1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో ఢిల్లీ హైకోర్టు దోషిగా నిర్ధారించిన మరుసటి రోజు సజ్జన్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి మంగళవారం రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి రాసిన లేఖలో సజ్జన్ పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని రాహుల్కు రాసిన లేఖలో ఆయన వెల్లడించారు.