మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తను చంపింది | Wife Kills Husband in Filmnagar | Sakshi

మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తను చంపింది

Aug 7 2018 10:03 AM | Updated on Mar 21 2024 6:15 PM

ఫిలింనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. బానోతు జగన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సైదప్ప బస్తీలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పైఅంతస్తుకు వెళ్లి చూడగా జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని వారు చెబుతున్నారు. జగన్‌ చాలా మంచి వ్యక్తి అని, మరో వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement