తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండోరోజు సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే వివిధ అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. దీంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల రెగ్యులరైజేషన్పై బీజేపీ, ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాగా హరితహారంపై నేడు సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలను 50 రోజులపాటు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.