జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఓ ఫంక్షన్కు ముదిగొండ వెళ్లి వస్తుండగా వారు వెళ్తున్న బైక్ను.. అర్ధరాత్రి సమయంలో నేలకొండపల్లి చెరువుకట్ట నక్కల తూము వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. నేలకొండపల్లి డబుల్ బెడ్రూమ్ కాలనీకి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు, అతని తల్లి పిచ్చమ్మ, అతని ఇద్దరి కుమారులు 8 ఏళ్ల కోదండరామ్, 6 ఏళ్ల ప్రణయ్ ఈ ఘటనలో మృతిచెందారు. జరిగిన ఘోరం తెలిసి కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
Published Wed, Feb 6 2019 8:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement