అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం | Supreme Court Rejects Review Petitions On Ayodhya Cese | Sakshi
Sakshi News home page

అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం

Published Thu, Dec 12 2019 4:41 PM | Last Updated on Wed, Mar 20 2024 5:39 PM

అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య కేసులో సుప్రీం తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన 18 రివ్యూ పిటషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. నవంబర్‌ 9న వెలువరించిన నిర్ణయమే తుది తీర్పని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును సవాల్‌ చేస్తూ ముస్లిం పర్సనల్‌ లా బోర్డు, నిర్మోహి అఖారా సైతం రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement