికి ఆటంకంగా ఉన్న ఎకో సెన్సిటివ్ జోన్ నిబంధనలు సడలించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన సహకారంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. వందలాది గ్రామాలకు సంబంధించిన ప్రధాన సమస్య పరిష్కారానికి అధికారిక ప్రక్రియ ప్రారంభింపజేశారు. 👉 అలాగే 16 వేల కేంద్రప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు ఆరోగ్య సంరక్షణకు వెల్నెస్ సెంటర్ తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 👉 వేలాదిమంది యువతకు ఇంజినీరింగ్ నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇచ్చేందుకు కేంద్రప్రభుత్వ నైలెట్ సంస్థ తిరుపతికి మంజూరు చేయించారు. 👉 స్విమ్స్, డీఆర్డీఓ అనుబంధ సంస్థ డేబెల్తో తక్కువ ఖరీదుకే రోగులకు మెడికల్ ఇంప్లాంట్స్ తయారు చేసే ప్రాజెక్టు తీసుకొచ్చారు. 👉 రైల్వే ప్రాజెక్టుల పురోగతిలో తనదైన ముద్ర వేశారు. తిరుపతి రైల్వేస్టేషన్ను రూ.350 కోట్లతో ప్రాజెక్టు పనుల వేగం పెంచారు. 👉 తిరుపతి ప్రజలకు నరకంగా ఉన్న రాయలచెరువు రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జి ఏర్పాటు చేయించారు. 👉 ఏర్పేడు, వెంకటగిరి రైల్వే ఫ్లైఓవర్లు మంజూరు చేయించారు. 👉 తిరుపతి ఆర్టీసీ బస్టాండ్కు ఎదురుగా రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 లక్షలు నిధులు ఇచ్చారు. 👉 యూనివర్సిటీ రోడ్డులో ఉన్న రైల్వే డీఐకాన్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకున్నారు. 👉 వెంకటగిరి కేంద్రీయ విద్యాలయాలన్ని ఇంటరీ్మడియెట్ స్థాయికి పెంచి విద్యార్థులు అక్కడే చదువుకునేలా చర్యలు చేపట్టారు. -
ఎన్నికల్లో పట్టివేతలు : రూ.200 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మార్చి 16 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన సోదాల్లో రూ.200,27,60,036 విలువైన నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర విలువైన పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో నగదు రూ.99,16,15,968 పట్టుబడినట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 466 ఫ్లయింగ్ స్వాడ్లు, 89 అంతర్రాష్ట్ర చెక్పోస్టులలో తనిఖీలు కొనసాగాయి.సోదాల్లో రూ.11,48,00,955 విలువైన మద్యం పట్టుబడింది. రూ.14,52,53,412 విలువైన నార్కోటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 92.271 కిలోల బంగారం, 178.657 కిలోల వెండి పట్టుబడింది. ఇవికాకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తెచ్చిన మరో రూ.11,91,06,661 విలువైన వస్తువులు ఉన్నాయి. ఇక 7,272 లైసెన్స్ కలిగిన ఆయుధాలను, మరో 20 లైసెన్స్లేని ఆయుధాలను జప్తు చేసినట్టు డీజీపీ కార్యాలయం ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సోదాల్లో నగదు, మద్యం, మత్తుపదార్థాలు, బంగారం, వెండి, ఇతర వస్తువులు కలిపి రూ.46.3 కోట్లు స్వా«దీనం చేసుకున్నట్టు వెల్లడించింది. -
గులాబీ పార్టీకి వెరీ వెరీ టఫ్ టైం!
తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.బీఆర్ఎస్ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్ఎస్ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.కేసీఆర్ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్ఎస్ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్, హరీష్రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్ఎస్ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్ఎస్ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్ఎస్ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్ఎస్ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్ఎస్ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.అప్పట్లో కాంగ్రెస్ను వీక్ చేయడానికి కేసీఆర్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్ఎస్లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్ఎస్ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఢిల్లీలో ఢిపరెంట్ రాజకీయం.. ప్రచార వ్యూహం మారిందా?
బహుళ భాషలు, బహుళ ప్రాంతాల్లో ప్రజలున్న ఢిల్లీలో విభిన్న రీతుల్లో పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మినీ ఇండియాలాంటి ఢిల్లీని దక్కించుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్స్వీప్ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది.బీజేపీ ఏకంగా వివిధ రాష్ట్రాల సీఎంలను ఎన్నికల ప్రచార రంగంలోకి దింపింది. అన్ని రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్న దేశరాజధానిలో ఆయా ప్రాంతాలకు సీఎంలను పంపుతూ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. క్యాపిటల్లో ఓట్లు క్యాష్ చేసుకునేందుకు పార్టీలు డిఫరెంట్ క్యాంపైన్ చేయడమే ఢిల్లీ ఎన్నికల ప్రత్యేకత..ఢిల్లీలో ఎన్నికల ప్రచారం క్లైమాక్స్కు చేరడంతో చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఇండియా కూటమి అన్ని వనరులను ఉపయోగిసస్తున్నాయి. ఢిల్లీలో ప్రధానంగా యూపీ, బీహార్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, పరిమిత సంఖ్యలో దక్షిణాది ప్రజలున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలను పార్టీలు రంగంలోకి దింపాయి.రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ రాజస్థాన్ ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో.. అలాగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలు అధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో సీఎం పుష్కర్ ధామి విస్తృతంగా ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ జీపుల్లో అభ్యర్థులతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ తమ పార్టీకి మద్దతివ్వాలని అభ్యర్థించారు. తమ తమ రాష్ట్రాల మాండలికంలో మాట్లాడుతూ వారితో కనెక్ట్ అయ్యేందుకు ప్రయత్నించారు. రాష్ట్రాలలో తాము అందిస్తున్న పథకాలు, మోదీ గ్యారంటీలు ప్రచారం చేశారు. దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని, ఈసారి కేంద్రంలో హ్యాట్రిక్ ఖాయమని వారు చెబుతున్నారు.ఇటు బీజేపీ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఇతర రాష్ట్రాల నేతలను ప్రచారంలోకి దింపాయి. రాజస్థాన్ సీఎంగా పనిచేసిన అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థలకు మద్దతుగా ఢిల్లీలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ్లను ఢిల్లీలోని రాజస్థాన్వాసులకు వివరించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా ప్రచారంచేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి సైతం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు.చోటా భారత్ను తలపించే ఢిల్లీలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం ఒక్క నాయకుడి వల్లే అయ్యేది కాదు. అందుకే ఆయా రాష్ట్రాల, భాషల ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో వారి భాష మాట్లాడే నాయకుడిని పంపి తమకు మద్దతివ్వాలని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరి ఓటరు దేవుళ్లు ఎవరిని కరుణిస్తారో.. ఏ భాషలో సమాధానమిస్తారో చూడాల్సి ఉంది. -
ఏడాదిన్నరలో నాలుగోసారి..
కాఠ్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ ‘ప్రచండ’సోమవారం పార్లమెంట్లో విశ్వాస తీర్మానం నెగ్గారు. పార్లమెంట్లో ప్రచండ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(మావోయిస్ట్ సెంటర్) మూడో అతిపెద్ద పారీ్టగా ఉంది. సోమవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో 275 మంది సభ్యులకుగాను హాజరైన 158 మందిలో ప్రచండ ప్రభుత్వానికి అనుకూలంగా 157 మంది ఓటేశారు. ప్రచండ సభ విశ్వాసం పొందినట్లు పార్లమెంట్ స్పీకర్ ప్రకటించారు. ప్రచండ 2022లో ప్రధాని పగ్గాలు చేపట్టాక గత 18 నెలల్లో పార్లమెంట్ విశ్వాసం పొందడం ఇది నాలుగోసారి. -
యూకే పార్లమెంట్ బరిలో తెలుగు బిడ్డ
సాక్షి, సిద్దిపేట: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలంగాణ బిడ్డ నిలిచారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ఫోర్డ్షైర్ లేబర్ పార్టీ నుంచి ఆయనను అభ్యర్థిగా ప్రకటించింది. శనిగరం గ్రామానికి చెందిన ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో ఉదయ్ జన్మించారు. తల్లిదండ్రులు హనుమంతరావు, నిర్మలాదేవి. బ్రిటన్లోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లండన్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ చేశారు. కష్టపడేత త్వం కలిగిన ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచం, భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావా న్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనే థింక్ ట్యాంక్ని నెలకొల్పారు. మంచి వక్తగా పేరు సంపాదించా రు. సర్వే ఫలితాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఉదయ్ గెలిచే సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నా రు. తెలుగు బిడ్డ బ్రిటన్లో ఎంపీగా పోటీ చేస్తుండటం.. విజయం సాధిస్తారనే అంచనాలు ఉండటంతో తల్లి నిర్మలా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు బిడ్డ ఆ స్థాయికి ఎదగడంతో శనిగరం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సెలబ్రిటీల ఓటు ఇక్కడే..
బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో చాలామంది ప్రముఖులు ఓటు వేయనుండగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కూడా మరికొంతమంది తారలు ఓటు వేయనున్నారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఓటు వేసి తమ బాధ్యతను చాటిచెప్పారు. ప్రతిఒక్కరూ ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. ఓటు ప్రాముఖ్యతను తెలియజేశారు. ప్రజలపై సినీతారల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఆ ఎన్నికల్లో ఓటర్లు కూడా భారీగా తరలివచ్చి తాము సైతం అంటూ ఓటు వేశారు. సోమవారం జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సైతం అటు సినీ ప్రముఖులు, ఇటు ఓటర్లు అదే స్ఫూర్తిని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. 👉 బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా బంజారాహిల్స్లోని నందినగర్ కమ్యూనిటీ హాలులో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 జూనియర్ ఎన్టీఆర్ బంజారాహిల్స్లోని ఓబుల్రెడ్డి స్కూల్లో, కల్యాణ్రామ్ ఎమ్మార్వో ఆఫీసు పోలింగ్ బూత్లలో ఓటు వేస్తారు. 👉 సినీ ప్రముఖుల్లో చిరంజీవి, సురేఖ, రామ్చరణ్, ఉపాసన, నితిన్లు జూబ్లీహిల్స్ క్లబ్ బూత్ నెంబర్–149లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. 👉 హీరో రవితేజ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ, సెంట్రల్ నర్సరీ బూత్ నెంబర్ 157లో, అక్కినేని నాగార్జున, అమల జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–45, ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో, మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేస్తారు. 👉 విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, బ్రహ్మజీ, జీవిత, రాజశేఖర్లు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్లో మోహన్బాబు, మంచు విష్ణు, రాఘవేంద్రరావు, కోట శ్రీనివాసరావు, పరుచూరి గోపాలకృష్ణ, విశ్వక్సేన్, రాణా, సురేష్బాబు ఓటు వేస్తారు. 👉 అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్లు జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–69 బీఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఓటేస్తారు. 👉 హీరో వెంకటే‹Ù, బ్రహా్మనందం మణికొండ హైస్కూల్లో, రాజమౌళి, రమ షేక్పేట ఇంటర్నేషనల్ హైస్కూల్లో, సుధీర్ బాబు దర్గా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో, అల్లరి నరేష్ జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–45లోని మహిళా ఆర్థిక సహకార సంస్థలో, తనికెళ్ల భరణి యూసుఫ్గూడ చెక్పోస్టు హైసూ్కల్ పోలింగ్ కేంద్రంలో, సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల పద్మారావు నగర్ వాకర్స్ టౌన్ హాలులో ఓటు వేస్తారు. -
Hyderabad: వీరు తమ ఓటు తాము వేసుకోలేరు
హైదరాబాద్: గ్రేటర్పరిధిలోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ప్రధాన పారీ్టల అభ్యర్థుల్లో కొందరు తమ ఓటును తమకు వేసుకోలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ ఏఐఎంఐఎం అభ్యర్థి అసదుద్దీ¯న్ ఒవైసీ రాజేంద్రనగర్ పరిధిలోని శా్రస్తిపురంలో నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తుంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత నివాసం ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్రహిల్స్లో ఉంది. ఈ ప్రాంతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ నివాసం జూబ్లీహిల్స్లో ఉంది. అది సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తోంది. చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కుత్బుల్లాపూర్లో నివాసం ఉంటున్నారు. అది మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్రెడ్డికి తాండూరులో ఓటుంది. ఆ ప్రాంతం చేవేళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. వీరందరూ తమ ఓటును తాము వేసుకోకుండా ఇతరులకు వేయాల్సిన పరిస్థితి ఉంది. -
లోక్సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: లోక్సభ ఎన్నికలకు గడువు దగ్గరపడుతున్న కొద్దీ మూడు ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ము మ్మరం చేస్తున్నాయి. ఇంకా వారం రోజులు మాత్రమే ఎన్నికల ప్రచారానికి సమయం ఉంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లు శాసనసభ సెగ్మెంట్ల పరిధిలోని అన్ని మండలాల్లో నాలుగైదు గ్రామాలకు ఒక కమిటీని, మున్సిపాలిటీల్లో వార్డులు, డివిజన్ల వారీగా కమిటీలు వేసుకుని క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఆయా కమిటీల్లో సీనియర్లతో పాటు జూ నియర్లను సభ్యులుగా చేర్చారు. వీరంతా ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయిలో అన్ని ఇళ్లను తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. తమ పార్టీ ప్రాధాన్యతలను వివరిస్తూ ముందుకు వెళుతున్నారు.నిజాం షుగర్స్, పసుపు బోర్డు తదితర అంశాలు, గల్ఫ్, బీడీ కార్మికులు, రైతు కూలీలు, ఉపాధి కూలీల సమస్యలతో పాటు మండలాలు, గ్రామా ల్లో స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారంపై నాయకులు, కార్యకర్తలు హామీలు ఇస్తున్నారు. ము ఖ్యంగా పోలింగ్ బూత్ల పరిధిలో సాధించే ఆధిక్యతను బట్టి స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని పార్టీల అగ్రనాయకులు చెప్పడంతో శ్రే ణులు గట్టిగా ప్రచారం చేస్తున్నాయి. ఆధిక్యత సాధి స్తే తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు లభిస్తాయనే ఆశాభావంతో శ్రమకోర్చి ప్రచారంలో పాల్గొంటున్నారు.తమ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపు లక్ష్యంతో పాటు స్థానికంగా తమ ఉనికినీ చాటుకునేలా మూడు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా పని చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన వెంటనే కొన్ని రోజుల తేడాతోనే గ్రామ పంచాయతీ సర్పంచ్, మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజాపరిషత్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి జూన్ ఆఖరులో లేదా జూలై ప్రారంభంలో ముగించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లోక్సభ ఎన్నికల కోసం పనిచేయాలని, వారి పనితీరునే ప్రామాణికంగా తీసుకుని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ పదవుల పోటీకి అవకాశాలు కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు స్థానికంగా వచ్చే ఓట్లకు సంబంధించి కూడికలు, తీసివేతల లెక్కలు వేసుకుంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తమ గ్రామాల్లో సాధించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ప్రచార వ్యూహాలను రూపొందించుకుని క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఆయా నాయకులు, కార్యకర్తలు తమ ప్రాంతాల్లో వచ్చిన ఓట్లను బూత్ల వారీగా సరిచూసుకుని ప్లస్లు, మైనస్లను బేరీజు వేసుకుని ప్రచారం చేస్తున్నారు.బీఆర్ఎస్ పార్టీ గత శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలో జగిత్యాల, కోరుట్ల, బాల్కొండ స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో నెలకొన్న త్రిముఖ పోటీ తమకు కలిసొస్తుందని లెక్కలు వేసుకుంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 6న నిజామాబాద్, 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్షోలు ఉండడంతో వాటిని విజయవంతం చేసేందుకు గాను బీఆర్ఎస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.కేంద్రంలో మరోసారి అధికారాన్ని దక్కించుకునే లక్ష్యంతో బీజేపీ శ్రేణులు ఉన్నాయి. నిజామాబాద్లో వరుసగా రెండోసారి జెండా ఎగురవేయాలనే పట్టుదలతో కార్యకర్తలు చెమటోడుస్తున్నారు. ‘మరోసారి మోదీ సర్కార్’ నినాదంతో పార్టీ శ్రేణులు, అనుబంధ హిందూ సంఘాలు క్షేత్రస్థాయిలో దూకుడుగా ప్రచారం నిర్వ హిస్తున్నాయి. పట్టణాల్లో, గ్రామస్థాయిలోనూ భారీగా ఓట్లు రాబట్టుకునేందుకు బీజేపీ శ్రేణులు, యువత గట్టిగా ప్రచారం చేస్తున్నారు.ఇవి చదవండి: మీరు తీసుకునేది ‘ట్యాపింగ్’ పైసలే : మాజీ మంత్రి పెద్దిరెడ్డి -
తొలి దశలో దిగ్గజాల పోరు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఒక మాజీ గవర్నర్సహా 8 మంది కేంద్ర మంత్రలు, ఇద్దరు సీఎంలు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల తొలి దశ పోరులో పోటీపడుతున్నారు. రేపు పోలింగ్ జరగబోయే 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ప్రచారం బుధవారంతో ముగిసింది. తమ తమ నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఎదురవుతున్నాసరే పక్కా వ్యూహరచనతో ముందడుగు వేస్తున్నారు. నితిన్ గడ్కరీ మహారాష్ట్రలోని నాగ్ పూర్ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్దమైన బీజేపీ నేత నితిన్ గడ్కరీ తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. 2014లో ఏడుసార్లు ఎంపీగా గెలిచిన విలాస్ ముట్టెంవార్పై 2.84 లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించి గడ్కరీ తన సత్తా ఏమిటో అందరికీ తెలిసేలా చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర కాంగ్రెస్ సారథి నానా పటోలేను 2019లో ఇదే నాగ్పూర్లో 2.16 లక్షల మెజారిటీతో మట్టికరిపించి తనకు ఎదురులేదని గడ్కరీ నిరూపించారు. అయితే ఇటీవల స్థానికంగా బాగా పట్టు సాధించిన కాంగ్రెస్ నేత వికాస్ థాకరే(57) గడ్కరీకి గట్టి సవాలు విసురుతున్నారు. నాగ్పూర్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న థాకరే కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు. ప్రకాశ్ అంబేద్కర్కు చెందిన వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ సైతం థాకరేకి మద్దతు పలికింది. కాంగ్రెస్లో అన్ని వర్గాలు ఒక్కటై థాకరే విజయం కోసం పనిచేస్తుండడంతో గడ్కరీ అప్రమ్తత మయ్యారు. కాంగ్రెస్ నేతలు నిరుద్యోగం, స్థానిక సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. దీంతో గడ్కరీ ఆయన సతీమణి, కుమారుడు, కోడలు సైతం నిప్పులు కక్కే ఎండల్లో విరివిగా ప్రచారం చేశారు. కిరెన్ రిజిజు: 2004 నుంచి అరుణాచల్ ప్రదేశ్ నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు నాలుగోసారి సార్వత్రిక సమరంలో దూకారు. 52 ఏళ్ల రిజిజుకు ఈసారి నబాం టుకీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురయ్యారు. టుకీ అరుణాచల్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు ప్రస్తుతం ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా. టుకీకి కరిష్మా తక్కువేం లేదు. దీంతో ఆసక్తి సర్వత్రా నెలకొంది. సర్బానంద సోనోవాల్: నౌకాశ్రయాలు, షిప్పింగ్, నదీజలాల రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సోనోవాల్ సైతం ఈసారి అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి బరిలో దిగారు. రాజ్యసభ సభ్యుడైన సోనోవాల్ ఈసారి లోక్సభలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలికి బీజేపీ ఈసారి టికెట్ నిరాకరించి సోనోవాల్ను నిలబెట్టింది. సంజీవ్ భలియా: ఉత్తరప్రదేశ్లో కులరాజ కీయాలకు పేరొందిన ముజఫర్నగర్లో కేంద్ర మంత్రి సంజీవ్ భలియా పోటీకి నిలబడ్డారు. ఈయనకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి హరీంద్ర మాలిక్, బహుజన్సమాజ్ పార్టీ అభ్యర్థి దారాసింగ్ ప్రజాపతి నుంచి గట్టిపోటీ ఉంది. ఈ త్రిముఖపోరులో గెలుపు ఎవరిని వరిస్తుందో. జితేంద్ర సింగ్: జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మోదీ హయాంలో సహాయ మంత్రిగా సేవలందించారు. హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని తెగ ప్రచారం చేశారు. భూపేంద్ర యాదవ్: రాజ్యసభ సభ్యుడైన భూపేంద్ర మోదీ మంత్రివర్గంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా సేవలందిస్తున్నారు. రాజస్థాన్లోని అల్వార్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బాలక్ నాథ్ను పక్కనబెట్టిమరీ పార్టీ ఈయనకు టికెట్ ఇచ్చింది. జిల్లాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే లలిత్ యాదవ్ ఈయనకు గట్టిపోటీ ఇస్తున్నారు. జిల్లాలోని మత్స్య ప్రాంతంలో యాదవుల మద్దతు ఇద్దరికీ ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అర్జున్రాం మేఘ్వాల్: రాజస్థాన్లోని బికనీర్ నుంచి తలపడుతున్న కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో మాజీ కాంగ్రెస్ మంత్రి గోవింద్ రామ్ మేఘ్వాల్ తలపడుతున్నారు. ఎల్.మురుగన్: తమిళనాడులోని నీలగిరి నియోజకవర్గంలో కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎల్.మురుగన్ తన అదృష్టం పరీక్షించుకోనున్నారు. ఇక్కడ డీఎంకే సిట్టింగ్ ఎంపీ, మాజీ కేంద్ర టెలికం మంత్రి ఏ.రాజా నుంచి మురుగన్కు గట్టి పోటీ ఎదురవుతోంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మురుగన్ తొలిసారిగా నీలిగిరి నుంచి నిలబడ్డారు. తమిళిసై సౌందరరాజన్: తెలంగాణ గవర్నర్గా పనిచేసి రాజీనామా చేసి మళ్లీ రాజకీయరంగప్రవేశం చేసిన తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ స్థానం నుంచి పోటీచేస్తున్నారు. గతంలో తూత్తుకుడి నుంచి తమిళిసై పోటీచేసి డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమిని చవిచూశారు. బిప్లవ్కుమార్ దేవ్: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. వెస్ట్ త్రిపురలో బిప్లవ్ దేవ్కు పోటీగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిశ్ కుమార్ సాహా నిలబడ్డారు. ఇద్దరికీ ఈ నియోజకవర్గంపై గట్టిపట్టుంది. దీంతో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టంగా మారింది. -
నెత్తురోడిన బస్తర్.. ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టుల మృతి
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పార్లమెంట్ ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న భీకర ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. భద్రతా దళాలకు చెందిన ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. మృతుల్లో ఇప్పటివరకు ముగ్గురిని గుర్తించగా.. వారిలో ఇద్దరు తెలంగాణ వాసులు ఉన్నారు. మరికొందరు తెలంగాణ వాసులు కూడా మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు.. మావోయిస్టులకు మధ్య మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందిందని బస్తర్ ఐజీ పి.సుందర్రాజ్, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి మంగళవారం రాత్రి వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ, ఆర్కేబీ డివిజన్ కమి టీ కార్యదర్శి సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్, అలియాస్ శంకర్రావు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్ల రామపురం గ్రామానికి చెందిన ఈయ నపై రూ.25 లక్షల రివార్డు ఉంది. మరోవైపు దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ కూడా మరణించినట్లు తెలుస్తోంది. గత పదిహేనేళ్లలో బస్తర్ అడ వుల్లో ఇదే అతి పెద్ద ఎన్కౌంటర్గా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టుల సమావేశంపై సమాచారంతో.. బస్తర్ అటవీ ప్రాంతంలో మొత్తం ఏడు జిల్లాలు ఉండగా కాంకేరు జిల్లా ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినాగుండ, కరోనార్ మధ్య హపటోలా, (ఛోట్ బెటియా పోలీస్ స్టేషన్కు తూర్పున 15 కి.మీ దూరంలో) మాడ్ సమీప అటవీ ప్రాంతంలో ఈ భారీ ఎన్కౌంటర్ జరిగింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మాడ్ ప్రాంతంలో మావోయిస్టు నేతలు సమావేశం అయ్యారన్న పక్కా సమాచారంతో పోలీసు బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల సమయాన ఇరువర్గాల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు మొదలయ్యాయి. ఎన్కౌంటర్ రాత్రి వరకు కొనసాగగా..ఎదురుకాల్పుల తర్వాత మావోయిస్టుల మృతదేహాలను బలగాలు స్వా«దీనం చేసుకున్నాయి. అలాగే ఘటనా స్థలంలో ఏడు ఏకే–47 రైఫిల్స్, మూడు లైట్ మిషన్ గన్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లతో పాటు పెద్ద సంఖ్యలో ఇతర ఆయుధాలు, సామగ్రి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఆయుధాల ఆధారంగా మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు భావిస్తున్నారు. మృతుల్లో మజ్జిదేవ్ భార్య లలిత! ఎన్కౌంటర్లో మృతిచెందిన వారిని గుర్తించే పనిలో ఉన్న పోలీసులు అజ్ఞాతంలో ఉన్న అనుమానిత మావోయిస్టుల కుటుంబాలకు సమాచారం పంపి ఆరా తీస్తున్నారు. 1995 నుంచి మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న చిన్నన్న 2000 సంవత్సరంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. పారీ్టలో వెళ్లేకంటే ముందే వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా ఈ ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగెకు చెందిన సిరిపల్లె సుధాకర్ అలియాస్ శంకర్, ఆయన భార్య అదిలాబాద్ జిల్లా బజార్హత్నూరుకు చెందిన ఆశశ్వర్ సుమన అలియాస్ రజిత మరణించినట్లు తెలుస్తోంది. సిరిపల్లె సుధాకర్ దండకారణ్యంలోనే డీవీసీలో పని చేస్తుండగా.. ఆయన భార్య రజిత అదే ప్రాంతంలో డీసీఎస్ స్థాయిలో ఉందని సమాచారం. అదే విధంగా దండకారణ్యం స్పెషల్ జోన్ స్టేట్ మిలటరీ కమిషన్ ఇన్చార్జి రాంధర్ అలియాస్ మజ్జిదేవ్ భార్య లలిత కూడా మృతి చెందినట్లు తెలిసింది. లలిత మహారాష్ట్రకు చెందిన వారని గుర్తించారు. అలాగే దండకారణ్యం ఐదవ కంపెనీకి చెందిన కమాండర్ రాజు సలామ్ కూడా మృతుల్లో ఉన్నట్లు తెలిసింది. ఈయనది ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా చెబుతున్నారు. మజ్జిదేవ్ కూడా ఉన్నారా? ఈ ఎన్కౌంటర్ మృతుల్లో దండకారణ్యం అగ్రనేత మజ్జిదేవ్ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఆయన భార్య లలిత మృతి చెందడంతో.. మజ్జిదేవ్ కూడా మృతుల్లో ఉండే అవకాశం లేకపోలేదంటున్నారు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమాల్లో కీలకంగా పనిచేస్తున్న మజ్జిదేవ్ పేరు ఇటీవలే వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక మరణించిన వారిలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలకు చెందిన పలువురు మావోయిస్టులు కూడా ఉండే అవకాశం ఉందని పోలీసువర్గాలు చెబుతున్నాయి. అటవీ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ జరుగుతోందని తెలిపాయి. ఎన్కౌంటర్లో గాయపడిన బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు డీఆర్జీ పోలీసులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. నెలరోజుల్లో 79 మంది లోక్సభ ఎన్నికల ముంగిట బస్తర్ అడవుల్లో భీతావహ పరిస్థితి నెలకొంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు పట్టుదలగా అడవుల్లోకి చొచ్చుకెళ్తున్నాయి. గడిచిన 30 రోజుల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో మావోయిస్టు పారీ్టకి చెందిన 79 మంది మరణించారు. ఇందులో మిలీíÙయా సభ్యులు మొదలు కంపెనీ కమాండర్ల వరకు వివిధ స్థాయి నేతలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఈనెల 19న లోక్సభ ఎన్నికల తొలి విడత, 26న రెండో దశ పోలింగ్ జరగనుంది. తెలంగాణ పోలీసుల అలర్ట్ సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోవడంతో రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంలైన ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాల ఎస్పీలను పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లో కూంబింగ్ను ముమ్మరం చేశారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మావోయిస్టుల కదలికలు లేనప్పటికీ, ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చనే అనుమానంతో తనిఖీలు పెంచినట్టు తెలిసింది. -
కాంగ్రెస్కు రెండు సీట్లు కూడా రావు: కేసీఆర్
సంగారెడ్డి,సాక్షి: రాజకీయాల్లో అప్పుడప్పుడు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు అధికారం వస్తుందని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే లిల్లిపుట్ గాళ్లకు సురుకు పెట్టినట్లతవుతుందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. సంగారెడ్డిలో మంగళవారం(ఏప్రిల్ 16) జరిగిన మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో వణుకుతున్నాడు. కాంగ్రెస్ పనైపోయింది. ఆ పార్టీపై ప్రజాగ్రహం ప్రారంభమైంది. సీఎం భయం చూస్తే ఏడాది కూడా ఉండేటట్టు లేడు. ముఖ్యమంత్రి ఉంటడా వేరే పార్టీలకు జంపైతడా తెల్వదు. ఇక్కడేమో కాంగ్రెస్కు ఓటేయమంటాడు. ఢిల్లీకి పోయి బీజేపీకి ఓటేయమంటాడు. నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదిగేలా.. నన్ను పెంచింది మెతుకు సీమ. మీరిచ్చిన బలంతోనే ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నాం. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపిచ్చిన మెతుకుసీమ గడ్డ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. కొంత మంది బీఆర్ఎస్కు పార్లమెంట్ సీట్లు ఎందుకని అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కావాలి ఎంపీ సీట్లు బీఆర్ఎస్కు. బీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు నెరవేర్తాయి. రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు ఉంటుంది. గుడ్డి లక్ష్మి వచ్చినట్లు కొంత మంది లిల్లిపుట్ గాళ్లకు కూడా అధికారం వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టుకుని ఆవిష్కరించుకున్నాం. విగ్రహం పెట్టుకున్న తర్వాత జరిగిన తొలి జయంతి రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది. పూలమాల పెట్టలే.. ఏర్పాట్లు చేయలే.. సందర్శకులు వెళ్లకుండా గేట్లు బంద్ చేశారు. ఇది కండకావరమా.. అజ్ఞానమా.. మరి సెక్రటేరియట్లో ఎందుకు కూర్చుకుంటున్నారు. దానికి కూడా అంబేద్కర్ అని పేరు పెట్టాం కదా.. యాదాద్రి గుడికి ఎందుకు వెళుతున్నారు..ఎమ్మెల్యే క్వార్టర్లలో ఎందుకు ఉంటున్నారు. అవన్నీ మేమే కట్టాం. ఇదే లిల్లీపుట్ గాళ్ల పార్టీ సింగూరు నుంచి ఒక్క చుక్క నీరు కూడా మెదక్కు ఇవ్వలే. మనం సంగమేశ్వర, బసమేశ్వర లిఫ్ట్లు పెట్టుకున్నం. వాటిని ఈ ప్రభుత్వం పట్టించుకుంట లేదు. దళితబంధు బంద్ పెడితే నోరు మూస్కోని పడుందామా.. అంబేద్కర్ను అవమానిస్తే చూస్తూ ఊరుకుందామా. వీళ్లకు సురుకు పెట్టాలె. ఈ ప్రభుత్వం మెడలు వంచి హామీలు నెరవేర్చాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టాల్సిందే. ఉద్యోగులకు ఎన్నో ఇచ్చాం గుర్తులేదా.. ఆలోచించండి లేదంటే బీఆర్ఎస్కు ఏం కాదు.. మీరే నష్టపోతరు. కరెంటు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. డీజీపీ వార్నింగ్.. పోలీసులు మీకు రాజకీయాలెందుకు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోం. కరీంనగర్లో సల్వాజీ మాధవరావు అనే బీఆర్ఎస్ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారు. డీజీపీకి వార్నింగ్ ఇస్తున్నా.. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. మీరేం చేస్తున్నరో అన్నీ రికార్డు చేస్తున్నం. జాగ్రత్త’ అని కేసీఆర్ హెచ్చరించారు. -
కమల దళం కార్యాచరణ జోరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం ఎన్నికల ప్రణాళిక అమలు ఊపందుకుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ను వెనక్కు తోసేలా ఎక్కువ సీట్లు గెలుపొందాలనే లక్ష్యసాధనకు అనుగుణంగా రోజురోజుకు వేగాన్ని పెంచుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నంబర్ వన్ స్థానం తనదేనని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ, మూడోసారి గెలిచి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతోందనే సానుకూల ప్రచారంతో ఏర్పడిన వాతావరణాన్ని ఇక్కడా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా ఎన్నికల ప్రచారం, ఇతర విషయాల్లో మిగతా పార్టీల కంటే జోరుగా అడుగులు వేస్తోంది. బీజేపీపాలిత రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ సానుకూల ప్రచారాన్ని విస్తృతస్థాయిలో తీసుకెళ్లి అధిక సీట్లు గెలవాలన్న జాతీయ నాయకత్వం వ్యూహాలను ఇక్కడా పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది. మరింత కష్టపడితే... రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో 10 సీట్లు గెలిచే అవకాశాలున్నాయన్న అంచనాల్లో ఉన్న బీజేపీ నాయకత్వం ఇంకా కొంచెం కష్టపడితే మరో రెండు స్థానాల్లోనూ విజయం సాధ్యమని గట్టిగా విశ్వసిస్తోంది. మిగతా పార్టీల కంటే ముందుగా అభ్యర్థుల ఖరారు, ముందుగానే తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని ముగించడం, పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ప్రధాని మోదీ ఇప్పటికే ఒక విడత ప్రచారాన్ని (ఐదు బహిరంగసభల్లో పాల్గొన్నారు) పూర్తిచేయడం, బూత్స్థాయిల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టడంపై అగ్రనేత అమిత్షా దిశానిర్దేశం వంటివి రాష్ట్రంలోని పార్టీ శ్రేణుల్లో గెలుపుపై ధీమా పెంచేందుకు దోహదపడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, ‘సారా కే సారే సత్రాయ్ హమారే’ (అన్నింటికి అన్ని సీట్లు మావే) అనే నినాదాన్ని విస్తృతంగా జనసామాన్యంలోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టితో... పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుపొందడం ద్వారా రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. ఈవిధంగా తెలంగాణలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందనే సందేశం ప్రజల్లోకి వెళితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం తథ్యమనే సంకేతాలు వెళ్తాయనే ధీమా రాష్ట్ర నాయకత్వంలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లను సమానంగా టార్గెట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలని నిర్ణయించినట్టు పార్టీ ముఖ్యనేతల సమాచారం. -
దక్షిణ కొరియా అధ్యక్షునికి ఎదురుదెబ్బ
సియోల్: పీపుల్ పవర్ పార్టీ నేత, దక్షిణ కొరియా దేశాధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ పరిపాలనకు రెఫరెండంగా భావిస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ కూటమి ఘన విజయం సాధించింది. ఓట్ల లెక్కింపు తాజా సమాచారం ప్రకా రం 300 సీట్లకుగాను విపక్షాల కూటమి 175 చోట్ల విజయం సాధించింది. అధికార పీపుల్ పవర్ పార్టీ, దాని మిత్రపక్షం కలిపి 109 చో ట్ల గెలిచాయి. ప్రతిపక్షం గెలుపుతో అ ధ్యక్షుడిగా యూన్ సుక్కు కష్టాలు మొదలయ్యాయి. పార్లమెంట్లో ప్రతిపక్షం ఆధిప త్యం పెరిగిన నేపథ్యంలో అధ్యక్షుడికి కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. -
బీజేపీ వరంగల్ అభ్యర్థిగా ‘అరూరి’..
సాక్షి ప్రతినిధి, వరంగల్: బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి రమేశ్ పేరును ఆ పార్టీ అధి ష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆదివారం రాత్రి ప్రకటించారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నుంచి 2014, 2018లో వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. ఆయన ఓటమికి సొంత పార్టీకి చెందిన వారే కొందరు కోవర్టుగా పని చేశారని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసంతృప్తిగా ఉన్న ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకోగా.. కేటీఆర్, హరీశ్రావు, దయాకర్ రావు కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి మాట్లాడించారు. అయినప్పటికీ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్ష పదవికి, సభ్యత్వానికి రమేశ్ రాజీనామా చేశారు. ‘అరూరి’ రాజకీయ ప్రస్థానం.. అరూరి రమేశ్ 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆ పార్టీ తరఫున స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండేటి శ్రీధర్ పై 86,349 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2015 జనవరి 10 నుంచి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ లెజిస్లేచర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీల్లో అక్రమాలపై హౌస్ కమిటీ చైర్మన్గా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తెలంగాణ జన సమితి పార్టీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్యపై 99,240 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2022 జనవరి 26న టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్ధన్నపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో 19,458 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అనంతరం ఈనెల 16న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మరుసటి రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. సుమారు ఆరు రోజులపాటు వరంగల్ పార్లమెంట్ పరిధి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసిన అనంతరం ఏకాభిప్రాయంతో పార్టీ అభ్యర్థిగా అరూరి రమేశ్ను ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, నాయకులు ఆయనకు అభినందనలు తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల పోలీసుల అలర్ట్
భూపాలపల్లి: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఎస్పీ క్యాంప్ ఆఫీస్లో ఆ జిల్లా డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంకిత్ గోయల్, ఐజీ, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించుకున్నారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. దీనివల్ల మావోయిస్టులను కట్టడి చేయడం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. మొదటగా రామగుండం పోలీస్ కమిషనర్, భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే, ఆసిఫాబాద్ ఎస్పీ, మంచిర్యాల డీసీపీ రామగుండం నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి వెళ్లారు. సమావేశంలో మూడు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, ఓఎస్డీలు, డీఎస్పీలు, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
పార్టీ ఏదైనా.. పోటీలో ఉండటం ఖాయం! : సోయం బాపూరావు
సాక్షి, ఆదిలాబాద్: బీజేపీ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఆయన కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. హస్తం పార్టీ హైకమాండ్ కూడా పాజిటివ్గా ఉందనే టాక్ మొదలైంది. గురువారం రాత్రి రాష్ట్రంలో ఐదు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం ఆదిలాబాద్ స్థానం పెండింగ్ పెట్టడం వెనక ఇదే కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ టికెట్ గొడం నగేశ్కు కేటాయించిన తర్వాత సోయం కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే చేరికలు, అభ్యర్థి ఎంపిక పరిశీలన వేగవంతం చేయడంతో ఇక కాంగ్రెస్ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని అందరూ భావించారు. అయితే తాజా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఈ విషయమై సోయం బాపూరావును ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించినప్పుడు.. ‘పార్టీ ఏదైనా.. తాను పోటీలో ఉండటం ఖాయం..’ అని పేర్కొనడం గమనార్హం. సీనియర్ నేతలను ఢీకొట్టగలరా.. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొద్ది రోజులుగా పరిణామాలు వేగంగా మారు తూ వచ్చాయి. చివరకు ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్ తమ పోస్టులకు స్వచ్ఛంద విరమణ ప్రకటించి సీఎం సమక్షంలో గురువారం కాంగ్రెస్లో చేరిన తెలిసిన విదితమే. ఈ ఇద్దరి నుంచే ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ప్రచారం సాగింది. సుగుణ అనుచరులు సంబరాలు సైతం చేసుకున్నారు. అయితే ఒక్కరోజుకే పరిస్థితి మారిపోయింది. తాజాగా సోయం బాపూరావు కాంగ్రెస్లో చేరనున్నారనే ప్రచారం వారి అభ్యర్థిత్వం విషయంలో బ్రేక్ పడినట్టేననే చర్చ సాగుతుంది. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారని, ఈ సీనియర్ నేతలను కొత్త నేతలు ఢీకొట్టగలుగుతారా.. అనే సమీకరణాల్లోనూ పార్టీ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో గోండు సామాజిక వర్గానికే చెందిన సిట్టింగ్ సోయంనే పార్టీలోకి చేర్చుకొని బరిలోకి దించాలని హైకమాండ్ పాజిటివ్గా ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి కూడా మనస్సు మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే సోయం బాపూరావుకు బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి శనివా రం రావాలని పిలుపు అందింది. గొడం నగేశ్కు సహకరించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, తెలంగాణ ఇన్చార్జి తరుణ్ చుగ్ కోరేందుకే పిలిచారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోయం పార్టీ కార్యాలయానికి వెళ్తారా.. లేదా అనేది ఆసక్తికరం. పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలను ఆయన కలవకపోవచ్చనే ప్రచారం సాగుతుంది. మరోవైపు లంబాడాకు ఇస్తారనే చర్చ.. రాష్ట్రంలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఆదిలాబాద్ విషయంలో చివరి క్షణంలో పెండింగ్ పెట్టిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుంది. కాగా ఈ పెండింగ్ విషయంలో లంబాడా సామాజికవర్గ కాంగ్రెస్ నేతలు మరో రకంగా చెబుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఆదివాసీ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించిన దృష్ట్యా లంబాడా సామాజిక వర్గానికి కాంగ్రెస్కేటాయించే యోచనలో ఉండడంతోనే పెండింగ్ పెట్టిందని చెబుతుండటం గమనార్హం. మహబూబాబాద్ టికె ట్ లంబాడాకు కేటాయించడంతో ఆదిలాబాద్ స్థా నం సమీకరణాల్లో భాగంగా ఆదివాసీకే కేటాయిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ రాష్ట్ర, దేశ వ్యాప్తంగా ఉన్న బంజారా జనాభా దృష్ట్యా పార్టీ ప్రయోజనాల కోసం లంబాడాకు ఇవ్వాలని యోచిస్తుందని చెప్పుకొస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న నేతలను కూడా పార్టీ పరిశీలిస్తుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్లలో ఎవరికైనా టికెట్ దక్కవచ్చనే ప్రచారం కూడా లేకపోలేదు. ఏదేమైనా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు అయ్యేవరకు ఈ చర్చలు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే హోలీ పండగ తర్వాత నిర్ణయం వెలువడవచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవి చదవండి: MLC Kavitha: ఈడీ కస్టడీలో కవిత.. ఈరోజు అప్డేట్స్ -
వేడెక్కిన రాజకీయం
సాక్షి, మేడ్చల్ జిల్లా: పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగడంతో రాజకీయం వేడెక్కింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తెచ్చి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంపై జెండా ఎగురవేసేందుకు మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద లోక్సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజిగిరి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. మూడు జిల్లాలు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నగరంతోపాటు శివారు జిల్లాలైన మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిగి ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ స్థానంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ(బీజేపీ), భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)అభ్యర్థులను ప్రకటించగా... కాంగ్రెస్ గెలుపు గుర్రం కోసం అన్వేషిస్తోంది. శాసనసభ ఎన్నికల తర్వాత రాష్ట్రంతో పాటు నగర శివారు జిల్లాల్లోనూ రాజకీయ సమీకరణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుండటంతో ఓటర్ల ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మల్కాజిగిరి ఎంపీ పరిధిలో ప్రస్తుతానికి 37,28,519 ఓటర్లు ఉన్నారు. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,58,190 మంది ఓటర్లు ఉండగా, మల్కాజిగిరిలో 4,99,538, కుత్బుల్లాపూర్లో 7,12,756, కూకట్పల్లిలో4,71,878, ఉప్పల్లో 5,33,544, ఎల్బీనగర్లో 6,00,552, కంట్మోనెంట్లో 2,52,060 మంది ఓటర్లు ఉన్నారు. ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు వరకు కూడా అర్హులైన వారు కొత్తగా ఓటుహక్కు నమోదు చేసుకోవడానికి ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పార్టీలు అప్రమత్తం మల్కాజిగిరి నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు కావటంతో ... కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుందనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థిత్వాలను ఆయా పార్టీలు ప్రకటించటంతో వారు ప్రచారంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రచార పర్వంలో ముందున్నారు. పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించిన ఆయన బస్తీలు ,పురపాలక సంఘాలు ,డివిజన్లు, గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. ఈటల విజయం కోసం కేంద్ర హోంమంత్రి అమిత్షా కంట్మోనెంట్ అసెంబ్లీ నియోజవర్గ పరిధిలో పార్టీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొని ఎన్నికల శంఖారాన్ని పూరించగా, శుక్రవారం భారత ప్రధాని మోదీ మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రోడ్ షో కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ నెలకొనడంతో అభ్యర్థుల ఎంపిక కీలకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం తాజాగా పట్నం సునీతా మహేందర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆమె పేరును అధికారికంగా నేడో ,రేపో ప్రకటించవచ్చునని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీలో అసమ్మతిపై దృష్టి బీజేపీలో టికెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన కొందరు నేతలు పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ ఆశించిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అర్బన్ అధ్యక్షుడు పి.హరీష్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పెద్దలు అసంతృప్తి నేతలను బుజ్జగించటంతో పాటు అభ్యర్థి ఈటల గెలుపు కోసం పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
బీఎస్పీకి రెండు లోక్సభ సీట్లు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకు గాను రెండు లోక్సభ సీట్లను పొత్తులో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఇవ్వాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, నాగర్కర్నూలు లోకసభ స్థానాలను ఇచ్చేందుకు బీఆర్ఎస్ అంగీకరించింది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావుతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్. ప్రవీణ్కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఇటీవల రెండు పర్యాయాలు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో నాగర్కర్నూలుతో పాటు మరో రెండు స్థానాలను బీఎస్పీ కోరినప్పటికీ రెండు సీట్లు మాత్రమే ఇచ్చేందుకు బీఆర్ఎస్ సుముఖత వ్యక్తం చేసింది. బీఎస్పీకి కేటాయించిన రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను ఆ పార్టీ చేసుకుంటుందని బీఆర్ఎస్ ప్రకటించింది. కేసీఆర్తో జరిగిన చర్చల సారాంశాన్ని తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి వివరించిన అనంతరం బీఆర్ఎస్ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నట్లు బీఎస్పీ ప్రకటించింది. కాగా, 15 ఎంపీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయనుంది. ఇప్పటికే 11 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారయ్యారు. భువనగిరి, నల్లగొండ, మెదక్, సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు అయిన తర్వాతే బీఆర్ఎస్ జాబితా వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మోదీ జోష్ షో
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు వివిధ వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఏర్పాటు చేసిన ఈ రోడ్షో పార్టీ నాయకులు, కేడర్లో జోష్ నింపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, ఇతర వర్గాల వారు రోడ్డుకు ఇరువైపులా, ఇళ్లపై, షాపింగ్, కమర్షియల్ కాంప్లెక్స్లపై నుంచి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మోదీకి అభివాదం తెలిపారు. అబ్కీ బార్ 400 పార్...(ఈసారి 400 సీట్లు దాటాలి) ఇతర నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రద ర్శించారు. ప్రధానిని ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించడంపై పలువురు ఆనందం వ్యక్తం చేశారు. రోడ్షో సాగిన మార్గమంతా రెండువైపులా ఉన్న ప్రజలను మోదీ రెండు చేతులు ఊపుతూ పలకరించారు. ఈ సంద ర్భంగా డప్పు, డోలు, ఇతర వాయిద్య బృందాల ప్రదర్శనలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాలు ఆకట్టుకున్నాయి. నేడు నాగర్కర్నూల్కు మోదీ కేరళ నుంచి బయలుదేరి శుక్రవారం సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్టులో దిగిన ప్రధానికి కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. మోదీ నేరుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని మీర్జాల గూడకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక ఓపెన్టాప్ వాహనంలో మల్కాజి గిరి దాకా దాదాపు 1.3 కి.మీ. దూరం రోడ్షో నిర్వహించారు. ఆయన వెంట జీప్లో ఓ వైపు కిషన్రెడ్డి మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యుడు, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రమే (ఇద్దరు భద్రతా సిబ్బంది మినహా) రోడ్షోలో పాల్గొన్నారు. అంతకుముందు చేవెళ్ల, భువనగిరి, హైదరాబాద్ ఎంపీ అభ్యర్థులు కొండా విశ్వేశ్వేర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, మాధవీలతలను మోదీకి పరిచయం చేశారు. ఈ రోడ్షో మొదలు, చివరి పాయింట్ల వద్ద పలువురు బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు స్వాగతం పలికేలా లైనప్లు ఏర్పాటు చేశారు. కాగా రోడ్షో ముగియగానే మోదీ రాజ్భవన్ బసకు చేరుకున్నారు. ప్రధాని శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి నాగర్కర్నూల్కు చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ ముగిసిన తర్వాత హెలికాప్టర్లో కర్ణాటకలోని గుల్బర్గా వెళతారు. -
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచార వేడి
-
రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సాక్షి, మేడ్చల్ జిల్లా/చార్మినార్: తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రంలో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఆ మూడు పార్టీలు అవినీతి, కుటుంబ పార్టీలని దుయ్య పట్టారు. మంగళవారం సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్లో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో అమిత్షా మాట్లాడారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ చేతిలో కీలు బొమ్మలన్నారు. బీజేపీని ఓడించడమే ఏకైక లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అవినీతి జాబితా పంపిస్తానని, దానిపై జవాబు చెప్పిన తర్వాతనే బీజేపీపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఇటలీ వెళ్లి సేద తీరాల్సిందేనని ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు రూ.10వేల కోట్లు సాయం చేసిందన్నారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అమిత్షా తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 12 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా వారియర్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. బీఆర్ఎస్కు సీట్లు వచ్చినా.. రాకున్నా.. రాష్ట్రానికి ఉపయోగం లేదని, బీఆర్ఎస్, కాంగ్రెస్కు ఓటేస్తే అది దుర్వినియోగం అవుతుందని చెప్పారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీని మళ్లీ ప్రధాని చేయాలని, మోదీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రతీ సోషల్ మీడియా కార్యకర్త అప్రమత్తంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఒవైసీని ఓడిస్తాం: కిషన్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలిస్తేనే.. తెలంగాణలో బలమైన పార్టీగా ఎదగగలదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. ఈసారి హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీని ఓడిస్తామని చెప్పారు. జాతీయ, రాష్ట్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సోషల్ మీడియా వారియర్స్ ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఇతర పార్టీల తప్పుడు ప్రచారాలను ఖండించాలని చెప్పారు. ఈ పదేళ్లలో మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, మహేశ్వర్రెడ్డి, ఎంవీఎస్ ప్రభాకర్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు అమిత్ షా మంగళవారం సాయంత్రం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్రెడ్డి, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవి లత తదితరులు పాల్గొన్నారు. -
పదవుల కోసం పోయెటోళ్లతో పరేషానొద్దు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పదవుల కోసం పార్టీలు మారే వారికోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొందరు నేతలు అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారని, అలాంటి వారిని చూసి పార్టీని నమ్ముకున్న నేతలు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని సూచించారు. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతలో భాగంగా నియోజకవర్గాల వారీగా భేటీలు నిర్వహిస్తున్న కేసీఆర్.. సోమవారం నందినగర్ నివాసంలో నల్లగొండ, చేవెళ్ల బీఆర్ఎస్ కీలక నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. చెరువు నిండినపుడు కప్పలు చేరినట్లు, అధికారం ఉన్న చోటకు వలసలు సహజమని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. కొందరు నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం బీఆర్ఎస్కే మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని కోరుకుంటున్నారని, అన్ని స్థాయిల్లో పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. చేవెళ్ల అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్! చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరో ధీటైన అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వంపై నియోజకవర్గం పరిధిలోని కీలక నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన ఆయన.. కాంగ్రెస్, బీజేపీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేసిన నేపథ్యంలో బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ ధీటైన అభ్యర్థి అవుతారని పేర్కొన్నారు. త్వరలో చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు తేదీ నిర్ణయించాల్సిందిగా పార్టీ నేతలకు సూచించారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రకాశ్గౌడ్, అరికెపూడి గాంధీ. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, రోహిత్రెడ్డి, మహేశ్రెడ్డి, పార్టీ నేతలు కార్తీక్రెడ్డి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. రంజిత్రెడ్డి, గుత్తా అమిత్ దూరం లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి సోమవారం నాటి భేటీకి దూరంగా ఉన్నారు. తాను పోటీకి సిద్ధంగా లేనని కొద్ది రోజుల క్రితం రంజిత్రెడ్డి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరోవైపు మొన్నటివరకు నల్లగొండ, భువనగిరిలో ఏదో ఒకచోట నుంచి టికెట్ ఆశించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు గుత్తా అమిత్రెడ్డి కూడా కేసీఆర్తో జరిగిన భేటీకి హాజరు కాలేదు. టికెట్ రేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఆయన కూడా వారం క్రితమే పార్టీ అధినేతకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో త్వరలో పార్టీ కొత్త ఇన్చార్జిని ప్రకటిస్తామని..తెలంగాణ భవన్లో తనను కలిసిన ఆ నియోజకవర్గ నేతలకు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. రెండు మూడురోజుల్లో రెండో జాబితా? బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగిస్తున్న కేసీఆర్ రెండు మూడురోజుల్లో రెండో జాబితా విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు (ఖమ్మం), మన్నె శ్రీనివాస్రెడ్డి (మహబూబ్నగర్), మాలోత్ కవిత (మహబూబాబాద్)తో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ (కరీంనగర్), మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి) అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తాజాగా గాలి అనిల్కుమార్ (జహీరాబాద్), కాసాని జ్ఞానేశ్వర్ (చేవెళ్ల) పేర్లపై దాదాపుగా స్పష్టత వచ్చింది. బీఎస్పీతో పొత్తు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నాగర్కర్నూలు కేటాయించే అవకాశముంది. ఇక పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్ అభ్యర్థుల విషయంలో మాత్రం చివరి నిమిషం దాకా వేచి చూసే ధోరణిలో కేసీఆర్ ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను బట్టి బీఆర్ఎస్ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెండురోజుల క్రితం బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పలువురు నేతలు సోమవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్రెడ్డిని కలిశారు. గిరిజనులు ఎక్కువగా ఉండే హుజూర్నగర్ బీఆర్ఎస్ ఇన్చార్జిగా గిరిజన నేతకు బాధ్యతలు అప్పగించాలని కొందరు కోరారు. అయితే కేసీఆర్ ప్రస్తుతానికి జగదీశ్రెడ్డి, రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్కు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. కాగా త్వరలో పార్టీ ఇన్చార్జిని ప్రకటిస్తామని జగదీశ్రెడ్డి చెప్పారు. -
Chennai: డీఎంకేతో కుదిరిన కమల్హాసన్ పార్టీ పొత్తు.. డీల్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్ఎన్ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్ఎన్ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది. చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్తో కమల్హాసన్ భేటీ తర్వాత ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్ఎన్ఎమ్కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన అనంతరం కమల్హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇదీ చదవండి.. హిమాచల్ సంక్షోభం మళ్లీ మొదటికి -
మిగతా స్థానాలు 20 తర్వాతేనా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికి నాలుగు లోక్సభ స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించిన ఏఐసీసీ, తెలంగాణలోని మిగిలిన స్థానాలకు ఈ నెల 20వ తేదీ తర్వాతే లైన్క్లియర్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11 లేదా 14, 15 తేదీల్లో మరోమారు కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీ జరిగే అవకాశమున్నా ఆ భేటీలో తెలంగాణ అభ్యర్థులపై చర్చ ఉండకపోవచ్చని సమాచారం. తదుపరి భేటీలో తెలంగాణలోని మిగిలిన అభ్యర్థిత్వాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని, ఈ భేటీ ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశముందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఇటీవల జరిగిన సీఈసీ భేటీ ఎజెండాలో రాష్ట్రం నుంచి 9 పార్లమెంటు స్థానాలపై నిర్ణయం తీసుకునే అంశం ఉన్నప్పటికీ, కేవలం ఐదింటిపైనే చర్చించారని తెలిసింది. కానీ అనూహ్యంగా నాలుగింటిని మాత్రమే ఏఐసీసీ ప్రకటించింది. చేవెళ్ల నుంచి సునీతా మహేందర్రెడ్డి అభ్యర్థిత్వం కూడా ఖరారైందని, మలి జాబితాలో ఆమె పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకటి రిజర్వుడ్, మూడు జనరల్ తాజాగా ప్రకటించిన నాలుగు స్థానాల్లో ఒకటి రిజర్వుడ్ కాగా, మూడు జనరల్ స్థానాలు. ఇందులో మహబూబాబాద్ (ఎస్టీ) నుంచి పాతకాపు పోరిక బలరాం నాయక్కే మరోమారు అవకాశమిచ్చారు. ఇక్కడ టికెట్ కోసం విజయాబాయి, బెల్లయ్య నాయక్లు శతవిధాలా ప్రయత్నించినా హైకమాండ్ బలరాం నాయక్వైపే మొగ్గుచూపింది. ఇక మహబూబ్నగర్లో అందరూ ఊహించినట్టుగానే వంశీచంద్రెడ్డి పేరు ఖరారయింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం మేరకు జహీరాబాద్ స్థానాన్ని బీసీ నేత సురేశ్ షెట్కార్కు కేటాయించారు. మరోవైపు నల్లగొండలో సీనియర్ నేత జానారెడ్డి మరోమారు తన పట్టు నిలుపుకున్నారు. ఈ స్థానం విషయంలో చాలా ఊహాగానాలు వచి్చనప్పటికీ తన కుమారుడు రఘువీర్కు టికెట్ ఇప్పించుకోవడంలో జానా సఫలీకృతులు కావడం గమనార్హం. ఇక, నాలుగు ప్రకటిత స్థానాల్లో రెండు రెడ్డి సామాజిక వర్గానికి, ఒకటి బీసీకి, మరొకటి ఎస్టీకి కేటాయించారు. -
West Bengal: ‘సందేశ్ ఖాలీ’పై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
కలకత్తా: బెంగాల్ పర్యటనలో ప్రధాని మోదీ అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై నిప్పులు చెరిగారు. బుధవారం రాజధాని కలకత్తాలో దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో ప్రారంభించిన అనంతరం ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన మహిళాశక్తి ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ‘బెంగాల్లో టీఎంసీ హయాంలో మహిళలు వేధింపులకు గురయ్యారు. చిత్రవధ అనుభవించారు. అధికార పార్టీ టీఎంసీ నేతలే స్వయంగా మహిళలను వేధించారు. టీఎంసీ మహిళలను ఎన్నడూ రక్షించలేదు. సందేశ్ఖాళీ ప్రాంతంలో జరిగిన దానికి ప్రతి ఒక్కరు సిగ్గు పడాలి. కానీ టీఎంసీ మాత్రం ఇవేవీ పట్టించుకోవడవం లేదు. బెంగాల్ ప్రజలను వేధించిన నిందితులను కాపాడాడానికి టీఎంసీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి చివాట్లు తిన్నది. సందేశ్ఖాలీ తుపాను బెంగాల్లో ప్రారంభమైంది. ఈ తుపాను బెంగాల్లోని ప్రతి మూలకు చేరనుంది. టీఎంసీ నేతలకు తమ అధినేత్రిపై పూర్తి నమ్మకం ఉంది కానీ బెంగాల్ మహిళలపై మాత్రం లేదు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం లైంగికదాడులకు పాల్పడే వారికి జీవిత ఖైదు శిక్షలు పడేలా చట్టం తీసుకువచ్చింది. మహిళల ఫిర్యాదులను సులభంగా నమోదు చేసేందుకు కేంద్రం తీసుకువచ్చిన వుమెన్ హెల్ప్లైన్ను టీఎంసీ ప్రభుత్వం పనిచేయనివ్వడం లేదు. మహిళల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం ఎప్పుడూ పనిచేయలేదు’అని మోదీ మండిపడ్డారు. #WATCH | West Bengal: At the women's rally in Barasat, North 24 Parganas district, PM Modi says "TMC govt can never provide protection to women. Whereas, the BJP govt has decided to award life imprisonment for heinous crimes like rape. For easy registration of women's… pic.twitter.com/mHXkqiy30F — ANI (@ANI) March 6, 2024 ‘మోదీ పరివార్’ లాలూ వ్యాఖ్యలకు కౌంటర్ కాదు.. ‘ఒక రాజకీయ నాయకుడు నాకు కుటుంబం లేదని అన్నందుకే నేను దేశమంతా నా కుటుంబమే అని నినాదమిస్తున్నాని కొందరు అనుకుంటున్నారు. వాళ్లకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. నేను నా చిన్నతనంలోనే ఇళ్లు వదిలిపెట్టాను. నా దగ్గర అప్పుడు డబ్బులేదు. అయినా నేను ఏ రోజు ఖాళీ కడుపుతో పడుకోలేదు. ఆ సమయంలో పేద ప్రజలే నన్ను ఆదుకున్నారు. నా జీవితం దేశ ప్రజలకు అంకితం. నా శరీరంలోని ప్రతి అణువణువు, ప్రతి నిమిషం నా దేశ ప్రజల కోసమే. మోదీకి ఎప్పుడైనా సమస్య వస్తే ఈ తల్లులు, సోదరీమణులే రక్షణ కవచంలా నిలిచారు’ అని మోదీ తెలిపారు. ఇదీ చదవండి.. ప్రధాని పర్యటన వేళ బీజేపీపై దీదీ ఫైర్ -
ఎలక్టోరల్ బాండ్లు: మోదీ సర్కారుపై ఖర్గే సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు గుప్త విరాళాలందించే ఎలక్టోరల్ బాండ్ల అంశంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు అందిన విరాళాల వివరాలు ఎన్నికల సంఘానికి(ఈసీ) అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చేస్తున్న జాప్యానికి మోదీ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యకక్షుడు మల్లిఖార్జున ఖర్గే మంగళవారం ఆరోపించారు. జాతీయ బ్యాంకును మోదీ ప్రభుత్వం రక్షణ కవచంలా వాడుకుంటోందన్నారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ టర్ము జూన్ 16తో ముగుస్తుందనగా ఎస్బీఐ జూన్ 30దాకా గడువు కోరడమేంటని ఖర్గే ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అత్యధికంగా అక్రమ లావాదేవీలు జరిపింది మోదీ బీజేపీయేనన్నారు. మార్చి 6వ తేదీకల్లా ఈసీకి బాండ్ల వివరాలందించాల్సిన ఎస్బీఐ డెడ్లైన్ను జూన్ 30 దాకా పొడిగించాలని తాజాగా సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నిజానికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలందించిన 44వేల434 కంపెనీలు, వ్యక్తుల వివరాలను సిద్ధం చేయడానికి 24 గంటల కంటే ఎస్బీఐకి ఎక్కువ సమయం పట్టదని నిపుణులు వాదిస్తుండటం గమనార్హం. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్టీల పేరు మీద విడుదల చేసే ఎలక్టోరల్ బాండ్లను కంపెనీలు, వ్యక్తులు కొనుక్కుంటే రాజకీయ పార్టీల ఖాతాల్లో ఆ నిధులు జమవుతాయి. ఎవరు బాండ్లు కొనుగోలు చేస్తారనేది రహస్యంగా ఉంచుతారు. అయితే ఈ స్కీమ్లో పారదర్శకత లేదని దాఖలైన పిల్ను విచారించిన సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వాటి వివరాలను ఎన్నికల సంఘానికి వెంటనే అందించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇదీ చదవండి.. లోక్సభ ఎన్నికలపై ఈసీ సంచలన ప్రెస్మీట్ -
కలకత్తా హైకోర్టు జడ్జి రాజీనామా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ..?
కలకత్తా: కలకత్తా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ మంగళవారం(మార్చ్5) తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. ఈయన వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. తాను రాజీమా చేయనున్నట్లు గంగోపాధ్యాయ్ సోమవారమే స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచించాలని కొందరు న్యాయవాదులు, కక్షిదారులు ఆయనను కోరారు. అయినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఇటీవల గంగోపాధ్యాయ ఇచ్చిన కొన్ని తీర్పులు పశ్చిమబెంగాల్లో రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అయితే రాజీనామా తర్వాత రాజకీయాల్లోకి వెళ్తారా అన్న ప్రశ్నకు మాత్రం జస్టిస్ గంగోపాధ్యాయ్ స్పష్టమైన సమాధానమివ్వలేదు. 2020 జులై30న కలకత్తా హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా గంగోపాధ్యాయ్ పదోన్నతి పొందారు. ఇదీ చదవండి.. లోక్సభ ఎన్నికలు.. సీఈసీ ప్రెస్మీట్ -
ఇద్దరు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలపై సమీక్ష చేపట్టారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లా నేతలతో కూడా కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. 12న కరీంనగర్ సభ ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభతో లోక్సభ ఎన్నికల సమర శంఖారావాన్ని బీఆర్ఎస్ పూరించనుంది. రోడ్ షోలు, బస్సు యాత్రలతో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనుంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్.. రేపు(సోమవారం) నలుగురు లేదా ఐదుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తున్న బీఆర్ఎస్.. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇదీ చదవండి: BJP జాబితా.. తెలంగాణ 9 మంది అభ్యర్థులు వీళ్లే -
BJP: లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ..
సాక్షి,ఢిల్లీ: ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీజేపీ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనుంది. ఇందుకుగాను ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. తొలిజాబితాలో అభ్యర్థుల పేర్ల ఖరారు కోసం గురువారం సాయంత్రం సమావేశమైన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) భేటీ శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ , గుజరాత్, గోవా, చత్తీస్గఢ్ రాష్ట్రాల నేతలతో బీజేపీ సీఈసీ భేటీ అయింది. #WATCH | BJP Central Election Committee (CEC) meeting concludes; Union Home Minister Amit Shah and BJP national president JP Nadda leave from the BJP headquarters, in Delhi. pic.twitter.com/xOM8KmrNns — ANI (@ANI) February 29, 2024 తొలి విడతలోనే సగం సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో గెలిచిన సీట్లు, పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను తొలుత ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఆయా అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి కనీసం 50 రోజుల సమయం దొరుకుతుందని పార్టీ నాయకత్వం భావిస్తోంది. కాగా, తొలి జాబితాలో తెలంగాణ నుంచి సుమారు 8 మంది అభ్యర్థులు ఖరారైనట్లు సమాచారం. ఖరారైన వారిలో సికింద్రాబాద్-కిషన్రెడ్డి, నిజామాబాద్-ధర్మపురి అరవింద్, కరీంనగర్- బండి సంజయ్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్రెడ్డి, భువనగిరి- బూర నర్సయ్యగౌడ్, హైదరాబాద్- మాధవిలత, మహబూబ్నగర్- డీకే అరుణ, నాగర్కర్నూల్- భరత్ ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు -
తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్/సాక్షి, ఆదిలాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మార్చి రెండో వారంలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రావొచ్చనే అంచనాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసే వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆదిలాబాద్, సంగారెడ్డిలలో నిర్వహించే బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మోదీ శంఖం పూరించనున్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అక్టోబర్ 1, 3 తేదీల్లో మహబూబ్నగర్, నిజామాబాద్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభంతోపాటు సభల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్లపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మళ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పర్యటనకు వస్తున్న మోదీ 4వ తేదీన రాత్రి రాజ్భవన్లో బసచేస్తారు. ఇదీ మోదీ పర్యటన షెడ్యూల్... ► 4న ఉదయం మహారాష్ట్ర నాగ్పూర్ ఎయిర్పోర్టులో ఎంఐ–17 హెలికాప్టర్లో బయలుదేరి ఉ దయం 10.20కు ఆదిలాబాద్కు చేరు కుంటారు. ► 10.30 నుంచి 11 గంటలదాకా ఆదిలాబాద్లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు ► 11.15 నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా బహిరంగసభలో పాల్గొంటారు ► 12.15కు ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు మహారాష్ట్రలోని నాందేడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యా హ్నం 2.45 గంటలకు చెన్నైకి చేరుకుంటారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని చెన్నై ఎయిర్పోర్టు నుంచి బయలుదేరి రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు రాజ్భవన్కు చేరుకుని అక్కడే బసచేస్తారు. ► మార్చి 5న ఉదయం 10,15 గంటలకు హెలికాప్టర్లో బేగంపేట నుంచి బయలుదేరి 10.40 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు ► 10.45 నుంచి 11.15 గంటల దాకా వివిధ అభివృద్ధి ప్రాజెక్ట్లు, పనులకు శంకుస్థాపనలు/ ప్రారంభోత్సవాలు చేస్తారు. ► 11.25 గంటలకు సంగారెడ్డికి చేరుకుంటారు. 12.15 వరకు సభలో ప్రసంగిస్తారు. ► 12.30కు హెలికాప్టర్లో సంగారెడ్డి నుంచి బయ లుదేరి 12.55కు బేగంపేటకు చేరుకుంటారు. ► మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట నుంచి విమానంలో భువనేశ్వర్కు బయల్దేరుతారు. దీంతో మోదీ రాష్ట్ర పర్యటన పూర్తవుతుంది. -
రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్
లక్నో: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడమే కాకుండా సవాల్ల పర్వం మొదలైంది. తాజాగా కేంద్ర మంతి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర నేడు (సోమవారం) ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది. ఈ నేపథ్యంలో అమేథీ లోకసభ నియోజకవర్గం నుంచి మళ్లీ రాహుల్ గాంధీ తనపై పోటీ చేయాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చాలెంజ్ చేశారు. ‘2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో ఓడిపోయారు. ఇప్పుడు కూడా ఆయన అమేథీలో ఓడిపోతారు. ఆయనకు అమేథీలో గెలుస్తాననే విశ్వాసం ఉంటే మళ్లీ కేరళలోని వయ్నాడ్ లోక్సభ నియోజకవగర్గంలో పోటీ చేయకుండా ఆమేథీలో నాతో పోటీపడాలి’ అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. ఇక్కడి ప్రజలు రాహుల్ గాంధీ గురించి ఏం అలోచిస్తునన్నారో? అమేథీలోని ఖాళీ రోడ్లను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని స్మృతి ఇరానీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆమె జన సంవాద్ కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజుల పర్యటనలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లో కంచుకోటగా ఉన్న అమేథీ లోక్సభ నియోజకవర్గంలో 2019లో రాహుల్ గాంధీ.. అనూహ్యంగా 55,000 ఓట్ల తేడాతో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశో గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే స్థానంలో గెలుపొందింది. కాంగ్రెస్ తరుఫున రాయ్బరేలీ సెగ్మెంట్లో సోనియాగాంధీ విజయం సాధించారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో ఓడిపోయి కేరళలోని వయ్నాడ్లో గెలుపొందారు. అయితే ఇటీవల సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ పెద్దల సభ(రాజ్యసభ)కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ రాయ్బరేలీ ప్రజలు తమ కుటుంబంతోనే ఉంటారని అన్నారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కూడా స్మృతి ఇరానీ స్పందిస్తూ.. గాంధీ కుటుంబంలో ఎవరు? రాయ్బరేలీ ప్రజలతో ఉంటారని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం రామ్బరేలీ స్థానాన్ని వదిలి వెళ్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. ఇక.. అమేథీ సెగ్మెంట్ నుంచి మళ్లీ రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టత లేదు. ‘కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.. అమేథీలో ఎవరు? పోటీ చేస్తారనే విసషంపై నిర్ణయం తీసుకోలేదు. రాహుల్ గాంధీ ఇక్కడ ఇప్పటీకే మూడుసార్లు గెలిపొందారు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కూడా అమేథీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అమేథీ నియోజకవర్గం చాలా ముఖ్యమైంది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ యాత్ర రేపు(మంగళవారం) యూపీలోని రాయ్బరేలీకి చేరుకోనుంది. -
పంజాబ్లో ఒంటరి పోరు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ, ఆప్ వేర్వేరుగా.. ఒంటరిగానే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగాలని ఓ ఒప్పదం చేసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్లో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేయటంపై ఎటువంటి అభిప్రాయ బేధాలు లేవని స్పష్ట చేశారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేఖ్ సింఘ్వీ నివాసంలో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ‘ఇరు పార్టీల ఒప్పందం ప్రకారమే పంజాబ్లో ఒంటగా పోటీ చేస్తున్నాం. ఈ విషయంలో ఎటువంటి బేధాభిప్రాయాలు, వివాదం కానీ లేవు’ అని కేజ్రీవాల్ తెలిపారు. ఇండియా కూటమిలో భాగంగా ఢిల్లీలో సీట్లపంపకంపై చర్చలు చివరికి వచ్చాయని తెలిపారు. ‘ఢిల్లీలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నాం. ఢిల్లీలో ఇరుపార్టీల మధ్య సీట్ల పంపిణీ కసరత్తు జరుగోతోంది. ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తులేకపోతే బీజేపీకి తేలిక అవుతుంది’ అని కేజ్రీవాల్ అన్నారు. ఇక.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏడు సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా ఏడు స్థానాల్లో బీజేపీ గెలుపొందిన సంగతి తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లోని 13 సీట్లలో తాము ఒంటరిగా పోటీ చేస్తామని రాష్ట్ర సీఎం భగవంత్సింగ్ మాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆప్ నిర్ణయాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ కూడా పంజాబ్లో ఒంటరిగానే బరిలోకి దిగాలనుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. -
రైతుల డిమాండ్లకు చెవి ఒగ్గాలి!
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పంజాబ్ రైతులు నిరసన బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతను అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్రం వాగ్దానం విషయంలో ఆలస్యమే ఈ నిరసనకు ఒక ప్రేరేపకం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయ పార్టీలు మాట వింటాయనేది మరొక కారణం. అయితే, 2020 నాటి రైతుల ఆందోళనకు 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. ఈసారి నిరసనలకు అంత విస్తృత మద్దతు లేదు. అయినప్పటికీ, మునుపటి కంటే డిమాండ్లు నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారత్ వైదొలగడం, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులు, రైతుకూలీలకు పింఛన్లు వంటివి ఇందులో ఉన్నాయి. రానున్న 2024 పార్లమెంటరీ ఎన్నికలు విరుద్ధమైన అవగాహనలకు సాక్షీభూతంగా నిలుస్తున్నాయి. ప్రతిపక్షాల కుల గణన డిమాండ్కు బీజేపీ తలొగ్గు తుందనే భావన పోయి, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత బీజేపీ ప్రయోజనం పొందుతుందనే అభిప్రాయం వైపు లోలకం సూచీ కదిలింది. అయితే, సమాఖ్య నిధుల్లో తమ వాటా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న దక్షిణాది ప్రాంతీయ పార్టీలు మాత్రం ఈ కథనాన్ని సవాలు చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్యనే పంజాబ్ రైతులు ఢిల్లీ వైపు కవాతు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నిరసనకు పలు రైతు సంఘాలు మద్దతు తెలుపడంతో ఎన్నికముందు మరోసారి రంగం సిద్ధమైంది. ఢిల్లీ సరిహద్దులో బలగాలను మోహరించి, భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, డిమాండ్ల స్వభావం, పాల్గొంటున్న సంఘాలు, ప్రభుత్వ ప్రతిస్పందన వంటి అనేక అంశాలలో, 2020 రైతుల నిరసనలకు ప్రస్తుత నిరసనభిన్నంగా ఉంది. ప్రస్తుతం ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసనలకు జగ్జీత్ సింగ్ డల్లేవాల్, సర్వన్ సింగ్ పంఢేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వం వహిస్తోంది. వీరు మునుపటి రైతుల నిరసనలో ప్రముఖులు కాదు. దర్శన్ పాల్, బల్బీర్ సింగ్ రాజేవాల్ నేతృత్వం వహిస్తున్న రెండు గ్రూపులు భారత్ బంద్కు వేర్వేరుగా పిలుపు నిచ్చాయి. హరియాణాలో మితిమీరిన ప్రభుత్వాధికార వినియోగానికి వ్యతిరేకంగా భారత్ కిసాన్ యూనియన్(ఉగ్రాహాన్) రైల్ రోఖోకు ప్రత్యేక పిలుపునిచ్చింది. 2020లో మొదలైన రైతుల ఆందోళనకు సైద్ధాంతికంగా సమ ర్థమైన 32 సంఘాల సమ్మేళనం నాయకత్వం వహించింది. పైగా అది పంజాబ్ కేంద్రంగా మాత్రమే జరగలేదు. అందులో పశ్చిమ ఉత్తర ప్రదేశ్, హరియాణా నుండి కూడా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. ఈసారి మాత్రం ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికి చాలావరకు మౌనంగా ఉన్నాయి. అలాగే రాకేశ్ టికైత్, గుర్నామ్ సింగ్ చఢూనీ నేతృత్వంలోని యూనియన్లు ప్రస్తుతం ఆందోళనలో భాగం కాకూడదని నిర్ణయించుకున్నాయి. అంతకుముందటి నిరసన ఉద్యమం... పౌర సమాజ కార్య కర్తలు, కళాకారులు, నిపుణులు, పదవీ విరమణ చేసిన పౌర సేవ కులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల నుండి విస్తృత మద్దతునుపొందింది. రాడికల్ మితవాదులు కూడా తమ సొంత కథనాలతోఅందులోకి వచ్చారు కానీ వారు కేంద్రస్థానంలోకి ప్రవేశించలేదు. ఉద్యమానికి ప్రగతిశీల రైతులు నాయకత్వం వహించడం, వారికి మత కుల అనుబంధాలకు అతీతంగా ఉదారవాదులు మద్దతునివ్వడం వల్ల రాడికల్ మితవాద రాజకీయాల పాత్ర పరిమితమైంది. కానీ ప్రస్తుత నిరసనకు విస్తృతమైన మద్దతు లేదు. పైగా గుర్తింపు రాజకీయాలవెంపర్లాట కూడా దీని వెనుక ఉంటోంది. నేడు రైతు సంఘాలలోని మూడు ప్రధాన వర్గాలు ఒకే బ్యానర్ కింద ఐక్యం కాలేదు. అవి ఒక దానితో ఒకటి పోటీ పడుతున్నాయి. సంయుక్త కిసాన్ మోర్చా (రాజ కీయేతరమైన గ్రూప్) ఇతర యూనియన్లను అధిగమించి నాయకత్వ స్థానంలోకి ప్రవేశించింది. పంజాబ్ ప్రభుత్వ మద్దతుతో కేంద్ర ప్రభు త్వంతో చర్చలు జరపడానికి సిద్ధమైంది. డిమాండ్ల విషయానికొస్తే, ప్రస్తుత నిరసనలు మునుపటి కంటే నిర్మాణాత్మకంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ నుండి భారతదేశం వైదొలగడం, వ్యవసాయ రుణాల మాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ, రైతులు– రైతు కూలీలకు పెన్షన్లు, 2020–21 నిరసనల సంద ర్భంగా రైతులపై దాఖలైన కేసుల ఉపసంహరణ, నష్టపరిహారంవంటివి ఇందులో ఉన్నాయి. నిరసన కాలంలో మరణించిన రైతు లకూ, ‘లఖీంపూర్ ఖీరీ ఘటన’ బాధితులకూ న్యాయం జరిగేలా చూడటం, వ్యవసాయ చట్టాల రద్దు తర్వాత 2021లో బీజేపీ చేసిన వాగ్దానాలపై దృష్టి పెట్టడం కూడా డిమాండ్లలో ఉన్నాయి. మరోవైపు, సరిహద్దుల్లో భారీగా కంచెలు వేయడం, ఘాజీపూర్, సింఘు, టిక్రి సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించడం చూస్తుంటే ప్రస్తుత నిరసనపై ప్రభుత్వ ప్రతిస్పందన ఇప్పుడు కూడా ప్రతిచర్యగానే కని పిస్తోంది. పంజాబ్, హరియాణాల్లో అనేక ప్రాంతాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పంజాబ్, హరియాణా సరిహద్దులను రాజ స్థాన్ మూసివేసింది. అనేక జిల్లాలలో నిషేధాజ్ఞలను విధించింది. వారి ‘ఢిల్లీ ఛలో’ ప్రకటనకు ముందే, రైతులతో చర్చలు ప్రారంభించినప్ప టికీ, 2021లో చేసిన వాగ్దానాలపై కేంద్రప్రభుత్వం ఇంకా స్పందించ లేదు.అలాగే, నిరసన ప్రదేశంలో టియర్ గ్యాస్ వాడకం, డ్రోన్ల ద్వారా పొగ బాంబులు వేయడం, రాళ్లు రువ్వడం, వాహనాలను సీజ్ చేయడం, రైతులను పోలీసులు నిర్బంధించడం వంటి ఘటనలు అలాగే కొనసాగుతున్నాయి. క్రితంసారి మితిమీరిన బలప్రయోగం జరిపిన అనుభవం నుంచి ప్రభుత్వం పాఠాలేమీ నేర్చుకున్నట్టు లేదు. ఎందుకంటే, మితిమీరిన బలప్రయోగం చేయడం... నిరసనను తీవ్ర దారుల్లోకి మళ్లించాలనుకునేవారికి ఊతమిస్తుంది. 2020లో జరిగిన రైతుల నిరసన నుండి ఇతర పాఠాలు కూడా ఉన్నాయి. అది రైతుల విజయంతో ముగిసింది, అయితే 700 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. 1990లలో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణల ఎజెండాకు వ్యతిరేకంగా ఇది మొదటి, సుదీర్ఘ పోరాటం. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్న వేళ వ్యవసాయ వ్యాపారం (అగ్రి బిజినెస్) మాత్రం విపరీతంగా లాభాలు ఆర్జించడం విడ్డూరం. ఆహార ధాన్యాలకు కొత్త మార్కెట్లు లేకపోవడం, నీటి మట్టం తగ్గడం లాంటి కారణాలనే వ్యవసాయ సంక్షోభానికి కారణా లుగా చూపడం పరిస్థితి తీవ్రతను తగ్గించడమే అవుతుంది. ఆహారమే ఇప్పుడు రాజకీయం. ఇది కేవలం పరిపాలన, చట్ట పరమైన చర్యల ద్వారా మాత్రమే పరిష్కారం కాదు. ఆహార సార్వ భౌమాధికారం, ఆహార భద్రత, రైతుల జీవనోపాధికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రాజకీయ సంకల్పం అవసరం. కేంద్రం అన్ని రాజకీయ పార్టీలను భాగం చేస్తూ, దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొన డంలో నిమగ్నం కావాలి. దీన్నొక ఓట్ల వ్యవహారంగా చూడకూడదు. వ్యవసాయాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేయాలంటే, సబ్సిడీలు ఇవ్వాలి. తమ వాణిజ్య వ్యవసాయాన్ని నిలబెట్టుకోవడానికి, అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారీ సబ్సిడీలు ఇస్తున్నాయి. క్రితంసారి రైతులు వీధుల్లోకి వచ్చిన ఘటన నుండి మరొక పాఠం ఏమిటంటే, ప్రభుత్వం అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల తర్వాతే చట్టాలను రూపొందించాలి. లేకపోతే, అది ప్రజలకు విషాదాన్నీ, నాయకత్వానికి ఇబ్బందినీ కలిగిస్తుంది. మూడు వ్యవ సాయ చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన మద్దతును అందించే మార్గాలను కనుగొనడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ వాగ్దానంపై చొరవ విషయంలో ఆలస్యమే ఇప్పుడు తమ నిరసనను ప్రారంభించేందుకు రైతులకు తగిన కారణాన్ని అందించింది. రాజకీయ నాయకత్వం కేవలం నిరసనలకు మాత్రమే స్పందిస్తుందనీ, ఎన్నికల వేళ మాత్రమే ప్రజల వాణిని వింటుందనే భావన ట్రిగ్గర్గా పనిచేసింది. - వ్యాసకర్త చండీగఢ్లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ చైర్పర్సన్_ -ప్రొ‘‘ ప్రమోద్ కుమార్ -
బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు!
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల గెలుపే లక్ష్యంగా, పార్టీలో కీలకమైన నేతలకు లోక్సభలో ప్రాధాన్యం కల్పించాలని బీజేపీ కొత్త వ్యూహాలు రచిస్తోంది. తాజాగా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అధిష్టానం కీలకమైన మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రులకు మాత్రమే తిరిగి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించటం గమనార్హం. వచ్చే ఏప్రిల్ నెలలో పెద్దల సభలో బీజేపీ చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న... ఏడుగురు కేంద్ర మంత్రులకు బీజేపీ తిరిగి రాజ్యసభకు అవకాశం ఇవ్వదని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే వారిని వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల బరిలో దించాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిలో ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా (గుజరాత్), విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (మధ్యప్రదేశ్), ఐటి మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (కర్ణాటక). పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (రాజస్థాన్), మత్స్య మంత్రి పర్షోత్తమ్ రూపాలా (గుజరాత్), మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే(మహారాష్ట్ర), విదేశి వ్యవహరాల శాఖ మంత్రి వి. మురళీధరన్ (మహారాష్ట్ర)లు ఉన్నారు. అయా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో ఏడుగురు మంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు తన సొంతం రాష్ట్రం అయిన ఒడిశాలోని (సంబల్పూర్ లేదా ధేక్నాల్) సెగ్మెంట్ల నుంచి లోక్సభకు పోటీకి నిలపనున్నట్లు సమాచారం. మంత్రి భూపేందర్ యాదవ్ను రాజస్థాన్లోని (అల్వార్ లేదా మహేంద్రగఢ్) నియోజకవర్గం, మంత్రి చంద్రశేఖర్ను బెంగళూరులోని మూడు నియోజకవర్గాలు (సెంట్రల్, నార్త్, సౌత్)లో ఏదో ఒక స్థానంలో బరిలో దించనుంది. మంత్రి మాండవియాను గుజరాత్లోని (భావ్నగర్ లేదా సూరత్), మంత్రి రూపాలా రాజ్కోట్ నుంచి బీజేపీ పోటీలో నిలపనుంది. మంత్రి మురళీధరన్కు తన సొంత రాష్ట్రం కేరళ నుండి పోటీ చేసే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడ బీజేపీకి ఉనికి లేనప్పటికీ ఈసారి గెలుపే లక్ష్యంగా మురళీధరన్ను అక్కడ నిలబెడుతుందని సమాచారం. రెండు దఫాల్లో రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇప్పటి వరకు కేవలం ఇద్దరు కేంద్ర మంత్రుకే తిరగి అవకాశం కల్పించింది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (ఒడిశా), ఫిషరీస్ మంత్రి ఎల్ మురుగన్ (మధ్యప్రదేశ్)లకు బీజేపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసింది. రాజ్యసభలో బీజేపీకి చెందిన 28 మంది సభ్యులు పదవీ విరమణ చేయనుండగా.. ఇప్పటివరకు అయితే కేవలం నలుగురు సభ్యులను మాత్రమే తిరిగి ఎంపిక చేయటం గమనార్హం. బీజేపీ పెద్దల సభకు కొత్తవారికి అవకాశం కల్పించటంలో అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఈ ఏడుగురు మంత్రులను కూడా రాజ్యసభకు కాకుండా పార్లమెంట్ ఎన్నికల బరి దించనున్నట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసీనదిలో వేసినట్టే
-
రాచకొండ సీపీగా తరుణ్ జోషి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఎఫెక్ట్తో రాచకొండ పోలీసు కమిషనర్గా పని చేస్తున్న జి.సుధీర్బాబు బదిలీ అయ్యారు. ఈయన్ను మల్టీ జోన్–2 ఐజీగా బదిలీ చేసిన ప్రభుత్వం అక్కడ పని చేస్తున్న తరుణ్ జోషిని రాచకొండ కొత్త సీపీగా నియమించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మూడు కమిషనరేట్ల నుంచి బదిలీ అయిన అధికారుల్లో ఎన్నికల కోడ్ ప్రభావం పడిన వారే అధికంగా ఉన్నారు. కీలక స్థానాల్లో పని చేస్తున్న ఉన్నతాధికారుల బదిలీలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలో మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఏడాది జూన్ 30ని గడువుగా తీసుకుని..ఆ తేదీ నుంచి వెనక్కు నాలుగేళ్ల కాలంలో వరుసగా మూడేళ్లు ఓ కమిషనరేట్లో విధులు నిర్వర్తిస్తే బదిలీ తప్పనిసరి. సుదీర్బాబు 2018 ఏప్రిల్ నుంచి 2023 జనవరి వరకు రాచకొండ కమిషనరేట్లో సంయుక్త, అదనపు సీపీగా విధులు నిర్వర్తించారు. డీఐజీ హోదాలో సంయుక్త సీపీగా అక్కడ రిపోర్ట్ చేసిన ఆయన ఐజీగా పదోన్నది పొందిన తర్వాత కూడా కొనసాగుతూ అదనపు సీపీగా పని చేశారు. ఆపై హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అదనపు సీపీగా బదిలీపై వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత గతేడాది డిసెంబర్ 13న రాచకొండ పోలీసు కమిషనర్గా వెళ్లారు. ఈసీ మార్గదర్శకాల ప్రకారం 2020 జూలై 1 నుంచి ఒకే కమిషనరేట్లో మూడేళ్లు పనిచేసిన జాబితాలో సుధీర్ బాబు ఉన్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం తరుణ్ జోషిని కొత్త సీపీగా నియమించింది. గతంలో రాచకొండ సంయుక్త సీపీగా పని చేసిన అనుభవం ఈయనకు ఉంది. హైదరాబాద్, సైబరాబాద్ల్లో కీలక పోస్టింగ్లతో పాటు వరంగల్ సీపీగానూ పని చేశారు. కోడ్ ఎఫెక్ట్తోనే ఈస్ట్జోన్ డీసీపీ బి.సాయి శ్రీ సైతం బదిలీ కాగా..ఆ స్థానంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ డీసీపీగా పని చేస్తున్న ఆర్.గిరిధర్ నియమితులయ్యారు. గద్వాల డీఐజీగా ఉన్న డి.జోయల్ డెవిస్ను సైబరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీగా నియమించింది. ఈయన ఇటీవల జరిగిన బదిలీల వరకు వెస్ట్ జోన్ డీసీపీగా, ఆపై సిటీ స్పెషల్ బ్రాంచ్ డీసీపీగా పని చేశారు. ట్రాన్స్కోలో పని చేస్తున్న డి.ఉదయ్కుమార్ రెడ్డిని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా, ఎస్.రష్మీ పెరుమాళ్ను హైదరాబాద్ టాస్్కఫోర్స్ డీసీపీగా ప్రభుత్వం నియమించింది. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ యూఎల్సీలో పనిచేస్తున్న కె.వెంకట ఉపేందర్రెడ్డి రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ అయ్యారు. కీసర ఆర్డీవోగా రమాదేవి, శేరిలింగంపల్లి తహసీల్దార్గా వెంకట్రెడ్డిలకు పోస్టింగ్ లభించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. -
Indonesia election 2024: ఒకే రోజు... ఐదు ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో పార్లమెంట్, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ జనాభా 27 కోట్లు కాగా, 20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 17 ఏళ్లు నిండినవారంతా ఓటు వేయడానికి అర్హులే. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం కోసం ప్రధానంగా మూడు పారీ్టలు హోరీహోరీగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు నేషనల్, ప్రావిన్షియల్, రీజినల్, రిజెన్సీ, సిటీ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం ఐదు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయాల్సి ఉంటుంది. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకే రోజు జరగడం ఇండోనేసియా ప్రత్యేకత. అయితే, ఈ ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి కాదు. అయినా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దేశంలో 575 పార్లమెంట్ స్థానాలు ఉండగా, 18 జాతీయ పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచాయి. వివిధ స్థాయిలో మొత్తం 20,616 పదవులకు 2,58,602 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం ఐదేళ్లు. అమెరికా అధ్యక్షుడి తరహాలో రెండుసార్లు మాత్రమే పదవిలో కొనసాగడానికి అర్హత ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు జొకో విడొడో(జొకోవి) వరుసగా రెండుసార్లు గెలిచారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన రెండు టర్మ్లు పూర్తయ్యాయి. కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఈసారి మార్పు తప్పనిసరి కాబోతోంది. మొత్తం జనాభాలో 90 శాతం మంది ముస్లింలే ఉన్న ఇండోనేíÙయాలో పోలీసులకు, సైనికులకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు. 40 కొత్త నగరాలు నిర్మిస్తాం అనీస్ బాస్వెదాన్ జకార్తా మాజీ గవర్నర్, విద్యావేత్తగా పేరుగాంచిన అనీస్ బాస్వెదాన్(54) స్వతంత్ర, ప్రతిపక్ష అభ్యరి్థగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. స్వదేశంలో తొలుత విద్యారంగంలోకి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరించారు. ఇక అనీస్ సహచరుడిగా ఉపాధ్యక్ష పదవికి నేషనల్ అవేకెనింగ్ పార్టీ నేత, పీపుల్స్ రిప్రిజెంటేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ముహైమిన్ ఇస్కాందర్(57) బరిలో ఉన్నారు. వీరికి మరో రెండు పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశవ్యాప్తంగా 40 కొత్త నగరాలు నిర్మిస్తామని అనీస్ బాస్వెదాన్, ఇస్కాందర్ హామీ ఇస్తున్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతున్నారు. సుబియాంటోకు విజయావకాశాలు! ఇండోనేసియా ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ప్రధానంగా ముగ్గురు నేతలు కన్నేశారు. ఇండోనేషియా జాతీయవాద పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి మాజీ సైనికాధికారి ప్ర»ొవో సుబియాంటో(72) పోటీలో ఉన్నారు. ఇదే పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జొకో విడొడో తనయుడైన 36 ఏళ్ల గిబ్రాన్ రాకాబుమింగ్ రాకా బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సుబియాంటో పోటీపడ్డారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జొకోవి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన సుబియాంటోపై పలు తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 1990వ దశకంలో సైనికాధికారిగా పని చేస్తున్న సమయంలో 20 మందికిపైగా ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలను కిడ్నాప్ చేయించినట్లు ప్రచారం జరిగింది. వారిలో 10 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సుబియాంటో ఈస్ట్ తిమోర్, పపువా న్యూ గినియా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. 1998లో సైన్యం నుంచి తప్పుకున్నారు. 2020 వరకు తమ దేశంలో ప్రవేశించకుండా ఆయనపై అమెరికా నిషేధం విధించింది. గిబ్రాన్ రాకాబుమింగ్ కూడా వివాదాస్పదుడే. ప్రస్తుతం సురకర్తా సిటీ మేయర్గా పనిచేస్తున్నాడు. తమను గెలిపిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామని సుబియాంటో, గిబ్రాన్ హామీ ఇస్తున్నారు. గెరిండ్రా పారీ్టకి ఇతర చిన్నాచితక పారీ్టలు మద్దతిస్తున్నాయి. ఇప్పుడు అంచనాలను బట్టి చూస్తే ప్ర»ొవో సుబియాంటో తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధ్యక్ష బరిలో విద్యావేత్త ప్రనొవో మెగావతి సుకర్నోపుత్రి సారథ్యంలోని ఇండోనేషియన్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్ నుంచి అధ్యక్ష పదవికి గాంజార్ ప్రనొవో(55), ఉపాధ్యక్ష పదవికి మహ్ఫుద్ ఎండీ(66) పోటీలో ఉన్నారు. ప్రనొవో గతంలో సెంట్రల్ జావా గవర్నర్గా సేవలందించారు. మహ్ఫుద్ ఎండీకి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్తో మరో మూడు పార్టీలు జట్టుకట్టాయి. ఇద్దరు అభ్యర్థులపై ఎలాంటి అరోపణలు, వివాదాలు లేకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలు తమకు తెలుసని, అధికారం అప్పగిస్తే వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని ప్రనొబో, మహ్ఫుద్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలకు సామాజిక సాయం పంపిణీ చేస్తామని, ఉద్యోగుల వేతనాలు పెంచుతామని అంటున్నారు. కీలక ప్రచారాంశాలు? ► ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే ఇండోనేíÙయాలోనూ ఎన్నో సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి 2022లో 5.3 శాతం కాగా, 2023లో అది 5.05 శాతానికి పడిపోయింది. ► దేశంలో ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారింది. ► నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైపోయాయి. ఉద్యోగులు, కారి్మకులకు వేతనాలు తగ్గిపోయాయి. మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు 40 ఏళ్లలోపు యువతే ఉన్నారు. వారే నిర్ణయాత్మక శక్తిగా తీర్పు ఇవ్వబోతున్నారు. ► దేశంలో మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతుండడంపై యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని చెబుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ గాలం!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష బీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు అధికార కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ను బలహీనపర్చడంతోపాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థిని కూడా బరిలోకి దింపి విజయం సాధించడమే లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ తెలంగాణకు చెందిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, హైదరాబాద్ పరిసరాల్లోని పలువురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మంతనాలు ప్రారంభించారని... వారిలో 7–8 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన ముగ్గురు, దక్షిణ తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యేతో కూడా చర్చలు పురోగతిలో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవులు, ప్రలోభాలు, వ్యాపార అవసరాల ప్రాతిపదికన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నట్లు తెలిసింది. లోక్సభ ఎన్నికల కంటే ముందే రాజ్యసభ ఎన్నికలు జరుగుతుండటం, ఈ ఎన్నికల్లో విప్ జారీ చేసే అధికారం పార్టీలకు లేకపోవడంతో ఆపరేషన్ ఆకర్‡్షను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం చేయడంపై టీపీసీసీ పెద్దలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తద్వారా తాము నిలబెట్టే మూడో అభ్యర్థి విజయం సాధిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందనే భావనను ప్రజల్లో కలిగించొచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ఎమ్మెల్యేలంతా తమ మూడో అభ్యర్థికి ఓటు వేయడం వరకే పరిమితం కావాలని, లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీలో చేర్చుకొనే అంశంపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఏఐసీసీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని, ఏఐసీసీ అనుమతి మేరకే మూడో అభ్యర్థిని రంగంలోకి దింపుతామని టీపీసీసీ సీనియర్ నేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. మరో ముగ్గురు.... నలుగురు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత కాంగ్రెస్లో చేరిన నేపథ్యంలో ఇంకెందరు బీఆర్ఎస్ ఎంపీలు, పార్టీ మారుతారోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏకంగా సిట్టింగ్ ఎంపీ పార్టీ మారడంతో ఈ చర్చ ఊపందుకుంది. గాంధీ భవన్ వర్గాల సమాచారం ప్రకారం మరో ముగ్గురు, నలుగురు బీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలకు చెందిన ఆ ముగ్గురు ఎంపీల్లో ఒకరు ఎస్సీ రిజర్వుడ్, ఇద్దరు జనరల్ స్థానాల నుంచి గెలిచారని, వారు త్వరలోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. అయితే వారి చేరిక విషయంలో టికెట్ల కేటాయింపు అంశం కొంత అడ్డంకిగా మారిందని, ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా పార్టీలోకి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఇంకో ఎంపీ విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద లోక్సభ ఎన్నికల కంటే ముందే మరో ఇద్దరు లేదా ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు తమ పార్టీలో చేరే అవకాశాలున్నాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. వెంకటేశ్ నేతకు తిరిగి ఎంపీ సీటు ఇవ్వొచ్చనే చర్చ పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకు అదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వొచ్చనే చర్చ జరుగుతోంది. ఆయన్ను పార్టీలో చేర్చుకొనేందుకు సీఎం రేవంత్ సైలంట్ ఆపరేషన్ నడిపించారని, అనేక సమీకరణాల నేపథ్యంలో వెంకటేశ్ నేత చేరిక అంశం కార్యరూపం దాల్చిందని తెలుస్తోంది. వాస్తవానికి పెద్దపల్లి ఎంపీ టికెట్ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే ఎంపీ టికెట్ వంశీకి ఇవ్వలేకపోతే రాష్ట్ర కేబినెట్లో వివేక్కు స్థానం కల్పిస్తారని, వెంకటేశ్కు ఎంపీ టికెట్ ఇస్తారని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. మరోవైపు టికెట్ వంశీకి లేదా పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న మరో నేతకు ఇస్తారని, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ప్రభావిత స్థాయిలో ఓట్లున్న సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడానికి వెంకటేశ్ను పార్టీలో చేర్చుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. -
సిట్టింగ్గా మరోసారి పోటీకి సిద్ధమవుతున్న ‘సోయం’
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీలో లుకలుకలు చోటు చేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు వర్సెస్ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి పాయల్ శంకర్ మధ్య విభేదాలు ముదిరి పాకానపడ్డాయి. సిట్టింగ్గా మరోసారి సోయం పోటీకి సిద్ధమవుతున్నారు. మరోపక్క ఇతర పార్టీల్లోని ఆశావహుల్ని పార్టీలోకి రప్పించేందుకు పాయల్ శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సోయంకు పోటీగా ఇతరులను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించేందుకు శంకర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పార్టీలో ప్రచారం ఉంది. ఇటీవల వరుసగా వేర్వేరు చోట్ల జరుగుతున్న పార్లమెంట్ సన్నాహక సమావేశాలు పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం బీజేపీలో లుకలుకలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోయంకు పోటీగా.. ఎంపీ సోయం బాపూరావుకు పోటీగా పార్టీలో ఇతర ఆశావహులను తెరపైకి తెచ్చేందుకు ఎమ్మెల్యే శంకర్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇతర పార్టీల్లోనూ ఆశవాహులను కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మరో ఆదివాసీ ముఖ్యనేతను పార్టీలో చేర్పించేందుకు నేరుగా వారిని ఢిల్లీకి తీసుకెళ్లినట్టుగా చర్చ సాగుతోంది. టికెట్ హామీ కండీషన్తో పార్టీలో చేరే విషయంలో ఢిల్లీ పెద్దలు హామీ ఇవ్వకపోగా, హైదరాబాద్లోనే ఆ నేతలను చేర్పించాలని తిరిగి పంపించారని ప్రచారం ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమక్షంలో జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇటీవల చేరారు. మరో ముఖ్య నేత మాత్రం టికెట్పై హామీ లేకపోవడంతో చేరకుండానే జిల్లాకు తిరిగి వచ్చినట్లు చెప్పుకుంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ సమావేశాల్లో ఆ నేత యాక్టీవ్గా పాల్గొనడంతో పార్టీని వీడే యత్నాలు ముగిసినట్టేనా.. లేనిపక్షంలో మున్ముందు ఎలాంటి నిర్ణయం ఆ నేత తీసుకుంటారనే విషయంలో పార్టీలో సందిగ్ధం నెలకొంది. సిద్ధాంతాలు ఎటుపోయాయి.. సిద్ధాంతాల పార్టీ అని చెప్పుకునే బీజేపీలో అవి మచ్చుకు కనబడటం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లోనే వ్యక్తమవుతుండడం గమనార్హం. ప్రధానంగా ఇటీవల ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి మార్పు చోటుచేసుకోగా, అనూహ్యంగా పార్టీలో సీనియర్లను కాదని గుడిహత్నూర్ జెడ్పీటీసీ పతంగే బ్రహ్మానందంను ఎంపిక చేయడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నాయకులు సుహాసినిరెడ్డి, ఆదినాథ్ వంటి వారికి అవకాశం ఇవ్వకుండా జెడ్పీటీసీకి ఆ పదవి కట్టబెట్టడం వెనుక పార్టీలో ముఖ్య నేతల మధ్య తీవ్ర విభేదాలే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీజేపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ భైంసా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్బాబు ప్రచార రథం నియోజకవర్గాల్లో తిరుగుతుండడంపై పార్టీ కార్యకర్తలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు ఎటుపోతున్నాయన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన పార్టీగా ఉన్న బీజేపీకి నష్టం జరిగించే విధంగా పార్టీలో కార్యక్రమాలు జరుగుతుండడంతో పలువురు సీనియర్ నేతలు సైతం నిరుత్సాహంగా ఉన్నట్లు సమాచారం. -
రాహుల్ యాత్ర రాంగ్: పీకే కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ యాత్రపై స్పందించారు. రాహుల్ గాంధీ యాత్ర తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయమని ఏ ఎన్నికల వ్యూహకర్త చెప్పారోనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయటం ఒక చెత్త నిర్ణయమని, అసలు ఈ సమయంలో యాత్ర చేపట్టడం సరికాదన్నారు పీకే. పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు ఇటువంటి యాత్ర నిర్వహించాల్సి ఉండేదన్నారు. యాత్ర కాకుండా.. బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఖరారు, భాగస్వామ్య పక్షాలు కలుపుకుపోవటం, ఎన్నికల కోసం వనరుల సేకరణ, రోజువారి సమస్యలకు పరిష్కారాలపై కసరత్తు చేయాల్సిందన్నారు. కానీ యాత్ర చేయటంలో లాజిక్ ఏం లేదన్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. కానీ, యాత్ర చేయమని సలహా ఇచ్చింది ఎవరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో నితీష్ కుమార్ వంటి కీలక నేతలు చేజారుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం ఈశాన్య భారతంలో యాత్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించటం కొంతమేరకు మంచిదే అయినప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని వదలటం తెలివైన పని కాదని అన్నారు. రాహుల్ ఇటువంటి చెత్త సలహాలు ఎవరు ఇస్తున్నారో తనకు తెలియటం లేదని అన్నారు. జనవరి 14న మణిపూర్లో ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం యాత్ర పశ్చిమ బెంగాల్లో కొనసాగుతోంది. చదవండి: అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ -
కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రిని కలిసినా మీ వ్యక్తిత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాంగ్రెస్ నేతల ట్రాప్లో ఎమ్మెల్యేలెవరూ పడొద్దు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి’అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్యేగా గురువా రం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నందినగర్లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ భేటీ లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ఇతర అంశాలపై కూడా పలు సూచనలు చేశారు. ప్రజల సమక్షంలోనే వినతిపత్రాలు ఇవ్వండి ‘నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వండి. వారి నివాసాలు, క్యాంప్ ఆఫీసులకు వెళ్లకుండా వారి కార్యాలయాల్లో కలిసి సమస్యలు విన్నవించండి. కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో తొందర అవసరం లేదు. వారిని పెద్దగా తిట్టాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ నేతలు వాళ్లను వాళ్లే తిట్టుకోవడం త్వరలోనే చూస్తాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. అవి హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత ప్రారంభమవుతుంది. బీఆర్ఎస్పై ప్రజలు నమ్మకం కోల్పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నామని అధైర్యపడొద్దు, ప్రతిపక్షంలో ఉండటం తప్పుకాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. రాజీలేని పోరాటం చేసేది బీఆర్ఎస్ మాత్రమే ‘ తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించాం. బీఆర్ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. ప్రభుత్వ విధానాలను నిశితంగా అ«ధ్యయనం చేస్తూ గాడి తప్పిన ప్రతీ సందర్భంలో ఎండగడదాం. ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో అండగా నిలబడాలి’అని కేసీఆర్ ఆదేశించారు. -
BRS: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూనే.. పార్లమెంట్ ఎన్నికలకు భయపడొద్దంటూ ధైర్యం చెప్పారాయన. తుంటి ఆపరేషన్ నుంచి కోలుకున్న కేసీఆర్ ఇవాళ(గురువారం) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం నందినగర్ నివాసంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలతో ముఖ్యనేతలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్త. ఏదో విని చెబితే.. ట్రాప్లో పడొద్దు. మంచి ఆలోచనతో ప్రభుత్వంలోని వారిని కలిసినా.. జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అభివృద్ధి పనుల కోసం మంత్రులను కలిసి వినతులు ఇవ్వండి. అదీ జనం మధ్య ఉన్నప్పుడే చేయండి. ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ను కలవాలంటే పార్టీకి ముందుగా సమాచారం అందించండి. పార్లమెంట్ ఎన్నికల్లో 6 నుంచి 8 స్థానాలు బీఆర్ఎస్కు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ హామీలను ఇలాగే సాగదీసే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? ఉండదా? అనేది వాళ్ల చేతుల్లోనే ఉంది. బీఆర్ఎస్ను బొందపెడతామంటూ కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి’’అని కేసీఆర్ ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: త్వరలోనే సీఎం రేవంత్ని కలుస్తా: మల్లారెడ్డి ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల్ని కలుస్తున్న పరిణామాలు చూస్తున్నాం. దీంతో వాళ్లు పార్టీలు మారతారనే ఊహాగానాలు చక్కర్లు కొడుతుండగా.. ఆ పరిణామాల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ కేసీఆర్వీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపైనా ఆయన ముఖ్యనేతలతో చర్చించారు. ‘‘పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలి. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఇక నుంచి వారంలో రెండు రోజులు పార్టీ నేతలు, కార్యకర్తలను కలుస్తా. మీరు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు’’ అని కేసీఆర్ అన్నారు. -
బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి! అరూరికి కష్టకాలమేనా?
సాక్షి, వరంగల్: పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడించాలనుకుంటున్న బీఆర్ఎస్కు జిల్లాలో ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. కొందరు పార్టీ ముఖ్యులతోపాటు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. ఇందుకు ఉదాహరణే ఇటీవల నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో పుట్టిన ముసలమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లో కార్పొరేటర్ల అనైక్యతా రాగాలు ఆ పార్టీకి బీటలు పడేలా చేస్తున్నాయి. చైర్మన్ల ఒంటెద్దు పోకడలు, ఏ విషయంలోనూ తమను పట్టించుకోవడం లేదని అప్పట్లో తమ ఎమ్మెల్యేల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లూ మిన్నకుండిపోయారు. ఇప్పుడు వారే గళమెత్తుతుండడంతో ఆ పార్టీకి ఏంచేయాలో పాలుపోవడం లేదు. పార్టీ ఎమ్మెల్యేలు మాజీలు కావడంతో తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ గుంటి రజనిపై అవిశ్వాసం వీగిపోయినా కూడా ఆ పార్టీలో అలజడి చెలరేగింది. ఏకంగా 13 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో గులాబీ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్లయ్యింది. అదేకోవలో ఇప్పుడు వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం ఎటువైపు దారి తీస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. 12 మంది కౌన్సిలర్లు ఉన్న ఈ మున్సిపాలిటీలో 9 మంది చైర్పర్సన్ ఆంగోతు అరుణపై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ జనవరి 11న కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్పై అవిశ్వాసం సృష్టించిన రగడ ఆ పార్టీలో పెద్ద కలకలం రేపుతుండగా.. ఇక వర్ధన్నపేటలో రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందోనని గులాబీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అప్పట్లో అధికారం అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిలర్లను నియంత్రించారు. ఇప్పుడు వారు మాజీలు కావడంతో ఎవరిని నియంత్రించలేక పోతున్నారని పలువురు పేర్కొంటున్నారు. అరూరికి కష్టకాలమేనా? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్కు పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలను నియంత్రించడం కత్తిమీద సాముగా మారింది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో అవిశ్వాసం కూడా ఆయనను టెన్షన్ పెట్టిస్తోంది. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా అరూరి పేరును కూడా బీఆర్ఎస్ పరిగణనలోకి తీసుకునే అవకాశముందని జోరుగా ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు పార్టీ జిల్లా బాధ్యతలు ఆయనకు తలనొప్పిగా మారాయని సమాచారం. ఒక్కొక్కరు సొంత పార్టీ వారిపైనే అవిశ్వాసం పెడుతుండడంతో అరూరితోపాటు ఆయా నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా పరిణమించిందని తెలుస్తోంది. ఈ ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపే అవకాశముందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికై నా ముఖ్య నాయకులు ఏకతాటిపైకి వచ్చి అసంతృప్తులను నిలువరిస్తేనే పార్టీకి ఎంపీ ఎన్నికల్లో అవకాశాలుంటాయని, లేకపోతే పెద్ద మొత్తంలో ఎదురు దెబ్బతగిలే అవకాశముందని శ్రేణులు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఎరబ్రెల్లి దయాకర్రావు, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి జిల్లాకు చెందిన వారు కావడంతో బీఆర్ఎస్ బలోపేతంపై దృష్టిసారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇవి చదవండి: వినతులు పెండింగ్ ఉండొద్దు! : మంత్రి పొంగులేటి -
2004 - 2024 : కాంగ్రెస్ దింపుడు కల్లం ఆశలు
2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది? మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్పేయి. బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది. ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్తో కలిసి లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు. ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు. నాటి ఎన్నికల్లో వాజ్పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి. చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు? -
మోదీ మళ్లీ పీఎం ఐతే.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ, సాక్షి: బీజేపీపై విమర్శలు సంధించే క్రమంలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభకు జరగబోయే చివరి ఎన్నికలు ఇవేనని, ప్రజలు జాగ్రత్తగా ఓటేయాలని కోరుతున్నారాయన. లోక్సభకు ఇవే చివరి ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో గనుక మోదీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అప్పుడు దేశంలో ప్రజస్వామ్యం, ఎన్నికలు ఉండవని అన్నారు. ప్రజలకు ఓటు వేసే అవకావం కూడా ఉండకుండా పోతుంది. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఓటేయాలని ఖర్గే కోరారు. ఒడిశాలోని భువనేశ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన పాల్గొని ప్రసంగించారు.‘అందిరికీ ‘ఈడీ’ నోటీసులు పంపుతారు. ప్రజలను భయపెడతారు. ఈ భయంతో కొంతమంది స్నేహానికి ద్రోహం చేస్తారు. కొంత మంది పార్టీలకు గుడ్బై చెబుతారు. మరికొంత మంది కూటమి నుంచి వైదొలుగుతారు. భాతర రాజ్యాంగం కల్పించిన ఓటు వేయటానికి ఇదే మీకు చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల తర్వాత ఇక ఎన్నికలు ఉండవు’ అని ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ, ఆ పార్టీకి సైద్ధాంతిక గురువుగా వ్యవహరించే ఆర్ఎస్ఎస్ సంస్థ దేశంలో ‘విషం’ లాంటివని మండిపడ్డారు. ‘రాహుల్ గాంధీ దేశం మొత్తం ఐక్యంగా ఉండాలనుకుంటున్నారు. రాహుల్ గాంధీది ప్రేమ దుకాణం.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ది మాత్రం ద్వేషంతో నిండిన దుకాణం. అందుకే మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండూ విషయంతో నిండినవి. ఈ రెండు ప్రజల హక్కులను కాలరాస్తాయి’ అని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. -
TS: ఖమ్మంలో బీఆర్ఎస్ ‘ఉనికి’ పాట్లు !
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి గుదిబండగా మారిందా? గడచిన మూడు ఎన్నికల్లోనూ ఒక్కో సీటు మాత్రమే ఇక్కడ గెలవడానికి కారణం ఏంటి? జిల్లా ప్రజల్ని, నాయకుల్ని అంచనా వేయడంలో గులాబీ బాస్ ఫెయిల్ అయ్యారా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ను సమూలంగా ప్రక్షాళన చేయడం సాధ్యమేనా? జిల్లాలో కొత్త నాయకత్వం తయారవుతుందా? పార్టీకి వైభవం వస్తుందా? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే అని రాజకీయాలు తెలిసిన ఎవరైనా చెబుతారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈ జిల్లాలో వచ్చే ఫలితాలు గులాబీ పార్టీని నిరాశకు గురిచేస్తున్నాయి. జిల్లాలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే...ప్రతిసారి ఒక్క సీటు మాత్రమే గులాబీ పార్టీకి దక్కుతోంది. దీంతో ఇతర పార్టీల తరపున గెలిచినవారిని చేర్చుకుని బలపడ్డామని గులాబీ పార్టీ నాయకత్వం ఇప్పటివరకు భావిస్తూ వచ్చింది. అయితే ఈసారి పరిస్థితి రివర్స్ అయింది. రాష్ట్రంలో అధికారం కూడా పోయింది. బీఆర్ఎస్లో బలమైన నేతలు కొందరు వెళ్లి కాంగ్రెస్లో చేరిపోవడంతో పార్టీ జిల్లాలో మరింత బలహీనంగా మారింది. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో ఒక్కో సీటే వచ్చినా రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. సింగిల్ సీటు రావడం..అదొక సెంటిమెంట్ అనుకున్నారు గులాబీ నేతలు. ఈసారి ఆ సెంటిమెంట్ పనిచేయలేదు. తాజా పరిణామాలతో ఈ జిల్లాలో బీఆర్ఎస్ని పూర్తిస్తాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఆ పార్టీ పెద్దలు. ప్రస్తుతం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది. ప్రస్తుతం జిల్లాకు చెందినవారే రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ బలం పెంచుకోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో పార్టీని, నాయకత్వాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్ ఖమ్మంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అక్కడి నేతలు చెబుతున్నారు. ఇలానే వదిలిస్తే జిల్లాలో గులాబీ పార్టీ మరింత వీక్ అవ్వడం ఖాయం అంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ పార్టీకి కొరుకుడు పడటంలేదనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పురాలేదు. అందుకే కేసీఆర్, కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి కష్టపడితేనే జిల్లాలో బీఆర్ఎస్ ఉనికి చాటుకోగలదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ గాడిన పెడతారో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఇదీచదవండి.. క్యాబినెట్ విస్తరణకు మహూర్తం ఫిక్స్..! -
కోర్ మీటింగ్లో ‘సోయం’ వ్యాఖ్యల దుమారం!
సాక్షి,ఆదిలాబాద్: బీజేపీలో రచ్చ మొదలైంది.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ అభ్యర్థి ఎవరనే విషయంలోనే ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. మొన్నటివరకు సిట్టింగ్ ఎంపీకే టిక్కె ట్ అనే ప్రచారం జరిగింది. దానిపై ప్రస్తుతం పార్టీ లో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మంగళవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో అటు ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు దుమారం లేపుతుండగా ఇటు ఎమ్మెల్యేలు అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా మాట్లాడటం విభేదాలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్లో జరగవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు తిరిగి పోటీ చేస్తారని కొద్దిరోజుల కిందట పార్టీలో చర్చ జరిగింది. తాజాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇటు పార్టీలో ఉన్న ఎస్టీ ముఖ్య నేతలు, పార్టీతో సంబంధం లేని ఇతరులు కూడా బీజేపీ నుంచి టిక్కెట్ ఆశిస్తూ ఆయా ఎమ్మెల్యేల ఫొటోలతో అన్నిచోట్ల ఫ్లెక్సీలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందనే ప్రచారం ఉంది. ఎన్నికలు సమీపిస్తుండగా పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నది స్పష్టమవుతోంది. అయితే ఆయా ఎమ్మెల్యేలు వేర్వేరు అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేలుగానే దీన్ని పరిగణించాలా? ఎమ్మెల్యేల మధ్య కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం ఉందా? అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆదిలా బాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అభ్యర్థి ఎంపిక విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం సా ధించగలుగుతారా? అనేది వేచిచూడాల్సిందే. వ్యాఖ్యల దుమారం.. బీజేపీ కోర్ కమిటీ సమావేశం మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర నేతలూ పాల్గొన్నారు. ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎంపీ సోయం మాట్లాడుతూ తాను బాగా పనిచేశానని పార్టీ భావిస్తే టిక్కెట్ ఇస్తుందని.. అలా కాదనుకుంటే ఇవ్వదని వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసేందుకు డిమాండ్ పెరిగిందన్నారు. అయితే కొత్తగా కొందరు పోస్టర్లు వేసి, డిన్నర్లు ఇస్తున్నారని, అలాంటి వారిని పార్టీ గుర్తించదని, ఇతర పార్టీలో ఇది సాధ్యమని అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఎంపీగా ఉన్నందునే పార్లమెంట్ పరిధిలో నాలుగు స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారని, మిగిలిన చోట్ల గట్టి పోటీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి ఎవరనేది మా చేతిలో లేదనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యర్థి ఎవరైనా పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఎంపీ, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయంగా మారాయి. మొత్తంగా ఎన్నికలకు ముందు పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. ఇవి చదవండి: రేవంత్రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -
రాహుల్ గాంధీ అరెస్ట్ ఖాయం: అస్సాం సీఎం
గువాహటి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర అస్సాం(అసోం)లో రాజకీయ వేడిని పెంచుతోంది. రాహుల్ వర్సెస్ హిమంత బిశ్వ శర్మగా మారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయమని సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బుధవారం సిబ్సాగర్ జిల్లాలోని నజిరా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాబోయే లోక్ సభ ఎన్నికల అనంతరం రాహుల్ గాంధీ అరెస్ట్ అవుతారని సీఎం హిమంత చెప్పారు. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అయినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) కూడా విచారణ చేపట్టిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ అరెస్ట్ కావటం ఖాయని అన్నారు. మంగళవారం మేఘాలయా నుంచి అసోం గువాహటిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని అది కాస్త తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అసోంలో ఘర్షణలు సృష్టించినందుకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, పోలీసులపై దాడికి పురిగొల్పినందుకు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
రేపు హైదరాబాద్కు ఖర్గే
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్తో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం సమీక్షించారు. తన నివాసంలో మహేశ్తో సమావేశమైన రేవంత్ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. సీఎంను కలిసిన సలహాదారులు, ఎమ్మెల్సీలు కాగా, కొత్తగా నియమితులైన సలహాదారులు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం రేవంత్ను కలిశారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్అలీ, హర్కర వేణుగోపాల్రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేశ్కుమార్గౌడ్, బల్మూరి వెంకట్లు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ అభినందించారు. అదే విధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్కు అభినందనలు తెలిపారు. -
100 మీటర్ల గొయ్యితీసి..బీఆర్ఎస్ను పాతిపెడతా!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ను బొక్కబోర్లాపడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆనవాళ్లు లేకుండా 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరో, మేమో చూసుకుందామని సవాల్ చేశారు. పులి బయటికి వస్తోందంటూ బీఆర్ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని.. దాని కోసమే ఎదురుచూ స్తున్నానని, తమ దగ్గర బోను, వల ఉందని వ్యాఖ్యానించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రేవంత్రెడ్డి శుక్రవారం లండన్లో నిర్వహించిన ‘ఇండియా డయాస్పోరా ఆర్గనైజేషన్స్ మీట్’కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రేవంత్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే.. ‘‘దేశ సరిహద్దు దాటిన తర్వాత రాజకీ యాలు మాట్లాడొద్దని, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలనుకుని బయలుదేరాను. కానీ ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న చర్చ లు.. తండ్రీకొడుకులు, అల్లుడు కలసి ప్రజలెన్ను కున్న ప్రజా ప్రభుత్వం మీద చేస్తున్న దాడులను చూశాక.. లండన్ గడ్డమీద రాజకీయ అంశాలు మాట్లాడదల్చుకున్నా. మంచి పనులకు ఎవరు పునాదిరాయి వేసినా.. వాటిని కొనసాగించడానికి నాకు గానీ, మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. కానీ కొందరు తమ కుటుంబం కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టి, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. పైగా ఈ రోజు అవినీతి గురించి చర్చే జరగొద్దన్నట్టు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించవద్దన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రపంచంతో పోటీ పడతాం.. మేం సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతో అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళుతుంటే కొందరు ఓర్వలేకపో తున్నారు. నేను సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి 20 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి హోదాకు చేరుకున్నా. ఇది ఆషామాషీగా రాలేదు. అయ్యనో, తాతనో ఇస్తే రాలేదు. నేను అయ్య పేరు చెప్పుకుని మంత్రి అయ్యి, విదేశీ పర్యటనల పేరు మీద విలాస జీవితం గడపడానికి రాలేదు. రాష్ట్ర అభివృద్ధిని మనసులో పెట్టుకుని వచ్చా. పక్క రాష్ట్రాలతో పోటీపడాలన్న ఆలోచన కాదు నాది. ఈ ప్రపంచంతోనే పోటీపడే ఆలోచన. ప్రపంచంతో పోటీపడే యువత, హైదరాబాద్ నగరం, ఐటీ మేధావులు, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్, ఐటీ, ఫార్మా కంపెనీలు నా దగ్గరున్నాయి. ప్రపంచంతో పోటీపడతానే తప్ప దివాలా తీసిన దద్దమ్మలతో నాకేం పోటీ? వారికి అధికారం పోయినా అహంకారం, బలుపు తగ్గినట్టు లేదు. మేం బ్రిటన్కు వచ్చి ఇంతమంది కుటుంబ సభ్యులను కలిశాం. ప్రతి పర్యాటకుడు హైదరాబాద్ రావాలి. అక్కడి పర్యాటక ప్రాంతాలను ఆస్వాదించాలి. ఫొటోలు దిగాలి. థేమ్స్ నది స్ఫూర్తితో మూసీని అభివృద్ధి చేస్తాం..’’ అని రేవంత్ చెప్పారు. తెలంగాణ శక్తి, వారసత్వ సంపదకు మీరే ప్రచారకులని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని లండన్లోని ఎన్నారైలను కోరారు. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళతానని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం 60 ఏళ్లలో 16 మంది సీఎంలు రూ.72 వేల కోట్లు అప్పులు చేస్తే.. గత పదేళ్లలో ఒకే ఒక్క కుటుంబం రూ.ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఆ దరిద్రాన్ని మన నెత్తిమీద పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసే దిశలో పనిచేస్తామని చెప్పాం. కానీ అసెంబ్లీ మొదలుపెట్టిన రోజునే.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని బిల్లా, రంగాలు అడిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని, నాయకులను బొక్కబోర్లా పడేసి బొక్కలిరగ్గొట్టినా బుద్ధి రాలేదు. ఇంకా మాట్లాడుతున్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో చూసుకుందాం. బిల్లారంగా, చార్లెస్ శోభారాజ్లకు సూటిగా సవాల్ విసురుతున్నా. రెండు రోజుల్లో తెలంగాణ గడ్డమీద కాలుపెడతా. ఈ నెల 26వ తేదీ తర్వాత ఇంద్రవెల్లిలో మొదలుపెట్టి తెలంగాణ నలుమూలలా సుడిగాలి పర్యటన చేస్తా. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీ నిషాన్ (ఆనవాళ్లు) లేకుండా వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా. -
మార్కెట్ కమిటీలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంగళవారం ఐదు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇన్చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పోస్టింగులు, బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సమర్థులైన అధికారులను ప్రభుత్వమే గుర్తించి అవసరమైనచోట వారి సేవలు ఉపయోగించుకుంటుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు తలదూర్చినా నిఘా యంత్రాంగం దృష్టి సారిస్తుందనే విషయాన్ని గుర్తించాలని మంత్రులు,ఎమ్మెల్యేలతో అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తామన్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని హితవు పలికారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. నిధుల ప్రాథమ్యాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తామన్నారు. ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 లోక్సభ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భేటీలో పాల్గొన్నారు. -
నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్యాదవ్?
మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. పార్లమెంటులో అడుగుపెట్టడానికి తెలంగాణ రాష్ట్రము నుంచి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ పీఠం 2024 లో బీజేపీకె చెందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రము నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. అదేవిదంగా 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా పార్లమెంట్ కు పోటీచేయడానికి రాష్ట్రము నుంచి పోటీ ఎక్కువగానే కనపడుతోంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత్ యాదవ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రంజిత్ యాదవ్ ఇప్పటి నుంచే నల్ల గొండ నుంచి పావులు కదుపుతున్నారు. పార్టీలో కొత్తగ చేరినప్పటికీ, ఆయనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు స్నేహపూర్వక వాతావరణం ఉంది. కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి...! నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు.. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత రెండు మూడు ఎన్నికల నుండి మిర్యాలగూడ.. నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న రఘువీర్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడంతో పాటు రాజకీయ సమీకరణలు అనుకూలించకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిన క్రమంలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రఘువీర్ రెడ్డి. బరాబర్ సిద్ధమై ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ తేరా చిన్నపరెడ్డి...! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే గతంలోనూ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు కుందూరు జానారెడ్డి కుటుంబంతో పోటీ అనగానే వాళ్లని ఎదుర్కొనే సత్తా... తేరా చిన్నపరెడ్డికి మాత్రమే ఉందనే రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అట్లనే గత సాగర్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలించడంతో పాటు ఎమ్మెల్సీ గానూ మరోసారి అవకాశం ఇవ్వకపోవడం వంటిపరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఈసారి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈయనతో పాటు ట్రైకార్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బీజేపీ నుంచి రంజిత్ యాదవ్..! నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉండి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్.. బీజేపీ పక్షాన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన రంజిత్ యాదవ్.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో... జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నల్లగొండ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులన్నీ కలిసి వస్తే జరగబోయే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన వాళ్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అట్లనే టికెట్ సాధించి బరిలో నిలిచే గెలిచే అభ్యర్థులు ఎవరో.. అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది. -
బంగ్లాదేశ్ ఎన్నికల్లో ‘అవామీ’ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ మరోసారి ఘన విజయం సాధించింది. మొత్తం 300 పార్లమెంట్ స్థానాలకు గాను 299 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, అవామీ లీగ్ ఏకంగా 223 స్థానాలు సొంతం చేసుకుంది. ఎన్నికలు అదివారం జరగ్గా, సోమవారం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. తుది ఫలితాలు వెలువడ్డాయి. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షమైన జతియా పార్టీ 11 సీట్లు గెలుచుకుంది. బంగ్లాదేశ్ కల్యాణ్ పార్టీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. 62 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. అలాగే జతియా సమాజ్ తాంత్రిక్ దళ్, వర్కర్స్ పార్టీ ఆఫ్ బంగ్లాదేశ్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి. అవామీ లీగ్ అధినేత, ప్రధానమంత్రి షేక్ హసీనా గోపాల్గంజ్–3 నియోజకవర్గం నుంచి అఖండ విజయం సాధించారు. బంగ్లాదేశ్ పార్లమెంట్కు ఆమె ఎన్నిక కావడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. హసీనా రికార్డు 76 ఏళ్ల షేక్ హసీనా 2009 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వరుసగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మొత్తంగా ఆమె ప్రధాని అవుతుండడం ఇది ఐదోసారి. బంగ్లా చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించబోతున్నారు. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్టతో పాటు మరో 15 పార్టీలు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. ఈసారి కేవలం 41.8 శాతం పోలింగ్ నమోదైంది. 2018 ఎన్నికల్లో 80 శాతానికి పైగా నమోదవడం విశేషం. ఇండియా గొప్ప మిత్రదేశం భారత్ తమకు గొప్ప మిత్రదేశమని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా కొనియాడారు. ఎన్నికల్లో విజయం అనంతరం ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ఇరుగుపొరుగు దేశాలైన భారత్–బంగ్లాదేశ్ ఎన్నో సమస్యలను కలిసి పరిష్కరించుకున్నాయని చెప్పారు. 1971, 1975లో భారత్ తమకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. తనకు, సోదరికి, కుటుంబ సభ్యులకు ఆశ్రయం కలి్పంచిందని అన్నారు. ఇండియాను తమ పక్కింటిలాంటి మిత్రదేశంగా భావిస్తామని తెలిపారు. ఇండియాతో తమకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. హసీనాకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. బంగ్లాదేశ్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. -
‘పార్లమెంట్’ హీట్! బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు..
కరీంనగర్: లోక్సభ సమరానికి రాజకీయ పార్టీలు సైఅంటున్నాయి. విజయబావుటా ఎగురవేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. కరీంనగర్ లోక్సభ సీటును కై వసం చేసుకోవాలని బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర, జాతీయస్థాయి నాయకులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో సభలు.. సమావేశాలకు రెడీ అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ స్థానాల్లో కాంగ్రెస్ విజయబావుట ఎగురవేసింది. కరీంనగర్, హుజూరాబాద్, సిరిసిల్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కరీంనగర్, హుజూరా బాద్లో బీజేపీ అభ్యర్థులు గట్టిపోటీ ఇచ్చారు. ప్రజాక్షేత్రంలోకి బీజేపీ.. బీజేపీ నుంచి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్కుమా ర్ తిరిగి పోటీ చేయనున్నారనే ప్రచారం ఊపందుకుంది. పార్టీ శ్రేణులు ఇప్పటికే పలుచోట్ల వాల్రైటింగ్, పోస్టర్లు వేసి ప్రచారం ముమ్మరం చేస్తున్నా రు. గతనెల చివరి వారంలో హైదరాబాద్లో నిర్వహించిన పార్టీ సమావేశంలో అమిత్షా సిట్టింగ్లకే టికెట్లు ఇస్తామని సంకేతం ఇవ్వడంతో బండి సంజయ్ క్యాడర్ను కదనరంగంలోకి దించారు. అయోధ్య శ్రీరాముడి అక్షింతలు ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు ప్రజ ల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. శక్తికేంద్రాల ఇన్చార్జిలను ట్రైనప్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు సూచిస్తున్నారు. వికసిత్ భారత్తో ప్రజలతో మమే కం అయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ బీజేపీ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ మానకొండూరు మండలం కొండపల్కల గ్రామంలో జరిగే ‘వికసిత్ భారత్’లో పాల్గొననున్నారు. జోష్లో ‘కాంగ్రెస్’.. పదేళ్ల తర్వాత అధికారాన్ని ‘హస్త’గతం చేసుకున్న కాంగ్రెస్ ఊపుతో ముందుకెళ్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న ఉత్సాహంతో పార్లమెంట్ సీటునూ గెలుచుకోవాలని చూస్తోంది. హుస్నాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉండటం, గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో అధిష్టానం లోక్సభ ఇన్చార్జిగా నియమించింది. దీంతో ఆ పార్టీ లీడర్లు బీజేపీ, బీఆర్ఎస్లను ఎదుర్కొనేందుకు క్యాడర్ను రెడీచేస్తున్నా రు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలు బిజీబిజీగా ఉన్నారు. గత అభివృద్ధి, కాంగ్రెస్ హమీలపై ప్రజల్లోకి బీఆర్ఎస్.. పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వందరోజుల్లో ఆరు గ్యారంటీల అమలు తదితరాలు ఎండగట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలిచిన మూడు సీట్లతో పాటు మిగతా నియోజకవర్గాల్లో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీ ఇచ్చామని గుర్తుచేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇవి చదవండి: నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మన్నెం రంజిత్యాదవ్? -
Sheik Hasina: ఎన్నికల్లో విజయం.. బంగ్లా ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఢాకా: ఐదోసారి బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన అవామీ లీగ్ చీఫ్, దేశ ప్రధాని షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సహజంగానే బంగ్లాదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. రానున్న ఐదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడమే నా లక్ష్యం. 2041కల్లా బంగ్లాదేశ్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. స్మార్ట్ ఎకానమి, స్మార్ట్ ప్రభుత్వం, స్మార్ట్ ప్రజలు నా లక్ష్యాలు’ అని ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు గెలిచి ఘన విజయం సాధించిన తర్వాత హసీనా అన్నారు. ఆదివారం జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలను ఆ దేశ ప్రధాన పతిపక్ష పార్టీ బహిష్కరించింది. ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ విజయం ఎన్నికల ముందే దాదాపు ఖరారైంది. అయితే ప్రతిపక్ష బీఎన్పీ పార్టీ ఉగ్రవాదులతో కుమ్మక్కై ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడిందని, వారు ఎన్నికలను బహిష్కరించి తనను గెలిపించలేదని, బంగ్లాదేశ్ ప్రజలను గెలిపించారని హసీనా అన్నారు. ఇదీచదవండి..మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం -
నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్దే: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ ఎంపీ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు అత్యధిక ఓట్లు వచ్చాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ఈ సారి త్రిముఖ పోరు జరగనుందని అన్నారు. నిజామాబాద్ ఎంపీ సీటు ఈసారి బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పై కాంగ్రెస్ ప్రభుత్వం దాటవేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, ప్రశాంత్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, ఇతర నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం -
కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది
సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగాఉందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహా పొరపాట్లు పార్లమెంటు ఎన్నికల్లో జరగనివ్వమని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్లో జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో జరిగిన భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి, కాంగ్రెస్కు దూరమైన వర్గాలు పార్లమెంటులో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. లోక్సభ ఎన్నికల్లో రెండు జాతీయపారీ్టలతో జరిగే త్రిముఖ పోటీ బీఆర్ఎస్కే అనుకూలిస్తుందన్నారు. కాంగ్రెస్కు ఓట్లేసిన వారిలో పునరాలోచన: అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకుందని, ప్రజల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వారు పునరాలోచనలో పడ్డారని, అప్పులను బూచిగా చూపి హామీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో తొందరపడటం లేదని, బీఆర్ఎస్పై కాంగ్రెస్ విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని, కాంగ్రెస్కు ఓటు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారన్నారని చెప్పారు. గతంలో తెలంగాణ పదాన్ని కాంగ్రెస్ నిషేధించిందని, బీఆర్ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పారీ్టలు సిద్ధంగా ఉన్నాయని, పారీ్టలకు ఎత్తు పల్లాలు తప్పవన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో అందరికీ దళితబంధు సాయం అందగా, ఇతర వర్గాలు ఓట్లు వేయలేదని, దళితబంధు, బీసీ బంధు, రైతుబంధు వంటి పథకాల ప్రభావం బీఆర్ఎస్పై పడిందని చెప్పారు. జుక్కల్లో షిండే ఓడిపోతారని తాము భావించలేదన్నారు. అధికారం కోల్పోయినా మునుపటి ఉత్సాహమే : హరీశ్రావు పార్టీ తరపున తప్పులు ఉంటే మన్నించాలని, అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఓటమిని దిగమింగుకొని లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీల సంఖ్య బలంగా ఉంటేనే లోక్సభలో తెలంగాణ గళం వినిపిస్తుందన్నారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండిచేయి, కాంగ్రెస్ది తొండిచేయి అని, కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నిస్తే గతంలో బీజేపీతో తాము కుమ్మక్కు అయినట్టు రేవంత్ ఆరోపించారన్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన 1.25 కోట్ల దరఖాస్తులకు మోక్షం కల్పించాలని, వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని హరీశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో కాకుండా బీఆర్ఎస్ బలహీనతల వల్లే గెలిచిందని, బీఆర్ఎస్లో కొందరు సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని చెప్పారు. అభివృద్ది ఎజెండాగా కాకుండా, ఇతర అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో కాంగ్రెస్ సఫలమైందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. జహీరాబాద్లో గెలుపుపై బీఆర్ఎస్ ధీమా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా బీఆర్ఎస్ బలోపేతమవుతుందని, లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లోక్సభ సన్నాహక సమావేశం అనంతరం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మీడియాతో మాట్లాడారు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూధనా చారి, ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యేలు మాణికరావు, చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు -
TS: లోక్సభ ఎన్నికలు.. కాంగ్రెస్ కోఆర్డినేటర్ల నియామకం
న్యూఢిల్లీ: రాబోయే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఈ మేరకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ► ఆదిలాబాద్- సీతక్క( అనసూయ) ►పెద్దపల్లి - శ్రీధర్బాబు ►కరీంనగర్ - పొన్నం ప్రభాకర్ ►నిజామాబాద్ - జీవన్ రెడ్డి ►జహీరాబాద్ - సుదర్శన్ రెడ్డి ► మెదక్ - దామోదర రాజనర్సింహ ►మల్కాజిగిరి - తుమ్మల నాగేశ్వరరావు ►సికింద్రాబాద్, హైదరాబాద్ - మల్లు భట్టి విక్రమార్క ►చేవెళ్ల, మహబూబ్నగర్ - సీఎం రేవంత్ రెడ్డి ►నాగర్ కర్నూల్ - జూపల్లి కృష్ణారావు ►నల్గొండ - ఉత్తంకుమార్ రెడ్డి ►భువనగిరి - కోమటిరెడ్డి వెంకటరెడ్డి ►వరంగల్ - కొండా సురేఖ ►మహబూబాబాద్, ఖమ్మం - శ్రీనివాస్ రెడ్డి -
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: 2014లో అనివార్యంగా ఒంటరిగా పోటీ చేశామని, అప్పుడు సంస్థాగతంగా పార్టీ గట్టిగా లేకపోయినా ప్రజలు మనల్ని దీవించారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన జహీరాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 119 సీట్లలో 39 సీట్లు గెలిచామని, ఇది తక్కువ సంఖ్య ఏమి కాదని మూడింట ఒకవంతు సీట్లు గెలిచాని అన్నారు. జుక్కల్ నియోజకవర్గలో హన్మంత్ షిండే ఓడిపోతారని అస్సలు ఊహించలేదని తెలిపారు. కేవలం 11 వందల ఓట్లతో ఓడిపోయారని గుర్తుచేశారు. నారాయణ్ ఖేడ్ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత జుక్కల్లో గెలిచారని అన్నారు. ఇలాంటి విచిత్రాలు చాలా జరిగాయని అన్నారు. దళిత బంధు నిజాంసాగర్ మండలంలో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదని తెలిపారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని అన్నారు. కొత్త ఒక వింత పాత ఒక రోతలా ప్రజలు భావించారని అన్నారు. కాంగ్రెస్కు ఓట్లు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారని అన్నారు. కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదర లేదని,గతంలో తెలంగాణ పదాన్ని నిషేధించారని అన్నారు. తెలంగాణ కోసం కడుపు చించుకుని కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్ బలంగా లేకపోతే మళ్ళీ తెలంగాణ పదం మాయం చేసేందుకు పార్టీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని అన్నారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందని తెలిపారు. ఈ మూడు ముక్కలాటలో మనకే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని అన్నారు. కేసీఆర్ పట్ల సానుభూతి, కాంగ్రెస్కు దూరమైన వర్గాలు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి బాటలు వేస్తాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ కచ్చితంగా గెలుస్తుందని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని, 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని గుర్తు చేశారు. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో అపుడు పరిస్థితి మారిందన్నారు. గులాబీ జెండా అంటే గౌరవం పెరిగిందని తెలిపారు. ఇటీవల కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా ఇపుడు పునారాలోచనలో పడ్డారని అన్నారు. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఒత్తిడి పెంచుదామని తెలిపారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు సీఎం రేవంత్రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని తెలిపారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వం మీద విమర్శల విషయంలో బీఆర్ఎస్ తొందరపడటం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపి అప్పుల పాలు చేశామని కాంగ్రెస్ వాళ్ళే మొదట దాడి మొదలు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు.. బీఆర్ఎస్ను విమర్శిస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. చదవండి: ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?: మాజీ ఎంపీ వినోద్ -
ఈ నెల 6,7,8 తేదీల్లో బీజేపీ భేటీ
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కీలకభేటీకి బీజేపీ సిద్ధమైంది. ఈ నెల 6, 7, 8 తేదీల్లో జాతీయ నేతలు తరుణ్చుగ్, సునీల్ బన్సల్లు రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కొత్త ఎన్నికల కమిటీ నియామకంపై దృష్టి పెట్టనున్నారు.90 రోజుల ఎన్నికల కార్యాచరణ ప్రణాళికపై చర్చించి ఖరారు చేయనున్నట్టు రాష్ట్రపార్టీవర్గాల సమాచారం. లోక్సభ ఎన్నికల ముందు వరకు పార్టీపరంగా ఏయే కార్యక్రమాలు చేపట్టాలి ? ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి ? అనే అంశంపై ఐదారు కమిటీలను నియమించనున్నట్టు తెలుస్తోంది. పనిలోపనిగా జాతీయ నేతలు అభిప్రాయసేకరణ జరిపాక బీజేఎల్పీనేతను ఎన్నుకోవాల్సి ఉన్నందున, ఈ భేటీల సందర్భంగా ఈ ఎన్నిక జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని పార్టీనేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీకి మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఉంటుందంటున్నారు. ముందుగానే లోక్సభ అభ్యర్థుల ప్రకటన : కిషన్రెడ్డి ఎంపీ టికెట్లకు సంబంధించి దరఖాస్తులేవీ స్వీకరించడం లేదని మంగళవారం మీడియా చిట్చాట్లో కిషన్రెడ్డి తెలిపారు. అభ్యర్థుల ఖరారు అనేది జాతీయ నాయకత్వం పరిధిలోనే ఉంటుందన్నారు. గతంతో పోల్చితే ముందుగానే 17 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను నాయకత్వం ప్రకటిస్తుందని చెప్పారు. ఇప్పటికైతే నాలుగు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ గ్యారంటీపై చర్చ జరగలేదన్నారు. వరంగల్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ పోటీచేస్తారనే దానిపై ఎలాంటి చర్చ కానీ, నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. -
తెలంగాణలో జాయినింగ్స్ కమిటీ ఉన్నట్టా? లేనట్టా?
-
పథకాల అమలుపై అనుమానాలున్నాయ్!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల హామీని నెరవేర్చేందుకు కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలాఖరులోగా షెడ్యూల్ వచ్చే అవకాశమున్నందున, కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరుగుతుందని అన్నారు. పార్లమెంటు ఎన్నికలు షెడ్యూల్లోపే ఆరు గ్యారంటీలలోని 13 హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయని హరీశ్ పేర్కొన్నారు. ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి మార్చి 17వ తేదీతో వంద రోజులు పూర్తవుతుందని, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆ పార్టీ చెప్పినప్పటికీ, ఎన్నికల కోడ్వస్తే గ్యారంటీల అమలుకు బ్రేక్పడే ప్రమాదముందన్నారు. ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలన్నా, ఫిబ్రవరి 20లోపే చేయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్షెడ్యూల్వచ్చేలోపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ప్రవేశపెట్టాలని, ఒకవేళ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్కాకుండా ఓట్ఆన్ఎకౌంట్బడ్జెట్పెట్టిందంటే హామీల అమలు ఎగవేతకు సిద్ధమైనట్టేనని అనుమానించాల్సి ఉంటుందన్నారు. అలాగే యాసంగి వడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ఇచ్చే పథకానికి సంబంధించిన గైడ్లైన్స్కూడా వెంటనే రిలీజ్చేసి, బడ్జెట్లో ఆ స్కీంను చేర్చాలని చెప్పారు. ఆ దరఖాస్తులు కాలయాపనకేనా? పథకాల అమలుకు ప్రభుత్వం ముందుగా విధివిధానాలు రూపొందించి, తరువాత ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుందని, కానీ కాంగ్రెస్ప్రభుత్వం గైడ్ లైన్స్సంగతి తర్వాత.. ముందైతే దరఖాస్తులు తీసుకుందామన్నట్టు వ్యవహరిస్తోందని హరీశ్రావు విమర్శించారు. అందుకే ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకుంటున్నారని, వాటిని ఆన్లైన్ చేయడం పేరుతో ఆయా స్కీంల అమలును వీలైనంత జాప్యం చేయాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. తమ ప్రభుత్వంలో ఏ రోజు ఎంతమంది రైతులకు రైతుబంధు ఇచ్చామో ప్రతి రోజూ ప్రెస్నోట్ఇచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఎందరికి రైతుబంధు ఇచ్చారో క్లారిటీ లేదని తెలిపారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టిన వారికి, ఎందరికి రైతుబంధు ఇచ్చారనే వివరాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాహుల్గాం«దీ, ప్రియాంక గాంధీ హామీ ఇచ్చిన, మేనిఫెస్టోలో పెట్టిన నిరుద్యోగ భృతి అమలును ఎగవేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తాము ఇలాంటి హామీ ఇవ్వలేదని చెప్పడమే దీనికి నిదర్శమన్నారు. డిసెంబర్9వ తేదీనే రైతు భరోసా, రూ.2 లక్షల రుణాలు మాఫీ, ఆసరా పింఛన్ల పెంపు, 200లోపు యూనిట్ల కరెంట్బిల్లులు మాఫీ హామీలు ఇచ్చారని, వాటిని వీలైనంత త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్ట్రాన్స్ప్లాంటేషన్సహా పెద్ద జబ్బులకు వైద్యం చేసేందుకు తమ ప్రభుత్వం రూ.11.50 లక్షల వరకు ఆరోగ్య శ్రీ కింద చెల్లించిందని, కొత్త ప్రభుత్వంలో ఈ స్కీం ఎంతమందికి వర్తింపజేశారనే వివరాలు ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. హామీలిచ్చేటప్పుడు బడ్జెట్పై అవగాహన లేదా? మాటకు ముందు అప్పులు, ఖాళీ కుండలు అని చెప్పేవాళ్లకు ... హామీలిచ్చేటప్పుడు బడ్జెట్పై అవగాహన లేదా అని హరీశ్రావు ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,400 కోట్ల అప్పు చేసినట్లు తెలిసిందని, రూ. 13వేల కోట్ల అప్పు తీసుకునేందుకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐకి లేఖ రాసిందని, ఈ అప్పులను కూడా శ్వేతపత్రంలో తమ ప్రభుత్వం ఖాతాలోనే వేశారని అన్నారు. కాంగ్రెస్పార్టీ ఎన్నికలకు ముందు జాబ్క్యాలెండర్పేరుతో పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందని, దానికి అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ప్రయత్నించాలని సూచించారు. కార్లు కొని దాచిపెట్టుకున్నట్టు మాట్లాడి ముఖ్యమంత్రి తన స్థాయిని దిగజార్చుకోవద్దన్నారు. ప్రగతిభవన్లో 200 రూములు, స్విమ్మింగ్పూల్, బుల్లెట్ప్రూఫ్బాత్రూంలు ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారని, ఇప్పుడు అందులో నివాసం ఉంటున్న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఏది నిజమో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రొటోకాల్ఉల్లంఘన జరుగుతోందని, నర్సాపూర్, జనగామ, హుజూరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్నేతలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. 119 మంది ఎమ్మెల్యేలను సమదృష్టితో చూస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చెప్పారని, ప్రస్తుతం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. -
ఎక్కడ.. ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం హడావుడి మొదలైంది. నలుగురు సిట్టింగ్ ఎంపీలకు రూట్ క్లియర్ అనే ప్రచారం నేపథ్యంలో మిగిలిన 13 స్థానాల్లో మాత్రం నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగా అభ్యర్థుల ఖరారులో జాప్యం జరగకుండా వచ్చే నెల మొదటి వారంలోగా ఎంపీ అభ్యర్థుల ఖరారుపై స్పష్టత వచ్చేలా చూస్తామని అమిత్షా ప్రకటించారు. ఇందుకు అవసరమైన కసరత్తు వేగవంతం చేయాలని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ను ఆయన ఆదేశించినట్టు పార్టీవర్గాల సమాచారం. దీంతో ఎంపీ టికెట్ల కోసం తీవ్రపోటీ నెలకొంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) మినహాయిస్తే, మల్కాజ్గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ► మహబూబ్నగర్ సీటు విషయానికొస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. ► చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సై అంటున్నారు. ► భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► మహబూబాబాద్ టికెట్కు తేజావత్ రామచంద్రునాయక్, హుస్సేన్నాయక్, దిలీప్నాయక్ పోటీ పడుతున్నారు. ► ఖమ్మం నుంచి పొంగులేటి సుధాకర్రెడ్డికి అవకాశం కల్పిస్తారా, లేకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ లేదా గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్రావులకు అవకాశం ఇస్తారా చూడాలి. ► నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం ఇస్తారా లేకపోతే రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత బరిలో దింపుతారా చూడాలి. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. ► పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. మల్కాజ్గిరి.. ఈటల గురి మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారు. ఇటీవల నగరానికి వచ్చిన అమిత్ షాతో విడిగా ఈటల భేటీ అయ్యారు. లోక్సభకు పోటీపై మాట్లాడేందుకు సమయం కావాలని కోరగా, రెండు, మూడురోజుల్లో ఢిల్లీకి రావాలని చెప్పినట్టు తెలిసింది. పి.మురళీధర్రావు, పేరాల శేఖర్రావు, ఎన్.రామచందర్రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మల్కాజ్గిరి టికెట్ ఇవ్వడానికి వీలుపడని పక్షంలో జహీరాబాద్, మెదక్ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్న సంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం. జహీరాబాద్.. ఏలేటి సురేశ్ రెడ్డి జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించాలంటూ ఈ లోక్సభ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్కు చెందిన వ్యాపారవేత్త ఏలేటి సురేశ్రెడ్డి కోరుతున్నారు. ఇప్పటికే ఆయన కిషన్రెడ్డిని కోరినట్టు తెలిసింది. ఈ విషయమై అధిష్టానానికీ విజ్ఞప్తి చేయగా, జనవరి 2న ఢిల్లీ వచ్చి కలవాలని ఆయనకు అమిత్షా చెప్పినట్లు తెలిసింది. డాక్టర్ కె.లక్ష్మణ్, వీరశైవ లింగాయత్ సమాజ్కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. వరంగల్.. మందకృష్ణ వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మరికొందరూ ఇదే సీటుకు పోటీపడుతున్నారు. నాగర్ కర్నూల్..బంగారు శ్రుతి నాగర్కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని బరిలో దింపవచ్చునని లేదంటే ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అంటున్నారు. హైదరాబాద్..రాజాసింగ్ హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. -
‘లోక్సభ’పై ఫోకస్! ఎంపీ ఎన్నికలపై పార్టీల కసరత్తు..
సాక్షి, ఆదిలాబాద్: రానున్న లోక్సభ ఎన్నికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అభ్యర్థి ఎంపిక విషయంలో కసరత్తు షురూ చేశాయి. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం ఎస్టీ రిజర్వుడ్ తెలిసిన విషయమే. ఆయా పార్టీలు జనవరి మధ్యలోనే అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ఈ ఎంపీ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగింటిలో బీజేపీ గెలుపొందింది. ఈ ఎన్నికలోనూ ఎలాగైనా గెలుపొందాలని ధీమాగా ఉంది. ఇక కాంగ్రెస్ ఒకే ఒక ఎమ్మెల్యే గెలుపొందినప్పటికీ ఈ సారి మాత్రం సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. రెండు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక ఓట్లు సాధించడం ద్వారా బీఆర్ఎస్ కూడా విజయంపై నమ్మకంగా ఉంది. ఇదీ పరిస్థితి.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు. అప్పుడు 3,76,892 ఓట్లు సాధించారు. బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన గొడం నగేష్ 3,18,665 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ 3,14,057 ఓట్లు సాధించారు. గడిచిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ పరిధిలోని అన్ని శాసనసభ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. బీఆర్ఎస్ అత్యధిక ఓట్లు సాధించింది. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు తేడా ఉంటుందన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రా బోయే ఎన్నికలపై అందరి దృష్టి నెలకొంది. అభ్యర్థుల ఎంపికపై దృష్టి.. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లు దృష్టి సారించాయి. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగర్కలాన్లో జరి గిన బీజేపీ రాష్ట్రస్థాయి సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్నారు. ఇందులో ఆదిలా బాద్ ఎంపీ సోయం బాపూరావు, నిర్మల్, ఆదిలా బాద్, ముథోల్, సిర్పూర్ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, రామారావుపటేల్, పాల్వాయి హరీష్బాబు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో సిట్టింగ్ ఎంపీలు ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి తిరిగి పోటీ చేయాలని ఆదేశించినట్లు తెలు స్తోంది. ఈ నేపథ్యంలో సోయం మరోసారి బరిలో నిలుస్తారా చూడాల్సిందే. ఇక బీఆర్ఎస్ కూడా సమాయత్తం అవుతుంది. జనవరిలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణకు సిద్ధమైంది. వచ్చేనెల 3న ఆదిలాబాద్కు సంబంధించి సమావేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ముఖ్యనేతలు ఈ సమావేశం నిర్వహిస్తుండగా, పార్లమెంట్ పరిధిలోని ముఖ్యలందరినీ ఆహ్వానించారు. కాగా గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన గొడం నగేష్ పేరే మరోసారి తెరపైకి వస్తుంది. ఇక కాంగ్రెస్ కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇన్చార్జి మంత్రిగా సీతక్కను నియమించిన విషయం తెలిసిందే. ఆమె ఈ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నాయకులను సమన్వయం చేసుకొని అభ్యర్థి ఎంపిక విషయంలో ముందుకు కదులుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన నరేశ్ జాదవ్తో పాటు ఎవరైన ఆదివాసీ అభ్యర్థిపై పార్టీ దృష్టి సారించినట్లు ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఆయా పార్టీలు సాధించిన ఓట్లు.. బీజేపీ: 4,48,961, బీఆర్ఎస్: 4,65,476, కాంగ్రెస్ : 2,52,286 -
నిజామాబాద్ ఎంపీ బరిలో నిర్మాత దిల్ రాజు..?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 'ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే ఊపులో పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఎంపీ ఎన్నికలు సమీపిస్తుండడంతో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అర డజను మంది నాయకులు టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్ దక్కుతుందోననే అంశంపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.' పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు పలు వురు నాయకులు ఉత్సాహంగా ఉన్నారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం రావడంతో నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు జాతీయ అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్న నేపథ్యంలో ప్రత్యేకత నెలకొంది. సానుభూతిపరంగా సునీల్రెడ్డి బాల్కొండ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందిన ముత్యాల సునీల్రెడ్డి సైతం ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. స్వల్ప తేడాతో ఓడిపోయినందున సునీల్రెడ్డిపై సానుభూతి ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీగా బరిలోకి దిగితే సానుకూల ఫలితం వస్తుందని సునీల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి ప్రశాంత్రెడ్డిని దీటుగా ఎదుర్కోవడంతో సునీల్కు కొందరు పార్టీ సీనియర్లు కూడా మద్దతు ఇస్తున్నారు. దీంతో సునీల్ తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు మైనారిటీ కోటాలో ఈ టికెట్ ఆశావహుల జాబితాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్బిన్ హందాన్ సైతం ఉన్నారు. మైనారిటీ కావడంతో సదరు ఓట్లు తనకు గంపగుత్తగా వస్తాయని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్టు ఆశించి విఫలమయ్యారు. దీంతో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జాబితాలో ఈరవత్రి.. బాల్కొండ మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ ఈరవత్రి అనిల్ కూడా ఎంపీ టికెట్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. బీసీ కోటాలో తనకు టికెట్టు ఇస్తే నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న బీసీ ఓట్లతో పాటు తన సామాజికవర్గానికి చెందిన పద్మశాలి ఓట్లు గంపగుత్తగా వస్తాయనే భావనలో ఉన్నారు. అదేవిధంగా మైనారిటీ ఓట్లు పూర్తిగా కాంగ్రెస్కే వస్తాయని భావిస్తున్నారు. సోషల్ ఇంజినీరింగ్ లెక్కల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మాత్రమే కచ్చితంగా బీసీలకు ఇవ్వాల్సిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తనకు టికెట్టు ఇస్తే కులాల సమీకరణలో ఉపయోగం ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి సైతం ఎంపీ టికెట్ ఆశించే వారి జాబితాలో ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండేలా చేసిన మానాలకు టికెట్టు కేటాయించాలని పలువురు అంటున్నారు. ఇదిలా జిల్లాలోని మోపాల్ మండలం నర్సింగ్పల్లికి చెందిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కూడా నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం తనవంతుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు సీఎం రేవంత్రెడ్డికి సన్నిహితంగా ఉంటారనే పేరుంది. ఈ నేపథ్యంలో ఎంపీ టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరో ఇద్దరు ముఖ్యులకు.. ఇక ఉమ్మడి జిల్లాకు చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్కుమార్గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్అలీ పీసీసీ అధ్యక్ష పీఠం రేసులో ఉన్నారు. ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. బీసీకి కేటాయిస్తే మహేష్కుమార్గౌడ్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఇచ్చి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్కుమార్గౌడ్ను నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచి స్తున్నట్లు తెలుస్తోంది. అయితే షబ్బీర్అలీకి మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి రాష్ట్ర కేబినెట్లో బెర్త్ కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బోధన్ నుంచి గెలుపొందిన పొద్దుటూరి సుదర్శన్రెడ్డికి కేబినెట్ ఖాయమైనట్లు తెలుస్తోంది. షబ్బీర్కు మంత్రి పదవి ఇస్తే జిల్లా నుంచి రెండు బెర్త్లు వచ్చినట్లే. ఇవి చదవండి: ప్రజా పాలన.. అపోహలొద్దు.. వాళ్లు అప్లై చేయక్కర్లేదు: సీఎం రేవంత్రెడ్డి -
TS: ఎంపీ ఎన్నికలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలై ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అనుకున్న దాని కంటే ముందే ఎంపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు క్యాడర్ను సంసిద్ధం చేసే పనిపై దృష్టిపెట్టంది. కొత్త సంవత్సరంలో జనవరి 3 వ తేదీ నుంచి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నిర్వహించనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల షెడ్యూల్ను పార్టీ శుక్రవారం ప్రకటించింది. 3వ తేదీన ఆదిలాబాద్ 4న కరీంనగర్, 5 చేవెళ్ల, 6 పెద్దపల్లి, 7 నిజామాబాద్, 8 జహీరాబాద్, 9 ఖమ్మం,10 వరంగల్,11 మహబూబాబాద్, 12 భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు, సంక్రాంతి అనంతరం 16న నల్గొండ, 17న నాగర్ కర్నూలు, 18న మహబూబ్నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో గులాబీ నేతలు చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకొని ఆ తప్పులు మళ్లీ జరగకుండా ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు అవలంబించాల్సిన కార్యాచరణను నిర్ణయించనున్నారు. ఇదీచదవండి..ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కొత్త డ్రామాలు -
TS: బీజేపీ నేతలకు ‘షా’ టార్గెట్ ఇదే !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమిత్ షా పర్యటనపై కమలనాథులు ఏమనుకుంటున్నారు ? ఇక్కడ పార్టీ పరిస్థితులు షా చక్కదిద్దారా ? బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య వివాదం సమిసిపోయిందా ? అసలు నేతలకు అమిత్ షా చెప్పిన గెలుపు సూత్రం ఏంటి ? పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు చేసిన మార్గదర్శనం ఏంటి? తెలంగాణ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. అధికారం సాధించే వరకు తెలంగాణకు వస్తూనే ఉంటానని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్ , బండి సంజయ్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పై ప్రధానంగా చర్చించారు. బీజేపీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సమక్షంలోనే అమిత్ షా.. ఆ ఇద్దరికి క్లాస్ తీసుకున్నారట. కలిసి వెళ్లకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకోవడం పద్దతి కాదంటూ గట్టిగా చెప్పారట. నేతల మధ్య సమన్వయ లేమి సమస్య మరోసారి రిపీట్ కాకుండా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని అమిత్ షా సూచించారు. తెలంగాణ కమల దళం ఎదుర్కొంటున్న సమన్వయ లేమి సమస్యకు అమిత్ షా పరిష్కారం చూపించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో.. 10 సీట్లను సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని నేతలకు అమిత్ షా భరోసా ఇచ్చారు. నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పార్టీ అని... కాంగ్రెస్ మునిగిపోనున్న పార్టీ అని నేతలతో భేటీలో అమిత్ షా అన్నట్లు సమాచారం. తెలంగాణలో భవిష్యత్ బీజేపీ దేనని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు అమిత్ షా. మరోవైపు ఈటల రాజేందర్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్కు అటు.. ఇటు ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలే... కొండా, ఈటల పార్టీ వీడుతున్నారనే ప్రచారం చేయిస్తున్నారని వీరిద్దరి అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో పది సీట్లు కొట్టాలని భావిస్తున్న కమలనాథుల ఆశలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. ఇదీచదవండి..ప్రజాభవన్ ఘటనలో కొత్త కోణం.. మాజీ ఎమ్మెల్యే తనయుడిని ఎలా తప్పించారంటే -
జేడీయూలో ట్విస్ట్..!
-
ఎంపీగా శశి థరూర్ పోటీ ఇదే చివరిదా!
తిరువనంతపురు: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ మెంబర్, ఎంపీ శశి థరూర్ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువనంతపురం లోక్ సభ స్థానంలో యువత అవకాశం కల్పిస్తానని అన్నారు. దీంతో ఆయన రాబోయే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలే చివరివి కానున్నాయా అని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. తిరువనంతపురంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శశి థరూర్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా ఉండలేరని అన్నారు. ఒకానొక సమయం వస్తుందని అప్పుడు తప్పకుండా వైదొలగి యువతకు రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వాలన్నారు. ఇదే తన ఆలోచనని తెలిపారు. ఇటీవల ఓ టీవీ ఛానెల్లో 2024 పార్లమెంట్ ఎన్నికలు తన చివరి ఎన్నికలని శశి థరూర్ ప్రస్తావించిన విషయం తెలిసిందే. అదే విషయాన్ని గురువారం మీడియా ప్రశ్నించింది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ అలా చెప్పలేదు. 2024 పార్లమెంట్ ఎన్నికలు నా చివరి ఎన్నికలని అనలేదు’ అని 67 ఏళ్ల శశి థరూర్ స్పష్టం చేశారు. ఆయిన మళ్లీ తిరువనంతపురం లోక్సభ సెగ్మెంట్ నుంచే పోటీ చేస్తానని తెలిపారు. శశి థరూర్ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో తిరువనంతపురంలో ఎంపీగా గెలుపొందారు. సమీప అభ్యర్థి రామచంద్ర నాయర్(సీపీఐ)పై 95వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదే విధంగా 2014, 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి శశి థరూర్ గెలుపొందారు. చదవండి: హఫీజ్ సయీద్ను అప్పగించండి -
‘మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించండి.. కూటమిలో చేరుతాం’
రాబోయే 2024 పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మాలూక్నగర్ డిమాండ్ చేశారు. తాము ఇండియాలో కూటమి చేరాలంటే బీఎస్పీ చీఫ్ మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని షరతు పెట్టారు. కాంగ్రెస్ కూటమిలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గేను.. ప్రధానమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కాంగ్రెస్ పార్టీ.. మాయావతికి క్షమాపణ చెప్పాలన్నారు. అదేవిధంగా మాయావతిని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు మాలూక్నగర్. అలా అయితే ఇండియా కూటమి 2024లో బీజేపీని ఎదుర్కొగలదని అన్నారు. ప్రధాని అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో మాయావతికి ప్రత్యామ్నాయ వ్యక్తి ఎవరూ లేరని తెలిపారు. కాంగ్రెస్ తమ షరతులకు అంగీకరం తెలుపుతుందని మాయావతి సానుకూలంగా ఉందన్నారు. తమకు ఉత్తరప్రదేశ్లో 13.5 శాతం ఓట్ల షేరు ఉందని, అది పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే.. 60 కంటే ఎక్కువ ఎంపీ సీట్లను బీఎస్పీ గెలుచుకుంటుందని అన్నారు. బీఎస్పీకి, ఎస్పీకి మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్న మాలూక్ నగర్ ఖండించారు. ఇండియా కూటమిలో మాయావతి చేరుతానంటే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ ఎటువంటి అభ్యంతరం తెలపరని అన్నారు. మాయావతి పట్ల అఖిలేష్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చదవండి: ఖతార్లో ఉరిశిక్ష పడిన భారత నేవీ మాజీ అధికారులకు ఊరట.. -
ఓటమితో కుంగిపోవద్దు.. లోక్సభ ఎన్నికలకు సిద్ధమవ్వండి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు సమాయత్తం కావాలని పార్టీ నేతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. అసెంబ్లీల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. qసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని, ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, పరాజయం చెందిన బీఆరెస్ అభ్యర్థులే నియోజకవర్గ ఇన్ఛార్జ్లని.. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్త్రృతంగా పర్యటించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయని, 26లోగా సమావేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. సమీక్ష అనంతరం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తనను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని కేటీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ ఏం చేయలేదని, పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతాం’’ అని పార్టీ శ్రేణులకు రంజిత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. -
‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’
ముంబై: ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరని మహారాష్ట్ర డిప్యూటీ అజిత్ పవార్ అన్నారు. వచ్చే 2024 సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంపై సందేహాలు వస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. ‘ప్రస్తుతానికి దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తప్ప మరో ప్రత్యామ్నయ నాయకుడు ఎవరూ లేరు. అటువంటి నిర్ణయం తీసుకోవాలంటే చాలా విషయాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి, రెండు విషయాలను దృష్టి పెట్టుకొని బీజేపీ అదిష్టానం నిర్ణయం తీసుకోదు’ అని ఆయన అన్నారు. మీరే చాలా వరకు ఈ విషయంపై ప్రచారం కల్పిస్తున్నారని మీడియా ఉద్దేశించి అన్నారు. అయితే దేశంలో ఎవరి పాలన సురక్షితం, భద్రంగా, దృఢంగా ఉంటుందో. ఎవరు ప్రపంచ వేదికలపై మన దేశ గుర్తింపును పెంచుతారో అదే చాలా ముఖ్యమని అన్నారు. అయితే తాము ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఫలితాలు చూశామని తెలిపారు. అంచనాలకు తగినట్టు ఫలితాలు రావని అన్నారు. కానీ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిందని గుర్తుచేశారు. -
వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావాలి: మోదీ
ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని నెలల్లో సమీపించనున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం పార్టీ అంతర్గత సమావేశాల్లో కనిపిస్తోంది. ఇటీవల జరిగి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో మూడోసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సంపాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. శుక్రవారం ప్రధాని మోదీ.. బీజేపీ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికలను ఒక ‘మిషన్’గా భావిస్తూ.. బృందంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. ‘మనం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచాము, 2024లో అంతకు మించి ఎంపీ సీట్లతో బీజేపీ గెలుపొందాలి. మన భావాలను సోషల్ మీడియాలో బలంగా వినిపిచాలి. ప్రతిపక్షాల వ్యకిరేతకమైన ప్రచారాలను తిప్పికొట్టాలి. ప్రజలకు బీజేపీ ప్రభుత్వ విధానాలు విరించాలి’ అని పిలపునిచ్చారు. ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ను కూడా దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. చదవండి: త్వరలో జేడీ(యూ), ఆర్జేడీ విలీనం అంటూ వ్యాఖ్యలు.. ఖండించిన ‘లాలూ’ -
ఎన్నికల సంఘం కసరత్తులో.. సమరానికి ఇంకొంత సమయం!
నాగర్కర్నూల్: శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీ పోరుపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత పాలకవర్గాల పదవీ కాలం వచ్చే ఏడాది జనవరి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం యంత్రాగాన్ని సమాయత్తపరుస్తోంది. ఇందులో భాగంగా పోలింగ్ సిబ్బంది వివరాలను సమర్పించాల్సిందిగా కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా వివరాలు ఈ నెల 30లోగా టీ–పోల్ యాప్లో అప్లోడ్ చేయాలని పేర్కొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని నాగర్కర్నూల్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలో శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారి వివరాలను అధికారులు యాప్లో పొందుపరుస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం–2019 ఎన్నికల స్థానాలకు రిజర్వేషన్లు పదేళ్ల పాటు వర్తిస్తాయని పేర్కొంది. ఉమ్మడి జిల్లాలో ఎస్టీలకు 318 గ్రామపంచాయతీలు, ఎస్సీలకు 295, బీసీలకు 355, జనరల్ అభ్యర్థులకు 716 గ్రామపంచాయతీలను రిజర్వేషన్లు వర్తింపజేసింది. ఇందులో సగం మహిళలకు కేటాయించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తుందా? లేక ఏమైనా మార్పులు చేస్తుందా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. షెడ్యూల్ ఏరియాలోని పంచాయతీల్లో వందశాతం ఎస్టీలకు రిజర్వేషన్ వర్తిస్తోంది. ఒక వేళ చట్టంలో మార్పులు చేస్తే జనాభా ప్రాతిపదికన గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించే అవకాశం ఉంది. ఇందు కోసం ప్రస్తుత చట్టాన్ని మార్చాలి. ఇది జరగాలంటే మరో కొత్త చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. ఆపై ఆమోదం పొందాలి. ఇంత ప్రక్రియ జరగాలంటే మరింత సమయం పడుతుంది. మరోవైపు పాలకవర్గాల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికల ప్రక్రియను కమిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అంత సమయం లేదు. ఆయా పరిణామాల నేపథ్యంలో స్థానిక సంగ్రామం సకాలంలో జరగకపోవచ్చు అనే అభిప్రాయం అధికారులు, రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అమలులోకి రావడం అనివార్యమవుతుంది. బ్యాలెట్ పోరు.. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితానే ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే దాన్ని పంచాయతీలు, వార్డుల వారీగా విభజించాల్సి ఉంటుంది. కొత్తగా అభ్యంతరాలు, స్వీకరణ, పరిశీలన జరిపి తుది జాబితా వెల్లడించడం తప్పనిసరి. ఈ ప్రక్రియకు కనీసం నెల రోజుల సమయం పడుతుందని ఎన్నికల విభాగం అధికారులు చెబుతున్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల్లో దొర్లిన తప్పుల సవరణకు సంబంధించి ఓటర్లకు అవకాశం ఇవ్వాలి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పంచాయతీ పోరుకు తుది ఓటరు జాబితాను పకడ్బందీగా సిద్ధం చేసే వీలుంది. ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పెట్టెలు సేకరించాలి. బ్యాలెట్ పత్రాలను ముద్రించాలి. ఇదంతా జరగాలంటే ఇప్పుడున్న సమయం కూడా చాలదన్న అభిప్రాయం ఎన్నికల అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ కోణంలో చూసి ఎన్నికల నిర్వహణ సాధ్యమా? అనే వాదన వినిపిస్తోంది. ఇవి చదవండి: బదిలీల కలకలం! బీఆర్ఎస్ బ్రాండ్ అధికారులపై వేటు.. -
నల్లగొండ బరిలో సోనియా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ బరిలో నిలవబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సోనియాగాంఽధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సోమవారం గాంధీభవన్లో ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ కాపీని సీఎం రేవంత్రెడ్డి మంగళవారం పార్టీ అధిష్టానానికి అందజేసినట్లు తెలిసింది. అయితే పీఏసీ సమావేశంలో సోనియాగాంధీ తెలంగాణలో ఏ జిల్లా నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే చర్చ వచ్చిన సందర్భంలో నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ అంశం కూడా పరిశీలించినట్లు తెలిసింది. దీంతో సోనియాగాంఽఽధీ నల్లగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నల్లగొండ జిల్లా మొదట్లో కమ్యూనిస్టులకు పుట్టినిల్లు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీని జిల్లా ప్రజలు ఆదరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకే కంచుకోటగా మార్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఆ తర్వాత మార్చిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలుగా ప్రస్తుత మంత్రులు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచిన జిల్లాగా నిలిచింది . ఉమ్మడి జిల్లాలోని 12 స్థానాల్లో ఒక్క సూర్యాపేట మినహా 11 స్థానాల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. జిల్లా ప్రజలు అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించి మళ్లీ నల్లగొండను కాంగ్రెస్కు కంచుకోటగా నిలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉద్ధండులైన నేతలు జిల్లా నుంచే ఉన్నారు. ప్రస్తుత మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డిలతో పాటు సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్రెడ్డికూడా నల్లగొండ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నారు. భారీ విజయమని.. సోనియాగాంధీ నల్లగొండ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే భారీ మెజారిటీతో గెలిపించుకోవచ్చన్న ఆలోచనల్లో జిల్లాలోని సీనియర్ నేతలు ఉన్నారు. జిల్లాలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ మేరకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు రాలేదు. ఈ పరిస్థితుల్లో సోనియాగాంధీని నల్లగొండ నుంచి పోటీలో నిలిపేలా ఒప్పిస్తే మరింత భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న చర్చ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు జిల్లా వ్యాప్తంగా జోరందుకుంది. సోనియాగాంఽధీ నల్లగొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే నల్లగొండ పేరు మళ్లీ చరిత్రలోకి ఎక్కే అవకాశం ఉంది. అందుకు ఆమెను ఒప్పించడం ద్వారా ఆమె నల్లగొండ నుంచి గెలుపొందడం, అదే సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉమ్మడి జిల్లా ఊహించని విధంగా అభివృద్ధికి నోచుకుంటుందనే చర్చ పార్టీ శ్రేణుల్లో సాగుతోంది. ఇందులో భాగంగానే నల్లగొండ నుంచే సోనియాగాంఽధీని పోటీ చేయించాలనే ఉద్దేశంతో జిల్లాలోని ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆశలు పెట్టుకున్న వారికి ఇతర పదవులు.. ప్రస్తుతం నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఆయన కుమారుడు రఘువీర్రెడ్డి భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట స్థానం నుంచి టికెట్ కోసం పటేల్ రమేష్రెడ్డి పోటీ పడటం, టికెట్ను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డికి దక్కడంతో రమేష్రెడ్డికి ఎంపీగా అవకాశం కల్పిస్తామని టీపీసీసీతోపాటు ఏఐసీసీ నేతలు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మరికొందరు బీసీ, ఇతర నేతలు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున పార్లమెంట్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకవేళ సోనియాగాంధీ నల్లగొండ నుంచి పోటీ చేస్తే మాత్రం ఆ నేతలకు నిరాశ తప్పదు. అయితే వారి హోదాను బట్టి ప్రభుత్వంలో ఇతర పదవులతో పాటు పార్టీ పదవులు ఇచ్చే అవకాశం ఉంది. -
ఆ పార్టీలది ఫ్రస్ట్రేషన్: ప్రధాని చురక
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షాలు నిరాశ నిస్పృహలోకి వెళ్లాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ఈ నిస్పృహతోనే ఆ పార్టీలు పార్లమెంటులో గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయన్నారు. మంగళవారం(డిసెంబర్19)ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీల ఈ తరహా ప్రవర్తన వల్ల రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ల నంబర్లు మరింత దిగజారుతాయని,బీజేపీ మరిన్ని సీట్లు గెలుచుకుంటుందన్నారు. కాగా, పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్తోనే ఆపార్టీలు పార్లమెంట్ సెషన్ను అడ్డుకుంటుండడంతో సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మరోపక్క పార్లమెంట్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం యోచిస్తోంది. ఇదీచదవండి..గెలవాలనుకుంటే నితీశ్, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు -
ఎంపీ ఎన్నికలే బీజేపీకి బూస్ట్..!
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతటి ఘన విజయం సాధించిన తర్వాత కూడా బీజేపీ ట్రాక్ రికార్డ్ ఇప్పటికీ లోక్సభ ఎన్నికల్లోనే టాప్ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 332 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాల్లో 2014,2019 లోక్సభ ఎన్నికల్లో 444, 450 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్ సాధించిందని లెక్కలు చెబుతున్నాయి. అయితే, రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మెరుగు పడడానికి లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన విజయాలు కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. 2014 లోక్సభ ఎన్నికల తర్వాతే రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ బెటర్ పర్ఫామెన్స్ చూపిస్తోందని ఓట్లు, సీట్ల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ దేశంలోని 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. ఇదీచదవండి..రెడ్ అలర్ట్..మరిన్ని రోజులు భారీ వర్షాలు -
మెదక్కు దామోదర.. జహీరాబాద్కు సుదర్శన్రెడ్డి
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఆయా నియోజకవర్గాల ఇన్చార్జిలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను నియమించింది. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయనకు మెదక్ బాధ్యతలు అప్పగించింది. అలాగే జహీరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ మంత్రి పి.సుదర్శన్రెడ్డిని ప్రకటించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్రెడ్డి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్, జుక్కల్, బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గాలతో పాటు, సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోల్(ఎస్సీ), జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. మెదక్ పార్లమెంట్ పరిధిలో మెదక్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట్, సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలుండడంతో కాంగ్రెస్ ఇన్చార్జిలను నియమించింది. ఇవి చదవండి: 'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్ -
తెలంగాణ నుంచి సోనియా పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్సభ ఎన్నికల్లో సోనియాగాందీని తెలంగాణలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానంతో కూడిన లేఖలను వ్యక్తిగతంగా సోనియగాంధీకి, అలాగే పార్టీ అధిష్టానానికి పంపింది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యక్షతన దాదాపు రెండు గంటలకు పైగా పీఏసీ సమావేశం జరిగింది. సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు తదితరులు హాజరయ్యారు. పార్టీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న తీరు, పార్లమెంటు ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన ఈ సమావేశంలో సోనియా రాష్ట్రం నుంచి పోటీ చేయడంతో పాటు ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ నేతలు, ఎన్నికల్లో పనిచేసిన పార్టీ కేడర్, నాయకత్వం, అలాగే ఓట్లేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ మొత్తం 3 తీర్మానాలను ఆమోదించారు. రేపట్నుంచి శ్వేతపత్రాలు కాంగ్రెస్ 10 రోజుల పాలనపై సమావేశంలో చర్చ జరిగింది. రేవంత్ ప్రభుత్వ పనితీరును పలువురు సభ్యులు అభినందించారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని నిలబెట్టేలా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ చెప్పారు. ఇటీవల జరిగిన అధికారుల నియామకాలు, బదిలీల్లో కూడా ఈ విషయం వెల్లడైందని అన్నారు. రాష్ట్ర ఆర్థి క పరిస్థితిని, విద్యుత్ శాఖ, నీటిపారుదల శాఖల్లో వాస్తవిక పరిస్థితులను ప్రజల ముందు పెట్టేందుకు బుధవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తామని తెలిపారు. లోక్సభ టార్గెట్ 15 వచ్చే ఏప్రిల్లో జరుగుతాయని భావిస్తున్న పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధతపైనా సమావేశంలో చర్చించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 15 లోక్సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని పీఏసీ సభ్యులు కోరారు. కాగా లోక్సభ టికెట్లు, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారాలను అధిష్టానం చూసుకుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. సంక్రాంతి లోపే పదవులు పార్లమెంటు ఎన్నికలు వస్తున్నందున నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తారని పీఏసీ సభ్యులు సూచించారు. వీలున్నంత త్వరగా భర్తీ చేయడం ద్వారా రెండేళ్ల కాలపరిమితికి అనుగుణంగా మరో రెండుసార్లు ఈ పోస్టులకు పార్టీ నేతలను ఎంపిక చేయవచ్చని, దాదాపుగా 1,000 మందికి అవకాశం కల్పించవచ్చని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు పూర్తి కాగానే, సంక్రాంతి పండుగ లోపే నామినేటెడ్ పదవులపై పూర్తిస్థాయిలో కసరత్తు జరుగుతుందని, అధిష్టానం పెద్దలతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ చేపడతానని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారంటీల అమలు ఆరు గ్యారంటీల అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, ఈ పథకాల అమలు పార్టీ కేడర్ ద్వారా సక్రమంగా జరిగేలా చూడాలని రేవంత్ కోరారు. పథకాల అమలుతో పాటు లబ్ధిదారుల ఎంపికలో పార్టీ నేతలు, కేడర్ చురుకుగా ఉండి అర్హులందరికీ లబ్ధి కలిగేలా చూడాలని, వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. బూత్ స్థాయి నుంచి జాగ్రత్తగా ఉండాలి ఓటర్ల జాబితా సవరణలపై చర్చ జరగ్గా.. ఈ సందర్భంగా పార్టీ పక్షాన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ వివరించారు. ఫిబ్రవరి 8న ప్రకటించే తుది జాబితా ప్రాతిపదికనే లోక్సభకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. ఈ జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణల కోసం బూత్ స్థాయిలో కార్యకర్తలను అలర్ట్ చేయాలని, ప్రతి ఇంటి నుంచి ఓటర్లను చేర్పించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. మాజీ మంత్రులు జానారెడ్డి, టి.జీవన్రెడ్డి, చిన్నారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి, వి.హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్చౌదరి, విష్ణునాథ్, పీఏసీ సభ్యులు జగ్గారెడ్డి, వంశీచందర్రెడ్డి, సంపత్కుమార్, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్రెడ్డి, హర్కర వేణుగోపాల్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల ఇన్చార్జులు ఖరారు పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలకు రెండేసి చొప్పున నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించగా, మంత్రి పదవుల్లో లేని సీనియర్ నేతలు జీవన్రెడ్డి, సుదర్శన్రెడ్డిలకు కూడా ఇన్చార్జి బాధ్యతలిచ్చారు. మిగిలిన 9 మంది మంత్రులకు 9 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. వీరంతా మంగళవారం నుంచే లోక్సభ ఎన్నికల పనిలో ఉంటారని గాందీభవన్ వర్గాలు వెల్లడించాయి. టికెట్ల కేటాయింపు ప్రక్రియ మొదలు ఎన్నికలు పూర్తయ్యేంతవరకు కేటాయించిన నియోజకవర్గాల్లో మంత్రులదే బాధ్యతని తెలిపాయి. ఇన్చార్జులు వీరే: చేవెళ్ల, మహబూబ్నగర్ – రేవంత్రెడ్డి సికింద్రాబాద్, హైదరాబాద్– భట్టి విక్రమార్క మెదక్ – దామోదర రాజనర్సింహ ఆదిలాబాద్ – సీతక్క నల్లగొండ – ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వరంగల్ – కొండా సురేఖ ఖమ్మం, మహబూబాబాద్ – పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పెద్దపల్లి – శ్రీధర్బాబు కరీంనగర్ – పొన్నం ప్రభాకర్ నిజామాబాద్ – టి.జీవన్రెడ్డి జహీరాబాద్ – పి.సుదర్శన్రెడ్డి మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు నాగర్కర్నూల్ – జూపల్లి కృష్ణారావు ఆరు గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ ఈనెల 28న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఆరు గ్యారంటీల అమలు కోసం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఈ ప్రక్రియకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ప్రభుత్వం వెల్లడిస్తుందని పీఏసీ కన్వినర్ షబ్బీర్ అలీ వెల్లడించారు. గాం«దీభవన్లో జరిగిన పీఏసీ సమావేశం అనంతరం ఏఐసీసీ కార్యదర్శి ఎస్.సంపత్కుమార్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గ్రామసభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేసే సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రారంభిస్తుందని తెలిపారు. 28 నుంచి 15 రోజుల పాటు నిర్దేశిత ఫార్మాట్లో దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని చెప్పారు. ఎలాంటి వివక్ష లేకుండా సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో జరిగే సభకు తెలంగాణ నుంచి 50 వేల మందిని తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ(PAC) సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్రావ్ ఠాక్రే అధ్యక్షతన ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, కమిటీ సభ్యులు ఈ భేటీలో పాల్గొంటారు. ప్రభుత్వం- పార్టీ మధ్య అనుసంధానం అనే ప్రధానాంశంతో పీఏసీ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్లమెంట్ ఎన్నికలపై, నామినేటెడ్ పదవుల భర్తీ పై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక.. ఈ నెల 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలపై పీఏసీలో నిర్ణయం తీసుకోనున్నారు, అలాగే.. బోయినపల్లి లోని గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణం వేగవంతం కోసం ఆ బాధ్యతను వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పచెప్పే ప్రకటనలు పీఏసీలోనే చేస్తారని తెలుస్తోంది. మరోవైపు.. త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురుచూస్తున్నారు. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రేపు(19న) ఢిల్లీ వెళ్లి పార్టీ అగ్ర నేతలతో సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్ ఆఫర్.. సున్నితంగా తిరస్కరణ -
దక్షిణ తెలంగాణపై ఫోకస్.. బీజేపీ వ్యూహం ఏంటి?
తెలంగాణ కమలం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది హైదరాబాద్లోని గోషామహల్ సీటు ఒక్కటే. తాజా ఎన్నికల్లో 8 స్థానాల్లో పాగా వేసింది. ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లు గెలిచింది. దక్షిణ తెలంగాణలో ఒక్కటి కూడా దక్కలేదు. మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు పెంచుకోవడానికి కాషాయ సేన ఏంచేయబోతోంది? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం ఒక్కటే బీజేపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ సీట్లు కూడా కాషాయ పార్టీ దక్కించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్తో పాటు.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని కమలం పార్టీ భావించింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. నిర్మల్లో గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి మినహా మిగిలినవారంతా కొత్తవారే. మొత్తం మీద అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పట్టు తగ్గలేదని కమలం పార్టీ నాయకులు సంతోషంగానే ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుని గులాబీ పార్టీని దెబ్బతీశామని భావించిన బీజేపీకి..అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గతంలో గెలిచిన గోషామహల్ ఒక్కటే మిగిలింది. కార్పొరేటర్లను భారీగా గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కమలం పార్టీ జెండా ఎగరేయలేకపోయింది. సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచిన చోట కూడా అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఇక మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా బీజేపీకి ఊహించనంత ఎదురుదెబ్బ తగిలింది. మరో ఐదు నెలల్లో లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే వెంటనే దక్షిణ తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్ మీద గట్టిగా దృష్టి పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు బీజేపీకి ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాలుగుతో పాటుగా.. కనీసం మరో నాలుగైనా గెలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఎంపీ సీట్లు కాపాడుకుంటూ.. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాగా వేయాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారు. -
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నేతలు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని.. వాళ్ల పాస్పోర్టులు సీజ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అధికారం పేరిట కేసీఆర్ కుటుంబం సహా బీఆర్ఎస్ నాయకులు ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. అవినీతి భాగోతాలు బయటపడతాయనే భయం వాళ్లలో ఉంది. అందుకే వాళ్ల పాస్పోర్టులు సీజ్ చేయండి. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బండి సంజయ్ అన్నారు. బంగారు పళ్లెంలో పెట్టి తెలంగాణాను అప్పగించామని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గు చేటని మండిపడ్డారాయన. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతే! పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు. దేశమంతా మోదీ హవా నడుస్తోంది. ముచ్చటగా మూడోసారి 350 సీట్లతో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండనుంది. బీఆర్ఎస్ అడ్రస్ ఇక గల్లంతే. పార్టీ గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. -
TS: పార్లమెంట్ ఎన్నికలు..పొత్తులపై కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ ప్రబారీలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కిషన్రెడ్డి మాట్లాడారు. ‘బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటుందనేది ప్రచారం మాత్రమే. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై సమానంగా పోరాటం చేస్తాం. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముంది. సర్వే సంస్థలకు సైతం అందని విధంగా లోక్సభ ఫలితాలుంటాయి’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ‘రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కొత్తగా ఎన్నికైన 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారు. మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తిచేయాలి’ అని నేతలకు కిషన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇదీచదవండి..‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్ కీలక ప్రకటన -
యాదవ్కు సీఎం పదవి..బీజేపీ బిగ్ స్కెచ్!
భోపాల్:మధప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్యాదవ్ ఎంపిక వెనుక బీజేపీ పెద్ద రాజకీయ వ్యూహమే పన్నినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రానున్న లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతోనే యాదవ్ వర్గానికి చెందిన నేతను సీఎం పదవికి ఎంపిక చేశారన్న ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్తో పాటు బీహార్లో వీలైనన్ని ఎక్కువ ఎంపీ సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ రెండు స్టేట్లలో యాదవ జనాభా డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇది దృష్టిలో పెట్టుకునే యాదవ్ వర్గానికి చెందిన మోహన్ యాదవ్ను బీజేపీ మధ్యప్రదేశ్కు సీఎంను చేస్తోందని పొలిటికల్ పండిట్లు విశ్లేషిస్తున్నారు. అంతేగాక మోహన్ యాదవ్ భార్య ఉత్తరప్రదేశ్కు చెందిన వారు కావడంతో ఆయనను సీఎం చేస్తే ఆ ప్రభావం అక్కడ కచ్చితంగా ఉంటుందని బీజేపీ పెద్దలు నమ్ముతున్నారు. మోహన్ యాదవ్ మామయ్య యూపీలోని సుల్తాన్పూర్లో నివసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్,బీహార్లలో కలిపి మొత్తం 120 లోక్సభ సీట్లు ఉన్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు తమ ఖాతాలో వేసుకుని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో పవర్లోకి రావాలనేది కమలనాథుల టార్గెట్ అని స్పష్టమవుతోంది. మోహన్ యాదవ్ ఎంపికతో యాదవ్ ఓట్ల మీద ఆధారపడి రాజకీయం చేసే యూపీలో సమాజ్వాదీ పార్టీ, బీహార్లో ఆర్జేడీని లోక్సభ ఎన్నికల్లో దెబ్బకొట్టేందుకు బీజేపీ పెద్ద స్కెచ్ వేసిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇప్పటికే 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)ని ఓడించి బీజేపీ రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదీచదవండి..జమ్ము కశ్మీర్కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
తీర్పులో ప్రత్యేకం: గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కుమార్తె కవిత ఓటమి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో ఏ పార్టీ గాలి వీచినా, ప్రాబల్యం పెంచుకుంటున్నా దానికి మొదటి అడుగు ఇందూరులోనే పడుతుందనేది స్పష్టమవుతోంది. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీలతో ప్రజల్లోకి వెళ్లడం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి పునాదిగా నిలిచింది కూడా ఇందూరు జిల్లానే. ఇక్కడ జిల్లా ప్రజాపరిషత్ గెలుపుతో కేసీఆర్ తన ప్రస్థానాన్ని మరింత పెంచుకుంటూ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా బీజేపీకి కూడా ఇందూరు జిల్లానే ఊతంగా నిలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి అనూహ్యంగా బీజేపీ తరుపున బరిలో నిలిచిన అర్వింద్ను ఎంపీగా ఎన్నుకున్నారు ఇక్కడి ఓటర్లు. కాంగ్రెస్కు నాలుగు సీట్లు.. ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్కు నాలుగు సీట్లు కట్టబెట్టి రాష్ట్రంలో అధికారం వచ్చేలా చేయడంలో ఇందూరు పాత్ర చెప్పు కోదగింది. మరోవైపు బీజేపీని మూడు స్థానా ల్లో గెలిపించడం విశేషం. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని గెలిపించడంతో పాటు ఈసారి ఏకంగా బీజేపీకి మూడు సీట్లు కట్టబెట్టడం విశేసం. గతంలో ఇక్కడ మొదటి జిల్లా ప్రజాపరిషత్కు పట్టం గట్టి రాష్ట్రం వచ్చాక వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేలా అవకాశం ఇచ్చిన జిల్లా ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గేట్వే మాదిరిగా బాటలు వేస్తుండడం గమనార్హం. ఇందూరు ఉమ్మడి జిల్లా ప్రజలు రాష్ట్రంలోనే ప్రత్యకంగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్కు 4, బీజేపీకి 3, బీఆర్ఎస్కు 2 సీట్లు ఇచ్చారు. కాగా బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పసుపు బోర్డు ప్రకటన నుంచి నిజాం షుగర్స్ తెరిపిస్తామనే వరకు, ఇతర అంశాల్లో ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడం విశేషం. తాజాగా కామారెడ్డి శాసనసభ స్థానంలో నిలిచిన సీఎం కేసీఆర్కు, సీఎం అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఏకకాలంలో ఓటమి రుచి చూ పించారు ఓటరు మహాశయులు. వీరిద్దరినీ కాదని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి పట్టం కట్టారు. దీంతో కామారెడ్డి ప్రజలు చరిత్రపుటల్లో తమకు తిరుగులేని ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. ఈ ఫలితం జాతీయస్థాయిలో సంచలనం కలిగించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉమ్మడి ఇందూరు ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో.. రాష్ట్రంలోనే అత్యధికంగా బీజేపీకి ఓట్లు ఇచ్చిన ఇందూరు జిల్లా పార్టీకి ప్రాబల్యం పెంచే విషయంలో గేట్వేగా నిలిచింది. ఇప్పటికే మూడుసీట్లు దక్కించుకున్న బీజేపీకి, కాంగ్రెస్కు మధ్య రానున్న పార్లమెంట్ ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశాలు పెరిగాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత బీజేపీ చేతిలో ఓడిపోగా ఈసారి కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి చవిచూశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నిజామాబాద్ లోక్సభ స్థానం పరిధిలో 45.22 శాతంతో 4,80,584 ఓట్లు వచ్చాయి. ఇక తాజా శాసనసభ ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలో, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో సైతం బీజేపీకి భారీగా ఓట్ల శాతం పెరిగింది. -
బర్రెలక్క.. తగ్గేదేలే!
బర్రెలక్క(శిరీష).. ఆమె ఓ సోషల్ మీడియాలో సంచలనం.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధాన పార్టీ అభ్యర్థులకు సైతం ఆమె ముచ్చెమటలు పట్టించారు. శిరీషకు వచ్చిన ప్రచారాన్ని చూసి ఆమె గెలుస్తుందని కూడా చాలా మంది భావించారు. ఒకవైపు ప్రశంసలు.. మరొకవైపు విమర్శల నడమ ఆమె పోటీకి సై అన్నారు. వెనక్కి తగ్గమని బెదిరింపులు.. బుజ్జగింపుల పర్వం కొనసాగినా చివరి వరకూ పోటీలోనే ఉంటానని చెప్పి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు శిరీష. అయితే ఇక్కడ బర్రెలక్క అనబడే శిరీష ఓడింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాలుకల్లో ఉండిపోయేంత ఆదరణను చూరగొంది. అదే ఇప్పుడు ఆమెకు కొండంత బలంలా పని చేస్తోంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి రెడీ అంటోంది. నాల్గో స్థానమే.. కానీ ప్రతీ నోట బర్రెలక్క మాటే..! ఆమె పోటీ చేసిన కొల్లపూర్ నియోజకవర్గంలో నాలుగో స్థానంలో నిలిచారు బర్రెలక్క. నిరుద్యోగుల తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసిన శిరీషకు మొత్తం 5,598 ఓట్లు వచ్చాయి. కానీ కౌంటింగ్ జరుగుతున్నంతసేపు బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయి? కొల్లపూర్లో పరిస్థితి ఏంటి అనేది చర్చ కూడా నడిచింది. ప్రధానంగా బర్రెలక్క ఎవరి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉందనే విషయం కూడా జనం నోళ్లల్లో ఎక్కవగా నానింది. చివరకు పరాజయం చవిచూసినా ఒక సామాన్యురాలు.. ఆ మాత్రం ముందుకు వెళ్లడమే చాలా గొప్ప విషయమంటూ పొగిడిన నోళ్లు ఎన్నో.. నాకు ప్రచారానికి టైమ్ సరిపోలేదు.. ఫలితాల అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ.. తాను ప్రచారం ఎక్కువ రోజులు చేయలేకపోయానని, వారం రోజులు మాత్రమే తాను పూర్తి స్థాయిలో ప్రచారం చేసినట్లు చెప్పారు. తాను ఎక్కువ రోజులు ప్రచారం చేసి ఉంటే మరింత ప్రభావం చూపేదానినని ఆమె పేర్కొంది. ప్రజలు ఎవరినీ తొందరగా నమ్మరని, తనది చిన్న వయసు కావున.. ఎలా పాలిస్తుందని అనుకున్నారని తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు. తాను ఓడిపోలేదని ప్రజల మనసు గెలిచానని తెలిపారు. కొందరు తనకు ఓటు వేయకూడదని ఓటర్లను బెదిరించారని చెప్పారు. తాను ఓట్ల కోసం డబ్బులు పంచలేదని.. తనకు వచ్చిన ఓట్లు స్వచ్ఛమైనవని, ఈ రకంగా తాను గెలిచినట్లేని చెప్పారు. తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేస్తానని తెలిపారు. తనకు ఓటు వేసిన ఓటర్లకు, మద్దతుగా నిలిచిన మేధావులకు, సోషల్ మీడియా మద్దతుదారులకు కృతజ్ఞతలు తెలిపారు. అందరిలో ఆసక్తి ఓట్లు విషయంలో ఆమె అందరిలో ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. గెలవకపోయినా కొల్లాపూర్ నియోజకవర్గంలో తన మార్క్ చూపుతుందని ఆమె మద్దతుదారులు ఆశించారు. ఆమె ప్రచారం కోసం పలు సంఘాల నేతలు, సోషల్ మీడియా ఫాలోవర్లు, న్యాయవాదులు, టీచర్లు, ముఖ్యంగా ఇతర జిల్లాలకు చెందిన నిరుద్యోగులు ఎంతో శ్రమించారు.. ఆమె సైతం ఎవరికీ భయపడకుండా.. ఒక వైపు తన సోదరుడి మీద దాడి జరిగినా ప్రచారంలో ముందుకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో ఆమెకు వచ్చిన ఓట్లను పక్కన పెట్టి.. అసలు పోటీ చేయడమే గొప్ప విషయమని, నిరుద్యోగుల పక్షాన పోరాటం అపొద్దని నెటిజన్లు కోరుతున్నారు. పోటీలో గెలవకపోయినా శిరీష తొలి అడుగును, ప్రచారంలో ఆమె చూపిన ధైర్యాన్ని అన్ని వర్గాలు వారు అభినందిస్తున్నారు. బర్రెలక్క బరిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. -
పార్లమెంట్ ఎన్నికల బరిలో షకీబ్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. త్వరలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో అతను పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున అతను బరిలోకి దిగుతాడు. తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గానికి సంబంధించి షకీబ్కు టికెట్ ఖరారైంది. జనవరి 7న బంగ్లాలో ఎన్నికలు ఉన్నాయి. ప్రపంచకప్లో వేలికి గాయమైన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న షకీబ్ మళ్లీ ఎప్పుడు మైదానంలోకి దిగుతాడనేదానిపై స్పష్టత లేదు. ఎన్నికల్లో బిజీగా ఉండే నేపథ్యంలో త్వరలో న్యూజిలాండ్తో ఇంటా, బయటా జరిగే వరుస సిరీస్లకు అతను అందుబాటులో ఉంటాడా అనేది చెప్పలేదు. షకీబ్కు ముందు అతని సహచర ఆటగాడు, మాజీ కెపె్టన్ మష్రఫ్ మొర్తజా గత ఎన్నికల్లో నరైల్ స్థానంనుంచి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఈ సారి కూడా అతను మళ్లీ బరిలో నిలిచాడు. మూడు ఫార్మాట్లో కలిపి బంగ్లా తరఫున 430 మ్యాచ్లు ఆడిన 14,406 పరుగులు చేయడంతో పాటు 690 వికెట్లు తీసిన షకీబ్ ప్రపంచ అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. -
స్లొవేకియాలో రష్యా అనుకూలవాది గెలుపు
ప్రేగ్: యూరప్లోని చిన్న దేశం స్లొవేకియాలో ఎన్నికల ఫలితాలు అమెరికా, యూరప్ దేశాలకు కంగారు పుట్టిస్తున్నాయి. రష్యా అనుకూల మాజీ ప్రధాని రాబర్ట్ ఫికోకు చెందిన వామపక్ష స్మెర్(డైరెక్షన్)పార్టీ తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించింది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు మొదట్నుంచీ పొరుగునే ఉన్న స్లొవేకియా మద్దతుగా నిలుస్తోంది. ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ శరణార్థుల కోసం సరిహద్దులను తెరిచి ఉంచింది. తాము అధికారంలోకి వస్తే ఉక్రెయిన్కు మద్దతు ఉపసంహరించుకుంటామని, వలసలను అడ్డుకుంటామని, రష్యాపై ఆంక్షలను ఎత్తివేస్తామని ప్రజలకు ఫికో హామీ ఇచ్చారు. గతంలో రెండు పర్యాయాలు ఫికో ప్రధానిగా పనిచేశారు. తాజా ఎన్నికల్లో ఏ పారీ్టకీ స్పష్టమైన మెజారిటీ రానప్పటికీ ఫికోయే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. స్లొవేకియా ఎన్నికల ఫలితాల గెలుపు ప్రభావం జర్మనీ, ఫ్రాన్సు, స్పెయిన్ వంటి దేశాల్లో మరికొద్ది రోజుల్లో జరగనున్న జాతీయ, ప్రాంతీయ ఎన్నికలపై పడుతుందన్నది పరిశీలకుల అంచనా. -
Jamili Elections: ‘జమిలి’ సర్వరోగ నివారిణా?
జమిలి ఎన్నికలపై చర్చ సద్దుమణిగిందని అనుకున్నప్పుడల్లా అది మళ్లీ మళ్లీ రాజుకోవటం ఏడెనిమిదేళ్లుగా రివాజైంది. కానీ ఈసారి ఉన్నట్టుండి అందుకు సంబంధించి తొలి అడుగుపడింది. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కమిటీ విధివిధానాలు, అందులో ఉండే నిపుణుల వివరాలు ఇంకా తెలియాల్సేవున్నా ఇండియా కూటమి సమావేశాల్లో తీరిక లేకుండా వున్న విపక్షాలకు ఇది ఊహించని పరిణామం. పార్లమెంటుకూ, అసెంబ్లీలకూ ఏకకాలంలో ఎన్నికలు జరగాలనీ, అందువల్ల ఎంతో ప్రజాధనం ఆదా అవుతుందనీ ఆ విధానాన్ని సమర్థిస్తున్నవారు చెబుతున్నారు. అంతేకాదు, తరచు ఎన్నికలవల్ల అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడుతున్నదని కూడా వారి వాదన. కానీ ఈ రకమైన వాదనలను కొట్టి పారేస్తున్నవారు కూడా గణనీయంగానే ఉన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడ ఆటంకం ఏర్పడిందో చూపాలని సవాలు చేస్తున్నారు. ప్రకృతి విపత్తుల సమయంలోనో, మరే అత్యవసర సందర్భాల్లోనో ప్రభుత్వాలను ఎన్నికల సంఘం నిరోధించిన దాఖలాలు లేవు. కాకపోతే ఓటర్లను ప్రలోభపెట్టి ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఉద్దేశించే పథకాలను మాత్రం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక ప్రకటించకుండా ఆపుతున్నారు. అందువల్ల జనం నష్టపోయారని చెప్పడానికి ఎటువంటి దాఖలాలూ లేవు. దేశంలో ఆంధ్రప్రదేశ్తోపాటు ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలను కూడా ఈ చట్రంలోకి తీసుకు రావటమే కేంద్రం ఉద్దేశం. ‘ఒకే దేశం–ఒకే ఎన్నికలు’ అన్న నినాదం కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచీ వినిపిస్తోంది. అంతక్రితం 2003లో అప్పటి ప్రధాని వాజ్పేయి ఈ విషయంలో కొంత ప్రయత్నం చేశారు. అప్పటి కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీతో ఆయన చర్చించారు. కానీ ఎందుకనో తదుపరి చర్యలేమీ లేవు. జస్టిస్ బీపీ జీవన్రెడ్డి ఆధ్వర్యంలోని లా కమిషన్ సమర్పించిన 170వ నివేదిక సైతం చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇంకా వెనక్కు వెళ్తే 1983లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈమాటే చెప్పింది. అయితే రాజ్యాంగ సవరణ, ప్రజాప్రాతినిధ్య చట్టం సవరణ, చట్టసభల నియమనిబంధనల సవరణ వగైరాలు చేయకుండా జమిలి ఎన్నికలు సాధ్యంకాదని 2018లో జస్టిస్ బీఎస్ చౌహాన్ నేతృత్వంలోని లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో అభిప్రాయపడింది. ఒక ఏడాది వేర్వేరు నెలల్లో ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించటం ఉత్తమమని సూచించింది. దేశంలో జమిలి ఎన్నికలు 1952 నుంచి 1967 వరకూ జరిగాయి. కానీ దానికి తూట్లు పొడిచింది కేంద్రంలోని పాలకులే. అప్పటి నెహ్రూ సర్కారు 1959 జూలైలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని తొలి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వాన్ని 356వ అధికరణ ప్రయోగించి బర్తరఫ్ చేసింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని చక్కదిద్దేవరకూ ఆ అధికరణ దశాబ్దాలపాటు దుర్వినియోగం చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించే ధోరణి వెర్రితలలు వేసి ప్రభుత్వాలు కుప్పకూలాయి. అసెంబ్లీలు రద్దయ్యాయి. ఈ కారణాలన్నిటివల్లా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలది తలోదారీ అయింది. పాలక పార్టీలను చీల్చటం, చీలికవర్గంతో కొత్త ప్రభుత్వాలను ప్రతిష్టించటం రివాజైంది. తరచు ఎన్నికల వల్ల ఖజానాకు తడిసిమోపెడు ఖర్చు అవుతున్నదన్నది వాస్తవం. దీనికితోడు రాజమార్గాల్లో, దొంగదారుల్లో ఎన్నికల జాతరకు వచ్చిపడే వేల కోట్ల రూపాయలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతున్నాయి. ఉదాహరణకు 2009 సార్వత్రిక ఎన్నికలకు ఖజానాకు రూ.1,115 కోట్లు ఖర్చ యితే, 2014 నాటికి ఇది రూ.3,870 కోట్లకు పడగలెత్తింది. ఇదంతా సర్కారుకయ్యే వ్యయం. పార్టీలూ, అభ్యర్థులూ చేసే ఖర్చు ఇందుకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. కానీ రోగం ఒకటైతే మందు మరొకటన్నట్టు ఈ సమస్యలకు జమిలి ఎన్నికలే పరిష్కారమని పాలకులు చేస్తున్న వాదన సరికాదు. ఎన్నికల్లో ధనప్రభావం అరికట్టడానికి ఎన్నికల సంస్కరణలు అవసరం. ఎన్నికల విశ్వసనీయత పెంచటానికి దొంగ ఓట్లను అరికట్టడం అవసరం. అలవిమాలిన వాగ్దానాలతో ప్రజలను ఆకర్షించి, అధికారంలోకొచ్చాక వంచించే పార్టీలపై చర్యలు తీసుకోవటం అవసరం. కానీ జరిగిందేమిటి? అసలే పార్టీలు వెచ్చించే కోట్లాది రూపాయల సొమ్ము ఎక్కడిదో తెలిసే అవకాశంలేని ప్రస్తుత పరిస్థితిని మరింత జటిలం చేసేలా ఎన్నికల బాండ్ల విధానానికి తెరలేపారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్ని కలు’ గొప్ప ఆదర్శంగా కనిపించవచ్చు. చూడదల్చుకున్నవారికి ఇందులో జాతీయతా భావన కూడా దర్శనమీయొచ్చు. కానీ ఎన్నికల ప్రక్షాళనకు ఇది దోహదపడేదెంత? ఇంతకూ జమిలి ఎన్నికల విధానం అమలు చేయటం మొదలెట్టాక రాష్ట్రాల్లో గడువుకు ముందే అసెంబ్లీలు రద్దు చేయాల్సివస్తే ఏం చేస్తారు? 90వ దశకంలో మాదిరే కేంద్రంలోనే అస్థిరత ఏర్పడి లోక్సభ రద్దు చేయాల్సివస్తే మార్గం ఏమిటి? ఇవన్నీ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ఎటూ పరిశీలిస్తుంది. ఇక రెండు చట్టసభలకూ ముడివేయటంవల్ల ఫెడరలిజం దెబ్బతింటుందనేవారూ... జాతీయ అంశాల ప్రాముఖ్యత పెరిగి స్థానిక అవసరాలు, ఆకాంక్షలు మరుగునపడతాయనేవారూ ఉన్నారు. అయితే 2019లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీల ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు వెలువడిన ఫలితాలు గమనిస్తే ఇది అర్ధసత్యమే అనిపిస్తుంది. ఏదేమైనా జమిలి ఎన్నికల విధానంపై విస్తృతమైన చర్చకు చోటిచ్చి, అందులో వ్యక్తమయ్యే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి అడుగులు వేయాలి. తొందరపాటు పనికిరాదు. ఇది కూడా చదవండి: Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ -
ఓట్ల పండుగ.. ఉపాధి మెండుగా
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో జరగనున్న పార్లమెంటు, వివిధ రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు.. కొత్త ఉపాధిని కల్పించనున్నాయి. యువతకూ ఉద్యో గాలు రానున్నాయి. కానీ ఈ రెండూ తాత్కాలికమే కానున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ.. మన దేశంలో మాత్రం ఎన్నికలతో భారీ ఎత్తున తాత్కాలిక ఉద్యోగాలు రాబోతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆగస్టు చివరి వారం నుంచి ఆరేడు నెలల పాటు పలు సెక్టార్లలో నిపుణులైన యువతకు అవకాశాలు రాబోతున్నాయని.. మార్కెట్ సర్వేలు, సిబ్బంది సేవల సంస్థలు మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా, టీమ్లీజ్, లింక్డ్ఇన్ వంటి సంస్థలు చెప్తున్నాయి. ఐటీ.. డిజిటల్..: దేశంలో ఎన్నికల సీజన్ ఇప్పటికే మొదలైంది. దేశవ్యాప్తంగా డిజిటల్ వినియోగం పెరిగిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు సరికొత్త విధానాలను అనుసరిస్తున్నాయి. ఐటీ, సోషల్ మీడియాను తమ అవసరాలకు వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ నిపుణుల అవసరం పెరుగుతుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దీనికితోడు ఆగస్టు నుంచి పండుగల సీజన్ మొదలవుతోందని, కొనుగోళ్ల సందడితో ఈ–కామర్స్ జోరందుకుంటుందని అంటున్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచుతాయని వివరిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో దేశవ్యాప్తంగా 7 లక్షల మందికిపైగా ఉద్యోగులను పలు కంపెనీలు తాత్కాలికంగా నియమించుకునే వీలుందని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా, టీమ్లీజ్, లింక్డ్ఇన్ వంటి సంస్థలు అంచనా వేశాయి. పొలిటికల్ సర్వేల సారాంశమిది దేశవ్యాప్తంగా అన్ని పార్టీలూ ప్రచార జోరు పెంచాయి. పార్టీలు, నిలబడే అభ్యర్థులు సర్వేలు చేయించి పరిస్థితిని విశ్లేషించుకోవడంలో మునిగారు. ఆన్లైన్ విధానంలో సాగే సర్వేల కోసం యువత అవసరం ఉంది. దీనికితోడు కార్యాలయంలోనే కూర్చుని క్షేత్రస్థాయి నివేదికలు ఇవ్వగల సరికొత్త సాఫ్ట్వేర్ అప్లికేషన్లనూ రూపొందిస్తున్నారు. సర్వే ఫలితాలను విశ్లేషించి నివేదిక (అనలిటికల్ రిపోర్టు) ఇవ్వడమూ ముఖ్యమే. బలాలు, బలహీనతలను పసిగట్టేలా.. ఓటర్ల మనోగతం తెలుసుకునేలా ఆన్లైన్ సర్వే అప్లికేషన్లను రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు ఐటీ ఉద్యోగుల అవసరం ఉంటుంది. ఇప్పటికే దేశంలో పెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థలైన కేపీఎంజీ, డెలాయిట్, ఈవైలు, పీడబ్ల్యూసీ వంటి సంస్థలు నియామకాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థంలో కనీసం 80వేల మంది ఐటీ ప్రొఫెషనల్స్ అవసరం ఉండొచ్చని ఈ కంపెనీలు అంటున్నాయి డిజిటల్ రంగం తళుకులు ఎక్కడో ఒకచోట మాట్లాడితే.. దేశమంతటా ప్రచారం కావాలని పార్టీలు కోరుకుంటున్నాయి. దీన్ని సాకారం చేయగల సత్తా డిజిటల్ మీడియాకే ఉంది. గత ఐదేళ్లుగా వర్చువల్ రియాలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఇందుకోసం ఆధునిక పరికరాలు, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు వస్తున్నాయి. సెల్ఫోన్లు సహా ఓటర్ వాడే ప్రతి డిజిటల్ మీడియాకు పార్టీలను తీసుకెళ్లడం అవసరంగా మారింది. ఇందుకోసం డిజిటల్ రంగ నిపుణుల ఆవశ్యకత పెరిగింది. దీనికి అనుగుణంగా విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో ఫొటోలు, వీడియోలు రూపొందించడం, ఎడిట్ చేయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి సాంకేతిక అనుభవం ఉన్న వారికి భారీగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. టెక్ విభాగాల్లో డెవలపర్స్, క్లౌడ్టెక్, సైబర్ సెక్యూరిటీ, మొబిలిటీ సైన్స్, వర్చువలైజేషన్, అనలిటిక్స్ వంటి నిపుణులకు ఎన్నికల సీజన్లో మంచి వేతనాలతో ఉపాధి ఉండే వీలుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగాల ‘పండుగ’ దేశంలో ఆగస్టు నుంచి వరుసగా పెద్ద పండుగలు ఉంటాయి. ఓనమ్, రక్షాబంధన్, జన్మాష్టమి, గణేశ్ నవరాత్రులు, దుర్గాష్టమి, దసరా, దీపావళి, క్రిస్మస్, 2024 కొత్త సంవత్సరం.. ఇలా పండుగలతో కొనుగోళ్లు పెరుగుతాయి. ఈ క్రమంలో రిటైల్, బ్యూటీ, ఫ్యాషన్, లైఫ్స్టైల్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్ వంటి రంగాల కంపెనీలు.. భారీగా తాత్కాలిక నియామకాల కోసం ప్రయత్నిస్తున్నాయి. మ్యాన్పవర్ గ్రూప్ అంచనాల ప్రకారం.. రిటైల్ అమ్మకాలు, సహాయక సిబ్బంది, గిడ్డంగుల్లో పికర్స్, ప్యాకర్స్, డెలివరీ సిబ్బంది, వినియోగదారుల రుణాల కంపెనీల వద్ద ఎగ్జిక్యూటివ్ల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ తరహా ఉద్యోగాలు గత ఏడాది కన్నా ఈసారి 25 శాతం ఎక్కువగా ఉంటాయని, సుమారు 2 లక్షల మంది అవసరం ఉండొచ్చని టీమ్లీజ్ సంస్థ అంచనా వేసింది. నైపుణ్యాలు ముఖ్యం ఇవి తాత్కాలిక ఉద్యోగాలే అయినా మంచి అవకాశాలే. నిరుద్యోగులకు అనుభవం సంపాదించి పెడతాయి. అనలిస్టులు, ఐటీ నిపుణులకు అవసరమైన పరిజ్ఞానం ఉంటేనే కంపెనీలు ప్రాధాన్యమిస్తాయి. ముఖ్యంగా మేథ్స్పై పట్టు ఉన్న వారు రాణించగలరు. ఈ అనుభవం మున్ముందు కూడా దోహద పడుతుంది. – ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ మంచి పనితీరు చూపితే పర్మినెంట్ కావొచ్చు సీజన్లో అవసరం కోసం తీసుకున్న ఉద్యోగుల నైపుణ్యాలను కంపెనీలు పరిశీలిస్తాయి. మంచి పనితీరు, ప్రావీణ్యం చూపితే సీజన్ తర్వాత కొన్ని పరీక్షల ద్వారా శాశ్వత ఉద్యోగాల్లోకి తీసుకునే వీలుంది. అందువల్ల చేసే పనిలో ప్రతిభ కనబరిస్తే మంచి భవిష్యత్ ఉంటుంది. – జావేద్, బహుళ జాతి సంస్థలో హెచ్ఆర్ నిపుణుడు -
అమెరికా మధ్యంతరంలో ఐదుగురు భారతీయులు
వాషింగ్టన్: అమెరికా పార్లమెంట్ దిగువ సభకు జరుగుతున్న మధ్యంతర ఎన్నికల్లో ఐదుగురు భారతీయ అమెరికన్లు బరిలో దిగారు. కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ స్థానం నుంచి 57 ఏళ్ల అమీ బేరా ఆరోసారి రేసులో ఉన్నారు. 46 ఏళ్ల రో ఖన్నా కాలిఫోర్నియాలోని 17వ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని ఏడో స్థానం నుంచి 57 ఏళ్ల జయపాల్ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మిషిగన్లోని 13వ స్థానం నుంచి శ్రీ థనేదర్ పోటీకి సిద్ధమయ్యారు. రిపబ్లిక్ అభ్యర్థులతో పోలిస్తే బేరా, రాజా, ఖన్నా, ప్రమీలా బలంగా ఉన్నట్లు సమాచారం. ఇక 67 ఏళ్ల థనేదర్ అరంగేట్రం చేస్తున్నారు. ఐదుగురిలో ప్రమీలా జయపాల్ ఒక్కరే మహిళా అభ్యర్థి. హోరాహోరీ పోరు ఉండే స్థానాల్లో భారతీయ అమెరికన్ ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ప్రతినిధుల సభలో 435 మంది సభ్యులుంటారు. 50 రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన స్థానాలను కేటాయిస్తారు. సెనేట్లో మాత్రం 100 మంది సెనేటర్లు ఉంటారు. ప్రతి రాష్ట్రానికి సమప్రాధాన్యత అంటే రెండు సీట్లు ఉంటాయి. మరోవైపు మేరీలాండ్ రాష్ట్రంలో డెమొక్రటిక్ మహిళా అభ్యర్థిగా లెఫ్టినెంట్ గవర్నర్ పదవి కోసం 57 ఏళ్ల అరుణా మిల్లర్ పోటీపడుతున్నారు. ఆమె గెలిస్తే ఈ పదవి చేపట్టే తొలి భారతీయ అమెరికన్గా చరిత్ర సృష్టిస్తారు. ప్రతినిధుల సభకు నవంబర్ ఎనిమిదో తేదీన పోలింగ్ జరగనుంది. -
యూకే లేబర్ పార్టీ లాంగ్లిస్ట్లో ఉదయ్
సాక్షి, హైదరాబాద్: యూకే పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న హైదరాబాద్ మూలాలుగల తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజు తాజాగా ఆ పార్టీ వడపోత అనంతరం రూపొందించిన ఆశావహుల జాబితాలో చోటు సంపాదించారు. మిల్టన్ కీన్స్ నార్త్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిత్వాన్ని ఉదయ్ ఆశిస్తున్నారు. యూకే పార్లమెంటరీ ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వందలాది మంది వ్యక్తులు తొలుత తాము అభ్యర్తిత్వం కోరకుంటున్న పార్టీకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను వడపోసి ముగ్గురు లేదా నలుగురిని ఎంపిక చేసి లాంగ్లిస్ట్ రూపొందిస్తారు. వారిలో ఒకరిని పార్టీ స్థానిక సభ్యులు ఎన్నుకుంటారు. ఆ అభ్యర్థే పార్టీ తరఫున అధికారికంగా పార్లమెంటరీ అభ్యర్థి అవుతారు. రాజకీయ అనుభవం, గెలుపు అవకాశాలు, ప్రజాసేవ పట్ల నిబద్ధత తదితరాల ఆధారంగా లాంగ్ లిస్ట్ను లేబర్ పార్టీ రూపొందించగా ఉదయ్ అందులో చోటు సంపాదించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు దగ్గరి బంధువైన ఉదయ్ నాగరాజు.. అంతర్జాతీయ వక్తగా, లేబర్ పార్టీ విధాన నాయకుడిగా మేథో విభాగాన్ని నడిపిస్తున్నారు. ఇదీ చదవండి: UK political crisis: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
...మొత్తం దృష్టి అంతా ఇక్కడే ఫోకస్ చేస్తే గెలిచే స్థానాల్లో ఓడిపోయే ప్రమాదం..
...మొత్తం దృష్టి అంతా ఇక్కడే ఫోకస్ చేస్తే గెలిచే స్థానాల్లో ఓడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సార్! -
లోక్సభ ఎన్నికల్లో ప్రజాగాయకుడు పోటీ? భట్టి ఆఫర్కు గద్దర్ సై అంటారా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాటలతో ప్రజాగాయకుడిగా గుర్తింపు పొందిన సామాజిక విప్లవకారుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్రావు పార్లమెంట్ బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామపక్ష, విప్లవ రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆలోచనా ధోరణి ఇటీవలికాలంలో మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తికర పరిణామం జరిగింది. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కోరుతూ గద్దర్ బుధవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. గద్దర్ మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్ర తెలంగాణకు వచ్చినప్పుడు సమాచారమిస్తే తాను పాల్గొంటానని చెప్పారు. మరి యాత్రలో పాల్గొనాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలా? అని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన భట్టి.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గద్దర్ను ఆహ్వానించారు. పార్టీలోకి రావడమే కాదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకు పోటీ చేయాలని కూడా కోరారు. భట్టి ఆహ్వానానికి గద్దర్ తల ఊపుతూ సానుకూలంగా స్పందించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు పెద్దపల్లి స్థానం నుంచి లోక్సభకు పోటీ చేయాలని గద్దర్ను కోరారు. అంబేడ్కర్ పేరు పెట్టడంపై కేసీఆర్ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని గద్దర్కు భట్టి సూచించగా.. సీఎంను కలిసే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని భట్టిని కోరుతున్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: ఇకపై వార్ వన్ సైడ్ కాదు.. 2024లో అంతా మారుతుంది -
గులాం నబీ అజాద్ సంచలన వ్యాఖ్యలు.. ఆ పరిస్థితి కనిపించటం లేదు
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీ ఓ వైపు నాయకత్వలేమి సమస్యలు ఎదుర్కొంటోంది. మరోవైపు సీనియర్ నాయకుల సంచలన వ్యాఖ్యలతో సతమతమవుతోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బుధవారం జమ్మూ కశ్మీర్లో మాట్లాడుతూ.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు గెలిచే పరిస్థితి కనిపించడం లేదన్నారు. చదవండి: మా మద్దతు లేకుండా బీజేపీని ఓడించలేరు అదే విధంగా జమ్మూ కశ్మీర్కు సంబంధించి అర్టికల్ 370 పునరుద్ధరణ విషయంతో తమ వాగ్దానాలను నెరవేర్చే స్థితిలో లేవమని పేర్కొన్నారు. అర్టికల్ 370 కోర్టు పరిధిలో ఉందని, ప్రస్తుతం తమ చేతిలో ఏం లేదని తెలిపారు. అయితే ఎవరైనా దానికి కోసం పోరాడితే అది బాధ్యతయుతమైన ముందడుగు అవుతుందని అన్నారు. చదవండి: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందం కేసీఆర్ భేటీ? కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా 300 ఎంపీ స్థానాలు లేవని, వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామన్న పరిస్థితి కనిపంచడం లేదన్నారు. అందుకే తాను సత్యదూరమైన వాగ్దానాలు చేయలేనని స్పష్టం చేశారు. ఇక, జీ-23 కాంగ్రెస్ నేతల్లో గులాం నబీ అజాద్ ప్రముఖ నేత అన్న సంగతి తెలిసిందే. -
2024 లోక్సభ ఎన్నికల నాటికి రిమోట్ ఓటింగ్!
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల వ్యవస్థలో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలవుతుందని, 2024 లోక్సభ ఎన్నికల నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని అన్నారు. రిమోట్ ఓటింగ్కు సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. ఐఐటీ మద్రాసుతో పాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా అరోరా చెప్పారు. రిమోట్ ఓటింగ్ అంటే ఆన్లైన్ ఓటింగ్ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని సీఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థకి మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే దీనికి తుదిరూపు రేఖ వస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల వారితో దీనిపై సంప్రదింపులు జరపవలసి ఉందని అన్నారు. గతంలో మాజీ డిప్యూటీ ఎన్నికల అధికారి సందేప్ సక్సేనా ఈ ప్రాజెక్టుని ‘‘బ్లాక్చైన్’’టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. టూ–వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో వైట్ లిస్ట్లో ఉండే ఐపీ పరికరాలు, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ డివైస్లు వంటివన్నీ ఉంటాయన్నారు. రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్దేశిత ప్రాంతానికి రావల్సి ఉంటుందని అప్పట్లో సక్సేనా వెల్లడించారు. (చదవండి: ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక) -
కరోనాపై విజయమే గెలిపించింది
అక్లాండ్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన విజయానికి కారణాలని రెండోసారి న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన జెసిండా అర్డెర్న్(40) చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ కృషిని ప్రజలు గుర్తించారని, అందుకే ఈ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ నుంచి పూర్తిగా తరిమికొట్టడమే లక్ష్యమన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అర్డెర్న్కు చెందిన లిబరల్ లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేషనల్ పార్టీకి కేవలం 27 శాతం ఓట్లు దక్కాయి. అంచనాలకు మించి తమకు ఓట్లు పడ్డాయని అర్డెర్న్ చెప్పారు. న్యూజిలాండ్లో 24 ఏళ్ల క్రితం దామాషా ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక పార్టీ పార్లమెంట్లో స్పష్టమైన మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి. ప్రధానిగా అర్డెర్న్ ఈ ఏడాది మార్చిలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేశారు. దీంతో దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గిపోయింది. ఇది ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అర్డెర్న్ 2017లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. అర్డెర్న్కు ప్రధాని మోదీ అభినందనలు జెసిండా అర్డెర్న్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబం«ధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి అర్డెర్న్తో కలిసి పనిచేస్తానని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
రాజకీయ అనిశ్చితిలో ఇజ్రాయెల్
ఏడాది వ్యవధిలో వరసగా మూడోసారి ఎన్నికలు వచ్చినా ఇజ్రాయెల్ పార్లమెంటు కెన్సెట్ ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టమైన తీర్పునివ్వలేకపోయారు. అమెరికా ఆశీస్సులతో వెస్ట్ బ్యాంక్ భూభాగంలోని మెజారిటీ ప్రాంతాన్ని కబ్జా చేయడానికి పథకరచన చేసిన ప్రధాని నెతన్యాహూ ఆశలకు ఈ ఎన్నికలు గండికొట్టాయి. అధికారికంగా ఈ నెల 10న ఫలితాలు ప్రకటించాల్సివున్నా 120 స్థానాలుండే కెన్సె ట్లో నెతన్యాహూ నేతృత్వంలోని మితవాద పక్షం లికుడ్ పార్టీకి అంచనాకు తగ్గట్టు సీట్లు రాలేదు. ఆ పార్టీకి గత ఎన్నికలకన్నా నాలుగు అదనంగా లభించి అది 36 సీట్ల దగ్గరే ఆగిపోగా, బెన్నీ గాంట్జ్ ఆధ్వర్యంలోని ప్రత్యర్థి పక్షం బ్లూ అండ్ వైట్ పార్టీకి 33 స్థానాలొచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదల్చుకున్న పక్షానికి పార్లమెంటులో ఉండాల్సిన కనీస స్థానాలు 61. నిరుడు ఏప్రిల్లో ఒకసారి, సెప్టెంబర్లో ఒకసారి ఎన్నికలు జరిగినప్పుడు నెతన్యాహూ ఏదోవిధంగా అధికారంలో కొనసా గారు. కానీ ఈసారి అది అంత తేలిగ్గా అందే అవకాశం కనబడటం లేదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇప్పుడు కూడా మెజారిటీ పక్ష నేతగా నెతన్యాహూకే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానం అందుతుంది. అయితే ప్రత్యర్థి పక్షం బ్లూ అండ్ వైట్ పార్టీ చేతులు కలిపితేనే సుస్థిర ప్రభుత్వం స్థాపించే అవకాశం వుంది. కానీ ఆ రెండు పార్టీలూ దగ్గరయ్యే అవకాశం లేదు. ఇతర మితవాద పక్షాలైన షాస్, యమినా, తోరా జుడాయిజంవంటివాటితో నెతన్యాహూ కూటమి ఏర్పరిచినా, కనీస మెజారిటీకి మూడు స్థానాలు తక్కువే వుంటాయి. ఏతావాతా ఆయన ప్రభుత్వం దినదిన గండం గానే గడపాలి. నెతన్యాహూ పార్టీకి సొంతంగా 58 స్థానాలొస్తాయని విశ్లేషకులు జోస్యం చెప్పారు. తోటి మితవాద పక్షాలను కూడగట్టి సునాయాసంగా సుస్థిర ప్రభుత్వాన్ని స్థాపించడం ఖాయమని నెతన్యాహూ నమ్మారు. కానీ చివరకు ఆయనకు నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల ప్రచారంలో ఎప్పటిలాగే నెతన్యాహూ పాలస్తీనాకు వ్యతిరేకంగా నిప్పులు కక్కారు. ‘ఇంకెంత... మరో రెండు నెలల్లో వెస్ట్బ్యాంకు ప్రాంతాన్ని విలీనం చేసుకోవడం ఖాయమ’ని ప్రక టించారు. ఆయన మాత్రమే కాదు...ఆయన ప్రత్యర్థి గాంట్జ్ కూడా వెస్ట్బ్యాంక్ విషయంలో అదే రక మైన అభిప్రాయంతో వున్నారు. కానీ ఆయన కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేరు. ఈ సంగతలా వుంచి నెతన్యాహూ పాలనపై ఇజ్రాయెల్ ప్రజానీకంలో వ్యతిరేకత పాలు అధి కంగానే ఉన్నదని తాజా ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. దేశ ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని తీర్చడంలో విఫలమవుతూ వస్తున్న నెతన్యాహూ జాత్యహంకార పోకడలనే ఆశ్రయిస్తున్నారు. ఆ పోకడల పర్యవసానంగా లికుడ్ పార్టీకి మిగిలిన పక్షాలకంటే అధిక స్థానాలు లభిస్తున్నాయి. అధికా రమూ దక్కుతోంది. కానీ వేరే పార్టీలతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పర్చక తప్పడం లేదు. ఇంత కుముందు రెండు ఎన్నికల సమయంలోనూ నెతన్యాహూపై అవినీతి ఆరోపణలు మాత్రమే వస్తే, ఈసారి ఆ ఆరోపణల్లో ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించి కేసులు కూడా దాఖలు చేశారు. నెత న్యాహూ, ఆయన భార్య అక్రమంగా బహుమతులు స్వీకరించారని, అధిక సర్క్యులేషన్ ఉన్న ఒక పత్రిక యజమానితో లాలూచీపడి అందులో తనకు బాగా ప్రచారం ఇచ్చేట్టు చేసుకన్నారని, దానికి ప్రతిఫలంగా దాని ప్రత్యర్థి పత్రిక దెబ్బతినేవిధంగా చట్టం తీసుకొచ్చారని, ఒక వెబ్సైట్లో తనకు అనుకూల వార్తలు రాయించుకుని, దాన్ని నిర్వహిస్తున్న టెలికాం సంస్థకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆ ఆరోపణల సారాంశం. అంచం ఆరోపణలు రుజువైతే నెతన్యాహూకు గరిష్టంగా పదేళ్లు శిక్షపడుతుంది. అలాగే విశ్వాసఘాతుకానికి సంబంధించిన ఆరోపణల్లో మూడేళ్లు శిక్ష పడే అవకాశంవుంది. కనుకనే ఈ ఎన్నికల్లో మంచి మెజారిటీతో నెగ్గి అధికారంలోకొచ్చినా నెతన్యాహూకు అది మూన్నాళ్ల ముచ్చటే అయ్యేది. ఈ దఫా ఎన్నికల ప్రచారంలో వెస్ట్బ్యాంక్తో పాటు నెతన్యాహూ ఈ అవినీతి ఆరోపణలపైనే కేంద్రీకరించారు. తనకు అధికారం దక్కకుండా చేయడానికే ప్రత్యర్థులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కానీ ఆయన మాటల్ని జనం విశ్వసించలేదని చెప్పడానికి ఎన్నికల ఫలితాలే రుజువు. ఈ ఆరోపణలపై న్యాయ స్థానాల్లో విచారణ మొదలు కావాలంటే సుదీర్ఘ సమయం పడుతుంది. ఆరోపణలు రుజువై శిక్ష పడినా, ఆఖరి అప్పీల్లో వ్యతిరేకంగా తీర్పు వచ్చేంతవరకూ అధికారంలో కొనసాగడానికి అడ్డంకు లేమీ ఉండవు. కానీ ఇలాంటి సమస్య తలెత్తకుండా చూసేందుకు అధికారంలోకొచ్చిన వెంటనే చట్టసవరణకు పూనుకొని ప్రధాని పదవిలో వుండేవారికి ప్రాసిక్యూషన్ బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని నెతన్యాహూ గట్టిగా కోరుకున్నారు. ఇప్పుడు అధికారం రావడం, దాన్ని నిలబెట్టు కోవడం పెద్ద సమస్యగా మారింది. తోటి మితవాద పక్షాలు కూటమిలో చేరినా, ఈ సవరణకు అంగీకరిస్తాయా అన్న సందేహం అందరిలో వుంది. ఇజ్రాయెల్లో ఇప్పుడు నెలకొన్న రాజకీయ అనిశ్చితి మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నది వేచి చూడాలి. ఈసారి నెతన్యాహూ కెన్సెట్లో విశ్వాస పరీక్ష నెగ్గలేకపోతే నాలుగో దఫా ఎన్నికలు అనివార్యమవుతాయి. అందుకు అన్ని పార్టీల ఎంపీలూ వ్యతిరేకంగా వున్నారని అంటున్నారు. కనుక పార్టీలకు అతీతంగా కొందరు నెతన్యాహూకు మద్దతిచ్చే అవకాశం లేకపోలేదు. ఆయనే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచి, వెస్ట్బ్యాంకు భూభాగం కబ్జాకు ప్రయత్నిస్తే ఇజ్రాయెల్–పాలస్తీనా ఘర్షణలు ప్రమాదకర స్థాయికి చేరతాయి. ఆ ప్రాంత పాలస్తీనా వాసులకు గూడు కరువవుతుంది. తనను తాను ప్రాసిక్యూషన్నుంచి మినహాయించుకుంటూ చట్ట సవరణకు నెతన్యాహూ పూనుకుంటే అది ఆ దేశ ప్రజాస్వామిక వ్యవస్థను మరింత భ్రష్టు పట్టిస్తుంది. మొత్తానికి ఇజ్రాయెల్ ఇప్పుడొక సంధి దశలో పడింది. దాన్నుంచి అది క్షేమంగా బయటపడుతుందా లేక మరో నిరంకుశ నేత ఆగమనానికి దారితీస్తుందా అన్నది చూడాలి. -
ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ విషయంలో గతేడాది జరిగిన ముందస్తు అసెంబ్లీ, తాజాగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ పోలీసులు అనుసరించిన వ్యూహాలు ఫలించాయి. వాస్తవానికి ఈ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. పార్లమెంటు కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఏప్రిల్ 11న తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించారు. పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర పోలీసులు మొత్తం 54 వేల మందికి తోడుగా కేంద్ర బలగాలు, అటవీ, విద్యుత్తు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసులంతా కలిపి దాదాపు 80 వేల మందికిపైగా పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. వామపక్ష తీవ్రవాదం అధికంగా ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్పల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కూంబింగ్ పార్టీలు నిత్యం అప్రమత్తంగా ఉండటంతో సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్గఢ్ల నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించకుండా పొలిమేరలను కట్టుదిట్టంగా పహారా కాశారు. పోలింగ్ ముందు ఛత్తీస్గఢ్లో ఎమ్మెల్యే కాన్వాయ్ పేల్చివేత, పోలింగ్ తరువాత మహారాష్ట్రలో పోలీసుల కాన్వాయ్పై మెరుపు దాడితో మావోయిస్టులు హింసకు దిగి ప్రశాంతతను చెదరగొట్టారు. కానీ, తెలంగాణలో మావోయిస్టులకు అలాంటి అవకాశాలు ఏమాత్రం ఇవ్వలేదు. ఇక తెలంగాణలో మొత్తం 2,600 సంక్లిష్ట ప్రాంతాలు, 5749 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి సఫలమయ్యారు. 40 రోజులపాటు సుదీర్ఘ పహారా.. ఏప్రిల్ 11న పోలింగ్ జరగ్గా, మే 23 ఓట్ల లెక్కింపు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా 34,603 పోలింగ్ స్టేషన్లలో 18,526 పోలింగ్ స్థానాల్లో ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరపడంలో పోలీసులు సఫలమయ్యారు. ఒక్క చోట కూడా రీపోలింగ్ జరపాల్సిన అవసరం రాకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం. ఎన్నికల అనంతరం ఎన్నికల నిబంధనల ప్రకారం.. 37 ప్రాంతాల్లో 123 స్ట్రాంగ్రూమ్లకు ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కేంద్ర బలగాల పహారా మధ్య తరలించారు. వీటికి 42 రోజులుగా సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్, కేంద్ర బలగాలతో మూడంచెల భద్రతను కల్పించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద 144 సెక్షన్లతో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా ఏకంగా 10,000 మంది స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. విరామం ఎరగకుండా.. ఏడాదిలోపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు నిర్వహించడం సవాలే అయినా.. సమస్యల్లేకుండా ఎలాంటి విశ్రాంతి, సెలవులు తీసుకోకుండా తెలంగాణ పోలీసులు నిర్విరామంగా, సమర్థంగా విధులు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాతే సర్పంచి ఎన్నికలు, తరువాత పార్లమెంటు, అనంతరం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా పూర్తిచేశారు. -
ఆస్తులు, అప్పుల్లో కొండా టాప్!
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పార్లమెంటు ఎన్నికలు జరగనున్న తెలంగాణలో నామినేషన్లు సోమవారంతో ముగిశాయి. నామినేషన్ల సందర్భంగా తమ ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్లో పేర్కొన్నారు. వివరాలు అందిన అభ్యర్థుల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ప్రకారం చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆస్తుల్లో, అప్పుల్లోనూ మొదటి స్థానంలో నిలిచారు. ఆయనకు రూ.895 కోట్లకు పైగా ఆస్తులు, రూ.35 కోట్లకు పైగా అప్పులున్నాయి. ఇందులో తమతో పాటు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యుల ఆస్తులు, అప్పులను వెల్లడించారు. ఆస్తుల్లో భాగంగా చరాస్తుల్లో బ్యాంకు బ్యాలెన్సులు, షేర్లు, బాండ్లు, పెట్టుబడులు, ఎల్ఐసీ పాలసీలు, హ్యాండ్లోన్లు, బంగారు, వెండి, ఇతర ఆభరణాలు, కార్లు, హెచ్యూఎఫ్ల కింద వ్యాపారాలు, ట్రస్టుల వివరాలను వెల్లడించారు. స్థిరాస్తుల్లో వ్యవసాయ భూములు, ప్లాట్లు, బిల్డింగులు తదితర వివరాలు వెల్లడించారు. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో వెల్లడించిన వివరాల ప్రకారం అందరి కన్నా కొండా విశ్వేశ్వర్రెడ్డి ఆస్తులు ఎక్కువని తేలింది. సికింద్రాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్యాదవ్ అప్పులివ్వడంలోనూ, తీసుకోవడంలోనూ మొదటిస్థానంలో ఉన్నారు. భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు ఎక్కువ సంఖ్యలో (విస్తీర్ణం కాదు) వ్యవసాయ భూములు, స్థలాలున్నాయని ఆయన అఫిడవిట్ ద్వారా వెల్లడైంది. అభ్యర్థులందరి అఫిడవిట్లను పరిశీలిస్తే భువనగిరి, మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్రెడ్డిలపై ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అయితే, మెజార్టీ అభ్యర్థులు తమ కన్నా భార్యల పేరిట ఎక్కువ ఆస్తులు చూపెట్టడం గమనార్హం. వివిధ పార్టీల అభ్యర్థులు తమ అఫిడవిట్లలో వెల్లడించిన ఆస్తులు, అప్పుల వివరాలు (రూపాయల్లో) -
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం
ఆర్మూర్: కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ అంశాన్ని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన బహిరంగలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చొరవ వల్లే సమస్య తీవ్రత కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు గిట్టుబాటు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వానికి పసుపు పంటకు ధర ఇవ్వడం పెద్ద సమస్య కాదని చెప్పారు. సుమారు 150 రకాల పసుపు, ఎర్రజొన్న లాంటి పంటలు పండించే రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులు ఎదుర్కొన్న తరుణంలో రైతు పంటను అమ్ముకున్న ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని రాంమాధవ్ హామీ ఇచ్చారు. పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వంపై ఉన్న వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కడానికి పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. ఇది ఎంపీ కవిత వైఫల్యమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో నిరంకుశ పాలన సాగుతోందని రాంమాధవ్ విమర్శించారు. బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరు.. పాలమూరు: బీజేపీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని రాంమాధవ్ అన్నారు. మహబూబ్నగర్లో ఆయన మాట్లాడుతూ. తానే కింగ్ మేకర్ అంటున్న కేసీఆర్, మోదీ పాలనను అడ్డుకుంటామన్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులెవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్న చంద్రబాబు మొదట ఆంధ్రలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దేశంలో రాహుల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. రాహుల్ ఎక్కడ పర్యటించినా మోదీ..మోదీ అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారని గుర్తు చేశారు. 300 స్థానాల్లో ఒంటరి పోరు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 300 స్థానాల్లో పోరాడుతుందని, అన్ని స్థానాల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ను ఓడించేందుకు బీజేపీ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని, ఎక్కువ మెజార్టీతో గెలిచాడని అల్లుడు హరీశ్రావును పక్కన పెట్టారని, మహబూబ్నగర్ ఎంపీగా ఉన్న జితేందర్రెడ్డికి సైతం టికెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్నగర్సభలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి మాట్లాడుతూ.. ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచంలో మోదీకి మించిన నాయకుడు లేడని కొనియాడారు. -
చేవెళ్ల నుంచి కాంగ్రెస్ ప్రచార భేరి
-
నేడు రాష్ట్రానికి అమిత్షా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్షా ఈ నెల 6న రాష్ట్రానికి రానున్నారు. నిజామాబాద్లో జరిగే పార్లమెంట్ క్లస్టర్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. మధ్యా హ్నం 1 గంటకి నిజామాబాద్ బోర్గాంలోని భూమారెడ్డి గార్డెన్స్లో జరిగే ఈ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన చర్యలపై అమిత్షా దిశానిర్దేశం చేస్తారు. ఈ సభలో నిజామాబాద్ క్లస్టర్ పరిధి లోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి శక్తి కేంద్రాల ప్రముఖ్లు, సహ ప్రముఖ్లు, ఇన్చార్జిలు పాల్గొంటారు. -
చేవెళ్ల నుంచి ప్రచార భేరి
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రచార భేరీ మోగించనుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సమర శంఖం పూరించనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు చేవెళ్ల పరిధిలో నిర్వహించే బహిరంగ సభ నుంచి పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇక ఈ వేదికగా ఇప్పటికే ప్రకటించిన కనీస ఆదాయ పథకంపై ప్రజలకు వాగ్దానం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సభకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ వాగ్దాన సభగా నామకరణం చేసింది. పార్లమెంట్ ఎన్నికలపై గత రెండు నెలలుగా ఏఐసీసీ తీవ్ర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పోటీలో నిలిచే అభ్యర్థుల వడపోత కార్యక్రమాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయిలో చేపట్టింది. ఈ నెల రెండో వారంలో అభ్యర్థులను ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇంకా వెలువడక ముందే వివిధ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనల వేదికలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ప్రధాన్మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఎండగడుతున్నారు. ఈ పథకం కింద ఐదు ఎకరాల్లోపు రైతులకు ఏడాదికి ఆర్థిక సాయం కింద అందించే రూ.6 వేలు ఏం సరిపోతాయని నిలదీస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పేదలందరికీ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని, డబ్బును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ పర్యటనలోనే రాహుల్ గాంధీ ప్రకటించారు. ప్రపంచంలో ఏ దేశంలో అమలు చేయని పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేస్తుందని హామీ కూడా ఇచ్చారు. ఈ హామీపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పథకాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 9వ తేదీన కనీస ఆదాయ పథక వాగ్దానాన్ని పహాడీషరీఫ్ బహిరంగ సభ వేదికగా రాహుల్ ప్రకటించనున్నారు. ఈ సభకు కనీసం 2 నుంచి 3 లక్షల మందిని తీసుకురావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఇక ఇదే రోజు ఉదయం కర్ణాటకలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్ గాంధీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పహాడీషరీఫ్ బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం 6 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. సభా ఏర్పాట్లపై పరిశీలన చేవెళ్ల పార్లమెంట్ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో రాహుల్ సభ ఏర్పాట్లను మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి. కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, మండలి సభ్యుడు షబ్బీర్అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్యెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, వాహనాల పార్కింగ్, భద్రత అంశాలపై చర్చించారు. -
వచ్చేది సంకీర్ణ యుగమే
అక్కన్నపేట (హుస్నాబాద్): వచ్చే 30 ఏళ్లు సంకీర్ణ ప్రభుత్వాల యుగమేనని, దీని ద్వారానే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లే నేడు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు భారీ గా నష్టాలను రాశారని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో ముఖ్యంగా నీళ్ల కోసమే కొట్లాడామని, కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకే రూ.50 వేల కోట్లు కేటాయించాలని చట్టంలో పెట్టిందని మండిపడ్డారు. 6న కరీంనగర్లో బహిరంగ సభ.. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6న కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ కళాశాల గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించన్నట్లు వినోద్కుమార్ చెప్పారు. ఈ సభకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు. -
ఊళ్లో పరిస్థితి ఎట్లుందే?
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఊహించని షాకులిస్తున్న అధికార టీఆర్ఎస్.. సమాంతరంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలకు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రజల నాడి తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఈ పనిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు తలమునకలైనట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజవర్గంలో ఒక్కో మండలానికి ఓ పోలీసు అధికారి (హెడ్ కానిస్టేబుల్ లేదా ఎస్ఐ)తో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రతీ అసెంబ్లీకి కనీసం 4 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 28 నుంచి 30 మంది వరకు పోలీసులు సర్వేలో పాల్గొంటున్నారు. 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా... శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడూ అనుసరించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లు లక్ష్యంగా బరిలోకి దిగిన ఆ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇద్దరు స్వతంత్రులు టీఆర్ఎస్లో చేరారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకుంటే పార్టీ బలం 91కి చేరింది. ఇక మిత్రపక్షం ఎంఐఎం 7 స్థానాలు కలిపితే ప్రభుత్వానికి 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో టీఆర్ఎస్ బలం మద్దతుదారులతో కలిపి 101కి చేరింది. 16 ఎంపీ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీఆర్ఎస్ ఈసారి 100 శాతం సఫలీకృతం కావాలని పావులు కదుపుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని జోరు మీదున్న కారు పార్టీ అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు ప్రజల్లో ఆదరణ ఏ మేరకు ఉందో తెలుసునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలు తీరు, పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతుబంధు తదితరాల విషయంలో లబ్ధిదారుల అభిప్రాయాలపై ఇంటెలిజెన్స్ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ప్రజాభిప్రాయాన్ని మొత్తంగా క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు. మరో రెండుసార్లు సర్వే? ఇప్పుడు జరుగుతున్న సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేశాక మరో రెండుసార్లు సర్వే చేయించనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి, బీ–ఫారాలు ఇచ్చాక రెండోసారి సర్వే జరుగనుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు ఎన్నికలపై పడతాయా? అన్న విషయంలోనూ సర్వే జరగనుంది. జాతీయ అంశాలు కీలకంగా ఎన్నికలు జరిగితే... టీఆర్ఎస్ అనుకున్న 16 సీట్లు గెలవడం క్లిష్టమవుతుంది. అందుకే, నోటిఫికేషన్ వచ్చాక, బీ–ఫారాలు ఇచ్చాక మరోసారి సర్వే జరగనుందని సమాచారం. -
కాంగ్రెస్, బీజేపీలను భూస్థాపితం చేయండి
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూ స్థాపితం చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ 61వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంటుందని, మిగతా 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఏపీకి వెళ్లి జగన్కు మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఏపీ సీఎం చంద్రబాబుకు కొంత రాజకీయ బాకీ ఇవ్వాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో దాన్ని కూడా తీర్చేస్తానని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఎంఐఎం కలసి 35 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. జైషే, ఐసిస్లకు మతం ఉండదు ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారికి మతం ఉండదని ఒవైసీ చెప్పారు. జైషే మహ్మద్, ఐసిస్ వంటి సంస్థలు ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నాయన్నారు. ఉగ్రవాదులకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారు ఇస్లాం మతానికి చెందిన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన తాము వారికి మద్దతు ఇస్తున్నట్లు కాదన్నారు. వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి తిరిగి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ అంశాన్ని కొందరు రాజకీయాలు చేయడం తగదన్నారు. దేశంలో లౌకికవాదాన్ని బ్రతికించుకోవాలని కోరారు. -
ఎంపీ టికెట్ ఎవరికో..?
సాక్షి, జనగామ : త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికలే టార్గెట్గా ఆశావహులు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ టికెట్ దక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. రానున్న ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఆచితూచి వ్యహరిస్తుండగా ఆశావహులు మాత్రం టికెట్ల కోసం నేతలను కలుస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం వడబోత ప్రారంభించగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంపీ టికెట్ ఆశించే అభ్యర్థుల నుంచి ఏకంగా దరఖాస్తులను స్వీకరించింది. మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లోని ఆశావహులు టికెట్లను దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు. హస్తం టికెట్ కోసం డాక్టర్ రాజమౌళి.. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం జనగామకు చెందిన ప్రముఖ వైద్యులు చంద్రగిరి రాజమౌళి దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ పార్లమెంటు (ఎస్సీ) స్థానం నుంచి తమకు పోటీ చేసే అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. పట్టణానికి చెందిన దళిత సంఘ నాయకుడిగా, వైద్యుడిగా రాజమౌళి రాణిస్తున్నారు. 2009లో చిరంజీవి ప్రారంభించిన పీఆర్పీ పార్టీలో చేరి వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి రాజమౌళి బరిలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. కొన్ని రోజులకే పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో తటస్థంగా ఉన్నారు. దళిత, ప్రజా ఉద్యమాల్లో పాలుపంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలుపంచుకున్నారు. 2015లో జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2018లో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ పార్లమెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుగుణాకర్రాజు.. టీఆర్ఎస్ పార్టీలో కొత్త వారికే చాన్స్ ఇస్తామని అధినేత కేసీఆర్ సంకేతాలు ఇస్తుండడంతో జనగామకు చెందిన డాక్టర్ పడిగిపాటి సుగుణాకర్రాజు వరంగల్ పార్లమెంటు స్థానాన్ని ఆశిస్తున్నారు. వైద్యవృత్తిలో రాణిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. రెండు సార్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు ఉన్న సుగుణాకర్రాజు 2015లో జరిగిన ఉప ఎన్నికల సమయంలో వరంగల్ టికెట్ను తీవ్రంగా ప్రయత్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ఆధ్వర్యంలో సాగిన పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులతో మంచి సంబంధాలున్నాయి. ఈ సారి ఎలాగైనా వరంగల్ పార్లమెంటు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తన బయోడేటాను పార్టీ నేతలకు అందించారు. వరంగల్, హైదరాబాద్లో మకాం వేసి పార్టీ కీలక నేతలను కలుస్తున్నారు. మహబూబాబాద్ టికెట్ కోసం లక్ష్మీనారాయణ నాయక్.. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం జనగామకు చెందిన డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ లక్ష్మీనారాయణ నా యక్ వైద్యుడిగా జిల్లా కేంద్రంలో రాణిస్తున్నారు. గ తంలో లక్ష్మీనారాయణనాయక్ సతీమణి ధన్వంతి వ రంగల్ జెడ్పీ చైర్పర్సన్గా వ్యహరించారు. కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్న నాయకుడిగా కొనసాగుతున్న డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ జనగామ జిల్లా సాధన ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. జిల్లా ఉద్యమ జే ఏసీ నాయకుడిగా ఉన్న లక్షీనారాయణ నాయక్కు ప్రజల్లో మంచి పట్టు ఉంది. రాబోయే పార్లమెంటు ఎ న్నికల్లో ఎస్టీకి రిజర్వుడ్ అయిన మహబూబాబాద్ స్థా నం నుంచి పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు డాక్టర్లు వరంగల్, మహబూబాబాద్ స్థానాల నుంచి టికెట్లు ఆశిస్తున్నారు. బీజేపీలో కన్పించని సందడి.. ఒకవైపు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎంపీ టికెట్ల కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు సాగుతుండగా బీజేపీలో మాత్రం సందడి కనిపించడం లేదు. జనగా మ నియోజకవర్గం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉండగా స్టేషన్ ఘన్పూర్, పాలకుర్తి ని యోజకవర్గాలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాయి. శాసన సభ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం దక్కలేదు. అప్పటి నుంచి బీజేపీ నాయకులు ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేదు. ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో ఆశావహులు ముందుకు రావడం లేదు. -
‘దేశభక్తులకు, స్వార్థపరులకు మధ్యే పోటీ’
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ దేశ భక్తులకు, స్వార్థపరులకు, నీతిమంతులకు, అవినీతి పరులకు మధ్యేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతి పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీని అత్యధిక స్థానాల్లో గెలిపిస్తారని పేర్కొ న్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సమక్షంలో శివసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేశ్, ఇతర కార్యకర్తలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తామని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సీఎంను ఎన్నుకోవ డానిౖకైతే, లోక్సభ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నికోవడానికి అయినందునా ప్రధాని నరేంద్రమోదీని ప్రజలు మళ్లీ గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్ని సీట్లు గెలిచినా కేసీఆర్ ప్రధాని కాలేరని, ఇది తెలంగాణ ప్రజలకు తెలుసని చెప్పారు. కేంద్ర పథకాలను తెలంగాణలో అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పిదం చేస్తోందన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నప్పటికీ తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి రావడాన్ని, మోదీ ప్రధాని కావడాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజస్థాన్ మాజీ ఎంపీ రామ్ స్వరూప్ కోలి, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చింతా సాంబమూర్తి, మీడియా కన్వీనర్ వి.సుధాకర్శర్మ, నగర ప్రధానకార్యదర్శి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ‘కాళేశ్వరానికి మరిన్ని నిధులు ఇవ్వండి’ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు ప్రధానం అయినందున కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందిం చాలని, అధిక నిధులను కేటాయించేలా చర్యలు చేపట్టాలని 15వ ఆర్థిక సంఘాన్ని బీజేపీ కోరనుంది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీజేపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్.మల్లారెడ్డి, అధికార ప్రతినిధి ఎ.రాకేష్రెడ్డి బృందం ఈ నెల 18న హైదరాబాద్లో 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, సంఘం ప్రతినిధులను కలసి రాష్ట్రానికి సంబంధించిన అంశాలను వివరించను న్నారు. అలాగే మిషన్ కాకతీయకు కూడా అధిక ని«ధులను కేటాయించేలా చూడాలని కోరనున్నారు. హైదరాబాద్ తెలంగాణ రాజధానిగానే కాకుండా దేశానికే రెండో రాజధాని స్థాయి కలిగిన నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేయనున్నారు. రాష్ట్రంలో పట్టణాలకు ఎక్కువ వలసలు ఉన్నందున గ్రామీణాభివృద్ధికి అధిక నిధులను కేటాయించాలని కోరనున్నారు. మరోవైపు తెలంగాణలో అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎఫ్ఆర్బీఎం యాక్ట్కు విరుద్ధంగా ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న తీరును ఆర్థిక ప్రతినిధులకు తెలియజేయనున్నారు. ప్రభుత్వం బడ్జెట్లో అంకెల గారడి చేస్తోందని, వాస్తవంగా లోటు బడ్జెట్ ఉన్నా, మిగులు బడ్జెట్ రాష్ట్రంగా చూపుతోందని వివరించాలని నిర్ణయించారు. బడ్జెట్లో కేటాయించిన నిధుల్లో 70 శాతమే ఖర్చు చేస్తోందని, 14వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించిందని, గ్రామ పంచాయతీల నిధులను మళ్లించడం సరికాదని తెలియజేయనున్నారు. కేంద్ర పథకాల అమలు, భూసార పరీక్షలు, ఫసల్ బీమా యోజన పథకాలను సరిగ్గా అమలు చేయడం లేదని, వీటన్నింటిని సీరియస్గా తీసుకోవాలని ఆర్థిక సంఘాన్ని కోరనున్నారు. -
టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిచినా లాభం లేదు
సాక్షి, హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ స్థానాలు గెలిచినా లాభం లేదని, కాంగ్రెస్ గెలిస్తే రాహుల్గాంధీ ప్రధాని అయ్యాక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తారని టీపీసీసీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల ఆలోచన వేరుగా ఉంటుందని, మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశ ప్రజల ఆలోచనల్లో మార్పు వచ్చిందని ఆయన చెప్పారు. సోమవారం గాంధీభవన్లో పార్టీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ సమావేశమై రానున్న ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, మీడియాతో సమన్వయంపై చర్చించారు. అనంతరం కమిటీ సభ్యులు మల్లురవి, దాసోజు శ్రవణ్ కుమార్, ఇందిరాశోభన్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ రాజు మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూలీలుగా మార్చుకున్న అహంకారి కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలన సరైన రీతిలో జరగాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో మైనార్టీలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేస్తారని చెప్పారు. మీడియాతో సమన్వయం కోసం త్వరలోనే జిల్లా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కమిటీలో ముగ్గురు సభ్యులు.. కాగా, పార్లమెంటు ఎన్నికలకోసం ఏర్పాటు చేసిన మీడియా కోఆర్డినేషన్ కమిటీలో కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించారు. గాంధీభవన్ పీఆర్వో కప్పర హరిప్రసాదరావు, సీనియర్ జర్నలిస్టు పల్లె రవికుమార్, సుధాకర్గౌడ్లను కమిటీ సభ్యులుగా నియమిస్తున్నట్టు మధుయాష్కీ వెల్లడించారు. -
నేడు ఢిల్లీలో కాంగ్రెస్ ‘వార్రూమ్’ భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మంగళవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఏఐసీసీ కార్యాలయంలోని వార్రూమ్ వేదికగా రాహుల్గాంధీ సమక్షంలో సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ భేటీకి రాష్ట్రానికి చెందిన పీసీసీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. ఈ మేరకు సమావేశానికి హాజరు కావాలని ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందడంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా సోమవారమే హస్తిన బాట పట్టారు. కాగా, గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో పార్టీ మారవద్దని, పార్లమెంటు ఎన్నికల అనంతరం పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, అందరూ కలిసికట్టుగా వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు గెలిచేలా పనిచేయాలని దిశానిర్దేశం చేయనున్నట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
మెజారిటీ సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్.. రాష్ట్రంలోని అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి, కో–చైర్మన్ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్, మోదీ మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలుస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రచార కమిటీ సభ్యులు అనిల్కుమార్ యాదవ్, ఆకుల రాజేందర్, బెల్లయ్య నాయక్, చామల కిరణ్ రెడ్డి, నేరెళ్ల శారద, కోటూరి మానవతారాయ్, అనిల్ తదితరులతో కలిసి డీకే అరుణ నివాసంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. తనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను అప్పగించినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీకి విజయశాంతి కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. కుట్రలు, కుతంత్రాలు చేసి, కోట్ల రూపాయలు ధారపోసి గెలిచిందని ఆమె ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీపై ఇక్కడి ప్రజల్లో కోపం ఉన్న మాట వాస్తవమేనని విజయశాంతి అన్నారు. ఆ కోపాన్ని ప్రజలు మర్చిపోయారని అనుకున్నామని, అయితే ప్రజల్లో ఇంకా టీడీపీపై కోపం ఉందన్నవిషయాన్ని అసెంబ్లీ ఫలితాలు వెల్లడించాయని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని, కనీసం మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేయకుండా ఫామ్హౌజ్లో యాగాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘ప్రజలు గెలిపించింది పాలించడానికా.. యాగాలు చేయడానికా?’అని ఆమె ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలు జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బీజేపీల మధ్య జరుగుతాయని, మోదీ, రాహుల్ల మధ్య జరిగే యుద్ధంలో న్యాయం గెలిచి.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ నెలలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించే అవకాశముందని విజయశాంతి వెల్లడించారు. కోచైర్మన్ డీకేఅరుణ మాట్లాడుతూ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అనుకున్నామని, అయితే, టీఆర్ఎస్ ధనబలంతో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో 16 లోక్సభ స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి మళ్లీ కాంగ్రెస్కు పట్టంగట్టాలని ఓటర్లకు అరుణ విజ్ఞప్తి చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలిచినా ఫలితం లేదని.. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనీ కేసీఆర్ సాధించలేదని ఆమె విమర్శించారు. ఫెడరల్ ఫ్రంట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. ఈవీఎంల వినియోగంపై అనుమానాలున్నప్పుడు.. బ్యాలెట్ వినియోగించడమే మేలని ఆమె అభిప్రాయపడ్డారు. లోక్సభకు తాను పోటీచేయాలా వద్దా అన్నది అధిష్టానం నిర్ణయమని అరుణ స్పష్టం చేశారు. -
‘పార్లమెంట్ ఎన్నికలకు కూడా అవే ఈవీఎంలు’
సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఎన్నికల ఏర్పాట్ల గురించి సమీక్ష నిర్వహించారు. శనివారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. రజత్ కుమార్ మాట్లాడుతూ.. ఎలక్టోరల్ రోల్ ఎలా ఉంది.. ఎప్పటి వరకూ పూర్తి అవుతుందనే అంశం గురించి అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈవీఎంలను పరిశీలించినట్లు.. వాటి వాడకం గురించి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ స్టేషన్లలో సౌకర్యాల గురించి అధికారులతో చర్చించానన్నారు. ఫిబ్రవరి 22 నాటికి తుది ఓటర్ లిస్ట్ను ప్రచురిస్తామని ప్రకటించారు. అసెంబ్లీకి వాడిన ఈవీఎంలనే పార్లమెంటు ఎన్నికలకు వాడతామన్నారు. -
హసీనా నాలుగోసారి
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ 11వ పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనా(71) నేతృత్వంలోని మహాకూటమి ఘనవిజయం సాధించింది. ఆదివారం ముగిసిన ఎన్నికల్లో మొత్తం 300 స్థానాలకు గానూ హసీనాకు చెందిన అవామీలీగ్, దాని మిత్రపక్షాలు 288 చోట్ల విజయదుందుభి మోగించాయి. తాజా ఫలితాల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా మూడోసారి, మొత్తంగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టేందుకు హసీనాకు మార్గం సుగమమైంది. కాగా, ఈ ఎన్నికల్లో విపక్ష కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్యూఎఫ్) కేవలం ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో అధికార కూటమి 82 శాతం దక్కించుకోగా, విపక్షాలకు 15 శాతం ఓట్లు లభించాయి. 2008లో జరిగిన ఎన్నికల్లో 263 సీట్లు సాధించి రికార్డు సృష్టించిన హసీనా ఈసారి ఏకంగా 288 స్థానాలు కొల్లగొట్టి ఆ రికార్డును తిరగరాశారు. ఫలితాలను అంగీకరించబోం: విపక్షాలు బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయని విపక్షాల కూటమి జాతీయ ఐక్య ఫ్రంట్(ఎన్యూఎఫ్) ఆరోపించింది. ఈ ఫలితాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఎన్నికలను రద్దుచేసి పారదర్శకంగా, తటస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని(ఈసీ) డిమాండ్ చేసింది. మళ్లీ ఎన్నికల ప్రసక్తే లేదు: ఈసీ బంగ్లాదేశ్లో పోలింగ్ సందర్భంగా భారీగా అవకతవకలు, రిగ్గింగ్ చోటుచేసుకున్నాయన్న విపక్షాల ఆరోపణలను ఎన్నికల సంఘం చీఫ్(సీఈసీ) కె.ఎం.నూరల్ హుడా ఖండించారు. పోలింగ్కు ముందురోజు రాత్రే చాలాచోట్ల బ్యాలెట్ బాక్సులు నిండిపోయాయన్న వాదనల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో నైరుతి గోపాల్గంజ్ నుంచి పోటీచేసిన ప్రధాని హసీనాకు 2,29,539 ఓట్లు రాగా, ఆమెపై పోటీచేసిన ఎన్యూఎఫ్ అభ్యర్థికి కేవలం 123 ఓట్లు వచ్చాయని తెలిపారు. హసీనాకు మోదీ ఫోన్.. బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన షేక్ హసీనాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. హసీనాకు సోమవారం ఫోన్చేసిన మోదీ.. బంగ్లాదేశ్ అభివృద్ధికి భారత్ మద్దతు కొనసాగుతుందని వెల్లడించారు. హసీనా నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ అభివృద్ధి విషయంలో భారత్ అండగా ఉంటుందని ప్రకటించారు. ఏక పార్టీ దిశగా అడుగులు సైనిక కుట్రలో చనిపోకముందు హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు ముజీబుర్ దేశంలో ప్రతిపక్షాలను దెబ్బతీసి ఏకపార్టీ వ్యవస్థను నెలకొల్పేందుకు యత్నించారని ఆరోపణలు ఉన్నాయి. ముజీబుర్ తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జియావుర్ రెహమాన్, ఎర్షాద్లు సైన్యానికి చెందిన వ్యక్తులు. వీరూ తమ హయాంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకోకుండా ప్రయత్నించారు. సైనిక పాలన ముగిశాక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బీఎన్పీ చీఫ్ ఖలీదా వైఖరీ ఇదే. మూడుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేసిన ఖలీదా ప్రతీసారి అవామీ లీగ్ను అణిచేందుకు యత్నించారు. హసీనా సైతం ప్రజాస్వామ్యం ఉనికిని చెరిపేసేలా వ్యవహరించడం గమనార్హం. ఖలీదాను అవినీతి ఆరోపణలపై జైలు శిక్షపడేలా హసీనా చేశారు. మొదటి నుంచి పెత్తందారీ ధోరణులే! 1996లో మొదటిసారి ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచీ ప్రతిపక్షాలను, పోటీదారులను హసీనా సహించిన దాఖలాలు లేవు. తన ప్రత్యర్థి ఖలీదా బాటలోనే పయనిస్తూ బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం కావడానికి ఆమె కారకులయ్యారు. బీఎన్పీ మిత్రపక్షమైన ముస్లిం ఛాందసవాద సంస్థ జమాతే ఇస్లామీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించారు. 1971 యుద్ధ నేరాలపై ఈ సంస్థ నేతలపై విచారణ జరిపించి శిక్షలు అమలు చేశారు. కొందరిని ఉరితీసి, మరి కొందరిని జైళ్లకు పంపారు. జమాతే సంస్థను ఖలీదా వాడుకున్నట్టే మరో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హిఫాజుతుల్ ఇస్లాంను హసీనా తనకు అనుగుణం గా వినియోగించుకుంటున్నారు. అవామీలీగ్కు ప్రతిపక్షమే లేకుండా చేయడమే లక్ష్యంగా ఆమె అధికారం ప్రయోగిస్తున్నారు. ఇంటర్నెట్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే రచయితలను చంపిన వారిని పట్టుకునే విషయంలో హసీనా ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అయితే నిరుపేద దేశంగా, బలహీన ఆర్థిక వ్యవస్థగా పేరొందిన బంగ్లాదేశ్ను అభివృద్ధిలో పరుగులు పెట్టించడం హసీనా విజయంగా చెప్పొచ్చు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, ఆతర్వాత రాజకీయా పరిస్థితుల నేపథ్యంలో హసీనా భారత్తో సుహృద్భావ సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. హసీనా చేపట్టిన అభివృద్ధి పనులకు బంగ్లా ప్రజలు పట్టం కట్టారని మోదీ ప్రశంసించారు. విద్యార్థి దశ నుంచే... బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రధాని హసీనా తీసుకున్న చర్యలే కారణమని ఆమె సన్నిహితులు చెబుతుంటే, ప్రతిపక్షాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తున్నారని వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. హసీనా.. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు ముజీబుర్ రెహమాన్ కుమార్తె. తూర్పుపాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాదేశ్)లోని తుంగిపరాలో 1947, సెప్టెంబర్ 28న జన్మించారు. ఢాకాలోని ఈడెన్ కాలేజీలో విద్యార్థి రాజకీయాల్లో హసీనా చురుగ్గా పాల్గొనేవారు. 1975, ఆగస్టు 15న ఆమె తండ్రి రెహమాన్, మిగిలిన కుటుంబ సభ్యులను ఆర్మీలోని ఓ వర్గం దాడిచేసి చంపేసింది. విదేశాల్లో ఉండటంతో హసీనా ప్రాణాలతో బతికిపోయారు. తర్వాత ఐదేళ్ల పాటు భారత్లోనే ప్రవాస జీవితం గడిపారు. 1981లో ఆమె అవామీలీగ్ పార్టీ అధ్యక్షురాలయ్యారు. బంగ్లాదేశ్లో సైనిక పాలనను పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించడంతో హసీనాకు మద్దతుదారులు క్రమంగా పెరిగారు. ఇదే సమయంలో ఆమెను సైన్యం గృహనిర్బంధంలో ఉంచింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) చీఫ్ జియా ఖలీదాతో కలిసి హసీనా ప్రజాస్వామ్య పోరాటాన్ని తీవ్రతరం చేయడంతో చివరికి 1990, డిసెంబర్లో అధ్యక్షుడిగా లెఫ్టినెంట్ జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్ రాజీనామా చేశారు. దీంతో బంగ్లాదేశ్లో సైనిక పాలనకు తెరపడింది. అయితే కాలక్రమంలో హసీనా, ఖలీదా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అణు శాస్త్రవేత్త అయిన ఎం.ఎ.వాజెద్ను హసీనా 1968లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమారుడు జోయ్, కుమార్తె సైమా ఉన్నారు. 2009లో హసీనా భర్త కన్నుమూశారు. హసీనా హయాంలోనే బంగ్లాదేశ్ పౌరుల తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 2017లో దేశ జీడీపీ 250 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
అవామీలీగ్ అఖండ విజయం
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టారు. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ సాధించింది. 299 స్థానాలకు పోలింగ్ జరగగా అధికార అవామీలీగ్ 288 స్థానాల్లో విజయఢంఖా మోగించింది. ఈ మేరకు బంగ్లా ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ ఉద్దీన్ ఆహ్మద్ ప్రకటించారు. ప్రతిపక్ష బంగ్లాదేశ్ నెషనలిస్ట్ పార్టీ ఘోరపరాజయం పాలైంది. గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి. బంగ్లా ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. బంగ్లాదేశ్ ఎన్నికల్లో తిరుగులేని విజయంసాధించిన హసీనాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆమెకు పలుదేశాల అధినేతలు అభినందనలు తెలుపుతున్నారు. Spoke to Sheikh Hasina Ji and congratulated her on the resounding victory in the Bangladesh elections. Wished her the very best for the tenure ahead. — Narendra Modi (@narendramodi) December 31, 2018 -
బంగ్లా: భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తున్న అధికార పార్టీ
ఢాకా: బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా నాలుగోసారి పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ భారీ మెజారిటీ దిశగా సాగుతున్నట్లు తెలిసింది. 299 స్థానాలకు పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కడపటి వార్తలందే సరికి అవామీ లీగ్ అభ్యర్థులు 90 చోట్ల, ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) అభ్యర్థులు మూడు చోట్ల గెలుపొందారు. మరోవైపు, ఫలితాల సరళిని బీఎన్పీ నాయకత్వంలోని విపక్ష కూటమి తోసిపుచ్చింది. అధికార పార్టీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిందని, తాత్కాలిక తటస్థ ప్రభుత్వం నేతృత్వంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. అంతకుముందు, పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసలో 17 మంది చనిపోయారు. ముఖ్యంగా అవామీ లీగ్, బీఎన్పీ కార్యకర్తల మధ్య పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. హసీనా రికార్డు విజయం.. అవామీ లీగ్ విజయం దాదాపు ఖాయమైనట్లేనని స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. అవామీ లీగ్ మరో 62 చోట్ల, బీఎన్పీ రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. గోపాల్ గంజ్ నియోజకవర్గంలో ప్రధాని హసీనా..బీఎన్పీ అభ్యర్థి పై రికార్డు మెజారిటీతో గెలుపొందారు. హసీనాకు 2 లక్షల పైచిలుకు ఓట్లు రాగా, ఆమె సమీప ప్రత్యర్థికి కేవలం 123 ఓట్లే దక్కాయి. ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్న తరువాత హసీనా మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మంచి జీవితం బంగ్లాదేశ్ ప్రజలు మళ్లీ తమకు పట్టం గడతారని చెప్పారు. బీఎన్పీ అధినేత్రి ఖలేదా జియా జైలుకు వెళ్లడంతో పార్టీని ముందుండి నడిపించిన ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రూల్ ఇస్లాం థాకూర్గావ్ నియోజక వర్గం నుంచి గెలుపొందారు. మొత్తం 299 స్థానాల్లో 1,848 మంది పోటీచేశారు. అభ్యర్థి మరణించడంతో ఒక స్థానంలో ఎన్నిక వాయిదాపడింది. సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. అవామీ లీగ్ గెలిస్తే షేక్ హసీనా రికార్డు స్థాయిలో నాలుగోసారి ప్రధాని అవుతారు. మరోవైపు, అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలేదా జియా పాక్షిక పక్షవాతానికి లోనైన సంగతి తెలిసిందే. దీంతో తాజా ఫలితాలతో ఆమె క్రియాశీల రాజకీయ జీవితంపై సందిగ్ధం ఏర్పడింది. పెచ్చరిల్లిన హింస.. పోలింగ్ రోజున దేశవ్యాప్తంగా 8 జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పోలీసు సహా 17 మంది మరణించారు. అధికార, ప్రతిపక్ష కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో 13 మంది మృతిచెందగా, ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ముగ్గురు చనిపోయారు. విపక్ష కార్యకర్తల దాడిలో ఓ పోలీసు మృతిచెందాడు. మృతుల్లో ఎక్కువ మంది అవామీ లీగ్ కార్యకర్తలే ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. -
మార్చినాటికి 'డబుల్'
సాక్షి, హైదరాబాద్: సంక్షేమం, అభివృద్ధి పథకాలతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఇపుడు వాటి అమలును వేగిరపరచాలని పట్టుదలగా ఉంది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాల్లో విజయావకాశాలు మెరుగవ్వాలంటే సంక్షేమ పథకాల అమలు మరింత పకడ్బందీగా జరపాలన్న దిశగా అడుగులు వేస్తోంది. 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కీలక హామీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లపై సీఎం దృష్టి సారించినట్లు సమాచారం. మార్చినాటికి వీలైనన్ని పంపిణీ.. మార్చిలోగా వీలైనన్ని ఇళ్లు పూర్తి చేసి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవ్వాలని అధికారపార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలను ప్రజలకు చేరువ చేసిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ల విషయంలో మాత్రం వెనకబడిందనే చెప్పాలి. వాస్తవానికి 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇది ప్రధాన హామీ. ఇపుడు కూడా దీనికి అంతే ప్రాధాన్యం ఉంది. దీనికితోడు ఇటీవల ఎన్నికల్లో సొంత ఇంటి స్థలం ఉన్నవారికి రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఆగస్టు 31నాటికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యా యి. ఈ నేపథ్యంలో మార్చినాటికి వీలైనన్ని ఎక్కు వ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని యోచిస్తోంది ప్రభుత్వం. తద్వారా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ సత్తా చాటాలన్న ప్రణాళికతో ముందుకువెళ్తోంది. ప్రభుత్వ రద్దుతో మందగించిన వేగం వాస్తవానికి ఈ పథకం ప్రారంభమే ఆలస్యమైంది. 2014లో ప్రభుత్వం కొలువుదీరినా.. 2016 మొద ట్లో ఈ ఇళ్ల నిర్మాణాన్ని పట్టాలెక్కించింది.ఆ ఏడాది కేవలం 864 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగింది. దీంతో ప్రజలు, ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఎన్నికలకు ఇంకా సమయముందని ఈ విషయంలో ప్రభుత్వం ఇళ్ల వేగంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. సెప్టెంబర్ 6న ప్రభుత్వం రద్దు కావడంతో వీటి నిర్మాణ వేగం మందగించింది. దసరాకు వీలైనన్ని ఇళ్లను నిర్మించి ఇవ్వాలని చూసినా.. సాధ్యం కాలేదు. 2018 ఆగస్టు 31 వరకు హౌసింగ్ శాఖ గణాంకాల ప్రకారం.. 13,927 ఇళ్లు పూర్తయ్యాయి. ఇందుకోసం రూ.2,461 కోట్లు వెచ్చించింది. మొత్తం 1.6 లక్షల ఇళ్లను 2018 మార్చినాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పోటెత్తుతున్న దరఖాస్తులు.. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. డబుల్ బెడ్రూమ్లకు దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తాకిడి అధికంగా ఉంది. ఇంటిజాగా ఉన్న వారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్న ప్రకటనతో రాజధాని హైదరాబాద్లో 3 లక్షలు, జిల్లాల్లో దాదాపు 4 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లుగా సమాచారం. ప్రతీసోమవారం జిల్లా కలెక్టరేట్లలో నిర్వహించే ప్రజావాణిలోనూ ఈ దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఈసేవా– మీసేవా కేంద్రాల ద్వారానూ దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. -
పార్లమెంటు ఎన్నికల్లో సెంటిమెంట్ ఉండదు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో సెంటిమెంటు పనిచేయదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలను ప్రజలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారని వివరించారు. శనివారం ముషీరాబాద్లోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తే టీఆర్ఎస్కు ఓటేసినట్లేనని ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పిందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అయిపోతున్నాయని, టీఆర్ఎస్ను ఎదుర్కొనే పార్టీ బీజేపీయేనని జోస్యం చెప్పారు. వచ్చేనెల 11న ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలపై జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. అమిత్షా అధ్యక్షతన జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాల అనంతరం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు. -
కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారీ వ్యత్యాసం ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర పరిస్థితిపైనే ఆధారపడి ఉంటాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాలతో ముడిపడి ఉంటాయని, కేంద్రంలో ప్రధాని మోదీకే భారతీయులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని, యువత, రైతులు బీజేపీకే మద్దతిస్తున్నారని వెల్లడించారు. దేశ సమగ్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో మోదీని మించిన నాయకుడు లేరని కొనియాడారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, భారీ మొత్తంలో ధాన్యం తడవడంతో వాటి కొనుగోలుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సీట్ల పంపకంపై అమిత్ షా, నితీశ్ భేటీ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సీట్ల పంపకం విషయంలో బీజేపీ చీఫ్ అమిత్ షా, జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నితీశ్ కుమార్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. గతవారం ఇరువురు నేతల మధ్య రెండు దఫాలుగా చర్చలు జరిగాయని.. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. విపక్షాలు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతుండగానే.. షా, నితీశ్లు సీట్ల సర్దుబాటు కోసం భేటీ అవడం చర్చనీయాంశమైంది. 40 ఎంపీ స్థానాలున్న బిహార్లో ఎట్టిపరిస్థితుల్లోనూ 15 సీట్లను వదులుకోకూడదని జేడీయూ పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే బిహార్లో ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటే.. జేడీయూకు 15 సీట్లు ఇవ్వడం కష్టమని బీజేపీ అంటోంది. -
చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు!
చైనా ప్రస్తుతం ఓ యువకుడి గురించి ఆందోళన చెందుతోంది. సరిహద్దు దేశాలతో వివాదాలు, దేశంలో ఎన్నో విషయాలపై నిషేధాలతో తరచూ వార్తల్లో ఉండే చైనా ప్రస్తుతం హాంకాంగ్ యువనేత కారణంగా వర్రీ అవుతోంది. ప్రభుత్వానికి గానీ, దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం జరిగినా ఉపేక్షించని చైనా ప్రభుత్వం హాంకాంగ్ యువనేత ఎడ్వర్డ్ లుంగ్ చేపట్టిన ప్రచారంతో కాస్త ఆలోచనలో పడింది. మెగా ఫోన్ చేతిలో పట్టుకుని నడివీధిలో నిల్చుని.. 'భవిష్యత్తు మన హాంకాంగ్ దే. మనం కచ్చితంగా గెలిచి తీరుతాం' అంటూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొంతెత్తారు. ఇతర పార్టీల నేతలు భారీ ఫ్లెక్సిలతో ప్రచారం చేస్తున్నా కేవలం ముగ్గురు వాలంటీర్లతో కలిసి ర్యాలీలో పాల్గొంటున్నారు. కొంతమంది ఎడ్వర్డ్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి, సెల్ఫీలు దిగుతుండటం బీజింగ్ అధికారులకు అంతగా రుచించడం లేదు. హాంకాంగ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ కౌన్సిళ్లకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో లుంగ్ పోటీ చేయడం లేదు. కారణం.. ఎన్నికల కమిషన్ అతడి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. లుంగ్ ను నిషేధించడం ప్రభుత్వానికి, బీజింగ్ పెద్దలకు నష్టాన్ని కలిగించే అంశమని చైనా యూనివర్సిటీ ప్రొఫెసర్ మా ఎన్గాక్ తెలిపారు. స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచిన వారికి మద్దతునిస్తూ లుంగ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. -
గురివింద సామెతలు చెప్పకండి
దిగ్విజయ్పై గుత్తా మండిపాటు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘నా జీవితంలో ఎప్పుడూ కాంట్రాక్టులు చేయలేదు. కాంట్రాక్టులు చేసే వారితో నాకు సంబంధాలు కూడా లేవు’ అని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను కాంట్రాక్టులు, డబ్బుల కోసమే పార్టీని వీడుతున్నాననడం కాంగ్రెస్ నేతలకు సంస్కారం కాదన్నారు. నల్లగొండలో గురువారం మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ గురివింద సామెతలు చెబుతున్నారన్నారు. ఇప్పుడు కాం గ్రెస్లో ఉన్న నేతలు ఎందుకు కాంట్రాక్టులు తీసుకుంటున్నారని గుత్తా ప్రశ్నించారు. కాం గ్రెస్లో అంతర్గత రాజకీయాలకు విసిగిపో యే తాను టీఆర్ఎస్కు అండగా ఉంటానని ప్రకటించానన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు రాజీనామా చేస్తానని, నల్లగొండ పార్లమెంటుకు ఉప ఎన్నికలు వస్తాయని, అందులో ఎలాంటి అనుమానం లేదని చెప్పారు. తన వియ్యంకుడు కాంట్రాక్టరే. ఆ కుటుంబంతో బంధుత్వం ఏర్పడి కొన్ని ఏళ్లే అయిందని గుత్తా తెలిపారు. కానీ వారి కంపెనీ కింద 60-70 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులు చేస్తున్నారని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ఎవరి దగ్గరా డబ్బులు తీసుకోలేదని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్రావు తెలిపారు. తన నిజాయితీ నిరూపించుకు నేందుకు అవసరమైతే వెంకటేశ్వరస్వామి గర్భగుడిలో ప్రమాణం చేస్తానన్నారు. -
తమిళనాడులో 42 మంది నేతలపై ఈసీ వేటు
ఖర్చులు సక్రమంగా చూపనందుకు ఎన్నికల్లో పోటీకి మూడేళ్ల నిషేధం సాక్షి, చెన్నై: తమిళనాడులోని వివిధ పార్టీలకు చెందిన 42 మంది రాజకీయ నాయకులపై ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) మూడేళ్ల నిషేధం విధించింది. ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చుల వివరాలు సక్రమంగా చూపని వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2011రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 10 మంది అభ్యర్థులు, 2014 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 32 మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు సక్రమంగా చూపలేదని పేర్కొంటూ మొత్తం 42 మందిపై నిషేధం విధించింది. ఈ 42 మంది మరో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ సోమవారం ప్రకటించారు. -
మయన్మార్లో ముగిసిన ఎన్నికలు
భారీగా పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం సూచీ పార్టీ గెలుస్తుందనే అంచనాలు యాంగాన్: దశాబ్దాలపాటు మిలిటరీపాలనలో మగ్గిన మయన్మార్లో ఆదివారం పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పోలింగ్ నమోదుకావడంతో ప్రజాస్వామ్య స్థాపన కోసం ఏళ్లతరబడి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఆంగ్సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ విజయబావుటా ఎగరేస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మిలిటరీ పాలనకు చరమగీతం పాడినట్లేనని అంటున్నారు. ఈ ఎన్నికల్లో 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో విపక్ష ఎన్ఎల్డీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. ఆదివారం యాంగాన్లో సూచీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియడంతో కౌంటింగ్ను ప్రారంభించారు. సోమవారం నుంచి దశల వారీగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాజధాని నేపిదాలో అధ్యక్షుడు, జుంటా జనరల్ థీన్ సేన్ (యూనియన్ సాలిడారిటీ, డెవలప్మెంట్ పార్టీ) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
లంక ప్రధానిగా మళ్లీ రణిల్!
-
లంక ప్రధానిగా మళ్లీ రణిల్!
పార్లమెంటు ఎన్నికల్లో యూఎన్పీ విజయం కొలంబో: శ్రీలంక ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే(66) మరోసారి ప్రధాని పీఠం అలంకరించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్పీ) సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 106 స్థానాలు గెలుచుకుంది. 225 స్థానాల పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాలు గెలుచుకోలేకపోయినప్పటికీ.. తమిళ పార్టీల మద్దతుతో విక్రమసింఘే మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే. మాజీ అధ్యక్షుడు, ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్న మహీంద రాజపక్స తుది ఫలితాలు వెలువడకముందే ఓటమి అంగీకరించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్(యూపీఎఫ్ఏ) 95 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. లంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళుల ప్రాబల్యమున్న మూడు జిల్లాలను తమిళ్ నేషనల్ అలయన్స్ క్లీన్స్వీప్ చేసింది. ఆ జిల్లాల్లోని 16 స్థానాలను గెల్చుకుంది. లంక పార్లమెంటులోని మొత్తం 225 స్థానాలకు గాను 196 సీట్లకు సోమవారం ఎన్నికలు జరిగాయి. మిగతా 29 స్థానాలను జాతీయ స్థాయిలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా ఆయా పార్టీలకు కేటాయిస్తారు. ఈ గెలుపు తన సుపరిపాలనకు మద్దతుగా ప్రజలిచ్చిన తీర్పని విక్రమసింఘే అన్నారు. మోదీ అభినందన.. మళ్లీ ప్రధాని కాబోతున్న విక్రమసింఘేను భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ట్వీట్ చేశారు. -
17 చోట్ల మొరాయించిన ఈవీఎంలు
గుమ్మిడిపూండి, న్యూస్లైన్: తిరువళ్లూరు పార్లమెంటు నియోజకవర్గంలోని గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పార్లమెంటు ఎన్నికలు గురువారం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయ్యాయి. గుమ్మిడిపూండి అసెంబ్లీ పరిధిలోని పూండి, పెరియపాలెం, గుమ్మిడిపూండిలో 17 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఉదయం 11.30 గంటలకు దాదాపు 4 గంటలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అలాగే పెరియపాలెంలోని నైవేలి గ్రామంలోని ఓ పోలింగ్ బూత్లో వేసిన ఓట్లన్నీ అధికార పార్టీకి పడుతుండడంతో ఓటర్లు ఫిర్యాదు చేయడంతో పోలింగ్ ఆపి మరో మిషన్తో పోలింగ్ నిర్వహించారు. నొచ్చికుప్పం, ఆరంబాక్కం, చిన్నంబేడు జాలర్లు తమపై జరిగిన దాడిలో అధికార పార్టీ నిర్లక్ష్యం చేసిందని, మూడు గ్రామాల జాలర్లు ఓటు వేసేందుకు రాలేదు. కనీసం ఏజెంట్లు సైతం పోలింగ్ బూత్కు రాలేదు. అధికారులు జిల్లా కలెక్టర్ వీరరాఘవరావుకు సమాచారం అందించడంతో ఆయన ఆదేశానుసారంగా గుమ్మిడిపూండి తహశీల్దారు శంకరి వచ్చి గ్రామస్తులతో చర్చించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో 16 మంది యువకులు మాత్రం వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గుమ్మిడిపూండి బజారు వీధిలోని ఏఎల్కే ప్రభుత్వ మహోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే సీహెచ్. శేఖర్, ఆయన సతీమణి మయూరి వచ్చి ఓటు వేశారు. మొత్తం మీద గుమ్మిడిపూండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. పోలీసులు ముందు జాగ్రత్తగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
కోలాహలంగా..
సాక్షి, కాకినాడ :వచ్చే నెల ఏడున జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ గత శనివారం జారీ కాగా, ఆ రోజు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. తిరిగి మంగళవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లావ్యాప్తంగా మూడు ఎంపీ స్థానాలకు నలుగురు, 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారీ ర్యాలీలు, పాదయాత్రలతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎటుచూసినా ఎన్నికల కోలాహలం కనిపించింది. హోరెత్తిన అమలాపురం అమలాపురం లోక్సభ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఉదయం 11.16 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ ఆర్.ముత్యాలరాజుకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి నివాసం నుంచి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి పాదయాత్రగా బయలుదేరిన విశ్వరూప్ సూర్యా నగర్లోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైస్కూల్ సెంటర్లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ నుంచి చిట్టబ్బాయి, పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, బొంతు రాజేశ్వరావు, గుత్తుల సాయి, చిర్ల జగ్గిరెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అల్లూరి కృష్ణంరాజు, వీవీఎస్ఎస్ చౌదరి, పార్టీ సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పికె రావు, ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు తదితరులతో కలిసి ఓపెన్టాప్ వ్యాన్లో ర్యాలీగా బయలుదేరారు. మోటార్ బైకులపై వందలాదిగా వచ్చిన యువకులతో పాటు వేలాదిగా పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. నల్లవంతెన నుంచి ఎర్రవంతెన వరకూ ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. విశ్వరూప్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని, జిల్లాలోని మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని చెప్పారు. పాదయాత్రగా బోస్ నామినేషన్ రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్చంద్రబోస్ ఉదయం 11.11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత రామచంద్రపురం గాంధీపేటలోని పార్టీ కార్యాలయం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్రగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి సుబ్బారావు వద్ద నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ మండపేట, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు గిరజాల వెంకట స్వామినాయుడు, గుత్తుల సాయితో పాటు అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కర్రి పాపారాయుడు, గుత్తుల వెంకట రమణ, పార్టీ నాయకులు మట్టా శైలజ, కొవ్వూరి త్రినాధరెడ్డి పాల్గొన్నారు. బోస్ మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్లు కుమ్మక్కు రాజకీయాలు చేశాయని, ఈసారి ఎవరెన్ని కుట్రలు.. కుతంత్రాలు పన్నినా ఫ్యాన్ గాలి ముందు నిలవలేవని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోసం రాష్ర్ట ప్రజలు ఎదురు చూస్తున్నారని, మే 7న ఫ్యాన్ గాలి సునామీగా మారుతుందని అన్నారు. భారీ ర్యాలీగా విజయలక్ష్మి నామినేషన్ వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు, వేలాదిగా కార్యకర్తలతో కలిసి దోసకాయలపల్లి, కందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ, రూరల్ పార్టీ అభ్యర్థులు బొమ్మన రాజ్కుమార్, ఆకుల వీర్రాజు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజానగరం తహశీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.45 గంటలకు రిటర్నింగ్ అధికారి మార్కండేయులు వద్ద విజయలక్ష్మి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తనయుడు జక్కంపూడి రాజా డమ్మీగా మరో సెట్ నామినేషన్ వేశారు. ఇంకా.. కాకినాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన భార్య వాణి డమ్మీగా నామినేషన్ వేశారు. రాజమండ్రి లోక్సభ స్థానానికి సింగిశెట్టి శ్రీనివాసరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), అమలాపురం అసెంబ్లీకి మాజీ ఐఆర్ఎస్ అధికారి పీఎస్ఆర్ మూర్తి (స్వతంత్ర), తుని నుంచి యనమల కృష్ణుడు(టీడీపీ), డమ్మీగా ఆయన కుమారుడు శివరామకృష్ణ; పెద్దాపురం నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నల్లజర్ల హారతి (స్వతంత్ర), కుంచె నాగలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా); మండపేట నుంచి కోనా సూర్యభాస్కరరావు (స్వతంత్ర) నామినేషన్లు వేశారు. ప్రత్తిపాడు నుంచి అత్యధికంగా నలుగురు నామినేషన్లు వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు(టీడీపీ), డమ్మీగా పర్వత గుర్రాజు, పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ (కాంగ్రెస్), రేచుపల్లి సింహాచలం (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్) నామినేషన్లు వేశారు. అనపర్తి నుంచి కత్తి వీరలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కొత్తపేట నుంచి దొడ్డిపట్ల శ్రీనివాస్ (స్వతంత్ర), కాకినాడ రూరల్ నుంచి రెడ్డి నారాయణస్వామి, కె.నూకరాజు నామినేషన్లు వేశారు. -
పోస్టల్ బ్యాలెట్ల సందడి
నేటితో దరఖాస్తుకు గడువు పూర్తి సత్తుపల్లి టౌన్ , న్యూస్లైన్: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్లతో పాటు ఉద్యోగుల ఓట్లు కూడా కీలకం. వందల సంఖ్యలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండడంతో రాజకీయ పార్టీల దృష్టి వీరిపై పడింది. అసెంబ్లీ, పార్లమెంట్కు జరిగే ఈ ఎన్నికల్లో ఈ ప్రాంత ఉద్యోగులు సుదూరప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులు.. ఇతర పార్లమెంట్ ప్రాంతానికి గానీ, సమీప జిల్లాల్లో గానీ పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు శిక్షణ కార్యక్రమంలోనే వారికి బ్యాలెట్ పత్రాల దరఖాస్తు చేసుకునేందుకు ఫాం-12, ఫాం-12ఏలను అందించారు. పోస్టల్ అడ్రస్, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలతో ఈ దరఖాస్తులు పూర్తి చేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈ నెల 15లోగా అందించాల్సి ఉంది. ఉద్యోగుల కోసం బ్యాలెట్ పత్రాలు.. సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలను వినియోగిస్తున్నప్పటికీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం బ్యాలెట్ పత్రాలు ముద్రించి వారి చిరునామాలకు పోస్టులో పంపిస్తారు. ఉద్యోగులు తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై పెన్నుతో టిక్ చేసిన తర్వాత బ్యాలెట్ పత్రాలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసే బ్యాలెట్ బాక్స్లో వేయాలి. ఈ నెల 30లోపే ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి. గడువు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఉద్యోగులతో సత్తుపల్లి రెవెన్యూ కార్యాలయం సందడిగా మారింది. పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పంపితే ఒత్తిడి తప్పదు.. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానంలో మార్పు చేసినట్లు సమచారం. రెవెన్యూ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. ఓటు వేసి వెంటనే అక్కడే ఉన్న బ్యాలెట్ బాక్స్లో వేయాలి. అయితే ఈ విధానం వల్ల ఉద్యోగులు స్వేచ్ఛగా, రహస్యంగా ఓటు వేసుకోవచ్చని భావిస్తున్నారు. కానీ బ్యాలెట్ పత్రాలు ఇంటికే పంపించినట్లయితే ఉద్యోగులకు రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి తప్పదని వాపోతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను సేకరించి అభ్యర్థుల నుంచి తగిన ఫలాన్ని పొందేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. -
ఇక సార్వత్రిక సమరం
పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ రాష్ర్ట విభజన అనంతరం తొలి పోరు రాష్ట్ర భవితవ్యాన్ని మార్చనున్న ఎన్నికలు నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ 19న ఆఖరు.. అయితే 5 రోజులే అవకాశం మండే ఎండలకు తోడు కానున్న రాజకీయ వేడి కర్నూలు(కలెక్టరేట్), న్యూస్లైన్ :కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు మార్చి 30న ముగిశాయి. రెండు విడతల జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారంతో పూర్తయ్యాయి. ఇక కీలకమైన సార్వత్రిక ఎన్నికల ఘట్టం శనివారం నుంచి మొదలవనుంది. రాజకీయ పార్టీల దశ దిశ మార్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ మార్చి 5న విడుదలైంది. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్రెడ్డి.. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.కన్నబాబు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇదే రోజు నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే వీలుంది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ చాంబర్, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి నంద్యాల ఆర్డీఓ చాంబర్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి గూడూరు, శ్రీశైలం నియోజకవర్గానికి సంబంధించి ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన ఆయా నియోజకవర్గ తహశీల్దార్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు ఈనెల 19 వరకు అవకాశం ఉన్నా 13, 14, 18వ తేదీలు సెలవులు కావడంతో నామినేషన్ల దాఖలుకు అవకాశం లేదు. 12, 15, 16, 17, 19 తేదీల్లో మాత్రమే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. 19వ తేదీ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్లకు గడువు పూర్తి కానుంది. 21న నామినేషన్లను పరిశీలన.. 23న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబర్లోకి పోటీ చేసే అభ్యర్థి సహా ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఆర్డీఓ కార్యాలయ ప్రధాన గేటుకు 100 మీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేయాల్సి ఉంది. నామినేషన్ సందర్భంగా ఊరేగింపులు నిర్వహించుకోవాలంటే పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే బాణసంచా పేల్చరాదనే నిబంధన విధించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎండలు మండిపోతుండగా.. నామినేషన్ల దాఖలుకు తెర లేవడంతో రాజకీయ వేడి మరింత ఉక్కిరిబిక్కిరి చేయనుంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక పరిస్థితుల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికలు విభజనకు కారణమైన పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. -
‘సార్వత్రిక’ నోటిఫికేషన్ రేపు
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్లైన్: లోక్సభ, శాసనసభల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 12న విడుదల చేస్తున్నట్టు కలెక్ట ర్ కాంతిలాల్ దండే తెలిపారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఐదు రోజులపాటు నామినేషన్ల్లు స్వీకరిస్తామన్నారు. నామినేషన్తో పాటు అఫిడవిట్ సమర్పించాలన్నారు. ఎంపీ అభ్యర్థి రూ.25 వేలు, ఎమ్మెల్యే అభ్యర్థి రూ.10 వేలు డిపాజిట్ చేయూల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో సగమే చెల్లించాలన్నారు. నామినేషన్కు ముందురోజు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించి ఎన్నికల వ్యయాన్ని ఆ ఖాతా ద్వారా ఖర్చు చేయాలన్నా రు. మే 5లోగా ప్రచారం పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకూ 49 రకాల కోడ్ ఉల్లంఘనలు జరిగాయన్నారు. ఎక్కడైనా కోడ్ ఉల్లంఘ న జరిగితే 1070 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి సమాచారమందించవచ్చని తెలిపారు. ర్యాలీలు, సమావేశాల కు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఈ నెల 24 నుంచి నెలాఖరు వరకూ ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామని పేర్కొన్నా రు. ఓటరు స్లిప్పుల పంపిణీపై అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటరు స్లిప్పు లు లేనంత మాత్రాన ఓటింగ్కు అనుమతించకూడదనే నిబంధన లేదన్నారు. ఎన్నికల సంఘం గుర్తించిన 21 గుర్తింపు కార్డులకు అదనంగా ఈ స్లిప్పులను ఎన్నికల సంఘం గుర్తించిందన్నారు. రాజకీయ నాయకులు కూడా ఓటరు స్లిప్పులు ఇవ్వవచ్చన్నారు. పార్టీ అభ్యర్థి, చిహ్నం, గుర్తులు, జెండాల వంటివి ముద్రించకూడదన్నారు. పోలింగ్ రోజున పార్టీ ల గుర్తులు, జెండాలు కనిపించకూడదని స్పష్టం చేశా రు. సమావేశంలో జేసీ రామారావు, ఏజేసీ నాగేశ్వరరా వు, డీఆర్వో హేమసుందర్, జెడ్పీ సీఈఓ మోహనరా వు, పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తుది ఓటర్ల జాబితా సిద్ధం
రాజంపేట, న్యూస్లైన్: ఎమ్మెల్యే, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితా సిద్ధంగా ఉన్నట్లు ఆర్డీఓ ఎం.విజయసునీత అన్నారు. సోమవారం తన చాంబర్లో నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ అందరి సహకారంతో ఓటర్ల తుది జాబితా పూర్తి చేశామన్నారు. పోలింగ్ రోజున ఏజెంట్గా నియమితులయ్యే వ్యక్తికి ఖచ్చితంగా ఎపిక్కార్డు ఉండాలన్నారు. ఆ గ్రామంలో ఓటరుగా ఉండాలన్నారు. అభ్యర్థులు ప్రచారం కోసం డీఎస్పీ అనుమతి కోరాలన్నారు. వాహనాలకు సంబంధించి ఆర్ఓ అనుమతి ఉండాలన్నారు. నిబంధనల మేరకే వాహనాలలో వెళ్లే వారి సంఖ్య ఉండాలన్నారు. నామినేషన్ వేసేటప్పుడు అభ్యర్థులు క్షుణ్ణంగా చదివి నెమ్మదిగా భర్తీ చేయాలన్నారు. మండల పరిధిలోని ఎంపీయూపీ స్కూల్ పేరును మండల ప్రజా పరిషత్ స్కూల్గా జాబితాలో సవరణ చేశామన్నారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు భాస్కర్రాజు, రమేష్రెడ్డి, గోపిరెడ్డి, దినేష్, నాగేశ్వరనాయుడు, బాలకృష్ణ, లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లునాయుడు, తహశీల్దార్ విష్ణువర్ధన్రెడ్డి, డీటీ సుబ్బన్న, ఎలక్షన్ డెస్క్ ప్రతినిధి శ్రీధర్ పాల్గొన్నారు. ఒంటిమిట్ట కోదండరాముని ఉత్సవాలపై 25న సమావేశం ఒంటిమిట్ట కోదండరామాలయం ఉత్సవాలపై ఈనెల 25వ తేదీన సమావేశం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ విజయసునీత తెలిపారు. వచ్చే నెల 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయన్నారు. -
కట్టల పాములోచ్
సాక్షి, నల్లగొండ,ఎన్నికల నేపథ్యంలో నోట్లు కట్టలు తెంచుకుంటున్నాయి. ఓటర్లకు ఆయా పార్టీల నాయకులు డబ్బులతో గాలం వేస్తున్నారు. ఇందుకోసం డబ్బులను ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు. లావాదేవీలకు సంబంధించి ఎటువంటి ఆధారాలూ వారి వద్ద లేకపోవడంతో పోలీసులు డబ్బులు సీజ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో నగదు తరలింపు జోరందుకుంది. కొన్నిచోట్ల పట్టుబడుతున్నా.. మరికొన్ని చోట్ల నిఘా కంట పడకుండా జారుకుంటున్నారు. వీటిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం మొదలు పెడితే నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఓటర్లను ప్రలోభాల నుంచి దూరం చేయవచ్చు. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు రూ.ఒక కోటి 16 లక్షల 50 వేలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్, జిల్లా, మండల పరిషత్లతోపాటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న ఉద్దేశంతో నాయకులు ఓటర్లకు నోట్లగాలం వేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు ఓటర్లకు పంచేందుకు సొమ్ము సిద్ధం చేసుకున్నారు. భాగాలుగా విభజించి పలువురి వద్ద ఉంచుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు తెప్పించుకోవడంలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని పలుచోట్లవరుసగా పట్టుబడుతున్న నోట్ల కట్టలే ఇందుకు నిద ర్శనం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది మొదలు డబ్బులు పట్టుబడుతూనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలతోపాటు, సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు చీరలు, వెండి వస్తువులు, ముక్కు పుడకలు వంటివి సమకూర్చుకోవడంలో నేతలు బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నిదారుల్లో నిఘా... జిల్లా పరిధిలోకి వచ్చే అన్నిదారుల్లో పోలీసులు చెక్పోస్టులు ఏర్పాటుచేశారు. అద్దంకి - నార్కట్పల్లి, నాగార్జునసాగర్- హైదరాబాద్, హైదరాబాద్ - విజయవాడ, వరంగల్ దారుల్లో, ఖమ్మం, మహబూబ్నగర్కు వెళ్లే దారుల్లో చెక్పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరంగా చేశారు. ఈ దారుల్లోనేగాక జిల్లాలోని ఇతర పట్టణాల్లో కలిపి మొత్తం 36 చెక్పోస్టుల వద్ద 24 గంటలపాటు వాహనాల సోదాలు చేపడుతున్నారు. ఒక్కో చెక్పోస్టు వద్ద ఎస్ఐతోపాటు దాదాపు 10మంది పోలీ సులు విధులు నిర్వహిస్తున్నారు. అంతేగాక ప్రతి నియోజకవర్గంలో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తిరుగుతున్నాయి. దీనికితోడు 36 స్టాటిస్టికల్ సర్విలెన్స్ బృందాలు జిల్లా యూనిట్గా ఎక్కడికక్కడ సోదాలు నిర్వహిస్తున్నాయి. తద్వారా ఏ క్షణాన ఎక్కడ తనిఖీలు చేస్తారన్నది ఎవ రికీ అంతుపట్టడం లేదు. దీంతో అక్రమంగా డబ్బు తరలిస్తున్నవారు పట్టుబడుతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా మద్యం అమ్మకాలు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికితోడు, రాష్ట్రపతి పాలన నేపథ్యంలో గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉండకూడదని కఠినంగా ఆదేశాలందాయి. అయినా అనేక గ్రామాల్లో అక్కడక్కడా గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్నారు. కొత్త వ్యక్తులు వెళితే మద్యం లేదని చెబుతున్నా... తెలిసిన వాళ్లు పోతే కాదు, లేదనకుండా అమ్ముతున్నారు. ఇలా వక్రమార్గంలో మద్యం విక్రయాలు యథావిధిగా సాగుతున్నాయి. అంతేగాక పగలంతా దుకాణాలకు తాళాలు వేసి.. రాత్రిపూట విక్రయిస్తున్న ఘటనలూ ఉన్నాయి. వీటిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కన్నేస్తే మద్యం వరదకు అడ్డుకట్ట పడవచ్చు. జిల్లాలో ఇప్పటివరకు 5,533లీటర్ల సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక 1789బీరు సీసాలు, 2311 మద్యం క్వార్టర్లు, 92 హాఫ్లు, 228 ఫుల్ బాటిళ్లు పట్టుకున్నారు. 49,810కిలోల బెల్లం, 945కిలోల పటిక స్వా దీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఎన్నికల్లో నాయకులు మద్యం వరద ఎలా పారించాలనుకున్నా రో ఊహించుకోవచ్చు. -
నేడు నగరవ్యాప్తంగా ఓటరు నమోదు
సాక్షి, ముంబై: పార్లమెంట్ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఆయా పార్టీలు నిమగ్నమయ్యాయి. వీరి భవితవ్యాన్ని నిర్ణయించే ఆయుధం ‘ఓటు’ను పాశుపతాస్త్రంగా మీరు మలుచుకోవాలనుకుంటున్నారా? ఇప్పటికీ మీకు ఓటు లేదా? అయితే 18 ఏళ్ల పైబడిన వారికి ఓటర్గా నమోదుచేసుకునేందుకు ఎన్నికల కమిషన్ మరో అవకాశాన్ని కల్పించింది. ఆదివారం ప్రత్యేక డ్రైవ్ను చేపట్టేందుకు ఈసీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నగరంలో 2,545, శివారు ప్రాంతాల్లో 957 కేంద్రాలను సంసిద్ధం చేసింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయనున్న ఈ కేంద్రాల్లో ఓటర్ కార్డు కోసం నమోదుచేసుకునేందుకు ప్రజలు పాస్పోర్ట్ పరిమాణంలో ఉన్న కలర్ ఫొటో, శాశ్వత చిరునామా, వయస్సుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త ఓటర్లు మొదట కేంద్రం వద్ద లభించే ‘ఫామ్ 6’ను భర్తీ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత ఎన్నికల గుర్తింపు కార్డు ఇంటికే వస్తుందని వివరించారు. కొన్ని కారణాల వల్ల ఆదివారం దరఖాస్తు ఫారం పూర్తి చేయనివారు ఈ నెల 25వ తేదీ వరకు ఈసీ అవకాశాన్ని కల్పించిందన్నారు. హెల్ప్లైన్ కేంద్రాలలో ఈ ఫారమ్ పూర్తి చేసి సమర్పించాలని తెలిపారు. కాగా, అప్డేట్ చేసిన ఓటర్ల వివరాలను మరోసారి పునఃపరిశీలించుకోవాలని జిలా ఎన్నికల ఉప ప్రధాన అధికారి తరుణ్ కుమార్ ఖత్రి పేర్కొన్నారు. ఓటర్లు తమ పేరు, చిరునామాను మరోసారి తనిఖీ చేసుకోవాలని కోరారు. అయితే అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోమన్నారు. బ్యాంక్, కిసాన్, పోస్టాఫీస్ ప్రస్తుత పాస్బుక్ల జిరాక్స్ ప్రతులను సమర్పించాలన్నారు. అవి లేకుంటే దరఖాస్తుదారుడి రేషన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లెసైన్స్, ఇన్కమ్ ట్యాక్స్ పత్రాలను ఆధారంగా తీసుకుంటామని వివరించారు. తాజా నీటి బిల్లు, టెలిఫోన్, విద్యుత్ బిల్లు, గ్యాస్ కనెక్షన్ బిల్లులను కూడా అడ్రస్ ప్రూఫ్గా తీసుకుంటామన్నారు. -
కోడ్ ఉల్లంఘిస్తే..కఠిన చర్యలు
విజయనగరం కలెక్టరేట్, న్యూస్లైన్: జిల్లాలో మున్సిపల్, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కాంతిలాల్ దండే స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తఫ్సీ ర్ ఇక్భాల్, జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేంద్ర ప్రసాద్లతో కలిసి ఆయన మాట్లాడారు. కోడ్ అమలుకు ప్రత్యేక బృందాలు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన జరగకుండా ఉండేందుకు రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. దీని కోసం జిల్లా, డివిజన్, మండల స్థాయిలతో పాటు గ్రామాల్లో కూడా కమిటీలు వేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, ఎక్సైజ్కు సంబంధించి డీసీ, ఏఎస్పీలు ఉంటారన్నారు. డివిజన్ స్థాయిలో సబ్ కలెక్టర్, ఆర్డీవో, డీఎస్పీలు, ఎక్సైజ్ అధికారులు పర్యవేక్షిస్తారని చెప్పారు. మండల స్థాయిలో మోడల్కోడ్ పర్యవేక్షణా అధికారులుగా ఎంపీడీవోలు ఉంటారని, వారితో పాటు వీడియోగ్రాఫర్, ఎస్సైలు పర్యవేక్షిస్తారన్నారు. అలాగే సాధారణ ఎన్నికల్లో నియోజకవర్గానికి 4 ప్రత్యేక బృందాలను ఫ్లయింగ్ స్క్వాడ్లుగా నియమిస్తామని చెప్పారు. చెక్పోస్టుల ఏర్పాటు జిల్లాకు ఇతర రాష్ట్రాల సరిహద్దులు ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి మద్యం, నాటుసారా సరఫరా కాకుండా ఉండేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. బొడ్డవర, మక్కువ, పాచిపెంట, చింతపల్లి, కూనేరు, పి.కోనవలసల్లో చెక్ పోస్టులు కొనసాగుతాయన్నారు. జిల్లాలో కోడ్ ఉల్లంఘనను పరిశీలించడానికి 1070 టోల్ ఫ్రీ నంబర్తో పాటు 08922 273255 నంబర్తో కంట్రోల్ రూమ్ కొనసాగుతుందన్నారు. విజయనగరం డివిజన్లో 08922 276888, సబ్ కలెక్టర్ ఆఫీస్లో 08963 221006 కంట్రోల్ రూమ్లు 24 గంటల పాటు పని చేస్తాయన్నారు. ఎక్కడకోడ్ ఉల్లంఘన జరిగినా ప్రజలు ఆ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందివ్వా లని కోరారు. పటిష్ట బందోబస్తు : జిల్లాలోని పోలింగ్ స్టేషన్లను పలు రకాలుగా వర్గీకరించినట్లు ఎస్పీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రం వద్ద ఐదుగురు, సమస్యా త్మ క పోలింగ్ కేంద్రం వద్ద నలుగురు, వివాదాలు ఉన్నచోట ముగ్గురు చొప్పున పోలీసులను నియమిస్తామని చెప్పారు. వీరితో పాటు ప్రత్యేక సిబ్బంది నిఘా కొనసాగు తుందన్నారు. బెల్ట్ దుకాణాలు మూసేయాలి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లాలో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సురేంద్రబాబు తెలిపారు. బయటకు మద్యం ఇవ్వకూడదని జిల్లాలో ఉన్న లెసైన్స్ షాపులు, బారుల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఇకవేళ ఆ నోటీసులను ఎవరైనా ఉపేక్షిస్తే లెసైన్స్షాపులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో నిరంతరం కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని చెప్పారు. ఇక్కడ టీవీ ఏర్పాటు చేశామని అందులో వార్తలను చూసి సంబంధిత ప్రదేశాల్లో దాడులు చేస్తామన్నారు. జిల్లాస్థాయిలో 08922 255890, ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో 08922 274865, పార్వతీపురంలో 08963 220781 నంబర్లతో ప్రత్యే కంట్రోల్ రూమ్లు కొనసాగుతాయని వివరించారు. సమావేశంలో ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్వో బి.హేమసుందర వెంకటరావు, ఆర్డీవో జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
కూత పెట్టేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా ప్రకటించే రైల్వే బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహానగరంలో కీలక భాగమైన జిల్లాకు ప్రత్యేక రైళ్లు వస్తాయనే ఆశలు జిల్లావాసుల్లో చిగురిస్తున్నాయి. అదేవిధంగా సర్వే పనులు పూర్తయిన వికారాబాద్- కృష్ణా(121.7 కిలోమీటర్లు) బ్రాడ్గేజి రైలుమార్గం పనులు, ఎంఎంటీఎస్ విస్తరణ పనులకు మోక్షం వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో పార్లమెంట్లో రైల్వేబడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఆ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. తాజా బడ్జెట్పై జిల్లా వాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పలు ప్రతిపాదనలు రైల్వే శాఖ వద్ద ఉండగా.. కొత్త డిమాండ్లు సైతం ప్రజాప్రతినిధులు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో ఏయే ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందో వేచిచూడాలి. ప్రతిపాదనలివే.. వికారాబాద్-కృష్ణా మధ్య కొత్తగా బ్రాడ్గేజ్ రైలుమార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలపై యంత్రాంగం సర్వే పూర్తిచేసింది. ఈ రైలు మార్గం నిర్మించాలంటే రూ.787.80 కోట్లు అవసరమని తేల్చిన రైల్వేశాఖ.. సరుకు రవాణాకు ఈ లైన్ అంతగా ఉపయోగపడదని స్పష్టం చేసింది. ప్రయాణికుల నిష్పత్తి కూడా అంతంతమాత్రంగా ఉంటుందనే అభిప్రాయానికి వచ్చింది. ప్రాజెక్టు వ్యయంలో సగం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు ముందుకొచ్చినప్పటికీ కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైలు మార్గాన్ని అనుసంధానం చేయాలని గతంలో నిర్ణయించినా.. ఇప్పటికీ మోక్షం లేదు. ఎయిర్కార్గో హబ్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఈ క్రమంలో సరుకు రవాణాకు అనువుగా రైల్వేలైన్లను విస్తరించాలని భావించినా.. రైల్వేశాఖ వద్ద ఫైళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఎయిర్పోర్టు నుంచి నేరుగా విజయవాడకు ప్రత్యేక రైల్వేలైన్ను నిర్మించాలని జీఎంఆర్ సంస్థ ప్రతిపాదించినా.. కేంద్రం నుంచి స్పందన లేదు. 2006లో ప్రతిపాదించిన మల్టీమోడల్ ట్రాన్సిట్సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండోదశ విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వీటికి ప్రత్యేక నిధులు కేటాయించాల్సి ఉంది. ఫల క్నుమా- ఉమ్దానగర్ వరకు ఉన్న రైలు మార్గాన్ని శంషాబాద్ వరకు విస్తరించాలని నిర్ణయించారు. ఫలక్నుమా- ఉమ్దానగర్ -శంషాబాద్ (20కి.మీ) వరకు కొత్త లైన్ వేయడమేగాకుండా, ప్రస్తుత మార్గాన్ని డబ్లింగ్, విద్యుద్ధీకరణ చేయాలని నిర్ణయించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. సికింద్రాబాద్- బొల్లారం -మేడ్చల్ (28కి.మీ), మౌలాలి -ఘట్కేసర్ (12.2 కి.మీ.)వరకు పొడగించాలని ప్రతిపాదించిన ఎంఎంటీఎస్కు ఇంకా ప్రతిబంధకాలు తొలగిపోలేదు. ఆదర్శ స్టేషన్ల నిర్మాణంలోనూ రైల్వేశాఖ అంతులేని జాప్యం చేస్తోంది. అరకొర నిధుల కేటాయింపులతో నిర్మాణ పనులను ఏళ్ల తరబడి సాగదీస్తోంది. 2011-12లో ప్రకటించిన పనులు కూడా ఇప్పటివరకు పూర్తికాలేదు. వికారాబాద్, శంకర్పల్లి, మల్కాజిగిరి, శేరిలింగంపల్లి ఆదర్శ స్టేషన్లు అధికారుల నిర్లక్ష్యానికి అద్దంలా నిలుస్తున్నాయి. కొన్నింటికి ఇప్పటివరకు పునాది రాయే పడలేదు. వికారాబాద్, తాండూరును కలుపుతూ పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు వేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. తాజా బడ్జెట్లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. -
ఎన్నికలకు సన్నద్ధం!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్లైన్: రానున్న ఆసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు- 2014కి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను పూర్తి స్థాయిలో ఉపయోగించనుంది. అయితే..నోటా వెర్షన్తో కూడిన మిషన్లు రానున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో జిల్లాలో వినియోగించిన ఈవీఎంలను..పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు తరలించారు. ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తమెషీన్లు రానున్నాయి. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి..5,200 ఓటింగ్ యంత్రాలు అవసరమని, అదనంగా రిజర్వ్లో 20 శాతం అనగా..మరో 1040 మెషీన్లు కావాలని అధికారులు ఎన్నికల కమిషన్కు వివరించారు. దీంతో ఈనెల పదో తేదీకల్లా జిల్లాకు మొత్తం 6,240 ఈవీఎంలు రానున్నాయని అధికార వర్గాల సమాచారం. సిబ్బందికి శిక్షణ ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఓటింగ్ విధానం, ఈవీఎం వినియోగించే పద్ధతిపై ఓటర్లకు కూడా శిక్షణ ఇస్తారు. ఈవీఎంలపై శిక్షణ ఇచ్చే..మాస్టర్ ట్రైనీలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు అధికారులు బి.మల్లేశ్వరరావు, సత్యనారాయణలు ఇప్పటికే..ఢిల్లీ వెళ్లి..శిక్షణ పొంది వచ్చారు. అలాగే..జిల్లా ఆడిట్ అధికారి, ప్రణాళికాధికారి హైదరాబాద్లో బుధవారం జరిగిన వర్క్షాపునకు హాజరయ్యారు. అనంతరం వీరు..జిల్లాలో వివిధ స్థాయిల అధికారులకు శిక్షణ ఇస్తారు. మండలాలవారీగా శిక్షణలు పూర్తియిన తరువాత, గ్రామాల్లో ప్రజలకు ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తారు. ఈవీఎంల పనితీరుతో పాటు.. ఎన్నికల ఖర్చులు, ఖర్చు రాసే విధానం, నోడల్ కోడ్ ఆప్ కాండాక్టుపై వివరిస్తారు. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ నాయకులు, స్థానిక కార్యకర్తలను శిక్షణలో భాగస్వాములను చేస్తారు. ఈ నెలాఖరు నాటికి శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. -
అన్నాడీఎంకే విజయాన్ని అడ్డుకోలేరు
గుమ్మిడిపూండి, న్యూస్లైన్: రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయాన్ని ఏ కూటమీ అడ్డుకోలేదని రాష్ట్ర మంత్రి వలర్మతి అన్నారు. గుమ్మిడిపూండి బజారువీధిలో అన్నాడీఎంకే యువజన శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ విజయాలను వివరించే బహిరంగసభ జరిగింది. ఈ సభకు యువజనశాఖ జిల్లా కార్యదర్శి ముల్లైవేందన్ నేతృత్వం వహించగా యూనియన్ కార్యదర్శి గోపాల్నాయుడు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రులు వలర్మతి, బీవీ రమణ పాల్గొన్నారు. మంత్రి వలర్మతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. అమ్మ పనితీరును జాతీయ పత్రికలు కొనియాడుతుంటే రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు ఇది మింగుడుపడడం లేదన్నారు. డీఎంకే అధినేత కరుణానిధి లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం పాకులాడుతున్నారని తెలిపారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదని పేర్కొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో 40 స్థానాల్లో అన్నాడీఎంకే గెలుపు కోసం కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషిచేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. ఎమ్మెల్యేలు పొన్రాజా, మణిమారన్, జిల్లా చైర్మన్ రవిచంద్రన్, జిల్లా కౌన్సిలర్లు నారాయణమూర్తి, ఎన్.శ్రీధర్, యూనియన్ చైర్మన్ గుణమ్మ, వైస్ చైర్మన్ నాగలక్ష్మి పాల్గొన్నారు. -
దూతలపై ధూంధాం !
సాక్షి ప్రతినిధి, గుంటూరు :రానున్న ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గాల అభ్యర్థుల గురించి కాంగ్రెస్ పార్టీ జరుపుతున్న అభిప్రాయ సేకరణపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏఐసీసీ పరిశీలకుల పర్యటన గోప్యంగా ఉంచడం, ఒక వర్గానికే ఆహ్వానాలు పంపడం, అభిప్రాయ సేకరణ హడావుడిగా ముగించ డం వంటి సంఘటనలపై క్షేత్రస్థాయిలో కొందరు కార్యకర్తలు,నాయకులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మూడు లోక్సభ స్థానాల్లో మొదట నరసరావుపేటపై పరిశీలకులు ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో అభిప్రాయ సేకరణ చేశారు. వారి వైఖరిని కాంగ్రెస్ లోని ఒక వర్గం తప్పుపడుతోంది. అభిప్రాయ సేకరణ ఇలానే జరిగితే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక కాంగ్రెస్ మనుగడ కష్టమని భావించిన కొందరు సీనియర్ నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీ, టీడీపీల్లో చేరిపోయారు. అరకొరగా మిగిలిన నేతల్లో దీటైన అభ్యర్థులను ఎంపిక చేయాలని ఆ పార్టీ పరిశీలకులను పంపితే దానికి భిన్నంగా, కాంగ్రెస్ మార్కు తరహాలోనే అభిప్రాయ సేకరణ జరుగుతుందని కార్యకర్తలు, కొందరు ఆశావహులు ప్రైవేట్ సంభాషణల్లో మండిపడుతున్నారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో సోమ,మంగళవారాల్లో ఏఐసీసీ పరిశీల కులు, కర్ణాటక మాజీ మంత్రి శివమూర్తి, డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు, ఠమొదటిపేజీ తరువాయి పీసీసీ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావులు పర్యటించి ఎంపి అభ్యర్థి ఎంపికపై కార్యకర్తల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. అయితే ఇది సక్రమంగా జరగలేదని ఓ సామాజిక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిపై అభిప్రాయ సేకరణ చేయాలంటే తొలుత పార్టీ జిల్లా అధ్యక్షుడు పరిశీలకుల పర్యటన వివరాలను పార్టీనేతలు, కార్యకర్తలకు ఒకటి రెండు రోజులు ముందుగా తెలియచేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఓ సమావేశాన్ని పార్టీ కార్యాలయంలో గానీ, ప్రైవేట్ భవనంలోగానీ ఏర్పాటు చేయాలి. ఈ రెండింటిలో జిల్లా అధ్యక్షుడు ఏదీ పాటించలేదు. ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారో ఆ నాయకుని ఇంట్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలను ముందుగా వెల్లడించనూలేదని కార్యకర్తలు మండిపడుతున్నారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి రానున్న ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ సీటు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి మంత్రి కాసు ఇంట్లోనే పరిశీలకుల సమక్షంలో కార్యకర్తల సమావేశం జరిగింది. మంత్రి ఇంట్లో ఉండగానే కొందరు కార్యకర్తలను మాత్రమే పిలిచి నరసరావుపేట ఎంపీగా కాసు వెంకట కృష్ణారెడ్డికి సీటు కేటాయించాలని వారితో చెప్పించారు. అదే విధంగా కాసుకు అత్యంత సన్నిహితునిగా మెలుగుతున్న డీసీసీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు సొంత నియోజకవర్గం విను కొండలో సైతం మక్కెనకు సంబంధించిన రాజీవ్ ఫౌండేషన్లో అభిప్రాయసేకరణ జరిపారు. రాత్రి 8 గంటల సమయంలో హడావుడిగా ఈ అభిప్రాయసేకరణ జరిపి మంత్రి కాసుకు ఎంపీ సీటు కేటాయించాలంటూ అధిక శాతం మందితో చెప్పించారు. మంగళ వారం మాచర్ల, గురజాల, పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట నియోజకవర్గాల్లో పర్యటించిన పరిశీలకులు శివమూర్తికి దాదాపు 80 శాతం మంది కాంగ్రెస్ నాయకులు మంత్రి కాసుకు ఎంపీ సీటు ఇవ్వాలంటూ చెప్పగా మరో 20 శాతం మంది మాత్రం నరసరావుపేట పార్లమెంటు పరిధిలో కమ్మ సామాజికవర్గం అధికంగా ఉందని, ఇక్కడ కేంద్రమంత్రి పురందేశ్వరికి ఎంపీ సీటు కేటాయించాలని కోరినట్లు తెలిసింది. అంతా గోప్యమే.... ఏఐసీసీ పరిశీలకుల పర్యటన వివరాలను తెలియచేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావును ‘న్యూస్లైన్’ ప్రతినిధి రెండు మూడుసార్లు ఫోన్లో సంప్రదిస్తే, జిల్లా పరిశీలకులుగా ఎవరిని నియమించిందీ తనకు తెలియదని చెప్పటం కొసమెరుపు.