Rejected
-
ట్రంప్కు అరబ్ దేశాల షాక్..!
కైరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అరబ్ దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత తాజాగా ట్రంప్ చేసిన ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాలస్తీనాలోని గాజా పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ప్రజలు నివసించేందుకు అక్కడి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఈ నేపథ్యంలో అక్కడున్న పాలస్తీనీయులకు పొరుగునే ఉన్న ఈజిప్టు, జోర్డాన్లలో పునరావాసం కల్పించాలని ట్రంప్ ఇటీవల ప్రతిపాదించారు. అయితే ఈ ప్రతిపాదనను అరబ్ దేశాలు తిరస్కరించాయి. ఈమేరకు ఈజిప్టు, జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్లు సంయుక్తంగా ప్రకటన చేశాయి.కాగా, గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 45 వేలమందికిపైగా చనిపోయినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టంతో పాటు గాజాలో ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ప్రజల జీవనానికి కావల్సిన మౌలిక సదుపాయాలేవీ ఇప్పుడక్కడ లేవు. గాజా పునఃనిర్మాణానికి భారీగా నిధుల అవసరం ఉంది. తాజాగా ఇజ్రాయెల్,హమాస్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గాజా నుంచి చెల్లాచెదురైన అక్కడి వారు తిరిగి గాజాకు చేరుకుంటున్నారు. -
మోహన్బాబుకు దక్కని ఊరట
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్ట్పై దాడి కేసులో ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్బాబుకు హైకోర్టులో ఎలాంటి ఊరట దక్కలేదు. అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘మైక్తో దాడి చేసి గాయపరిచారన్నది ఆరోపణ. అనుమతి లేకుండా మోహన్బాబు ఇంట్లోకి వెళ్లిన కారణంగానే ఘటన జరిగింది. తొలుత బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద కేసు పెట్టిన పోలీసులు జర్నలిస్ట్ రంజిత్ వాంగ్మూలం తీసుకుని సెక్షన్ 109గా మార్చారు. మోహన్బాబు, రంజిత్ మధ్య ఎలాంటి వివాదం లేదు. హత్యకు ప్రయత్నించారనడానికి ఎలాంటి కారణాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పిటిషనర్ బెయిల్కు అర్హుడు’అని పేర్కొన్నారు. మనోజ్ జిమ్ ట్రైనర్తోపాటు మరొకరి స్టేట్మెంట్ రికార్డు చేశామని ఏపీపీ జితేందర్రావు చెప్పారు. కౌంటర్ కూడా దాఖలు చేశామన్నారు. మోహన్బాబు కావాలని చేయకున్నా.. తెలిసి దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.‘రంజిత్కు తగిలిన గాయంపై ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన నివేదిక ఆధారంగా సెక్షన్ను మార్చాల్సి వచ్చింది. వారంపాటు ఆస్పత్రిలోనే ఉన్నారు. 20 రోజుల వరకు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. పిటిషనర్ కుమారుడి ఆహ్వనం మేరకు మీడియా ప్రతినిధులు వెళ్లారు. మోహన్బాబు దుబాయ్ వెళ్లే అవకాశం ఉంది. ఆయనకు జీవితకాల శిక్ష పడే అవకాశం కూడా ఉంది’అని చెప్పారు. అయితే మోహన్బాబు దుబాయ్ వెళ్లడం లేదని రవిచందర్ పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఇరు పార్టీలను అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని రవిచందర్ కోరగా, నిరాకరించారు. -
ధన్ఖడ్పై అభిశంసన నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది. ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్ఖడ్పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి. ‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురు
ఢిల్లీ: లైంగిక దాడుల కేసుల్లో కర్ణాటక నేత, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు భంగపాటు ఎదురైంది. బెయిల్ విజ్ఞప్తిని సోమవారం సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఇంతకు ముందు.. కర్ణాటక హైకోర్టు కూడా ఆయన బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. -
అమెరికా మత స్వేచ్ఛ రిపోర్టు.. రిజెక్ట్ చేసిన భారత్
న్యూఢిల్లీ: అమెరికా అంతర్గత వ్యవహారాల శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ రిపోర్టు 2023 పూర్తిగా పక్షపాతవైఖరితో కూడినదని భారత్ విమర్శించింది. ఈ నివేదికను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ శుక్రవారం(జూన్28) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. భారత్లో సామాజిక కూర్పును అర్థం చేసుకోకుండా కేవలం ఓట్బ్యాంకు పాలిటిక్స్ ఆధారంగా తయారు చేసిన నివేదికలా అది కనిపిస్తోందన్నారు. ‘రిపోర్టులో చాలా పొరపాట్లున్నాయి. ఎంపిక చేసుకున్న అంశాలను వారికి కావల్సిన చోట కావల్సినట్లుగా అన్వయించుకున్నారు. పక్షపాత వైఖరితో తయారు చేశారు. రాజ్యాంగ నిబంధనలను చట్టాలకు కూడా తమకు కావల్సినట్లుగా భాష్యం చెప్పారు’అని జైస్వాల్ తెలిపారు. -
రిజర్వేషన్ల పెంపు.. బీహార్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
బీహార్లో రిజర్వేషన్ల పరిధిని మరింతగా పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది.విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఇతర వెనుకబడిన తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం 65 శాతం మేరకు పెంచిన రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై పట్నా హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా రిజర్వేషన్ల పెంపును రద్దు చేస్తూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ గౌరవ్ కుమార్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను పూర్తి చేశాక, మార్చి 11న నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. పట్నాహైకోర్టు ఈ రోజు(గురువారం) రిజర్వేషన్లపై తన తీర్పు వెలువరించింది. Patna High Court scraps 65% reservation for Backward Classes, EBCs, SCs & STs.The Court set aside the Bihar Reservation of Vacancies in Posts and Services (Amendment) Act, 2023 and The Bihar (In admission in Educational Institutions) Reservation (Amendment) Act, 2023 as ultra… pic.twitter.com/FTvY9CzvRn— ANI (@ANI) June 20, 2024 -
స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
న్యూఢిల్లీ:ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ఎంపీ స్వాతిమలివాల్పై దాడి చేసిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టు బెయిల్ నిరాకరించింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా బిభవ్కుమార్ న్యాయవాది వాదనలు వినిపించారు. బిభవ్కుమార్పై మలివాల్ చేసినవన్నీ తప్పుడు ఆరోపణలన్నారు. మలివాల్ కావాలనే సీసీ కెమెరాలు లేని చోటే తనపై దాడి జరిగిందని కేసు పెట్టారన్నారు. అయితే బిభవ్కుమార్ దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని ప్రాసిక్యూషన్ వాదించింది. వాదనలు విన్న బిభవ్కుమార్ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. తీస్హజారీ కోర్టు తన బెయిల్కు నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పుపై బిభవ్కుమార్ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
అల్లు అర్జున్తో ఛాన్స్.. నో చెప్పిన తెలుగు హీరో ఎవరో తెలుసా? (ఫోటోలు)
-
నామినేషన్లలోనే సగం మంది అవుట్!
నోయిడా: లోక్సభ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఉత్తర ప్రదేశ్లోని రెండు స్థానాల్లో దాఖలైన నామినేషన్లలో సగానికి పైగా తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్లో 60 శాతం, గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా)లో దాదాపు 56 శాతం మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్లు స్థానిక ఎన్నికల అధికారులు తెలిపారు. ఘజియాబాద్లో 35 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 14 మంది అభ్యర్థుల దరఖాస్తులు ఆమోదించినట్లు జిల్లా ఎన్నికల కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పక్కనే ఉన్న గౌతంబుద్ధ్ నగర్లో 34 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు వచ్చాయని, వారిలో 15 మంది అభ్యర్థులు చెల్లుబాటయ్యారని పేర్కొంది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 69 నామినేషన్లు రాగా అందులో 40 తిరస్కరణకు గురయ్యాయి. ఘజియాబాద్లో నామినేషన్ల తిరస్కరణ 60 శాతం కాగా, గౌతమ్బుద్ధ్నగర్లో 55.89 శాతంగా నమోదైంది. అధికారిక జాబితా ప్రకారం.. ఘజియాబాద్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే గౌతమ్బుద్ధ్నగర్లో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు నలుగురు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ రెండు స్థానాల్లోనూ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 8 కాగా ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్నాయి. -
73 మంది అభ్యర్థులపై అనర్హత వేటు!
ఛత్తీస్గఢ్ రాజకీయాల్లో మరో సంచలనం నమోదయ్యింది. ఎన్నికల నిబంధనలను పట్టించుకోని 73 మంది అభ్యర్థులను భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్) అనర్హులుగా ప్రకటించింది. ఖర్చు వివరాలు తెలియజేయని లేదా ఇతర నిబంధనలను పాటించని ఈ అభ్యర్థులు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేదు. భారత ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఈ అభ్యర్థుల జాబితాను బహిరంగపరిచింది. అనర్హతకు గురయిన ఈ 73 మందిలో 65 మంది అభ్యర్థులు 2024 వరకు, ఎనిమిదిమంది అభ్యర్థులు 2025 వరకు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ఛత్తీస్గఢ్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ప్రారంభమయ్యింది. వీటిని పరిశీలించాక సంబంధిత అధికారులు అనర్హుల జాబితాను విడుదల చేశారు. రాయ్పూర్ జిల్లా నుండి గరిష్టంగా 17 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హుల జాబితాను భారత ఎన్నికల సంఘం వెబ్సైట్లో అప్లోడ్ చేసిందని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి యుఎస్ బాండే తెలిపారు. ఛత్తీస్గఢ్లోని 11 స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న రాష్ట్రంలో తొలి దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఛత్తీస్గఢ్లో ఏప్రిల్ 19న ఒక స్థానానికి, ఏప్రిల్ 26న మూడు స్థానాలకు, మే 7న ఏడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
మేం వినబోం.. హైకోర్టుకు చెప్పుకోండి
న్యూఢిల్లీ: టీనేజీ అమ్మాయిలపై లైంగిక దాడులు, అత్యాచారం ఆరోపణల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద గురువు ఆశారాం బాపు తన శిక్షను రద్దుచేయాలంటూ పెట్టుకున్న పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయంలో తామేమీ వినదల్చుకోలేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఏదైనా ఉపశమనం కావాలంటే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లండి’’ అని స్పష్టం చేసింది. అయితే ఈ మేరకు ఆశారం గతంలో పెట్టుకున్న పిటిషన్లను రాజస్థాన్ హైకోర్టు నాలుగుసార్లు కొట్టేసిందని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆశారాం శిక్ష రద్దుచేసి మహారాష్ట్ర ఆస్పత్రిలో వైద్యానికి అవకాశం ఇవ్వాలని కోరారు. తామేమీ చేయలేవని, మళ్లీ హైకోర్టుకే వెళ్లాలని ధర్మాసనం స్పష్టం చేసింది. 2013 ఏడాదిలో తన ఆశ్రమంలో టీనేజీ అమ్మాయిని రేప్ చేశాడనే కేసులో అదే ఏడాది అరెస్టయి 2018లో పోక్సో కోర్టు యావజ్జీవ శిక్ష విధించిన నాటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. -
చిరంజీవి ఇంటికి పిలిచి ఆఫరిస్తే రిజెక్ట్ చేశా..
-
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడాకులపై కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు ఆయన భార్య పాయల్ అబ్ధుల్లా నుంచి విడాకులు మంజూరు చేసేందుకు ఢిల్లీ హై కోర్టు నిరాకరించింది. ఒమర్ అబ్దుల్లా విడాకుల పిటిషన్ను కొట్టివేస్తూ ఫ్యామిలీ కోర్టు తీసుకున్న నిర్ణయం సరైనదేనని హై కోర్టు వ్యాఖ్యానించింది. ఒమర్ అబ్దుల్లాపై ఆయన భార్య చూపిన క్రూరత్వం ఏమీ లేదని అందుకే విడాకుల మంజూరు కుదరదని తేల్చి చెప్పింది. ‘ఒమర్ అబ్దుల్లా పిటిషన్లో క్రూరత్వానికి సంబంధించిన ఆరోపణలు స్పష్టంగా లేవు. వాటికి పెద్దగా ఆధారాలు లేవు. కింది కోర్టు తీర్పుపై వేసిన అప్పీల్ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ లేవు. అందుకే ఈ అప్పీల్ను డిస్మిస్ చేస్తున్నాం’అనిజస్టిస్ సంజీవ్ సచ్దేవ,జస్టిస్ వికాస్ మహాజన్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ ఇప్పటికే విడివిడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమర్ అబ్దుల్లా విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. పాయల్ రాజస్థాన్ కాంగ్రెస్ అగ్రనేత సచిన్ పైలట్ చెల్లెలు కావడం విశేషం. ఇదీచదవండి..నా పై దాడికి సీఎం కుట్ర: గవర్నర్ సంచలన ఆరోపణలు -
లిక్కర్ స్కాంలో ఆప్ నేత మనీష్ సిసోడియాకు దక్కని ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు నిరాశే ఎదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కేసు విచారణను 6-8 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ, ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హాజరయ్యారు. మనీష్ సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తమ వాదనలను వినిపించారు. రూ. 338 కోట్ల బదిలీకి సంబంధించి సందేహాస్పదమైన కొన్ని అంశాలున్నందవల్లే బెయిల్ను తిరస్కరించామని జస్టిస్ ఖన్నా అన్నారు. విచారణ నెమ్మదిగా సాగితే సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తాజా తీర్పుతో సిసోడియాకు మరో ఆరు నెలల పాటు జైలులోనే ఉండనున్నారు. అయితే, ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సిసోడియా బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో తన తీర్పును రిజర్వ్ చేసింది. సీబీఐ, ఈడీ దాఖలు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. సిసోడియాను నిరవధికంగా జైల్లో ఉంచడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు.. అదే సమయంలో విచారణకు ఎంత సమయం పడుతుందని దర్యాప్తు సంస్థలను ప్రశ్నించింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్యం కుంభకోణంలో అరెస్టయిన సిసోడియా అప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. అరెస్టయిన సమయంలో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఫిబ్రవరి 28న క్యాబినెట్కు రాజీనామా చేశారు. లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా ♦ ఈ కుంభకోణంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారులుబదులుగా కొంతమంది వ్యాపారులకు మద్యం లైసెన్స్లు మంజూరు చేసేందుకు సహకరించారనే ఆరోపణలు ♦ కొందరు మద్యం విక్రయదారులకు లబ్ధి చేకూర్చేందుకు అధికారులు ఎక్సైజ్ పాలసీని మార్చారని అభియోగాలు ♦ ఫిబ్రవరి 26న సిసోడియాను అరెస్టు చేసిన సీబీఐ ♦ ఎక్సైజ్ శాఖతో సహా 18 పోర్ట్ఫోలియోలను నిర్వహిస్తున్న సిసోడియా ఫిబ్రవరి 28న క్యాబినెట్కు రాజీనామా ♦ మనీలాండరింగ్ కేసులో మార్చి 9న తీహార్ జైలులో విచారించిన తర్వాత ఈడీ అరెస్టు చేసింది. ♦ "హై ప్రొఫైల్" వ్యక్తి అంటూ మే 30న సీబీఐ కేసులోబెయిల్ నిరాకరించిన హైకోర్టు ♦ జూలై 3న మనీలాండరింగ్ కేసులో కూడా బెయిల్ను తిరస్కరణ ♦ సిసోడియాను సుదీర్ఘ కాలం కటకటాల వెనుక ఉంచలేరు, ఒక కేసులో చార్జిషీటు వేశాక ఆ వెంటనే వాదనలు మొదలవ్వాలి- సుప్రీం ♦ విశ్లేషణలో కొన్ని అనుమానాస్పద అంశాలు ఉన్న నేపథ్యంలో బెయిల్ తిరస్కరించినట్టు తాజాగాపేర్కొన్న సుప్రీంకోర్టు Supreme Court dismisses the bail plea of former Delhi Deputy CM Manish Sisodia in connection with cases related to alleged irregularities in the Delhi Excise Policy case. pic.twitter.com/3gAYUMGW9I— ANI (@ANI) October 30, 2023 -
టీడీపీ సోషల్ మీడియా అత్యుత్సాహం
సాక్షి, అమరావతి: విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు అరెస్ట్పై వాదోపవాదాలు నడుస్తున్న సమయంలో టీడీపీ సోషల్ మీడియా, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో చెలరేగిపోయింది. జడ్జి ఎటువంటి నిర్ణయం చెప్పకుండానే మధ్యాహ్నం 2 గంటల నుంచి చంద్రబాబు రిమాండ్ను తిరస్కరిస్తున్నట్టు తమకు సమాచారం ఉందని విపరీతంగా ప్రచారం చేశాయి. ఐటీడీపీకి చెందిన కార్యకర్తలు ట్విట్టర్, ఫేస్బుక్ ఇతర సోషల్ మీడియాల్లో రిమాండ్ను తిరస్కరించినట్టు పోస్టులు కూడా పెట్టి వైరల్ చేశారు. ఇంకా జడ్జి తీర్పు వెల్లడించలేదని తెలిసి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ఇష్టానుసారం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అంతటా గందరగోళం నెలకొంది. చంద్రబాబు ఇంటికి వెళ్లిపోతారని, కోర్టులో ఆయనకు అనుకూలంగా నిర్ణయం ఉందనే భావన వచ్చేలా చేశారు. కొన్నిచోట్ల అయితే టపాసులు కాల్చడం, స్వీట్లు పంచడం కూడా చేశారు. పలుచోట్ల సంబరాలకు నేతలు సిద్ధమయ్యారు. చంద్రబాబు తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించి బయటకు వచ్చి విక్టరీ గుర్తు చూపించడంతో దాన్ని వైరల్ చేస్తూ చంద్రబాబు ఇంటికి వెళ్లిపోతారనే ప్రచారం చేశారు. కోర్టు నుంచి చంద్రబాబు నేరుగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళతారని అక్కడ పార్టీ పొలిట్బ్యూరో సమావేశం నిర్వహిస్తారని, అనంతరం పవన్ కళ్యాణ్తో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేశాయి. చివరకు చంద్రబాబుకు జడ్జి రిమాండ్ విధించడంతో ఒక్కసారిగా ఎల్లో మీడియా, ఐటీడీపీ సైలెంట్ అయిపోయాయి. -
పవన్ ప్రత్యేక విమానానికి పోలీసుల అనుమతి నిరాకరణ
సాక్షి, విజయవాడ: విజయవాడలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. శాంతి భద్రతలు సమస్య రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి అనుమతిని పోలీసులు నిరాకరించారు. చంద్రబాబును కలిసేందుకు పవన్కు అనుమతి లేదని.. కుటుంబ సభ్యులకు తప్ప మరెవ్వరికీ పర్మిషన్ లేదని పోలీసులు స్పష్టం చేశారు. భువనేశ్వరి, లోకేశ్లకు అనుమతిస్తామని తెలిపారు. ఉద్రిక్తతలు కోసం పవన్ వస్తున్నారంటూ తమకు సమాచారం ఉందన్న పోలీసులు.. ఆ మేరకు పవన్ ప్రత్యేక విమానాన్ని అనుమతించవద్దని ఎయిర్పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం పంపించారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించడానికి టీడీపీ కుట్రకు తెరలేపింది. చంద్రబాబుని తీసుకొచ్చే మార్గంలో అల్లర్లకు పథక రచన చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. పలు చోట్ల పోలీసులపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారు. ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టి.. శాంతి భద్రతల సమస్య సృష్టించాలంటూ టీడీపీ నేతలకు కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులను రెచ్చగొట్టి తద్వారా మైలేజ్ పొందాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. చదవండి: CBN: కళ్లు మూసుకుని అవినీతిని ప్రోత్సహించి.. -
టిమ్ కుక్కి చేదు అనుభవం - క్రెడిట్ కార్డుకి అప్లై చేస్తే..
ఆధునిక కాలంలో క్రెడిట్ కార్డు వినియోగం ఎక్కువైంది.. సర్వ సాధారణమైపోయింది. నేడు చిన్న జాబ్ చేసే ఉద్యోగి నుంచి లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఉద్యోగుల వరకు క్రెడిట్ కార్డులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ప్రస్తుతం చాలా సంస్థలు సంపాదనను బేస్ చేసుకుని ఈ కార్డులను ప్రొవైడ్ చేస్తాయి. అయితే ప్రముఖ వ్యాపార వేత్తకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంక్ నిరాకరించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్ గోల్డ్మన్ సాచ్స్తో ఆపిల్ క్రెడిట్ కార్డు అందిస్తుంది. ఇలాంటి క్రెడిట్ కార్డు కోసం ఆపిల్ కంపెనీ సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) అప్లై చేసుకుంటే రిజెక్ట్ అయింది. ఆపిల్ అండ్ గోల్డ్మన్ సాచ్స్ కలిసి 'ఆపిల్ క్రెడిట్' ఒకే సమయంలో ప్రారంభించాయి. ఆ సమయంలో చాలామంది ప్రముఖులు కూడా దీని కోసం అప్లై చేసుకున్నారు. వారివి కూడా చాలా వరకు రిజెక్ట్ అయ్యాయి. ఇదీ చదవండి: కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా! టిమ్ కుక్ ధరఖాస్తుని తిరస్కరించడానికి ప్రధాన కారణం అయన పేరుని ఉపయోగించి ఎవరైనా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసి ఉండవచ్చనే అనుమానమే అని తెలుస్తోంది. ప్రస్తుతం కుక్ నికర సంపద విలువ 2 మిలియన్ డాలర్లని సమాచారం. -
ఇది విడ్డూరం కాదు.. అంతకు మించి.. తెల్లగా ఉందని జాబ్ ఇవ్వలేదు!
ఉద్యోగమంటే టాలెంట్ చూసి ఇవ్వడం ఆనవాయితీ, అయితే బెంగళూరులో ఒక యువతి తెల్లగా ఉందన్న కారణంతో జాబ్ ఇవ్వలేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, బెంగళూరులో ఒక సంస్థ ఉద్యోగ ప్రకటన చూసి 'ప్రతీక్ష జిక్కర్' అనే యువతి అప్లై చేసుకుంది. కంపెనీ నిర్వహించిన పరీక్షలో విజయం పొందింది, ఆ తరువాత జరిగిన మూడు రౌండ్లను కూడా ఆమె పూర్తి చేసింది. అయితే చివరికి కంపెనీ మాత్రం ఈమెను రిజెక్ట్ చేసింది. దీనికి ప్రధాన కారణం ఆమె తెల్లగా ఉండటమే అని సంస్థ తెలిపింది. కంపెనీ పంపిన మెయిల్లో 'మేము మీ ప్రొఫైల్ చూసాము, ఉద్యోగానికి కావాల్సిన అన్ని అర్హతలు మీకు ఉన్నాయి, కానీ మా మొత్తం టీమ్లోని ఇతర సభ్యులకంటే తెల్లగా ఉండటం వల్ల మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నామని' తెలిపింది. ఈ విషయాన్ని ప్రతీక్ష జిక్కర్ లింక్డ్ ఇన్లో పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి: ఫుడ్ సీక్రెట్ చెప్పిన సుధామూర్తి - విదేశాలకు వెళ్లినా..) నిజానికి కంపెనీ మెయిల్ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, మనిషి రంగును బట్టి కూడా ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని నేను ఊహించలేదు, మనిషి కలర్ కాకుండా ప్రతిభను బట్టి ఉద్యోగం ఇవ్వాలని కంపెనీని కోరుతూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ చూసిన చాలామంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. బహుశా ఇలాంటి సంఘటన బెంగళూరులో వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కావచ్చు. -
చైనా కంపెనీ విషయంలో భారత్ కీలక నిర్ణయం!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'బివైడీ' (బిల్డ్ యువర్ డ్రీమ్స్) హైదరాబాద్కి చెందిన మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) కంపెనీతో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే దీనికోసం కంపెనీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీ కోసం చైనా సంస్థ మన దేశంలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రతి పాదనను కేంద్రం నిరాకరించింది. భద్రత పరమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. (ఇదీ చదవండి: మొదటిసారి రోడ్డుపై కనిపించిన ప్రపంచములోనే ఖరీదైన కారు - చూస్తే హవాక్కావల్సిందే!) ఇప్పటికే బివైడీ కంపెనీ ఈ6, ఆటో వంటి కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కాగా త్వరలోనే మరో ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కాగా ఈ సమయంలో కేంద్రం ఒక్కసారిగా ఝలక్ ఇచ్చింది. సరిహద్దు దేశాలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి, కేంద్ర కూడా దీనికి అనుమతిస్తుంది. -
పురుషులకు జాతీయ కమిషన్.. పిల్ కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: పురుషుల హక్కుల పరిరక్షణకు ‘జాతీయ కమిషన్ ఫర్ మెన్’ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గృహ హింస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడే పురుషుల కేసులపై విచారణకు మార్గదర్శకాలను రూపొందించాలని పిటిషనర్ న్యాయవాది మహేశ్ కుమార్ తివారీ కోరారు. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2021లో 1,64,033 ఆత్మహత్యలు చేసుకోగా వారిలో 81,063 మంది వివాహితులైన పురుషులున్నారని, 28,680 మంది వివాహిత మహిళలని వివరించారు. వీరిలో కుటుంబ సమస్యలతో బలవన్మరణాలకు పాల్పడిన వారు 33.2% కాగా, వివాహ సంబంధిత సమస్యలతో 4.8% మంది తనువు చాలించినట్లు తెలిపారు. వివాహమైన పురుషుల ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు, గృహ హింసకు గురవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్చార్సీ)ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు. ఈ పిల్పై సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘మీరు నాణేనికి ఒక వైపునే చూపించాలనుకుంటున్నారు. పెళ్లవగానే చనిపోతున్న యువతుల డేటాను మీరివ్వగలరా? చనిపోవాలని ఎవరూ అనుకోరు. అది వ్యక్తిగతంగా వారు ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొంది. పిల్ ఉపసంహరించుకునేందుకు పిటిషనర్కు అవకాశం ఇచ్చింది. -
అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయింది. తెలుగులో కొంతకాలం స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియమణి పెళ్లి తర్వాత సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవల నాగచైతన్య 'కస్టడీ'లో సీఎంగా మెప్పించింది. త్వరలో షారుఖ్ 'జవాన్' చిత్రంతో రాబోతుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ప్రియమణి. కిస్ సీన్లకు బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటో తాజాగా వెల్లడించింది. (ఇదీ చదవండి: ఆమెతో సుధీర్ నిశ్చితార్ధం.. మరీ రష్మి పరిస్థితి ఏంటి అంటూ..) 'నేను స్క్రీన్పై ముద్దు సీన్లలో నటించకూడదని అనుకున్నాను. ఇప్పుడు నేను అలాంటి పాత్రలు చేయడం కరెక్ట్ కాదనిపించింది. సినిమాలో నాది ఒక పాత్ర అయినా వ్యక్తిగతంగా దాని వల్ల ఇబ్బంది పడతాను. అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా నేను తెరపై మరొక వ్యక్తిని ముద్దుపెట్టుకోవడం అంత సౌకర్యంగా కూడా అనిపించదు.' అని చెప్పింది. 2021లో ZEE5లో వచ్చిన 'హిస్ స్టోరీ' వెబ్ సీరిస్లో సత్యదీప్ మిశ్రాతో రొమాన్స్ సీన్తో పాటు ముద్దు పెట్టుకునే సన్నివేశాలు ఉన్నాయని మేకర్స్ చెప్పారు. కానీ వాటికి ఒప్పోకోలేదని ప్రియమణి గుర్తుచేసింది. అలాంటి సన్నివేశాలలో నటించమని భారీ ప్రాజెక్ట్లు వచ్చాయి. అంతే కాకుండా భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు. పెళ్లి తర్వాత అలాంటి వాటిలో నటించకూడదని కండీషన్స్ పెట్టుకున్నట్లు ప్రియమణి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) 2017లో తనకు వివాహమైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి బోల్డ్ సీన్స్లో నటించలేదు. సినిమాను అంగీకరించడానికి ముందే ఈ విషయం గురించి దర్శక-నిర్మాతలకు తెలియజేస్తానని చెప్పింది. ఏ సినిమాలో నటించినా దాన్ని తమ ఇరు కుటుంబాల వాళ్లు చూస్తారు. అలాంటి సన్నివేశాల వల్ల వాళ్లు ఇబ్బంది పడడం తనకు ఇష్టం ఉండదని పేర్కొంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రియమణి అని తెలిపింది. -
Adani Row: కేంద్రానికి సుప్రీం ఝలక్
సాక్షి, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. అదానీ స్టాక్ పతనం తర్వాత ఇన్వెస్టర్ల సంపదను సంరక్షించేందుకు పటిష్ట యంత్రాంగం అవసరమని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. కమిటీ ఏర్పాటుకు కేంద్రం ఓకే చెప్పింది. అయితే ప్యానెల్ వివరాలను కేంద్రం సీల్డ్ కవర్లో సమర్పించగా.. సుప్రీం దానిని తిరస్కరించింది. ‘నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి, పెట్టుబడిదారులను రక్షించడానికి’ ఏర్పాటు చేయబోయే ప్యానెల్ వివరాల ప్రతిపాదనలను ‘సీల్డ్’ కవర్లో ఇవ్వడం సరికాదు. మాకు సీల్డ్ కవర్ అక్కర్లేదు. మేము పూర్తి పారదర్శకతను కోరుకుంటున్నాము. మేము ఈ సూచనలను అంగీకరిస్తే.. అది మేం కోరుకోని, ప్రభుత్వం నియమించిన కమిటీగా కనిపిస్తుంది. ఆ నిర్ణయం మాకే వదిలివేయండి అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కమిటీపై తన ఉత్తర్వులను రిజర్వ్లో ఉంచింది. కోట్లాది ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టి, విపక్షాల నుంచి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలకు కారణమైంది అదానీ స్టాక్స్ పతన వ్యవహారం. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ఓ న్యాయమూర్తితో సహా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు గత వారం కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం రెడీ అయ్యింది. ఇక అదానీ వ్యవహారం కేసులో సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లు ఇలా ఉన్నాయి. అదానీ కంపెనీల అడిటింగ్ వివరాలతో పాటు బ్యాంక్ రుణాల ఇచ్చిన షేర్ల విలువ తెలియజేయాలని కోరారు. మరో పిటిషన్లో అడ్వొకేట్ ఎంఎల్ శర్మ.. హిండెన్బర్గ్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హిండెన్వర్గ్ నివేదికపై సుప్రీం కోర్టు ఆధారిత సిట్ను దర్యాప్తు కోసం ఏర్పాటు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక హిండెన్బర్గ్ నివేదికపై దర్యాప్తునకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని కేంద్రం ఇదివరకే సుప్రీంకు తెలిపింది కూడా. -
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి ఈడీ షాక్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. రోహిత్రెడ్డి అభ్యర్థనను ఈడీ అధికారులు తిరస్కరించారు. ఆయన లేఖను ఈడీ పరిగణనలోకి తీసుకోకపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రోహిత్రెడ్డి హాజరుకానున్నారు. కాగా, విచారణకు హాజరు కాలేనని లాయర్తో ఈడీకి రోహిత్రెడ్డి లేఖ పంపించారు. విచారణకు హాజరయ్యేందుకు చాలా తక్కువ సమయం ఇచ్చారని, వరుస సెలవులు కారణంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఇతర డాక్యుమెంట్లు తీసుకోలేకపోయానని రోహిత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. అయితే రోహిత్రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. కాగా, ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విచారణ నిమిత్తం తమ కార్యాలయానికి రావాలని స్పష్టం చేసింది. మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టంలోని (పీఎంఎల్ఏ) 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం పది అంశాలను పొందుపరిచింది. -
ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు కోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. జైన్తో పాటు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వైభవ్ జైన్, అంకుశ్ జైన్లకు కూడా బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మనీలాండరింగ్ కేసులో సత్యేంజర్ జైన్ను మే 30న అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఆయన జూన్లో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. నిరాశే ఎదురైంది. ఇప్పుడు రెండో సారి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ కేసులో విచారణకు జైన్ సహకరించడం లేదని, దర్యాప్తు ముందుకుసాగకుండా తమను తప్పదోవ పట్టిస్తున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో న్యాయస్థానం జైన్కు బెయిల్ ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేసింది. 2017 ఆగస్టు 24న నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా జైన్ను ఈడీ అదికారులు మే 30న అరెస్టు చేశారు. అప్పటినుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. తిహాడ్ జైల్లో జైన్కు వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నాడనే ఆరోపణలతో ఆ జైలు సూపరింటెండెంట్ను సస్పెండ్ చేశారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్ర ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ: 80 శాతంపైగా తిరస్కరణ?
సాక్షి, హైదరాబాద్: సర్కారు అక్రమిత నివాస స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తులో సుమారు 80 శాతం పైగా తిరస్కరణకు గురైనట్లు తెలుస్తోంది. మిగతా దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. గత మూడు నెలల క్రితమే జీవో 58 కింద దరఖాస్తులపై విచారణ పూర్తి కాగా, తాజాగా జీవో 59 కింద దరఖాస్తులపై క్షేత్ర స్థాయి విచారణ ప్రారంభమైంది. ప్రతి మండలానికీ ఒక జిల్లా స్థాయి అధికారిని కేటాయించడం ద్వారా క్రమబద్దీకరణ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియను వేగవంతంగా కొనసాగుతోంది.గతంలో పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను మరోసారి పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే క్రమబద్దీకరిస్తారు. చదవండి: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ మార్గాల్లో వెళ్లొద్దు ప్రభుత్వ విలువ ఆధారంగా.. 59 జీవో కింద అక్రమిత స్థలాలను ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువ ఆధారంగా క్రమబద్దీకరించనున్నారు. 126 నుంచి 250 గజాల వరకు ప్రభుత్వం నిర్ధారించిన భూమి విలువలో 25 శాతం.. 251 నుంచి 500 గజాల వరకు 50 శాతం.. 500 నుంచి 100 గజాల వరకు 75 శాతం.. 1000 గజాలపైన పూర్తి విలువను దరఖాస్తుదారులు చెల్లించాల్సి ఉంటుంది. రెండు నెలల క్రితమే.. జీవో 58 కింద ఉచిత క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులపై రెండు నెలల క్రితమే క్షేత్ర స్థాయి విచారణ పూర్తయింది. ప్రతి 250 దరఖాస్తులకు ఒక బృందం చొప్పున రంగంలో దిగి క్షేత్రస్థాయిలో వివరాలు, ఫొటోలు, తదితర ఆధారాలు ప్రత్యేక రూపొందించిన ‘జీవో 58 మొబైల్ యాప్’లో నమోదు చేశారు.అనంతరం సమగ్ర నివేదికను అధికార యంత్రాంగాలకు సిఫార్సు చేశారు. దరఖాస్తుల సంఖ్య 1.14 లక్షలపైనే ప్రభుత్వం అక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ పాత జీవో 58, 59లకు అనుబంధంగా కొత్త జీవోలను జారీ చేసంది. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 31 వరకు సుమారు 1.14 లక్షల పైన కుటుంబాలు ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 71,316, ఆతర్వాత రంగారెడ్డి జిల్లాలో 31,830, హైదరాబాద్ జిల్లా పరిధిలో 11,675 దరఖాస్తులు వచి్చనట్లు రెవెన్యూ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
కాంగ్రెస్ ఎన్నికలు: ఆయన నామినేషన్ తిరస్కరణ
ఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం పూర్తైంది. సెప్టెంబర్ 30తో నామినేషన్ల దాఖలు గడువు పూర్తికాగా, ఇవాళ పరిశీలన కూడా పూర్తైంది. అయితే అందులో నుంచి ఓ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేఎన్ త్రిపాఠి(45) నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్ మధుసుదన్ మిస్ట్రీ వెల్లడించారు. ఆయన సమర్పించిన నామినేషన్ పత్రాల సెట్ నిబంధనల ప్రకారం లేదని, సంతకాలకు సంబంధించిన సమస్య తలెత్తిందని తెలిపారు. మొత్తం 20 పత్రాలు వచ్చాయని, అందులో నాలుగు సంతకాల సంబంధిత కారణాలతో తిరస్కరణకు గురైనట్లు మధుసుదన్ వెల్లడించారు. దీంతో బరిలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, మరో ముఖ్య నేత శశిథరూర్లు నిలిచారు. కేఎన్ త్రిపాఠి.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే. జార్ఖండ్ మాజీ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(సొంత వర్గం)కు జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించాడు. అయితే.. ఆయన కాంగ్రెస్ అధ్యక్ష బరిలో దిగడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో అధికారిగా పని చేసిన త్రిపాఠి.. 2019 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వార్తల్లో ప్రముఖంగా నిలిచాడీయన. కోషియారా గ్రామంలో బీజేపీ అభ్యర్థి మద్దతుదారులు ఆయన్ని చుట్టుముట్టగా.. తుపాకీతో కాల్పులకు దిగాడు. అయితే ఆ పరిణామం ఆయనకేం సహకరించకపోగా.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. మావో ప్రభావిత పాలము జిల్లాకు చెందిన త్రిపాఠి.. లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్నారు. ప్రాణహని నేపథ్యంతో ఎన్నికల టైంలోనూ ఆయన ఆ తుపాకీని అప్పగించాల్సిన అవసరం కూడా లేదు. ఇదిలా ఉంటే.. 2009లో దాల్టోన్గంజ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు ఆయన. అదృష్టవశాత్తూ 2014లో త్రిపాఠికి మంత్రి బెర్త్ దక్కింది. దీంతో రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, లేబర్ మినిస్టర్గా పని చేశారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా త్రిపాఠి మాట్లాడుతూ.. తాను రైతు బిడ్డను మాత్రమే కానని, సోనియాకు కూడా కొడుకు లాంటి వాడినేనంటూ ఉపన్యాసం దంచాడు. అందుకే పార్టీ టాప్ పోస్ట్కు పోటీ చేస్తున్నట్లు తెలిపాడు. అంతేకాదు హైకమాండ్ ఏం చెబితే.. అది పాటిస్తానంటూ ప్రకటన ఇచ్చాడు. అయితే ఆయన నామినేషన్ వేసి వచ్చిన కాసేపటికే పార్టీలో చర్చ నడిచింది. త్రిపాఠి బరిలో నిలవాంటే.. నాలుగు రాష్ట్రాల నుంచి కనీసం పది మంది ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించాలి. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ చివరి వరకు ఉంటుందా? అని అంతా అనుకున్నారు. అనుకున్నట్లే.. ఆయన నామినేషన్ చివరకు తిరస్కరణకు గురైంది. ఇక కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందని, ఆ తేదీ నాటికి ఒక ఎన్నిక నిర్వహించాలా? వద్దా? అనే విషయంపై ఓ స్పష్టత వస్తుందని మధుసుదన్ మిస్ట్రీ తెలిపారు. అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తారు. 19వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. -
బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్ తీసుకున్నా:కంగనా
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాంట్రవర్సీ క్వీన్గా పేరు తెచ్చుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏ విషయమైన సూటిగా స్పష్టంగా చెప్పేసే ఆమె ప్రస్తుతం సక్సెస్ఫుల్ హోస్ట్గా కూడా రాణిస్తోంది. ఇకపోతే కంగనా లేటెస్ట్ మూవీ 'ధాకడ్' నుంచి ఇటీవల విడుదలైన టీజర్కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కంగనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పలు పెద్ద చిత్రాలను తిరస్కరించడం, అవార్డు ఫంక్షన్లకు దూరంగా ఉండటం వంటి పెద్ద రిస్క్ తీసుకోవడం వల్లే తను ఈ స్థాయికి ఎదిగినట్లు కంగనా తెలిపింది. 'నేను చాలా మేల్ సెంట్రిక్ చిత్రాలను తిరస్కరించినప్పుడు అందరూ నన్ను విమర్శించారు. ఖాన్, కుమార్ వంటి పెద్ద హీరోల సినిమాలు చేయనన్నందుకు 'ఎందుకు తన జీవితాన్ని వృథా చేసుకుంటుంది' అన్నట్లుగా నన్ను చూసేవారు. కానీ మీ భవిష్యత్తు పట్ల మీకు పూర్తి విజన్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. మీలో ఏదో సమస్య ఉందని మాత్రం అనుకుంటారు.' అని కంగనా పేర్కొంది. కాగా కంగనా నటించిన 'ధాకడ్' మూవీ మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్ షాకింగ్ రియాక్షన్ షారుఖ్, అక్షయ్, ప్రియాంక చోప్రా అంతా ఫెయిల్యూర్స్.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
వారు తిరస్కరించిన పాత్రలతోనే నా కెరీర్ రూపొందింది..
Swara Bhaskar Says Her Career Made Up Of Roles Rejected By Others: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రీల్ లైఫ్ పక్కన పెడితే.. వాస్తవ జీవితంలో మిగతా బాలీవుడ్ సెలబ్రిటీలకు భిన్నంగా ఉంటారామె. సమాజంలో చోటు చేసుకుంటున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో స్పందిస్తారు స్వరా భాస్కర్. అయితే ఆమె ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టి.. ఆపై ట్రోలింగ్కు గురవుతారు. అయితే తాజాగా తాను నటించిన పాత్రల గురించి పలు ఆసక్తిర విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన కెరీర్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలు ఇతరులు వద్దనుకోవడం వల్లే తనకు వచ్చాయని పేర్కొన్నారు. 'రాంజనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో వంటి చిత్రాలలో నాకు వచ్చిన పాత్రలను మొదటగా వేరే నటీమణులకు ఆఫర్ చేశారు. ప్రేమ్ రతన్ ధన్పాయో సినిమాలో సల్మాన్ ఖాన్కు చెల్లెలిగా చేయాలని ఎవరు కోరుకుంటారు. ఇలాంటి పాత్రలన్నీ ఆఖరి నిమిషంలో అకస్మాత్తుగా వదులుకునేసరికి చివరిగా నన్ను సంప్రదించేవారు. అయితే ఇదందా నన్ను పెద్దగా బాధించేది కాదు. ఒక పాత్రను ఒప్పుకునేప్పుడు నేను బాక్సాఫీస్ గురించి, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే విషయాలు పెద్దగా ఆలోచించను. ఇంకా వీరే ది వెడ్డింగ్ సినిమాలో ముందుగా నాకు బదులు రియా కపూర్ చేయాల్సింది. కానీ, ఆ పాత్రను నాకివ్వమని స్వయంగా రియా కపూర్ ఒప్పించింది.' అని పేర్కొంది స్వరా భాస్కర్. ఇలా ఇతరులు తిరస్కరించిన పాత్రలతో తన కెరీర్ రూపొందినట్లు, ఆ పాత్రలతోనే తనకు మంచి గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. -
ఎయిరిండియా సీఈవో పోస్టుకు ఇల్కర్ తిరస్కరణ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో, ఎండీగా చేరాలంటూ టాటా గ్రూప్ ఇచ్చిన ఆఫర్ను ఇల్కర్ అయిజు తిరస్కరించారు. భారత మీడియాలోని కొన్ని వర్గాలు .. అవాంఛనీయ కథనాలతో తన నియామకంపై సందేహాలు రేకెత్తించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘ఒక వ్యాపార నాయకుడిగా నేను ఎప్పుడూ ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇస్తాను. నా నియామకాన్ని ప్రకటించినప్పటి నుంచి దానికి అవాంఛనీయ రంగులు అద్దేలా భారత మీడియాలోని కొన్ని వర్గాలు అభ్యంతరకమైన కథనాలను ప్రచారం చేస్తుండటాన్ని పరిశీలించాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు చేపట్టడం సరికాదనే నిర్ణయానికి వచ్చాను‘ అని ఇల్కర్ తెలిపారు. ఎయిరిండియాకు సారథ్యం వహించే అవకాశాన్ని ఆఫర్ చేసినందుకు టాటా గ్రూప్, దాని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాను టాటా సన్స్ గతేడాది అక్టోబర్లో రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి సీఈవో, ఎండీగా టర్కిష్ ఎయిర్లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్ను నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించింది. -
పీపీఈ కిట్లో వచ్చినా ఫలితం దక్కలేదు
షాజహాన్పూర్: నగరానికి చెందిన వైద్యరాజ్ కిషన్ సంయుక్త వికాస్ పార్టీ తరఫున షాజహాన్పూర్ నియోజకవర్గానికి ఈనెల 25న నామినేషన్ వేశారు. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? కరోనా వ్యాప్తి నిరోధానికి వాడే పీపీఈ కిట్ తొడుక్కొని, శానిటైజర్ బాటిల్, థర్మల్స్కానర్తో వచ్చి ఆయన నామినేషన్ వేశారు. అయితే ఆయన నామినేషన్ను రిటర్నింగ్ అధికారి ఆదివారం తిరస్కరించారు. దీంతో కుప్పకూలిన వైద్యరాజ్ ఇది అధికారుల కుట్రని విమర్శించారు. మంత్రి సురేశ్ ఖన్నా సూచనల మేరకే అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని వాపోయారు. అయితే అసంపూర్ణ డాక్యుమెంట్లు సమర్పించినందునే ఆయన నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు వెల్లడించారు. నామినేషన్ రోజే అడిగిన పత్రాలు ఇస్తానన్నా అధికారులు వినిపించుకోలేదని, మరుసటి రోజు వారు కోరిన పేపర్లను సమర్పించానని వైద్యరాజ్ చెప్పారు. కానీ కావాల్సిన పేపర్లను సమర్పించాలని వైద్యరాజ్కు మూడు నోటీసులు ఇచ్చినా స్పందిచలేదని, అందుకే తిరస్కరించామని అధికారులు వివరించారు. ఇంతవరకు వైద్యరాజ్ 18 ఎన్నికల్లో పోటీచేసి దిగ్విజయంగా డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయారు. వైద్యరాజ్ ఎవరో తనకు తెలియదని, తానెవరి నామినేషన్ తిరస్కరించమని చెప్పలేదని మంత్రి సురేశ్ వివరణ ఇచ్చారు. యోగిపై పోటీకి కూడా నామినేషన్ వేస్తానని వైద్యరాజ్ గతంలో ప్రకటించారు. -
లోన్ ఇవ్వలేదని.. బ్యాంకునే తగలబెట్టాడు!
సాక్షి, బెంగళూరు: బ్యాంకుల్లో లోన్ లభించడం అంత సామన్యమైన విషయం కాదు! ఇల్లు, పొలానికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండాలి. కొన్నిసార్లు అన్ని డాక్యుమెంట్లు సరిగా ఉన్నా బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు తప్పవు. బ్యాంకు ఆఫిసర్లు పెట్టే కండిషన్లు సామాన్యులకు తీవ్రమైన అసహనానికి గురిచేస్తుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి తన లోన్ అప్లికేషన్ను తిరస్కరించిన బ్యాంక్ను పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిది. వివరాల్లోకి వెళితే.. వసీమ్ అనే వ్యక్తి బైక్ మీద హవేరి జిల్లా బైడగి తాలూకా సమీపంలోని హెడిగొండ గ్రామానికి వచ్చాడు. చదవండి: అశ్లీల వీడియోల పేరుతో బ్లాక్మెయిల్ కేసు: వెలుగులోకి కొత్తపేరు ఆ గ్రామంలో ఉన్న బ్యాంక్ కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. బ్యాంక్లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. అయితే ఈ ఘటనను గమనించిన గ్రామస్తులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసిన విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సదరు బ్యాంక్ వద్ద తాను లోక్ దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. అయితే తన లోన్ దరఖాస్తును బ్యాంక్ తిరస్కరించదని, ఆ కోపంతో బ్యాంక్ను పెట్రోల్తో తగలబెట్టానని పోలీసులకు తెలిపాడు. అయితే ఈ ఘటన వెనక బ్యాంక్ అంతర్గత సిబ్బంది ప్రమేయం ఉందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకులోని కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు ధ్వసం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
నిశ్చితార్థం బాగానే జరిగింది.. తీరా పెళ్లి పత్రికలు పంచుతుండగా..
సాక్షి,పెద్దకడబూరు( కర్నూలు): నిశ్చితార్థం అయ్యాక వరుడు పెళ్లి వద్దంటున్నాడని, తమకు న్యాయం చేయాలని వధువు బందువులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి డీఎస్పీ వినోద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొందు మడుగుల రమేష్ మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని ఇంద్ర నగర్కు చెందిన అంజలికి పెద్దకడబూరు మండల కేంద్రానికి చెందిన రవితో పెద్దల సమక్షంలో పెళ్లి నిశ్చయించారన్నారు. నిశ్చితార్థం కూడా పూర్తయి, పెళ్లి తేదీని నిర్ణయించి పత్రికలను బంధువులకు పంచినట్లు తెలిపారు. తీరా ఇప్పుడు పెళ్లికొడుకు తనకు పెళ్లి ఇష్టం లేదని దాటవేస్తున్నాడన్నారు. రవితో పెళ్లి జరిపించి బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. స్పందించిన డీఎస్పీ వరుడు కుటుంబ సభ్యులతో మాట్లాడి యువతికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. చదవండి: వివాహేతర సంబంధం.. భార్యను పలుమార్లు హెచ్చరించాడు.. చివరకు -
మెహబూబా తల్లికి పాస్పోర్ట్ నిరాకరణ
శ్రీనగర్: కేంద్ర మాజీ మంత్రి, కశ్మీర్ మాజీ సీఎం ముఫ్తి మొహమ్మద్ సయీద్ భార్య గుల్షన్ నజీర్ పాస్పోర్టు దరఖాస్తు తిరస్కరణకు గురైంది. పోలీస్ శాఖ ఇచ్చిన ప్రతికూల నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గుల్షన్ కూతురు, కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కూడా తన పాస్పోర్టు దరఖాస్తును అధికారులు తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించగా సోమవారం చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ తల్లి, కూతురు పవిత్ర మక్కా వెళ్లేందుకు పాస్పోర్ట్ కోసం గత ఏడాది డిసెంబర్లో దరఖాస్తు చేసుకున్నారు. పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) ప్రకారం జమ్మూకశ్మీర్ పోలీస్ సీఐడీ విభాగం పాస్పోర్ట్ దరఖాస్తును తిరస్కరించిందని ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి కార్యాలయం గుల్షన్కు లేఖ పంపింది. ఈ విషయాన్ని మెహబూబా ముఫ్తీ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించారు. ‘ఏడు పదుల వయస్సున్న నా తల్లితో దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి, ఆమెకు పాస్పోర్ట్ అవసరం లేదు. వారి మాట విన లేదని భారత ప్రభుత్వం మమ్మల్ని ఇలాంటి విధానాలతో వేధించేందుకు, శిక్షించేందుకు పూనుకుంది’అని విమర్శించారు. ఎవరైనా దరఖాస్తుదారు దేశం విడిచి వెళ్లడం ద్వారా దేశభద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని భావించినప్పుడు అధికారులు పాస్పోర్ట్ను నిరాకరించేందుకు పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 6(2)(సి) సెక్షన్ అధికారం కల్పించింది. దరఖాస్తుదారుకు పాస్పోర్ట్ మంజూరు ప్రజాసంక్షేమం కోసం కాదని కేంద్రం భావించిన సందర్భాల్లో కూడా అనుమతి నిరాకరించవచ్చు. చదవండి: మాస్క్ సరిగా ధరించకుంటే ఫైన్ -
ముఫ్తీకి మరో ఎదురుదెబ్బ
సాక్షి, కశ్మీర్ : పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి , జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీకి ఎదరు దెబ్బ తగిలింది. దేశ భద్రతకుముప్పు అంటూ ముప్తీ పాస్పోర్టును రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం ముఫ్తీ ట్విట్ చేశారు. 2019 ఆగస్టు (స్పెషల్ స్టేటస్ రద్దు)తరువాత రాష్ట్రంలో నెలకొన్న సాధారణ పరిస్థితికి ఇది నిదర్శనమంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పాస్పోర్ట్ ఇవ్వడం ఇంత పెద్ద దేశ సార్వభౌమత్వానికి ముప్పు ఎలా అవుతుందంటూ కేంద్రంపై ఆమె మండిపడ్డారు. (మెహబూబా ముఫ్తీకి సమన్లు జారీ చేసిన ఈడీ) క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్పోర్టు కార్యాలయం తనకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. కేంద్రం విధానాలనువ్యతిరేకిస్తున్నాన్న కారణంతో ఉద్దేశపూర్వంగాగానే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందదని విమర్శించారు. తన పాస్పోర్ట్ గతేడాది మే 31 తో ముగిసిందని, తదనుగుణంగా 2020 డిసెంబర్ 11 న తాజా పాస్పోర్ట్ జారీ కోసం దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. అయితే దేశ భద్రతకు ముప్పు అంటూ తన పాస్పోర్ట్ తనకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని సీఈడీ నివేదిక ఆధారంగా పాస్పోర్టు జారీకి నిరాకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో ముఫ్తీని ఈడీ విచారిస్తోంది. జమ్మూకాశ్మీర్ మరో మాజీ ముఖ్యమంత్రి,ఎన్సీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లాకు చెందిన రూ.12 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ గత ఏడాది జప్తు చేసింది.జమ్మూ-కశ్మీరు క్రికెట్ అసోసియేషన్ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై కేస నమోదు చేసింది. కాగా జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనతరం, మెహబూబాతోపాటు ఇతర నేతలను కేంద్రం దాదాపు సంవత్సరంపాటు నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. Passport Office refused to issue my passport based on CID’s report citing it as ‘detrimental to the security of India. This is the level of normalcy achieved in Kashmir since Aug 2019 that an ex Chief Minister holding a passport is a threat to the sovereignty of a mighty nation. pic.twitter.com/3Z2CfDgmJy — Mehbooba Mufti (@MehboobaMufti) March 29, 2021 -
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. గురువారం జరగనున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనుమతినివ్వాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. దీపక్రెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను తిరస్కరించింది. ఈ దశలో దీపక్రెడ్డి కోరినట్లుగా మధ్యంతర ఉత్తర్వులివ్వడం సాధ్యం కాదంది. దీపక్రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసేనాటికి హైదరాబాద్లోని రాయదుర్గం మునిసిపాలిటీలో ఓటరని, నిబంధనల ప్రకారం ఆయన ఆ మునిసిపాలిటీ ఎక్స్ అఫీషియో సభ్యుడు అవుతారని హైకోర్టు స్పష్టం చేసింది. దీపక్రెడ్డి తన ఓటును రాయదుర్గం నుంచి తాడిపత్రికి మార్చుకున్నా.. తాడిపత్రి మునిసిపాలిటీ ఎక్స్ అఫిషియో సభ్యుడు కాజాలరని తేల్చిచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. చదవండి: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు అక్రమాల పుట్ట ‘అమరావతి’ -
ప్రవీణ్ ప్రకాష్ బదిలీకి సర్కారు ‘నో’
సాక్షి, అమరావతి: సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) ప్రవీణ్ ప్రకాష్ను బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) జారీచేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం ఎస్ఈసీకి లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదివారం ఎస్ఈసీకి లేఖ రాశారు. ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టంచేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని సీఎస్ కోరారు. (చదవండి: జేసీ విజయకు హైకోర్టులో చుక్కెదురు) -
సుప్రీం కోర్టులో వరవరరావుకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు బెయిల్ పిటిషన్ విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. వరవరరావు భీమా కోరేగావ్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా వరవరరావు భార్య హేమలత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్ని విచారించిన జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ముంబయి హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. వరవరరావుకు చికిత్స అందజేస్తున్న హాస్పిటల్లో సౌకర్యాలను కూడా ముంబై హై కోర్టే పరిశీలిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వరవరరావు బెయిల్ అప్పీల్ను సరైన సమయంలో విచారించాలని సుప్రీం కోర్టు, ముంబయి హైకోర్టుకు సూచించించింది. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
కంగనా ఉందని సినిమా నుంచి తప్పుకున్నా
‘‘కంగనా రనౌత్ లీడ్ రోల్లో నటిస్తోందని తెలిసి నేను ఓ సినిమా నుంచి తప్పుకున్నా’’ అని ప్రముఖ కెమెరామేన్ పీసీ శ్రీరామ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘‘కంగనాతో కలిసి పని చేయడం నాకు అసౌకర్యంగా అనిపించింది. ఈ విషయాన్ని చిత్రబృందానికి చెబితే వాళ్లు అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మన మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి. ఈ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్’’ అన్నారాయన. ఇది నిజంగా నాకు నష్టమే – కంగనా కంగనాతో నేరుగా పీసీ శ్రీరామ్కు ఏ వివాదం లేకపోయినా.. ప్రతిదాన్నీ వివాదంగా మార్చే ఆమె తీరు నచ్చకే ఆయన తప్పుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏ విషయాన్నయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కంగనా బాలీవుడ్లో నెలకొన్న నెపోటిజమ్ (బంధుప్రీతి) గురించి విమర్శనాస్త్రాలు సంధించారు. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి నేపథ్యంలో బాలీవుడ్లో వివక్ష గురించి సంచలన వ్యాఖ్యలు చేశారామె. ఇక తాను నటిస్తున్న సినిమా నుంచి పీసీ శ్రీరామ్ తప్పుకోవడం గురించి కంగనా ఓ ట్వీట్ చేశారు. ‘‘మీలాంటి లెజెండ్తో పని చేసే అవకాశాన్ని మిస్సయ్యాను. ఇది నిజంగా నాకు నష్టమే. మీకు నా విషయంలో ఎక్కడ అసౌకర్యంగా అనిపించిందో తెలియడంలేదు. ఏది ఏమైనా మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. విష్ యు ఆల్ ది బెస్ట్’’ అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు కంగనా రనౌత్. -
అమూల్యకు బెయిల్ నిరాకరణ
బెంగళూర్ : పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజ్ విద్యార్థిని అమూల్య లినా బెయిల్ దరఖాస్తును బెంగళూర్ కోర్టు తోసిపుచ్చింది. ఆమెను విడుదల చేస్తే ఇదే తరహా నేరాలకు పాల్పడే అవకాశంతో పాటు పారిపోవచ్చని కోర్టు వ్యాఖ్యానించింది. ఫిబ్రవరి 20న బెంగళూర్లో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలో ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆమె పాకిస్తాన్ జిందాబాద్ అని నినదించారు. కాగా ఈ నినాదం చేసిన వెంటనే ఆమె వ్యాఖ్యలను ఓవైసీ ఖండించారు. తామంతా భారత్ కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ నినాదం చేసిన వెంటనే ఆమెను పలువురు కిందకు తీసుకువెళుతుండగా, మైక్రోఫోన్ను లాక్కునే ముందు ఆమె హిందుస్తాన్ జిందాబాద్ అని, లాంగ్లివ్ ఇండియా అని నినదించారు.ర్యాలీలో అలజడి రేపిన అమూల్యపై బెంగళూర్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు. కాగా ఆమె బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అమూల్య ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు నివేదించారు. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్త లాక్డౌన్తో ఆమె బెయిల్ పిటిషన్లో జాప్యం నెలకొంది. చదవండి : మిస్డ్ కాల్తో పరిచయం ఆపై.. -
తుక్కుగూడలో కేకేకు ఓటు హక్కుపై రిట్
సాక్షి, హైదరాబాద్: తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో మెంబర్గా రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు (కేకే) వేసిన ఓటు చెల్లదని ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజ్యసభ సభ్యుడిగా కేకేను.. ఏపీకి కేటాయించారని, ఆయన ఓటును రద్దు చేయాలని కోరుతూ బీజేపీకి చెందిన కౌన్సిలర్లు రిట్ దాఖలు చేశారు. ఇందులో ప్రతివాదులుగా రాష్ట్ర ఎన్నికల అధికారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రాజేశ్వర్రెడ్డి, చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ బి.వెంకట్రెడ్డిలను పేర్కొన్నారు. కేకే ఓటు వేయడానికి అనుమతించిన ఎన్నికల అధికారి ఎస్.రాజేశ్వర్రెడ్డి అనుమతి ఇవ్వడాన్ని మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 5 (2), (3)కు వ్యతిరేకమని ప్రకటించాలని కోరతూ రాజుమోనిరాజు సహా ఎమిమిది మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు. మధుమోహన్, వెంకట్రెడ్డి.. చైర్మన్, వైస్ చైర్మన్లుగా ఎన్నిక అయ్యేందుకు ఎక్స్అఫీషియో మెంబర్గా కేకే ఓటు కీలకమైందని, ఏపీకి చెందిన ఎంపీగా కేకే ఉన్నందున ఆయన తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఎన్నికల అధికారి అనుమతించడం చెల్లదని ప్రకటించాలని కోరారు. -
అశ్వత్థామరెడ్డికి చుక్కెదురు...
సాక్షి, హైదరాబాద్: సమ్మె ముగిసిన అనంతరం విధుల్లో చేరిన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి.. ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవులు కావాలంటూ దాఖలు చేసిన అభ్యర్థనను ఆర్టీసీ తిరస్కరించింది. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, సంస్థ ఉన్నతికి సిబ్బంది అంతా కలసి శ్రమించాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో సెలవు మంజూరు చేయలేమంటూ అధికారులు అప్పట్లోనే స్పష్టం చేశారు. తాజాగా ఆయన మరోసారి ఎక్స్ట్రా ఆర్టనరీ లీవ్ (ఈఓఎల్) కోసం దరఖాస్తు చేయగా రెండోసారి తిరస్కరించారు. సంస్థ కష్టాల్లో ఉన్నందున అన్ని రోజులు సెలవు మంజూరు చేయలేమని, వెంటనే విధుల్లో చేరాలని అధికారులు సూచించారు. చదవండి: కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి సీఎం ఆదేశాలు అమలు కావట్లేదు : అశ్వత్థామ రెడ్డి దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి -
అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీం కీలక నిర్ణయం
-
అయోధ్య తీర్పుపై సుప్రీం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య కేసులో సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన 18 రివ్యూ పిటషన్లను సర్వోన్నత న్యాయస్ధానం తిరస్కరించింది. నవంబర్ 9న వెలువరించిన నిర్ణయమే తుది తీర్పని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ స్పష్టం చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ గత నెలలో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పును సవాల్ చేస్తూ ముస్లిం పర్సనల్ లా బోర్డు, నిర్మోహి అఖారా సైతం రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. అయోధ్య తీర్పును సవాల్ చేస్తూ 40 మంది సామాజిక కార్యకర్తలు సైతం రివ్యూ పిటిషన్ను దాఖలు చేశారు. మరోవైపు అయోధ్యలో ముస్లింలకు మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాలు కేటాయించాలని సుప్రీం కోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హిందూ మహాసభ పిటిషన్ దాఖలు చేసింది. -
మోదీ విమానానికి పాక్ నో
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ న్యూయార్క్ పర్యటన దృష్ట్యా పాకిస్తాన్ గగనతలం నుంచి విమానాన్ని అనుమతించాలన్న భారత విజ్ఞప్తిని పాకిస్తాన్ బుధవారం తిరస్కరించింది. ఎయిర్ ఇండియా వన్ విమానం కమర్షియల్ విమానం కాకపోయినప్పటికీ వీఐపీ విమానం కాబట్టి అనుమతించాలని భారత్ కోరింది. చుట్టూ తిరిగి ప్రయాణించడం వల్ల ఫ్రాంక్ఫర్ట్కు ప్రయాణ సమయం 45 నిమిషాలు అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. హూస్టన్ ప్రయాణానికి ఫ్రాంక్ఫర్ట్లో విమానం ఇంధనం నింపుకోవాల్సి ఉంటుంది. నెలరోజుల క్రితం రాష్ట్రపతి కోవింద్ యూరప్ పర్యటన సమయంలోనూ పాక్ గగనతలంపై నుంచి విమానాన్ని అనుమతించాలన్న భారత్ విజ్ఞప్తిని ఆ దేశం తిరస్కరించింది. పాకిస్తాన్ అనుమతించని పక్షంలో ప్రధాని విమానం ముంబై, అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించి మస్కట్ నుంచి యూరప్ వెళ్లాల్సి ఉంటుంది. -
అమెరికా నివేదికపై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతదేశంలోని ప్రజల రాజ్యాంగహక్కుల గురించి మాట్లాడే హక్కు ఓ విదేశీ ప్రభుత్వానికి లేదని ఘాటుగా వ్యాఖ్యానిం చింది. 2018లో అంతర్జాతీయ మతస్వేచ్ఛకు సంబంధించి అమెరికా ప్రభుత్వం శుక్రవారం నివేదిక విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్లో మైనారిటీలపై హిందూ అతివాద సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయని ఆ నివేదికలో పేర్కొంది. గోమాంసాన్ని రవాణా చేయడం, గోవధ చేశారనే ఆరోపణలతో ముస్లింలపై దాడులు చేస్తున్నారని ఆరోపించింది. అమెరికా విదేశాంగ శాఖ తన నివేదికలో చెప్పిన అంశాలను భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ఖండించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోని లౌకిక భావజాలం పట్ల భారత్ గర్విస్తోంది. ప్రజల సంక్షేమం కోసం కృషిచేస్తున్న అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇక్కడి ప్రజలందరికీ మత స్వాతంత్య్రం ఉంది. రాజ్యాంగం మైనారిటీలు సహా అన్ని వర్గాలకు హక్కులను కల్పిస్తోంది. ఎవరికీ ఎలాంటి హానీ కలగదు. ఈ విషయంలో విదేశీ ప్రభుత్వం జోక్యం తగదు’అని ఉద్ఘాటించారు. -
మమతా బెనర్జీ రాజీనామా..!
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పశ్చిమబెంగాల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధించడంతో ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఇరుకునపడ్డారు. ఈ నేపథ్యంలో కోల్కతాలో శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన మమతా పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. అయితే టీఎంసీ మమతా బెనర్జీ రాజీనామాను తిరస్కరించింది. ఈ సమావేశం అనంతరం మమత మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఈవీఎంలను తారుమారు చేసిందనీ, ఈ ఫలితాల వెనుక విదేశీ శక్తుల హస్తముందని ఆరోపించారు. అందుకే రాజీనామా చేశా.. ‘లోక్సభ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పాలనను ఈసీ 5 నెలల పాటు ఆధీనంలోకి తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సీఎంగా ఎలా ఉండగలను? అందుకే ముఖ్యమంత్రిగా తప్పుకుంటానని చెప్పాను. కానీ పార్టీ నా రాజీనామాను తిరస్కరించింది. ఈ సీఎం కుర్చీ నాకవసరం లేదు. ఆ కుర్చీకే నా అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీనీ నెరవేర్చాం. ఇప్పటివరకూ ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీని పటిష్టం చేయడంపై కూడా దృష్టి సారిస్తా. లోక్సభ సీట్లలో బీజేపీ అభ్యర్థులకు లక్ష మెజారిటీ దాటేలా వాటిని రీప్రోగ్రామింగ్ చేశారు. దీనివెనుక విదేశీ శక్తులు కూడా ఉండొచ్చు. బీఎస్ఎఫ్ బలగాలు ప్రజలపై ఒత్తిడి తెచ్చి బీజేపీకి ఓట్లేసేలా చేశాయి’ అని మమత ఆరోపించారు. -
వీవీప్యాట్ లెక్కింపుపై పిటిషన్ కొట్టెసిన సుప్రీం
-
అనర్హులు 10,379
సర్పంచో.. వార్డు సభ్యుడో కావాలని కలలు కన్నారు... కలిసొచ్చిన రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకుందామనుకున్నారు... ఇందుకు కుటుంబసభ్యులు, బంధుమిత్రుల ప్రోత్సాహం దొరికింది... ఇంకేం 2013లో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో బరిలోకి దిగారు... ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి... గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.. ఓడిపోయిన వారు రాజకీయాలు కలిసిరావంటూ తమని ఓదార్చుకున్నారు... అయితే తిరకాసు వచ్చి పడింది... కొందరు గెలిచిన వారు సైతం ఎన్నికల సంఘానికి తమ ఖర్చు లెక్కలు చెప్పకపోగా.. ఓడిపోయిన వారైతే ఆ ఊసే ఎత్తలేదు.. ఫలితంగా ఎన్నికల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10,379 మంది 2020 వరకు ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ 2018 జనవరి 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అయోమయంలో పడిన ఆనాటి అభ్యర్థుల పరిస్థితి తాజా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్తో ఆందోళనకరంగా మారింది. ఈ అనర్హుల జాబితా ఉమ్మడి జిల్లాలోని జిల్లా పంచాయతీ అధికారుల వద్ద ఉంది. ఈ విషయంలో తదుపరి ఉత్తర్వులు వెలువడకపోతే పాత ఉత్తర్వులనే ప్రామాణికంగా తీసుకుని ఒకవేళ వారు నామినేషన్ వేసినా పరిశీలనలో తిరస్కరించే అవకాశం ఉంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: గత స్థానిక సంస్థల ఎన్నికల్లో లెక్కలు చూపని అభ్యర్థులకు 2017 డిసెంబర్ చివరి వారంలో మరోసారి కలెక్టర్లు, పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల ఖర్చు లెక్కలు చెప్పని వారిపై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. లెక్కలు చెప్పని వారిని 2020 సంవత్సరం వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వేటు వేసేలా ఆ ఉత్తర్వులో పేర్కొంది. వేటుపడ్డ వారిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10,379 మంది ఉన్నారు. ఇందులో ఆరుగురు సిట్టింగ్ సర్పంచ్లు ఉండగా, 1203 మంది పోటీ చేసి ఓడిపోయిన వారు, వార్డు మెంబర్ల అభ్యర్థులు 9170 మంది ఉండగా, 949 మంది సిట్టింగ్ వార్డు సభ్యులు ఉన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులు 45, ఎంపీటీసీ అభ్యర్థులు 371 మంది కాగా, కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోటీ చేసిన మరో 815 మంది ఈ జాబితాలో ఉన్నారు. సర్పంచ్ల్లో వారికి ఎన్నికల సంఘం నోటీస్లు జారీ చేసినా ప్రయోజనం లేకపోవడంతో 2020 నవంబర్ వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారి ఆశలు ఆడియాశలు కాగా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అత్యధికం... ఉద్యమాల ఖిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎందులోనైనా ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. చివరకు ఎన్నికల్లోనూ తమ తప్పిదాల్లో నెంబర్ వన్గా నిలిచింది. 2013, 2014లలో జరిగిన రూరల్, అర్బన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఇప్పటివరకు ఎన్నికల జమ, ఖర్చుల లెక్కలు చెప్పని వారు 10,379 మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నారు. అందులో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న ఆరుగురు సర్పంచ్లతో పాటు 949 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేసిన అభ్యర్థులంతా ఫలితాలు వెలువడిన 40 రోజుల్లో ఎన్నికల ఖర్చుల వివరాలు ఎన్నికల సంఘానికి అందజేయాలి. ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం గతంలో చూసిచూడనట్లు వ్యవహరించినా ఈసారి మాత్రం చాలా కఠినంగానే వ్యవహరిస్తోంది. అందులో భాగంగానే గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి జమ, ఖర్చుల వివరాలు సమర్పించని వారిపై అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్థలకు చెందిన వార్డు సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్ అభ్యర్థులు అందులో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన వారందరికి ఖర్చుల లెక్కలు సమర్పించాలని అధికారులు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో వారిపై కఠిన చర్యలు చేపట్టారు. 2020 వరకు పోటీకి అనర్హులు ఎన్నికల ఖర్చుల వివరాలు చెప్పని వారిపై మూడేళ్ల వరకు 2020 నవంబర్ వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. అందులో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు 955 మంది ఉన్నారు. సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులతో పాటు 57 జెడ్పీటీసీ స్థానాల నుంచి పోటీ చేసిన 45 మంది, 817 ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసిన 371 మందిపైనా అనర్హత వేటు పటింది. అదే విధంగా ఉమ్మడి జిల్లాలోని రెండు కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నుంచి పోటీ చేసి లెక్కలు చూపని 815 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రామగుండం కార్పొరేషన్లో 363 మంది ఉండగా, కరీంనగర్లో 132 కాగా, హుజూరాబాద్ నగర పంచాయతీలో ఒక్కరే ఉన్నారు. అనర్హత వేటు మిగతా అభ్యర్థులు జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, సిరిసిల్ల, వేములవాడ, జమ్మికుంటల నుంచి ఉన్నారు. అనర్హత వేటు పడిన వారిలో ఆందోళన వ్యక్తమవుతుండగా, సర్పంచ్ అభ్యర్థి రూ.40 వేలు, వార్డు మెంబర్ అభ్యర్థి రూ.6 వేల వరకు.. ఇలా అందరికీ వ్యయాన్ని చూచించినా ఎన్నికల సంఘం.. ఆ లెక్కలు చూపని అభ్యర్థులపై చర్యలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. కొత్త ఉత్తర్వులు వెలువడే వరకు పాతవే ప్రామాణికం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ లెక్కలు చెప్పనందుకు చర్యల కింద 2020 నవంబర్ వరకు పోటీ చేసే అర్హత కోల్పోయారు. ఈ విషయంలో కొత్త ఉత్తర్వులు వెలువడే వరకు పాత ఉత్తర్వులే అమల్లో ఉంటాయి. ఈసీ నియమావళి ప్రకారం ఒక్కో అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాలన్న నిబంధనలు ఉన్నాయి. ఆ మేరకు ఎన్నికల వ్యయాన్ని సమర్పించాలనే బాధ్యతను విస్మరించిన వారికి నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. – సీహెచ్. మనోజ్కుమార్, ఇన్చార్జి డీపీవో, కరీంనగర్ -
మాల్యాకు మరో ఎదురుదెబ్బ
సాక్షి, ముంబై: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుడు విజయ్ మాల్యాకు దెబ్బమీద దెబ్బ పడుతోంది. లండన్ హౌస్ తనఖా పెట్టి తీసుకున్నరుణాలను యూబీఎస్కు తిరిగి చెల్లించాలంటూ బుధవారం యూకే కోర్టు మాల్యా షాక్ ఇచ్చింది. మరోవైపు ఫ్యుజిటివ్ ఆర్థిక నేరస్థుల చట్టం కింద చర్యలపై బోంబే హైకోర్టులో చుక్కెదురైంది. ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుల చట్టం 2018 కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణను నిలిపివేయాలని కోరుతూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు గురువారం తోసి పుచ్చింది. కోట్ల రూపాయలను స్వదేశీ బ్యాంకులకు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టాలనే లక్ష్యంగా బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన చట్టమే ఫ్యుజిటివ్ ఆర్థిక నేరగాళ్ళ చట్టం -2018. ఈ చట్టం ప్రకారం విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించాలని, ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు అనుమతించాలని ఈడీ ట్రయల్ కోర్టును ఆశ్రయించింది. దీన్ని నిలిపివేయాలంటూ మాల్యా పెట్టుకున్న పిటిషన్ తాజాగా కోర్టు తిరస్కరించింది. బంగారు టాయిలెట్ పాయే? స్విస్బ్యాంకు యూబీఎస్కు మాల్యా చెల్లించాల్సిన 26.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19.50కోట్లు) రుణానికి బదులుగా సుమారు రూ.80 లక్షలు (88,000 పౌండ్ల) చెల్లించాలని యూకే బుధవారం ఆదేశించింది. ఈ మొత్తాన్ని జనవరి 4, 2019 నాటికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గడువు లోపు ఈ డబ్బును చెల్లించకపోతే.. లండన్ లోని రీజెంట్స్ పార్క్ ఇంటిని స్వాధీనం చేసుకొనేందుకు యూబీఎస్కు గ్రీన్ సిగ్నల్వచ్చినట్టేనని, దీంతో మాల్యా బంగారు టాయెలెట్ పోయినట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నాయకత్వంలోని 13బ్యాంకుల కన్సార్షియానికి రూ.9వేల కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టి 2016 మార్చిలో లండన్ పారిపోయాడు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మాల్యా ఆస్తుల జప్తుపై ఎస్బీఐ కన్సార్షియానికి అనుకూలంగా యుకె హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయనకు దాదాపు రూ.12,500 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని సమాచారం. -
30 తిరస్కరణ..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తయింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు పలు పార్టీల నుంచి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల గడువు సోమవారం ముగిసిన విషయం విదితమే. ఈ క్రమంలో సక్రమంగా లేనివాటిని అధికారులు తిరస్కరించారు. ఉమ్మడి జిల్లాలో 294 నామినేషన్లు దాఖలు కాగా.. పలువురు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. కొందరు అభ్యర్థులు తమ పార్టీ నుంచి టికెట్ వస్తుందని భావించి.. ముందుగానే పార్టీ పేరును ఉదహరించడంతో నామినేషన్ దాఖలు చేసే సమయానికి సదరు పార్టీ బీ ఫారం ఇవ్వని కారణంగా అధికారులు వాటిని తిరస్కరించారు. అయితే ఆయా పార్టీల ఆశావహులు కొందరు మాత్రం రెండు, మూడు విడతలుగా నామినేషన్ పత్రాలను దాఖలు చేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా వేసిన నామినేషన్లు మాత్రం ఆమోదం పొందాయి. ఖమ్మం జిల్లాలో.. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు, సత్తుపల్లిలో 2, మధిరలో 2, వైరాలో 6.. పాలేరులో ఒక నామినేషన్ను అధికారుల పరిశీలన అనంతరం సరైన పత్రాలు లేవనే కారణంతో తిరస్కరించారు. వాటిలో వైరా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పేర్కొంటూ రాములునాయక్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురికాగా.. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన వేసిన నామినేషన్ ఆమోదం పొందడంతో ఆయన ఎన్నికల బరిలో నిలిచే అవకాశం లభించింది. ఇల్లెందు నుంచి కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసిన మంగీలాల్ నామినేషన్ను అధికారులు సరైన పత్రాలు లేవనే కారణంతో తిరస్కరించారు. అలాగే పినపాక నియోజకవర్గంలో పాయం ప్రమీల, కుంజా కృష్ణకుమారి నామినేషన్లను తిరస్కరించారు. ఇల్లెందు నియోజకవర్గంలో మొత్తం మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మధిర నుంచి నామినేషన్ దాఖలు చేసిన నకిరికంటి చిట్టెమ్మ, మోదుగు సైదులు నామినేషన్లను తిరస్కరించగా.. 12 నామినేషన్లను ఆమోదించారు. కొత్తగూడెం జిల్లాలో 151 నామినేషన్లు దాఖలు కాగా.. 17 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 134 నామినేషన్లు ఎన్నికల అధికారుల ఆమోదం పొందాయి. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన బత్తుల లెనిన్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 25 నామినేషన్లు దాఖలు కాగా.. మూడు నామినేషన్లు తిరస్కరించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 29 నామినేషన్లు దాఖలు కాగా.. నాలుగు నామినేషన్లను తిరస్కరించారు. -
ఇప్పటికీ అర్థం కావడం లేదు
సినిమాలోని పాత్రకు సరిపడ గ్లామర్ లేదు.. ఫేస్లో సరైన ఎక్స్ప్రెషన్స్ను చూపించడం లేదు... ఇలాంటి కారణాలతో హీరోయిన్స్ను రిజెక్ట్ చేస్తుంటారు కొందరు డైరెక్టర్లు. కానీ, తెలివైన అమ్మాయిలా కనిపించినందుకు ఓ సినిమా చాన్స్ను కోల్పోయారట బాలీవుడ్ బ్యూటీ స్వరభాస్కర్. ఈ వింత అనుభవం గురించి ఆమె చెబుతూ–‘‘లుక్స్ బాగుండే హీరోయిన్స్కు మంచి అవకాశాలు వస్తుంటాయి. లేకపోతే ఏ హీరోయిన్ మేకప్ కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టరు. కానీ, నేను ముంబైకి వచ్చిన కొత్తల్లో సినిమా చాన్స్ కోసం ఓ డైరెక్టర్ను కలిశాను. ‘నువ్వు చాలా తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు.. మా సినిమాలో తీసుకోలేం’ అన్నారాయన. ఆ డైరెక్టర్ మాటల్లోని మర్మం ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. అలాంటి సంఘటనలను వీలైనంత త్వరగా మర్చిపోవడమే మంచిది’’ అని చెప్పుకొచ్చారు స్వరభాస్కర్. -
ఉగ్రపార్టీలను తిరస్కరించిన పాక్ ఓటర్లు
-
హనీప్రీత్కు బెయిల్ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ను దోషిగా తేల్చిన అనంతరం చెలరేగిన అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఇన్సాన్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు గురువారం తోసిపుచ్చింది. హనీప్రీత్ బెయిల్ అప్పీల్ను కోర్టు తిరస్కరించిందని, అయితే ఉత్తర్వుల కాపీ తమకు ఇంకా అందలేదని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ప్రియాంక తనేజా అలియాస్ హనీప్రీత్ లైంగిక దాడి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ దత్తపుత్రికగా చెబుతారు. హింసను ప్రేరేపించారనడానికి ఆమెకు వ్యతిరేకంగా హర్యానా పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవంటూ హనీప్రీత్ బెయిల్ను కోరుతున్నారని న్యాయవాది తెలిపారు.గత ఏడాది పంచ్కులలో జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్ అయిన 15 మందికి వేర్వేరు కోర్టుల్లో బెయిల్ లభించిందని డిఫెన్స్ న్యాయవాది పేర్కొనగా, ఆమె బెయిల్ అప్పీల్ను ప్రాసిక్యూషన్ వ్యతిరేకించింది. గత ఏడాది ఆగస్ట్ 25న గుర్మీత్ సింగ్ను లైంగిక దాడి కేసులో దోషిగా నిర్ధారించిన అనంతరం చెలరేగిన అల్లర్లలో 41 మంది మరణించగా, పలువురికి గాయాలైన విషయం తెలిసిందే. అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన హనీప్రీత్ ఆరు నెలల నుంచి జైలు జీవితం గడుపుతున్నారు. -
హీనాతో పెళ్లి.. అబూ సలేంకి ఝలక్
సాక్షి, ముంబై : ముంబై పేలుళ్ల దోషి.. మాజీ డాన్ అబూ సలేంకు ఝలక్ తగిలింది. వివాహం కోసం అతను దాఖలు చేసుకున్న పెరోల్ను పోలీసులు తోసిపుచ్చారు. మే 5వ తేదీన సయ్యద్ బహర్ కౌసర్ అలియాస్ హీనాను పెళ్లి చేసుకునేందుకు సలేం సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో 45 రోజుల పెరోల్ కోసం నవీ ముంబై కమిషనర్ను సలీం అభ్యర్థించాడు. అయితే పోలీసులు మాత్రం సలేం అభ్యర్థనను తిరస్కరించారు. ఈ విషయాన్ని తలోజా జైలు సూపరిడెంట్ శుక్రవారం ధృవీకరించారు. కాగా, హీనా తొలిసారిగా 2014లో సలీంతోపాటు రైల్లో ప్రయాణించి(ముంబై నుంచి లక్నోకు) వార్తల్లో నిలిచారు. 1993 ముంబై పేలుళ్ల కేసులో సలేం దోషిగా తేలటంతో.. ప్రత్యేక న్యాయస్థానం అతనికి జీవిత ఖైదును విధించింది. అప్పటి నుంచి తలోజా జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. కాగా, అబూ సలేంతో పెళ్లి జరిపించాలంటూ ముంబ్రాకు చెందిన 25 ఏళ్ల హీనా అప్పట్లో న్యాయ పోరాటానికి సైతం దిగింది. ఈమేరకు ప్రత్యేక అనుమతి కోరుతూ ముంబై టాడా కోర్టును ఆశ్రయించింది. అతనితో నిఖా జరిపించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది కూడా. అయితే కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. సలేంకు మరణశిక్ష విధించకపోవటానికి కారణం ఇదే... -
నటి శ్రుతి బెయిల్ పిటిషన్ కొట్టివేత
తమిళసినిమా: నటి శ్రుతి బెయిల్ పిటిషన్ను కోవై కోర్టు కొట్టివేసింది. కోవై, పాపనాయగన్ పాళైయం, ధనలక్ష్మీనగర్కు చెందిన నటి శ్రుతి(21) ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు యువకుల నుంచి కోట్లాది రూపాయలను గుంజి మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎడపాడి గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ బాలకుమార్ను పెళ్లి పేరుతో రూ.45 లక్షలు మోసానికి పాల్పడడంతో అతను కోవై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నటి శ్రుతి, ఆమె తల్లి చిత్ర, సోదరుడు సుభాష్, సహయకుడు ప్రసన్న వెంకటేశ్లను అరెస్ట్ చేసి కోవై సెంట్రల్ జైలుకు పంపారు. నటి శ్రుతితో పాటు నలుగురు బెయిల్ను మంజూరు చేయవలసిందిగా కోవై జేఎం.కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఈ పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వేల్స్వామి ఆ నలుగురికి బెయిల్ను మంజూరు చేయడానికి నిరాకరిస్తూ పిటిషన్ను కొట్టివేశారు. -
ఆర్కే నగర్ బైపోల్.. విశాల్ నామినేషన్ తిరస్కరణ
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై రిటర్నింగ్ అధికారి వరుస షాకులు ఇస్తున్నారు. నటుడు విశాల్ నామినేషన్ను కూడా తిరస్కరించినట్లు ఆయన ప్రకటించారు. కాసేపటి క్రితం ఈ విషయాన్ని ఆయన తెలియజేశారు. నామినేషనల్ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైంది. సాంకేతిక కారణాలతో ఆమె నామినేషన్ను తిరస్కరించినట్లు అధికారి తెలిపారు. విశాల్ అరెస్ట్... నామినేషన్ తిరస్కరణపై విశాల్ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
సత్యగిరిపై సత్రానికి మూడో ‘సారీ’
సత్రం నిర్మాణానికి మూడో సారి తీర్మానం తిరస్కరించిన ఉన్నతాధికారులు కొండ దిగువున సత్రం నిర్మాణానికి అంగీకారం అన్నవరం (ప్రత్తిపాడు): ప్రతి చిన్న విషయానికి పొదుపు, విరాళాలు అంటూ కాలయాపన చేసే దేవస్థానం అధికారులు ఒకవైపు... అవసరమని తెలిసి కూడా సత్రాల నిర్మాణానికి అనుమతి ఇవ్వని దేవాదాయశాఖ ఉన్నతాధికారులు మరోవైపు... దీంతో అంగుళం ముందుకు కదలని దేవస్థానం నిర్మాణాలు... వసతి గదులు దొరక్క భక్తుల ఇబ్బందులు...ఇదీ ప్రస్తుతం అన్నవరం దేవస్థానం పరిస్థితి. అన్నవరం సత్యగిరిపై 1.5 ఎకరాల స్థలంలో రూ.16 కోట్లతో ఐదంతస్తుల్లో 138 గదులతో తలపెట్టిన సత్రం నిర్మాణానికి ముచ్చటగా మూడో సారీ దేవాదాయశాఖ ఉన్నతాధికారుల నుంచి చుక్కెదురైంది. ఈ నిర్మాణం ఇప్పుడే వద్దని, ముందు కొండదిగువున ఈరంకి వారి సత్రంలో వంద గదులు నిర్మించుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్ వై.వి.అనూరాధ దేవస్థానం అధికారులకు సూచించారు. దీంతో ఈ సత్రం నిర్మాణానికి ఏడేళ్లలో మూడో సారి అధికారులు చేసిన ప్రయత్నం వృ«థా అయింది. దేవస్థానం మాస్టర్ప్లాన్ ఇంకా సిద్ధం కాకపోవడాన్ని సాకుగా చూపి అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జె.ఎస్.వి.ప్రసాద్ దేవస్థానానికి వచ్చి ఈ సత్రం నిర్మాణం అవసరం ఉందో లేదో పరిశీలించిన తరువాత అనుమతి ఇచ్చే విషయం పరిశీలిస్తామని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ సత్రం అనుమతి కోసం విజయవాడ వెళ్లిన ఇంజినీరింగ్ శాఖ అధికారులు డీలా పడ్డారు. 2011లోనే పాలక మండలి తీర్మానం భక్తుల వసతి కోసం సత్యగిరిపై 138 గదులతో సత్రం నిర్మించాలని 2011లో చైర్మన్ ఐ.వి.రామ్కుమార్ అధ్యక్షతన గల పాలకమండలి తీర్మానించింది. ఈ సత్రం నిర్మాణానికి రూ.11 కోట్లు వ్యయమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేశారు. దీన్ని 2012లో అప్పటి కమిషనర్ ఆమోదించగా, అప్పటి ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ప్రసాదం వేంకటేశ్వర్లు సత్రం నిర్మాణానికి టెండర్లు పిలవకుండా తాత్సారం చేయడంతో నిర్మాణం జరగలేదు. ఆయన బదిలీ అనంతరం మరలా 138 గదుల సత్రం నిర్మాణానికి 2014లో పాలకమండలి రెండో సారి తీర్మానం చేసింది. అప్పుడు దీని అంచనా వ్యయం రూ.11 కోట్ల నుంచి రూ.14.5 కోట్లకు పెరిగింది. 2014లో దేవస్థానానికి వచ్చిన శృంగేరీ పీఠాధిపతి జగద్గురు శ్రీభారతీ తీర్థస్వామి ఈ సత్రం నిర్మాణానికి లాంఛనంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. గత నెలలో మళ్లీ తీర్మానం భక్తుల వసతికి ఇబ్బందిగా ఉన్నందున 138 గదుల సత్రం నిర్మాణం అవసరమని భావించి మరలా గత నెలలో పాలక మండలిలో తీర్మానించారు. దీని నిర్మాణానికి ప్రస్తుత ధరల ప్రకారం రూ.16 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. వాస్తవంగా చూస్తే 2011లోనే దీని నిర్మాణం ప్రారంభిస్తే అప్పటి అంచనా వ్యయం ప్రకారం రూ.11 కోట్లకే పూర్తయి ఉండేది. మూడేళ్ల క్రితమే భక్తులకు అందుబాటులోకి వచ్చేది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ, ఉన్నతాధికారుల అభ్యంతరాల కారణంగా దీని నిర్మాణ వ్యయం రూ.ఐదు కోట్లు పెరిగింది. అయినప్పటికీ ఉన్నతాధికారులు అనుమతించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొండ దిగువున సత్రం నిర్మాణానికి అనుమతి కొండ దిగువున జూనియర్ కళాశాల వెనుక గల 2.34 ఎకరాల ఈరంకి వారి స్థలంలో 110 గదులతో సత్రం నిర్మాణానికి కొన్ని మార్పులతో కమిషనర్ అనుమతి ఇచ్చారు. దీని నిర్మాణానికి రూ.13.25 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఈ స్థలంలో ప్రస్తుతం నర్సరీ గార్డెన్ నిర్వహిస్తున్నారు. ఈ గార్డెన్ను తయారు చేయడానికి సుమారు రూ.20 లక్షలు ఖర్చుపెట్టి పంపా నుంచి మట్టి తెచ్చి ఎత్తు చేశారు. కొండ కింద సత్రాలకు భక్తుల ఆధరణ ఉండటం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొండమీద బస చేయాలనుకునే భక్తులే ఎక్కువ. ఇప్పటికే కొండ దిగువున బస చేసేవారు లేక పంపా సత్రాన్ని ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణకు ఇచ్చేశారు. సత్యగిరి సత్రంలో గదులు రద్దీ సమయంలో తప్ప పూర్తిగా నిండే పరిస్థితి లేదు. దీంతో కొండ దిగువున సత్రం కట్టడం పెద్దగా లాభదాయకం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశీలించాకా అనుమతి ఇస్తామన్నారు సత్యగిరిపై నిర్మించే సత్రానికి కమిషనర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాత అనుమతి ఇస్తామన్నారు. ముందు కొండ దిగువున ఈరంకి వారి స్థలంలో సత్రం కట్టేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా పాత ప్లాన్ మార్చమని చెప్పారు. ఆ ప్లాన్ మార్చేందుకు దేవస్థానం ఈఈని విజయవాడలోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాం. - కె.నాగేశ్వరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం -
ఆయనతో నో అనడానికి అదే కారణం!
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఒక రకమైన యుక్తి అయితే, ఒక ప్రణాళిక ప్రకారం తనకు నచ్చిన విధంగా కెరీర్ను కొనసాగించడం మరో రకం యుక్తి. నటి కీర్తిసురేశ్ రెండవ పద్ధతిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది. రజనీమురుగన్, రెమో చిత్రాల విజయంతో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఆ తరువాత విజయ్తో నటించే అవకాశాన్ని అందుకుంది. కాగా వాలు చిత్రం ఫేమ్ విజయచందర్ దర్శకత్వంలో నటుడు విక్రమ్కు జంటగా స్కెచ్ చిత్రంలో నటించే అవకాశం ముందు నటి కీర్తీసురేశ్నే వరించింది. అయితే సీనియర్ కథానాయకులతో నటించరాదని నిర్ణయించుకున్నట్లు ఆ దర్శక నిర్మాతలతో ఓపెన్గానే చెప్పి ఆ అవకాశాన్ని వదులుకుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్పై ప్రత్యేక దృష్టిని సారిస్తున్న కీర్తీకి అక్కడ కృష్ణవంశీ దర్శకత్వంలో బాలకృష్టకు జంటగా నటించే అవకాశం రాగా సీనియర్ నటుడన్న కారణంగా ఆ అవకాశాన్ని తిరస్కరించిందట. అయితే సీనియర్ నటులకు జంటగా నటించాలన్న కోరిక తనకూ ఉందని, అయితే ఆదిలోనే అలా వారికి జంటగా నటిస్తే, యువ నటులకు జంటగా నటించే అవకాశాలను మిస్ అవుతానేమోనన్న భావనతో ఆ అవకాశాలను ఒప్పుకోవడం లేదని కీర్తీ చెప్పుకొచ్చింది. అయితే సెకండ్ రౌండ్లో పెద్ద, చిన్నా తారతమ్యాలు చూడకుండా కథా పాత్రలకు ప్రాముఖ్యతనిచ్చి నటిస్తానని కీర్తీసురేశ్ అంటోంది. చూద్దాం ఈ అమ్మడి యువ యుక్తి ఎంతవరకూ పారుతుందో. -
టాటా సన్స్పై మిస్త్రీ పిటిషన్ తిరస్కృతి
న్యూఢిల్లీ: టాటా సన్స్పై ఆ గ్రూప్ బహిస్కృత చైర్మన్ సైరస్ మిస్త్రీ దాఖలు చేసిన అప్పిలేట్ పిటిషన్ను నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తోసిపుచ్చింది. మిస్త్రీని బోర్డ్ డైరెక్టర్ బాధ్య తల నుంచి తొలగించడానికి టాటా సన్స్ సోమవారం నిర్వహించతలపెట్టిన షేర్ హోల్డర్ల సమావేశాన్ని నిలుపుచేయాలని కోరుతూ మిస్త్రీ నేతృత్వంలోని రెండు కంపెనీలు తొలుత ముంబై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించాయి. జనవరి 31న ఎన్సీఎల్టీ దీనిని తోసిపుచ్చడంతో అప్పిలేట్ ట్రిబ్యునల్ను మిస్త్రీ ఆశ్రయించారు. తాజాగా ఇక్కడా ఆయనకు ప్రతికూల తీర్పు వెలువడింది. ‘‘మేము ఎలాంటి సానుకూల రూలింగ్నూ ఇవ్వడం లేదు. ఇందుకు సంబంధించి మూడు అప్పీళ్లనూ తిరస్కరిస్తున్నాం. తరువాత సవివరమైన ఉత్త్తర్వులను వెలువరిస్తాం’’ అని జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. గౌరవనీయ పరిష్కారం... మిస్త్రీ కంపెనీల పిటిషన్ను తిరస్కరించిన అప్పిలేట్ ట్రిబ్యునల్, కేసు పరిష్కారం విషయంలో కీలక సూచనలూ చేసింది. ‘‘ఈ కేసులో పార్టీలు గౌరనీయమైన ఒక పరిష్కారానికి రావాలి. అలాకాని పక్షంలో ఇరువైపుల ప్రతిష్ట దెబ్బతింటుంది. వాణిజ్య ప్రయోజనాలకూ విఘాతం కలుగుతుంది. అలాగే ఉద్యోగుల నైతికతా దెబ్బతింటుంది.’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'
దర్శకుడు ప్రేమ్ రాజ్ తెరకెక్కించిన శరణం గచ్ఛామి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్బోర్డ్ నిరాకరించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయటంపై తెరకెక్కించిన ఈ సినిమా రాజ్యంగంలోని పలు నింబధనలను ఉల్లంఘించిందన్న కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తన సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను, డైలాగ్లను తొలగించేందుకు తాను సిద్ధమని అలాంటివేవీ చెప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అన్యాయం అంటున్నారు దర్శకుడు ప్రేమ్ రాజ్. ప్రాంతీయ సెన్సార్బోర్డ్ సెన్సార్కు నిరాకరించటంతో ప్రస్తుతం కేంద్ర సెన్సార్బోర్డ్ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఇటీవల సెన్సార్బోర్డ్ నిర్ణయాలు వివాదాస్పద మవుతున్న నేపథ్యంలో శరణం గచ్ఛామి విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డ్, ఏ నిర్ణయం తీసుకోనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
ప్రొఫెసర్ లక్ష్మికి చుక్కెదురు
గుంటూరు: మెడికో సంధ్యారాణి ఆత్మహత్య కేసులో అరెస్టయిన ప్రొఫెసర్ లక్ష్మికి కోర్టులో చుక్కెదురైంది. బుధవారం ప్రొఫెసర్ లక్ష్మి బెయిల్ పిటిషన్ను విచారించిన మూడో అదనపు జిల్లా కోర్టు.. ఆమె పిటిషన్ను తోసిపుచ్చుతూ నిర్ణయం తీసుకుంది. లక్ష్మి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పేర్కొటూ లేఖరాసి సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్య అనంతరం పరారీలో ఉండి ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన లక్ష్మికి బెయిల్ మంజూరు చేయడానికి కోర్టు నిరాకరించింది. -
'ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేం'
జోద్పూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారం బాపునకు మరోసారి రాజస్థాన్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ దాదాపు ముగింపు దశలో ఉండగా ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ కోర్టు స్పష్టం చేసింది. 2013 సెప్టెంబర్ 2న జోద్ పూర్ సెంటర్ జైలుకు ఆశారాం బాపును తరలించారు. ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించగా అప్పటి నుంచి ఆయన పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఆశారాం బెయిల్ పిటిషన్ వేయడం.. కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి. -
సివిల్స్ ఉత్తీర్ణులు ఆరుగురిపై అనర్హత వేటు
-ఆందోళనలో ఆరుగురు విద్యార్థులు -చట్టాన్ని ఆశ్రయిస్తామని వెల్లడి చెన్నై: జాతీయ స్థాయిలో నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఆరుగురు అభ్యర్థులపై అనర్హత వేటు పడింది. ఇటీవల జరిగిన సివిల్స్ పరీక్షల్లో తమిళనాడుకు చెందిన 80 మందికిపైగా ఉత్తీర్ణులయ్యారు. ఓబీసీ కేటగిరికి చెందిన ఆరుగురిని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హఠాత్తుగా వారిని అనర్హులుగా ప్రకటించింది. వార్షిక ఆదాయం రూ.6లక్షలకుపైగా ఉన్నందున ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పరిధిలోకి రానందున అనర్హులుగా పరిగణిస్తూ ఉత్తీర్ణతను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. బాధితులను మీడియా పలుకరించగా సివిల్స్కు దరఖాస్తు చేసుకున్నప్పుడే అన్ని సర్టిఫికెట్లను సమర్పించామని, వాటిని బాగా పరిశీలించిన తర్వాతే పరీక్ష రాసేందుకు అనుమతించారని తెలిపారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి నేడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న దశలో అనర్హులని అకస్మాత్తుగా ప్రకటించడం అన్యాయమని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ చట్టపరమైన పోరాటం చేస్తామని వారు తెలిపారు. -
రాప్తాడు ధర్నాకు పోలీసులు నో
రాప్తాడు(అనంతపురం): కర్నూలులో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న జలదీక్షకు మద్దతుగా రాప్తాడు మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం పది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ధర్నా నిర్వహిస్తుండగా రాప్తాడులో మాత్రం పోలీసులు అనుమతించక పోవడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డాలర్ డ్రీమ్స్కు దారేది..
-
హార్దిక్కు మళ్లీ చుక్కెదురు
సూరత్: దేశద్రోహం కేసులో పటేళ్ల ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఆయన సూరత్ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఆయన బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పటేళ్లకు ఓబీసీ కోటాలో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని గుజరాత్ కు చెందిన హార్ధిక్ పటేల్ పెద్ద మొత్తంలో ఉద్యమాన్ని లేవదీసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఉద్యమం ఆందోళన కరంగా మారి ఘర్షణలకు తావిచ్చింది. ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ఆయనపై పలుచోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. అయితే, ప్రత్యేకంగా ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు అవసరం అయితే ప్రాణాలు తీయాలని వ్యాఖ్యానించి ఆందోళనకారులను రెచ్చగొట్టాడు. ఉద్యమకారులారా ఆత్మహత్యలు వద్దు అవసరం అయితే పోలీసులను చంపేయండి అంటూ పరుష వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేసి గత నెల 16న లప్ పోర్ జైలులో వేశారు. దీంతో ఆయన సూరత్ జిల్లా సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారని అందులో పేర్కొన్నారు. కానీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అక్టోబర్ నుంచే హార్ధిక్ పై దేశ ద్రోహం కేసులు పలు చోట్ల నమోదయ్యాయి. -
ఎమ్మెల్సీ ఎన్నికల పిటిషన్ను తోసిపుచ్చిన హైకోర్టు
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలను నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని...నిలిపివేయడం కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా.... ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు మల్లేశ్ పిటిషిన్ వేసిన విషయం తెలిసిందే. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ రోజుతో గడువు ముగియనుండడంతో అన్ని పార్టీలు నామినేషన్లు వేసే పనిలో నిమగ్నమైయ్యాయి. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో ససేమీరా అనడంతో టెన్షన్ నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి పోటీకి విముఖత తెలపడంతో కాంగ్రెస్ అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది. -
నిశ్చితార్థం అయ్యాక నచ్చలేదన్నాడని..
-
అర్ధరాత్రి హైడ్రామా
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ క్షమాభిక్షపిటీషన్ని తిరస్కరిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మెమన్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మరికొందరు న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు రాత్రి 12 గంటల సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపటికే సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కూడా అక్కడకు చేరుకొని మెమన్ తరఫు న్యాయవాదుల పిటీషన్లను తీసుకొని సీజేఐ కు సమర్పించారు. క్షమాభిక్ష పిటిషన్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే నిర్ణయం సరికాదని ...ఒక వేళ తిరస్కరించినా ఆ నిర్ణయం అమలుకు కనీసం 14 రోజులు గడువు కావల్సి ఉంటుందని కావున తమ విజ్ఞప్తిని పరిశీలించాల్సిందిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ హెచ్ ఎల్ దత్తును మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఈ వినతిని స్వీకరించిన సీజేఐ రాత్రికి రాత్రే ఇదివరకే ఈ కేసును విచారించిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్లతో కూడిన ధర్మాసనం ఏర్పాటుకు అంగీకరించారు. తెల్లవారుజామున మూడుగంటలకు సుప్రీం కోర్టులోని హాల్లో మెమన్ ఉరిశిక్ష వాయిదాకు సంబంధించిన తుది విచారరణ ప్రారంభమైంది. అంతకు ముందులాగే ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు మెమన్ ఉరిశిక్ష నిలిపివేతను తీవ్రంగా వ్యతిరేకించారు. ఉరిశిక్ష అమలుకు 10గంటల ముందు దాఖలు చేసిన క్షమాభిక్షపిటీషన్ చెల్లు బాటుకాదని, నిజానికి ఈ కేసులో వాస్తవ న్యాయప్రక్రియ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయిందని ఆటార్నిజనరల్ ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. ఇంతకు ముందు క్షమాభిక్షపిటీషన్ మెమన్ సోదరుడు దాఖలు చేయగా, తాజాగా బుధవారం రాష్ట్రపతికి అందిన పిటిషన్ మెమన్ ఇచ్చిందని న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం బుధవారం సాయంత్రం నుంచి శిక్షఅమలుకు 14 రోజుల వ్యవధి ఉండాలని మెమన్ తరఫు న్యాయవాదులు కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్నఅనంతరం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ్ రాయ్లతో కూడిన ధర్మాసనం ప్రాసిక్యూషన్కు అనుకూలంగా తీర్పువెలువరించడంతో మెమన్ ఉరి అమలుకు అడ్డంకులు తొలగినట్లయింది. -
ఈ నవ్వులు ఇక లేవు
-
65 క్షమాభిక్ష పిటిషన్ల తిరస్కృతి
ఇస్లామాబాద్: 65 మంది మరణ శిక్ష పడ్డ ఖైదీల క్షమాభిక్ష పిటిషన్లను, పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ తిరస్కరించారు. వీరిలో హత్య కేసులో దోషిగా ఉన్న కనీజాన్ బీబీ అనే ఒకే ఒక్క మహిళ కూడా ఉంది. కనీజాన్కు ఉరి అమలైతే, పాక్లో ఇప్పటివరకు ఉరి శిక్ష పడ్డ మహిళల సంఖ్య 9కి చేరుతుంది. అధికారిక లెక్కల ప్రకారం పాక్లో కింది స్థాయి కోర్టులు ఇచ్చిన తీర్పులతో కలుపుకొని మొత్తం 47 మంది ఉరిశిక్ష పడ్డ మహిళల కేసులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో 150 మంది ఖైదీలకు ఉరి శిక్షని అమలు చేశారు. గత సంవత్సరం జరిగిన పెషావర్ ఆర్మీ స్కూల్ విషాదం తర్వాత మరణ శిక్ష నిషేధాన్ని టెర్రరిజం సంబంధం ఉన్నకేసుల్లో ఎత్తి వేశారు. ఈసంఘటనలో 140 విద్యార్థులు, సిబ్బంది చనిపోయారు. క్షమాభిక్ష తిరస్కరించిన వారందరికి రంజాన్ మాసం పూర్తయిన తర్వాత ఉరి శిక్ష అమలు కానుంది. -
సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు
-
సల్మాన్ ఖాన్ కు చుక్కెదురు
జోధ్పూర్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు జోథ్ పూర్ కోర్టులో చుక్కెదురు అయ్యింది. హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ తో సంబరాల్లో మునిగి తేలుతున్న సల్లూ భయ్యాకు కోర్టు షాక్ ఇచ్చింది. పదహారేళ్ల కిందట సల్మాన్ ఖాన్ కృష్ణజింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ పెట్టుకున్న పిటిషన్ ను తిరస్కరించింది. సాక్షులను మళ్లీ విచారించేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా అక్టోబర్, 1998లో జోథ్ పూర్ లో 'హమ్ సాథ్ సాథ్ హై' సినిమా షూటింగ్ సమయంలో అక్కడి అడవిలో మూడు చింకారాలు, ఒక కృష్ణజింకను సల్మాన్ ఖాన్ వేటాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్లూపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
డీసీ డెరైక్టర్ల బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో రుణం పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) డెరైక్టర్లు టి.వెంకటరామిరెడ్డి, టి.వినాయక రవిరెడ్డిలకు బెయిల్ ఇచ్చేందుకు ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు (8వ అదనపు ఎంఎస్జే) నిరాకరించింది. ఈ మేరకు వీరిద్దరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎం.లక్ష్మణ్ శుక్రవారం కొట్టివేశారు. బెయిల్ ఇస్తే దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి, బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు. -
సెలబ్రెటీలు చట్టానికి అతీతులా !
-
పెరోల్ పాలిటిక్స్
-
నిజంగా మీరు జయలలితను అభిమానిస్తే...
చెన్నై: అన్నాడీఎంకే మద్దతుదారులు ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. మీరు నిజంగా జయలలితను అభిమానిస్తే సహనాన్ని పాటించాలన్నారు. మంగళవారం జయలలిత తరపున దాఖలైన పిటిషన్ ను బెంగళూరు హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో జయ అభిమానులకు, అన్నాడీఎంకే మద్దతుదారులకు పన్నీర్ సెల్వం సూచించారు. ఆదాయానికి మించి అస్తులు కలిగి ఉన్నారనే దాఖలైన కేసులో జయలలితకు బెంగళూరు కోర్టు జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. జయలలితకు బెయిల్ లభించిందంటూ పుకార్లు రావడంతో పలు మీడియా, వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో వార్తల్ని ప్రసారం చేశాయి. ఆతర్వాత బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించిందనే వార్త బయటకు పొక్కడంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్న అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ నేపథ్యంలో అభిమానులు,కార్యకర్తలు అవేశానికి లోనవ్వద్దని పన్నీర్ సెల్వం సూచించారు. -
రియల్ వ్యాపారి బెయిల్ తిరస్కృతి
న్యూఢిల్లీ: నోయిడా భూ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన రియల్ఎస్టేట్ వ్యాపారి శివేందర్సింగ్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. రాజకీయ నాయకుల మద్దతుతో, మాఫియా అండదండలతో వ్యవసాయభూమిని సొంతం చేసుకున్నారని, చట్టమంటే భయం లేనట్లుగా వ్యవహరించారని అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని లావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు, ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సంబంధిత అధికారులను కూడా విచారించాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది. పట్టుబడిన నింది తుడు చట్టాన్ని లెక్కచేయకుండా వ్యవహరించాడు. ఖజానాకు 12.5 కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. అతనికి తండ్రి, సహనిందితుడు అయిన మహేందర్సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శివేందర్సింగ్కు బెయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వడం సరికాద’ న్యాయమూర్తి పేర్కొన్నారు. -
రియల్ వ్యాపారి బెయిల్ తిరస్కృతి
న్యూఢిల్లీ: నోయిడా భూ కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన రియల్ఎస్టేట్ వ్యాపారి శివేందర్సింగ్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. రాజకీయ నాయకుల మద్దతుతో, మాఫియా అండదండలతో వ్యవసాయభూమిని సొంతం చేసుకున్నారని, చట్టమంటే భయం లేనట్లుగా వ్యవహరించారని అడిషనల్ సెషన్స్ జడ్జి కామిని లావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆర్థిక నేరాల విభాగం పోలీసులు, ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. సంబంధిత అధికారులను కూడా విచారించాల్సిందేనని కోర్టు అభిప్రాయపడింది.‘పట్టుబడిన నింది తుడు చట్టాన్ని లెక్కచేయకుండా వ్యవహరించాడు. ఖజానాకు 12.5 కోట్ల రూపాయల నష్టం కలిగించాడు. అతనికి తండ్రి, సహనిందితుడు అయిన మహేందర్సింగ్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శివేందర్సింగ్కు బెయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వడం సరికాద’ న్యాయమూర్తి పేర్కొన్నారు.