ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా నిప్పులు చెరిగారు. గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. బాబుకు చిన్నమెదడు చిట్లిపోయిందని, అందుకే అర్ధం పర్ధం లేని మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ తీసుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేశంలోనే ఎవరికీ ఇవ్వని ప్యాకేజీ ఏపీకి ఇచ్చారని అసెంబ్లీలో తీర్మానం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాటం, వైఎస్సార్సీపీ ఎంపీల రాజీనామా తర్వాత బాబు యూటర్న్ తీసుకోవడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అవినీతి గురించి బాబు మాట్లాడటం హాస్యాస్పదం
Published Thu, Aug 2 2018 12:39 PM | Last Updated on Wed, Mar 20 2024 3:21 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement