Film Nagar
-
Hyderabad: ‘గే’ యాప్లో పరిచయం.. ఇంటికి పిలిచి..
ఫిలింనగర్: ‘గే’ యాప్లో పరిచయం చేసుకుని బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్న నిందితుడిని ఫిలింనగర్ పోలీసులు ఫోన్ పే ద్వారా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. డబీర్పురాలో నివసించే పర్హాన్బేగ్ (25) జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం జెండర్ యాప్లో ’గే’లను పరిచయం చేసుకుంటూ వారిని తనవద్దకు రప్పించి వీడియోలు తీస్తూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నాడు. షేక్పేట జైహింద్నగర్కు చెందిన ఓ యువకుడి (22)ని గత నెల జెండర్ యాప్లో పరిచయం చేసుకుని తన వద్దకు రప్పించుకున్నాడు. ఇంటికి వెళ్లిన సదరు యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ వీడియో రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి రూ.15 వేలు డిమాండ్ చేశాడు. అయితే బాధితుడు రూ.10 వేలను ఫోన్ పే ద్వారా నిందితుడికి బదిలీ చేశాడు. తాను మోసపోయానని తెలుసుకుని ఈ నెల 1న ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడి ఫోన్ పే ఆధారంగా కాల్ డేటా సేకరించి ఆదివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పర్హానబేగ్ ‘గే’ కాదని, కేవలం ‘గే’లను పరిచయం చేసుకుని బ్లాక్ మెయిల్ చేసేందుకు జెండర్ యాప్లో ఉన్నాడని, గతంలో కూడా ఇలాంటి బ్లాక్మెయిలింగ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నా దారి రహదారి
అవని నుంచి అంతరిక్షం వరకు మహిళలు అసాధారణ విజయాలు సాధించి తమ సత్తా చాటుతున్నా.... ఇంకా లింగవివక్షతతో కూడిన బోలెడు ఆశ్చర్యాలు మిగిలే ఉన్నాయి. ఫిలింనగర్ బస్తీలో మక్కల మాధవి బస్ డ్రైవర్గా స్టీరింగ్ పట్టినప్పుడు... ‘ఇదేందీ!’ అని ఆశ్చర్యపోయిన వాళ్లే ఎక్కువ. ‘పెద్ద బస్పు నడపడం నీ వల్ల ఏమవుతుందమ్మా!’ అని నిరాశ పరిచిన వారే ఎక్కువ. అయినా సరే...‘నా దారి రహదారి’ అంటూ మాధవి దూసుకువెళుతూ తన డ్రైవింగ్ స్కిల్స్తో శభాష్ అనిపించుకుంటోంది...హైదరాబాద్ ఫిలింనగర్లోని గౌతమ్నగర్ బస్తీలో నివసించే మక్కల మాధవి భర్త రాజేష్ ‘జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్’ బస్సు డ్రైవర్గా గత పది సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. ఇదే బస్సులో మాధవి అటెండర్గా పని చేసేది. భర్త బస్సు నడుపుతున్న తీరు చూసి డ్రైవింగ్పై ఆసక్తి పెంచుకుంది. స్కూల్ మైదానంలో భర్త ద్వారా డ్రైవింగ్లో శిక్షణ తీసుకొని ఏడాది క్రితం నుంచే బస్సు నడపడం మొదలుపెట్టింది. స్కూల్ చైర్మన్, ప్రిన్సిపాల్తోపాటు టీచర్లు కూడా ఆమె పట్టుదలకు ఫిదా అయ్యారు. ప్రోత్సహించారు. పూర్తి అనుభవం వచ్చాకే స్కూల్ బస్సు నడుపుతానని జేహెచ్పీఎస్ యాజమాన్యానికి తెలియజేసింది.డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లిన మాధవిని చూసి ‘బక్కపల్చగా ఉన్న ఈమె బస్సు ఏం నడుపుతుంది!’ అని అధికారులు వ్యంగ్యంగా మాట్లాడటమే కాకుండా బస్సు నడపడానికి తిరస్కరించారు. అయితే మాధవి ఏమాత్రం నిరాశ పడలేదు. మూడోసారి వెళ్ళి ఒకసారి తాను బస్సు నడపడం చూడాలని, నచ్చకపోతే లైసెన్స్ ఇవ్వొద్దని వేడుకుంది. ఎత్తు, ఒంపుల్లో బస్సును నడిపించి ఎలాగైనా అనర్హురాలిగా చేసి పంపాలనుకున్న అధికారులు మాధవి బస్సు నడిపించే తీరు చూసి ఆశ్చర్యపోయారు. అభినందించారు. పరీక్షలో పాస్ కావడంతో మాధవికి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేశారు. స్కూల్ యాజమాన్యం కూడా ఆమెను మరింత ప్రోత్సహిస్తూ పిల్లలను తీసుకురావడం, ఇంటి దగ్గర దింపేందుకు బస్సు నడిపే బాధ్యతను అప్పగించింది. గో ఎ హెడ్డ్రైవింగ్ చేస్తానని చెప్పినప్పుడు నా భర్త కాస్త భయపడ్డాడు. అయితే నాకు నేర్పించే క్రమంలో గ్రౌండ్లో నా డ్రైవింగ్ చూసి ఆయనకు భయం పోయింది. దీంతో మెల్లమెల్లగా ప్రతిరోజూ అదే గ్రౌండ్లో రెండు గంటలపాటు డ్రైవింగ్ప్రాక్టిస్ చేసేదాన్ని. బస్సు డ్రైవింగ్ పూర్తిగా వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్కూల్ యాజమాన్యం, టీచర్లు వెన్ను తట్టి ప్రోత్సహించడం, బస్సు నడుపుతున్నప్పుడు గో ఏ హెడ్ అని పిల్లలు అరవడం నాకు ఉత్సాహాన్ని ఇచ్చింది.– మక్కల మాధవి – పురుమాండ్ల నరసింహారెడ్డి,సాక్షి, హైదరాబాద్ -
ఫిల్మ్నగర్ పాపం.. ట్రాఫిక్ పోలీసులదే..!
కొందరు అవినీతి ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్ నిర్వాకం... వెరసీ.. ఓ కుటుంబాన్ని పెను విషాదంలో నింపాయి. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసి కనీసం కన్నవారికి ‘ముఖం’ చూసే అదృష్టం కూడా లేకుండా చేశాయి. మంగళవారం (Tuesday) ఉదయం షేక్పేట ఆంజనేయస్వామి దేవాలయం వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం పదేళ్ల చిన్నారి అథర్వి ఉసురుతీసింది. ఈ పాపం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదేనని చెప్పక తప్పదు. ఉత్తర్వులు ఉత్తవేనా? హైదరాబాద్ (Hyderanad) నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ఈ మేరకు గత ఏడాది ఫిబ్రవరి 20న ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలో ప్రవేశించే అనుమతి ఉన్న వాహనాలకు సైతం నిర్ణీత సమయాలు కేటాయించారు. నగరంలో ఉన్న రహదారుల్ని మొత్తం 91 రకాలైన రూట్లుగా పోలీసులు విభజించారు. వీటిలో కొన్నింటిలో కొన్ని రకాలైన వాహనాలను నిషేధించడం, నిర్దేశిత సమయాలు కేటాయించడం చేశారు. ఈ మార్గాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఆయా వాహనాలు ప్రయాణించాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. 10 టన్నుల కంటే మించొద్దు.. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి వచ్చే 10 టన్నుల కంటే ఎక్కువ బరువుతో కూడిన కమర్షియల్ వాహనాలు నగరంలోకి ప్రవేశించడాన్ని పూర్తిగా నిషేధించారు. లోకల్ లారీలతో పాటు నిర్మాణ సామగ్రి తరలించే 10 టన్నుల కంటే ఎక్కవ బరువుతో కూడిన వాహనాలు రాత్రి 11 ఉదయం 7 గంటల మధ్య మాత్రమే నగరంలో సంచరించాలి. డీసీఎం, ఐచర్, స్వరాజ్ మజ్దా వంటి మధ్య తరహా గూడ్స్ వాహనాలు (3.5 టన్నుటు–12 టన్నుల మధ్య బరువుతో కూడినవి) మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు మాత్రమే తిరగాలి. కాసులు కురిపించడమే కారణమా? షేక్పేటలో చిన్నారిని చిదిమేసిన లారీ పంచదార లోడ్తో ప్రయాణిస్తోంది. ఇది కేవలం రాత్రి 11 నుంచి ఉదయం 7 వరకు మాత్రమే నగరంలో తిరగాలి. అయితే.. ప్రమాదం చోటు చేసుకున్న 8.10 గంటలకు అది నగరంలోనే ఉంది. ఈ తరహా లారీలే కాదు... నగరంలో మరికొన్ని వాహనాలు తిరుగుతూ కొందరు ట్రాఫిక్ పోలీసులకు కాసులు పండిస్తున్నాయి. అక్కడ నుంచి మట్టి తరలించే, నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ను తీసుకువచ్చే వాటిని ‘వదిలేయడం’ కోసం యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకుని మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రయితే చాలు రాకాసులే.. ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతం చాలా కీలకమైంది. నగర శివార్లలో ఉన్న, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్లో ఉన్న అనేక కార్యాలయాలు, పాఠశాలలకు చెందిన బస్సులు, వాహనాలతో ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అలాంటి సమయంలోనూ ఓ లారీ మృత్యు శకటంగా దూసుకొచ్చిందంటే దానికి కారణం అయితే మామూళ్ల మత్తయినా అయి ఉండాలి.. లేదంటే నిబంధనలు అతిక్రమించిందంటూ ‘ఉక్కుపాదం’ మోపిన ట్రాఫిక్ పోలీసులు ఓ చలానా రాసి వదిలేసైనా ఉండాలనే వాదన వినిపిస్తోంది. చదవండి: ‘మమ్మీ బాయ్..’ఈ రెంటిలో ఏది జరిగినా ఆ పాపం మాత్రం కచ్చితంగా ట్రాఫిక్ పోలీసులదే. నగరంలోకి పగలంతా లారీల ప్రవేశం లేకపోవడంతో రాత్రయిందంటే చాలు ఒక్కసారిగా రోడ్లపైకి వస్తాయి. వాయు వేగంతో దూసుకుపోయే ఇవి రాకాసులుగా మారుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు సైతం పాయింట్స్లో ఉండకపోవడంతో విజృంభిస్తున్నాయి. -
పొన్నాల ఇంట భారీ చోరీ
హైదరాబాద్, సాక్షి: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లక్షన్నర నగదుతో పాటు భారీగా అభరణాలు దొంగలు దోచుకెళ్లారు. ఫిలిం నగర్ పోలీసులకు ఈ ఘటనపై పొన్నాల సతీమణి అరుణాదేవి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాంపల్లి కోర్టు వార్నింగ్.. దగ్గుబాటి హీరోలపై కేసు నమోదు
టాలీవుడుకు చెందిన దగ్గుబాటి వెంకటేష్,సురేష్, రానాలపై కేసు నమోదైంది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఇప్పటికే నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ.. దక్కన్ కిచెన్ హోటల్ను కూల్చివేసినందుకు వారిపై కేసు నమోదైంది. దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, రానా, అభిరామ్పై 448, 452,458,120బి సెక్షన్లపై కేసు నమోదైంది.వివాదం ఏంటి..?డెక్కన్ కిచెన్ లీజు విషయంలో ఆ హోటల్ యజమాని నందకుమార్, దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య వివాదం ఏర్పడింది. ఫిలిం నగర్లోని వెంకటేష్కు చెందిన స్థలంలో నందకుమార్ వ్యాపారం నిర్వహించేవాడు. లీజు విషయంలో ఇద్దరి మధ్య విబేదాలు రావడంతో హోటల్ యజమానీ కోర్టుకు వెళ్లాడు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని ధిక్కరించి అక్రమంగా బిల్డింగ్ కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీంతో దగ్గుబాటి ఫ్యామిలీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. న్యాయస్థానం సూచనల మేరకు వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.దగ్గుబాటి ఫ్యామిలీ ఏం చెబుతుంది..?జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్డు నంబర్ ఒకటిలో వెంకటేష్కు చెందిన 1000 గజాలు స్థలాన్ని సుమారు ఆరేళ్ల క్రితం నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. అక్కడ డెక్కన్ కిచెన్ పేరుతో ఆయన ఒక రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. అయితే, ఈ స్థలానికి పక్కనే ఉన్న రానాకు చెందిన స్థలాన్ని కూడా నందకుమార్ లీజుకు తీసుకుని నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడే వారి మధ్య వివాదం తలెత్తింది. రానా నుంచి తీసుకున్న స్థలం లీజు పూర్తి అయింది. కానీ, ఆ స్థలంలో నందకుమార్ నిర్మాణాలు చేయడంతో రానా జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆపై జీహెచ్ఎంసీ అధికారులు నందకుమార్కు నోటీసులు జారీ చేసి డెక్కన్ కిచెన్ నిర్మాణాలను కూల్చివేశారు. కానీ, దగ్గుబాటి కుటుంబ సభ్యులు 60 మంది బౌన్సర్లతో తన రెస్టారెంట్ను కూల్చివేశారని నాంపల్లి కోర్టును నందకుమార్ ఆశ్రయించారు. ఈ స్థలం విషయంలో నందకుమార్పై కూడా కేసు నమోదు అయింది. దగ్గుబాటి కుటుంబానికి చెందిన స్థలాన్ని నందకుమార్ తన స్థలంగా చెప్పుకుంటూ మరో ఇద్దరికి లీజుకు ఇచ్చారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై రెండు కేసులో నమోదు అయ్యాయి. -
ఫిల్మ్ నగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఫిలింనగర్: నూతన సంవత్సర వేడుకల వేళ ఫిలింనగర్లో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్తో పాటు ఓ కొనుగోలుదారును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. షేక్పేటలోని ఫాల్కన్ కాలనీలో నివసించే ఎండీ అబ్దుల్ ఇర్ఫాన్ కారు డీలర్గా పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి షేక్ మహ్మద్ రెహమాన్ అలీ న్యూ ఇయర్ వేడుకలకు అవసరమైన వారికి డ్రగ్స్ విక్రయించేందుకు ముంబై నుంచి ఇటీవలే ఎండీఎంఏ డ్రగ్స్ను నగరానికి తీసుకువచ్చాడు. ఇర్ఫాన్తో కలిసి నాలుగు రోజుల పాటు డ్రగ్స్ విక్రయించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఫిలింనగర్లోని కొత్త చెరువు వద్దకు రెహమాన్ అలీ చేరుకుని మరో పెడ్లర్ ఇర్ఫాన్ను అక్కడికి పిలిపించాడు. అవసరమైన వారికి సరుకును విక్రయించే క్రమంలో బహదూర్పురాకు చెందిన సయ్యద్ హజ్మతుల్లాను పిలిపించారు. కొత్త చెరువు వద్ద వీరిద్దరూ కలిసి హజ్మతుల్లాకు డ్రగ్స్ ఇచ్చే క్రమంలో అప్పటికే సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రెహమాన్ అలీ ఇటీవలే డ్రగ్స్ను ముంబై నుంచి తీసుకు వచ్చినట్లుగా తేల్చారు. ఇర్ఫాన్తో కలిసి డ్రగ్స్ను విక్రయించాలని పథకం వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేయడానికి వచి్చన హజ్మతుల్లాతో పాటు వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరి నుంచి పెద్ద ఎత్తున ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాదీనం చేసుకున్నారు. ఫిలింనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫొటోలు తీసి.. డబ్బులు వసూలు
ఫిలింనగర్: ఫొటోలు తీసి ఓ ‘గే’ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ఓ వ్యక్తిపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. షేక్పేట ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి స్వలింగ సంపర్కుడు (గే). ఇటీవల గ్రిండర్ అనే డేటింగ్ యాప్లో అతనికి ఓ గుర్తు తెలియని వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో అతన్ని ఈ నెల 23న తన ఫ్లాట్ రావాలని ఆహ్వానించాడు. ఆ సమయంలో ఇద్దరూ శారీరకంగా కలుసుకునే క్రమంలో సదరు గుర్తు తెలియని వ్యక్తి అతనిని నగ్నంగా ఫొటోలు తీశాడు. తనకు రూ.15,000లు ఇవ్వాలని బాధితుడిని ఆ వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో తన వద్ద అంత లేవని రూ.10,000లను యూపీఐ పేమెంట్ ద్వారా చెల్లించాడు. తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును దర్యాప్తు చేస్తున్నారు. -
కీచక టీచర్ నిర్వాకం.. ట్యూషన్లోనే
సాక్షి,హైదరాబాద్: విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే కీచకుడిగా మారాడు. పదో తరగతి విద్యార్థినిపై ట్యూషన్ మాస్టర్ వెకిలి చేష్టలకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పిలింనగర్లో దారుణం జరిగింది. పదో తరగతి బాలికపై ట్యూషన్ ఉపాధ్యాయుడు రాములు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఉపాధ్యాయుడు చేసిన పనికి మనోవేదనకు గురైన విద్యార్థిని దుఃఖాన్ని దిగమింగుకొని ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కీచక టీచర్ రాములుపై ఫిలింనగర్ పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. -
లడ్డూ దక్కించుకున్న సినీ నిర్మాత కొండేటి సురేష్
ప్రముఖ సినీ నిర్మాత, సంతోషం అధినేత కొండేటి సురేష్ గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఫిలింనగర్ దైవసన్నిదానంలో శనివారం నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంలో పాల్గొన్న ఆయన ’ 19 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు గణపతి చేతిలో పూజలందుకున్న లడ్డూ తనకు దక్కడం సంతోషంగా ఉందని, ప్రతియేటా తాను లడ్డూ వేలం పాటలో పాల్గొని లడ్డూను దక్కించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, ఆలయ కోశాధికారి కాజా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు
సాక్షి, హైదరాబాద్: నందిగిరి హిల్స్లో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారు క్షణాల్లో పూర్తిగా దగ్ధమైంది. దీంతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి ఫిల్మ్నగర్ వరకు భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వెళ్తున్న కారులో అకస్మాత్తుగా బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఘటనాస్థలానికి చేరుకునే క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో అగ్నిమాపక సిబ్బందికి సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులో మంటలు చెలరేగడంతో పాదచారులు భయంతో పరుగులు పెట్టారు. -
నిర్మాత బండ్ల గణేష్పై కేసు నమోదు
ఫిలింనగర్: తన ఇంట్లో అద్దెకు ఉంటున్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ఇచ్చిన పిర్యాదు మేరకు సినీ నిర్మాత బండ్ల గణేష్పై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాలివీ... నౌహిరా షేక్ ఫిలింనగర్లోని తన ఇంటిని నిర్మాత బండ్ల గణేష్కు నెలకు రూ. లక్ష అద్దె చొప్పున కిరాయికి ఇచ్చింది.అయితే గత కొంతకాలంగా గణేష్ అద్దె ఇవ్వకపోగా గుండాలతో తనను బెదిరిస్తున్నారని, తనను ఇంట్లోకి అనుమతించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. అతను ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు సమాచారం అందిందని, గుండాల సహాయంతో, రాజకీయ నాయకుల అండతో ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. నౌహీరా ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు బండ్ల గణేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిల్మ్ ఛాంబర్లో అగ్ని ప్రమాదం.. ఎగిసిపడిన మంటలు!
హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కార్యాలయంలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంగి మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. మరోవైపు భవనం చుట్టు దట్టమైన పొగలు కూడా అలుముకున్నాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్లో ప్రమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. తన ప్రేమను కాదంటున్నాడని పక్కా పథకంతో లండన్ నుంచి వచ్చిన ఓ యువకుడు తన సన్నిహితురాలి భర్తను దారుణంగా హత్య చేశాడు. వివరాలు.. షేక్పేట సమీపంలోని జైహింద్నగర్ కాలనీలో నివసించే గౌస్ మొహినుద్దీన్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి దుబాయ్లో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఇటీవలే నగరానికి వచ్చి భార్యాపిల్లలతో ఉంటున్నాడు. ఆయన భార్య మీనా రూహీ 2002 ఫిబ్రవరిలో ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లింది. మూడు నెలలకే ఆమె భర్త గౌస్ మొహినుద్దీన్ కూడా ముగ్గురు పిల్లలను తీసుకుని లండన్ వెళ్లి ఆమెతో పాటు కొన్నాళ్లు ఉన్నారు. పిల్లల ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. గౌస్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని నగరానికి వచ్చారు. భార్య మీనా లండన్లో ఉంది. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన అద్నాన్ హుస్సేన్ (26)తో ఆమెకు పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్యసానిహిత్యం ఏర్పడింది. తనను పెళ్లి చేసుకోవాలని మీనా రూహీని బలవంతం పెట్టాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలను చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో ఆమె హైదరాబాద్కు తిరిగివచ్చింది. గత నవంబర్ 14న అద్నాన్పై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అద్నాన్పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే.. మీనాను తనతో పాటు తీసుకెళ్లాలని పక్కా పథకంతో అద్నాన్ లండన్ నుంచి నగరానికి వచ్చాడు. ఇందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఒకరి జోలికి మరొకరు వెళ్లవద్దని ఒప్పందం చేసుకుని వీడియో రికార్డింగ్ కూడా చేసుకున్నారు. కాగా.. ఈ నెల 14న రాత్రి గౌస్ మొహినుద్దీన్ తన భార్య, ముగ్గురు పిల్లలను తీసుకుని పుప్పాలగూడలో ఓ విందుకు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్పై తన ఇంటికి వచ్చాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న అద్నాన్ బలవంతంగా ఇంట్లోకి వెళ్లి మీనా రూహీని తనతో పాటు బలవంతంగా తీసుకువెళ్లేందుకు యత్నించగా ఆమె భర్త గౌస్ అడ్డుకున్నాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో అద్నాన్ ఆగ్రహంతో ఊగిపోతూ గౌస్ గుండైపె గట్టిగా పొడిచాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గౌస్ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
Hyderabad: ఫిలింనగర్లో ఎన్ఆర్ఐ దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఇటీవల యూకే నుండి హైదరాబాద్ వచ్చిన ఎన్నారై గౌస్ మొయినుద్దీన్ను దుండగులు హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు గౌస్ మొయినుద్దీన్ ఇటీవల యూకే నుండి నుండి హైదరాబాద్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వైశ్య లైమ్ లైట్ అవార్డ్స్లో ఆకట్టుకున్న మోడల్స్ ర్యాంప్ వాక్.. ఫోటోలు
-
యువతకు ఇందులో అవకాశాలున్నాయి! : సెలబ్రిటీ డిజైనర్ 'షబ్నమ్ గుప్తా'
సాక్షి, హైదరాబాద్: యువతలకు ఇంటీరియర్ డిజైనింగ్లో అద్భుతమైన అపారమైన అవకాశాలు ఉన్నాయని, సృజనకు పదును పెట్టుకుంటే విజయాలు సుసాధ్యమని సెలబ్రిటీ డిజైనర్ షబ్నమ్ గుప్తా అన్నారు. నగరంలోని ఫిలిమ్నగర్లో ఏర్పాటు చేసిన కోషా ఇంటీరియర్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఆమె గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తన పీకాక్ లైఫ్ బ్రాండ్ను నగరానికి పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉందన్నారు. తన ఇంట్లో వేసిన కలర్స్ నచ్చక సొంతంగా రంగులు వేయడం అనే అభిరుచి నుంచి ప్రస్తుతం బాలీవుడ్ స్టార్స్ పరిణితి చోప్రా, ఇర్ఫాన్ ఖాన్, కంగనారనౌత్ తదితరుల ఇళ్లకు డిజైన్ చేసే దాకా సాగిన తన 3 దశాబ్దాల ప్రయాణాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేసుకున్నారు. శతాబ్దాల నాటి ఇంటీరియర్ వస్తువులకు కొత్త సొబగులు అద్దుతూ కోషాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ఉత్పత్తుల విశేషాలను సంస్థ సీఈఓ అజితా యోగేష్ వివరించారు. కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు పేజ్ త్రీ సోషలైట్స్, డిజైనింగ్ రంగ ప్రముఖులు.. హాజరయ్యారు. -
ఉదయం అదృశ్యం.. రాత్రికి మృతదేహం
హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) నగరంలోని ఓ టీవీ చానెల్లో కెమెరామన్గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్పై బయలుదేరాడు. రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్ ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో కార్తీక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్ జిల్లా శామీర్పేట్ చెరువులో పడి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్పేట్ చెరువు వద్ద బైక్తో పాటు కార్తీక్ మొబైల్ ఫోన్ పోలీసులకు కనిపించింది. దీని ఆధారంగా కార్తీక్ అడ్రస్ను కనిపెట్టి ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
మొన్న తల్లిదండ్రులు.. నిన్న కుమారుడు.. అనాథగా మారిన కూతురు!
హైదరాబాద్: ఫిలింనగర్లోని మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో మూడ్రోజుల క్రితం వంట గ్యాస్ లీకై దంపతులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో నివసించే మిర్యాల రమేష్.. ఇంట్లోని వంట గ్యాస్ లీకై న విషయాన్ని గ్రహించకుండా.. కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అదే రోజు రమేష్ మృతి చెందాడు. మరుసటి రోజు ఆయన భార్య శ్రీలత ఆస్పత్రిలో కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన కుమారుడు హర్షవర్ధన్ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడు మృతి చెందడంతో చెల్లెలు అనాథగా మారింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
హైదరాబాద్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో రోజు రోజుకూ డ్రగ్స్ దందా పెరుగుతోంది. నగరంలో రెండు వేరు వేరుప్రాంతాల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు నార్కోటిక్ పోలీసులు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రకు డ్రగ్స్ సప్లై చేస్తున్న అరుగురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు భారీగా నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు సీజ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో మామూనూరు బెటాలియన్ కానిస్టేబుల్ ప్రశాంత్ నాయక్ ఉన్నారు. పోలీస్ సైరన్ వేసుకొని చెక్పోస్ట్ను దాటేస్తున్న ఈ ముఠా.. పుష్పసినిమా తరహాలో వాహనాల్లో ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది. మరోవైపు ఫిలింనగర్లోనూ భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్లో డ్రగ్స్ పిల్స్ విక్రయిస్తున్న బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ పాస్టర్ డేవిసన్ను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద రూ 11 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.డేవిసన్.. ఆల్ ఇండియా నైజీరియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్గా ఉన్నారు. బెంగళూరు కేంద్రంగా దక్షిణ భారత్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. నకిలీ వీసా, పాస్పోర్టుతో ఇండియాలో ఉంటున్నట్లు తేలింది. -
ఫిలింనగర్లో కారు బీభత్సం.. ర్యాష్ డ్రైవింగ్తో రెచ్చిపోయిన మహిళ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని ఫిలింనగర్లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్లో చెట్టును ఢీకొట్టింది. తర్వాత కారు కంట్రోల్ అవ్వకపోవడంతో ఎలక్ట్రికల్ పోల్, గోడను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో ఎగిరి పడ్డాయి. అయితే కారును అక్కడే వదిలేసిన యువతి.. తన హై హీల్స్ భుజాన వేసుకుని సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాగా ప్రమాద స్థలంలో గుడిసెలో ఓ వాచ్ మెన్ కుటుంబం నివాసముంటోంది. గుడిసెకు అడుగుదూరంలో కారు ఆగడంతో సదరు కుటుంబం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలో కరెంట్ స్తంభం, గోడ కూలిపోయాయి. అంతా మట్టి,రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో గోడకు తగిలి కారు అయిపోయింది. లేదంటే నేరుగా ఎదురుగా గుడిసెలోకి దూసుకెళ్లేదని స్థానికులు అంటున్నారు. కారు అదే స్పీడ్లో వెళ్ళి ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఫిలింనగర్ పోలీసులు కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా? -
హైదరాబాద్ ఫిలింనగర్ లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం
-
ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడి...
హైదరాబాద్: ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి అక్రమంగా చొరబడడంతో పాటు ఆమెను నిర్బంధించి దాడి చేయడమే కాకుండా ఇంటిని ధ్వంసం చేసి అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలతో ఇద్దరు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్లోని వినాయక్నగర్ బస్తీలో నివసించే కవిత అనే మహిళ ఇంట్లోకి అదే బస్తీకి చెందిన పిల్లికళ్ల కురుమూర్తి(38), పిల్లికళ్ల శేఖర్(32) మద్యం మత్తులో ప్రవేశించి దుర్భాషలాడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా ఇంట్లోని సామాన్లను ధ్వంసం చేస్తూ వీరంగం సృష్టించారు. కిటీకి అద్దాలతో పాటు టీవీని ధ్వంసం చేశారు. పూల కుండీలు ఎత్తేస్తూ ఇళ్లంతా బీభత్సం సృష్టించడంతో పాటు ఆమెను భయాందోళనకు గురిచేశారు. అడ్డుకునేందుకు ప్రయతి్నంచిన కవితపై దాడికి దిగారు. ప్రాణాలు ఆరచేతుల్లో పెట్టుకున్న బాధితురాలు వారి బారినుంచి తప్పించుకుని ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితులపై ఐపీసీ 452,.354(బి), 341, 323, 427 నాన్బెయిలబుల్సెక్షన్ల కింద కేసు నమోదు చేసి శుక్రవారం రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉండగా వీరిద్దరూ ఇటీవల బోనాల పండగ రోజు కూడా మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. దీంతో పాటు దాడులకు పాల్పడడుతూ ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదయింది. ఆ ఘటన మరువక ముందే మరోమారు వీరిద్దరూ బస్తీలో దౌర్జన్యానికి దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. వరుస సంఘటనలతో వినాయక్నగర్లో పెరిగిపోతున్న దౌర్జన్యాలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ఒకరితో సహజజీవనం..మరోకరితో ప్రేమాయణం..చివరికీ..
హైదరాబాద్: యువతిని గాఢంగా ప్రేమించాడు.. ఆమె ఫొటోను ఛాతిమీద పచ్చబొట్టుగా వేయించుకున్నాడు... పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు...ఆమెతో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి ప్రియురాలు నో చెప్పడంతో ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కర్నూలుకు చెందిన శివ ప్రసాద్(23) ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. కొంత కాలంగా ఫిలింనగర్లోని దుర్గా భవానీనగర్లో గది అద్దెకు తీసుకొని కవిత అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఒక వైపు సహజీవనం చేస్తూనే మరో వైపు అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ నర్సుతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఆమె ఫొటోను..పేరును కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు. తనతో సహజీవనం చేస్తూ మరో యువతితో ప్రేమ పేరుతో తిరుగుతున్న శివ ప్రసాద్ను సహజీవనం చేస్తున్న యువతి కవిత మూడు రోజుల క్రితం నిలదీసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తనను మోసం చేశాడని భావించిన కవిత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది జరుగుతుండగానే శుక్రవారం సాయంత్రం ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుందామని శివ ప్రసాద్ అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. సహజీవనం చేస్తున్న యువతి నిద్రమాత్రలు మింగి ఆస్పత్రిలో చేరడం, ప్రేమించిన యువతి పెళ్లికి అంగీకరించకపోవడంతో శివప్రసాద్ శనివారం తెల్లవారుజామున తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోలుకున్న యువతి కవితను పోలీసులు ఆస్పత్రి నుంచి పునరావాస కేంద్రానికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిలింనగర్: ఉద్యోగం మానేశానని భర్తకు ఫోన్ చేసి .. ఇంట్లో నుంచి బయటకు
హైదరాబాద్: అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అదృశ్యమైన ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్లోని బాలరెడ్డినగర్లో నివసించే సాయి కృష్ణవేణి విప్రో సర్కిల్లోని ఓ బ్యాంక్ లో పనిచేస్తుంది. ఆమెకు మూడేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ నెల 1న తన భర్త ప్రవీణ్ కుమార్కు ఫోన్ చేసి తాను ఉద్యోగం మానేశానాని ఇంటిలో నుంచి వెళ్లిపోతున్నానని చెప్పి ఫొన్ స్విచ్ఛాప్ చేసింది. ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. తన భార్య కనిపించడం లేదంటూ ప్రవీణ్ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
ఫిలింనగర్: ‘అమ్మా.. నేనేం పాపం చేశానమ్మా?’
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లు కూడా నిండని ఆ కొడుకును.. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పైగా కడుపులో మరో బిడ్డ పెరుగుతోంది. అయితే కుటుంబ సమస్యలు.. క్షణికావేశం ఆ తల్లి ఆలోచనా శక్తిని చంపేసినట్లున్నాయ్. ఫలితంగా.. ఘోరానికి పాల్పడిందామె. నగరంలోని ఫిలింనగర్ తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. అత్తింటి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే తాను చనిపోతే పిల్లాడి ఆలనా పాలనా చూసుకునేవారు ఎవరూ ఉండరనుకుందో ఏమో.. ఆ తల్లి ఘోరమైన నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి సైతం ఉరేసింది. విశ్వనాథ్, శిరీషలు ఫిలింనగర్లోని వినాయక నగర్లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు మనీష్ అనే కొడుకు ఉన్నాడు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు చాలాకాలంగా శిరీషను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీష మరోసారి గర్భం దాల్చింది. మూడు నెలల కడుపుతో ఉన్న ఆమె.. అత్తింటి వారి వేధింపుల్ని భరించలేకపోయింది. శుక్రవారం రాత్రి చిన్నారి మనీష్తో పాటు తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృత దేహాలను ఉస్మానియా కి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: ఆమెపై మోజుతో భార్యకు నరకం.. ఫేస్బుక్ లైవ్లోనే.. -
Hyderabad: అనుమానాస్పదంగా సినీ రచయిత మృతి
ఫిల్మ్ నగర్(హైదరాబాద్): ఎన్నో సినిమా కథలు రాశాడు. ఎన్నో పాత్రలు సృష్టించాడు. ఆ పాత్రలకు ప్రాణం పోశాడు. వాటిని వెండి తెర మీద చూసి మురిసిపోదామనుకున్నాడు. కానీ పరిస్థితులు కలిసిరాక అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక పోయాడు. వందలాది కథలు రాసుకున్న ఆయన ‘కథ’ అర్ధాంతరంగా ముగిసింది. ఇది ఓ కథా రచయిత విషాద గాథ. ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఘటన వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తిసాగర్ (50) సినిమాల్లో కథలు రాయడంపై మక్కువతో చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చాడు. షేక్ పేట్ పరిధిలోని ఓ పెంట్ హౌస్లో నివాసం ఉంటున్నాడు. సినిమా కథలతో పాటు సహాయ దర్శకుడిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున టెర్రస్పై విగత జీవిగా కనిపించాడు. చదవండి: హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన బుల్లితెర నటి! ఇది గమనించిన స్నేహితుడు 108 కు సమాచారం అందించాడు. వారు వచ్చి అప్పటికే మృతి చెందినట్టు నిర్దారించారు. గత కొంత కాలంగా సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళాడు. స్నేహితుడు రాధాకృష్ణ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతని గదికి వెళ్లి చూడగా తాను రాసుకున్న వందలాది కథలు గది నిండా ఉన్నాయి. వాటిని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. అతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో ఉస్మానియా మార్చురీలో భద్రపరిచారు. -
చిన్న ప్రమాదమే, క్షేమంగానే ఉన్నాను: శర్వానంద్
‘నా కారు చిన్న ప్రమాదానికి గురైంది. కానీ, నేను క్షేమంగానే ఉన్నాను’ అంటూ హీరో శర్వానంద్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ జంక్షన్ లో శర్వానంద్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా శర్వానంద్ స్పందిస్తూ – ‘‘ఈ రోజు (ఆదివారం) ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది చాలా చిన్న ప్రమాదం. మీ అందరి ప్రేమ, ఆశీస్సులతో నేను క్షేమంగానే ఉన్నాను. నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన పడొద్దు’’ అన్నారు. కాగా జూన్ 3న రాజస్థాన్ లో శర్వానంద్ వివాహం రక్షితతో జరగనున్న విషయం తెలిసిందే. There has been news that my car met with an accident this morning. It was a very minor incident.I am absolutely safe and sound at Home with all your love and blessings. There is nothing to worry about. Thank you all for your concern.Have a great Sunday everyone.— Sharwanand (@ImSharwanand) May 28, 2023 -
హీరో శర్వానంద్కు ప్రమాదం..
-
Hyderabad: ఇద్దరు బాలికల అదృశ్యం
సాక్షి, బంజారాహిల్స్: ఫిలింనగర్లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న వి.శిరీష (12) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. అయితే తమ కూతురిని డబ్బు కోసం కిడ్నాప్ చేశారంటూ తండ్రి వి.కృష్ణ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లోని దుర్గా భవానీనగర్లో నివసించే వి.శిరీష స్థానికంగా ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 12న ఉదయం తల్లిదండ్రులు జీహెచ్ఎంసీలో పనులకు వెళ్లగా, ఇంట్లో ఉన్న సోదరి కనిపించడం లేదంటూ కొడుకు నరేష్ తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న కృష్ణ, సుజాత దంపతులు అన్ని ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. తనకు వరుసకు మేనల్లుడు వి.మల్లేష్ (22) కూడా కనిపించడం లేదని, అతడిపైనే తమకు అనుమానం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణ పేర్కొన్నాడు. డబ్బుల కోసం తన కూతురిని కిడ్నాప్ చేశారని, సీసీ కెమెరా ఫుటేజీలో మల్లేష్ తల్లి సరోజమ్మ తన కూతురిని తీసుకెళ్తున్న దృశ్యం కనిపించిందన్నారు. మల్లేష్ ఇటీవల తనను రూ. 50 వేలు అడిగాడని, తాను లేవని చెప్పడంతో కక్ష పెంచుకొని తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని ఆరోపించారు. బంజారాహిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శిరీష ఆచూకీ తెలిసిన వారు 8712660458 నంబర్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. బంజారాహిల్స్లో 9వ తరగతి విద్యార్థిని బంజారాహిల్స్: అనుమానాస్పదస్థితిలో 9వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం 10లోని నూర్నగర్లో నివసించే అమ్రీన్ బేగం(14) సెయింట్ నిజామియా హైస్కూల్లో చదువుతోంది. ఈ నెల 21న జహిరానగర్లోని షాహిన్ కన్వెన్షన్ హాల్లో పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఫేర్వెల్ పార్టీకి హాజరైంది. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోదరుడు హనీఫ్ ఫోన్ చేయగా కార్యక్రమం ఇంకా జరుగుతున్నదని, కొద్దిసేపట్లో వస్తానని తెలిపింది. అయితే సోదరుడు కొంత సమయం తర్వాత హాల్ వద్దకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తన చెల్లెలు అదృశ్యమైందని పోలీసులకు హనీఫ్ ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
కె. విశ్వనాథ్ కడసారి చూపు కోసం తరలి వచ్చిన సినీ ప్రముఖులు
తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఐదు దశాబ్దాల పాటు తెలుగు పరిశ్రమలో తనదైన ముద్రవేసిన విశ్వనాథ్ ఇక లేరన్న వార్త తెలుసుకొని చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగింది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. కె. విశ్వనాథ్ చివరి చూపు కోసం సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లోని ఆయన నివాసానికి వెంకటేశ్, మణిశర్మ, గుణశేఖర్, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్, సాయికుమార్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా కె. విశ్వనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ►విశ్వనాథ్ గారు లేరనే వార్త నన్ను బాధకు గురిచేసింది నాకు పితృసమానులు. విశ్వనాథ్ చిత్రాలు పండితుల నుంచి పామరుల వరకు అలరించాయి జనరంజకం చేస్తూ బ్లాక్ బస్టర్ చేయడం అనేది ఆయన కృషికి నిదర్శనం.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనుడు ఆయన దర్శకత్వంలో నేను నటించడం అదృష్టం. మా లాంటి నటులకు విశ్వనాథ్ ఓ గ్రంథాలయం. ఆయన చేత్తో అన్నం తినిపించిన గొప్ప వ్యక్తి. 'ఇంద్ర' సమయంలో వారణాసికి పిలవడంతో వచ్చారు ఆయన ప్రేమ వాత్సల్యం పొందిన నేను తండ్రిని పొగొట్టుకున్నంత బాధగా ఉంది- చిరంజీవి ► కె. విశ్వనాథ్ గారి మరణం చాలా బాధాకరం.ఆయన సినిమాలంటే నాకు చాలా ఇష్టం.ఆయన తెలుగు సినిమాకు మూలస్తంభం. తన సినిమాల ద్వారా సంస్కృతిని తెలియజేశారు. విశ్వనాథ్ గారి మరణం సినిమా రంగానికి తీరని లోటు అంటూ పపన్ కల్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. ► విశ్వనాథ్ గారు ఈరోజు లేరనే వార్త చాలా షాకింగ్గా, బాధగా అనిపిస్తుంది. దేశంలోని అత్యత్తుమ డైరెక్టర్లలో ఆయన ఒకరు. పాత తరమే కాదు, ఈనాటి జనరేషన్ కూడా ఆయన చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటాయి - విక్టరీ వెంకటేశ్ ► పుట్టినప్రతివాడికి మరణం తప్పదు. కానీ విశ్వనాథ్ గారి మరణం చాలా గొప్పది. - ఆయాన సినిమాల్లో నేను నటించాను. - ఎప్పుడు ఆప్యాయంగా పలకరించేవారు. - ఆయన కుటుంబంతో గడిపిన క్షణాలు మర్చిపోలేను. - ఆయన లేడు అనేది చాలా బాధాకరం. - భారతీయ చలన చిత్రాలలో విరబూసిన కమలం ఆయన - బ్రహ్మానందం ► కళా తపస్వి అన్న పేరుకు ఆయనే నిలువెత్తు సాక్ష్యం. ఆయన కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. అలాంటి మనిషి ఈరోజు లేరన్నది నిజం. కానీ ఇప్పుడు ఆయన్ను చూస్తుంటే యోగ నిద్రలో ఉన్నట్లున్నారు. ఒక భీష్మాచార్యుడిలాగా కనిపించారు. ఆయన ఆశీస్సులు మన అందరికి ఉండాలి. తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో సినిమాలు తీయాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి - సాయికుమార్ ► దర్శకత్వపు ప్రాథమిక సూత్రాలు ఆయన సినిమాల్లో కనిపిస్తాయి. ఆయన సినిమాలు మాలాంటి వాళ్లు ఎంతోమందిని ప్రభావితం చేశాయి. కాబట్టి ఆయన ఎప్పుడూ సజీవంగానే ఉంటారు. పాతతరమే కాదు యువతరం కూడా ఆయన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి - గుణశేఖర్ ►కె. విశ్వనాథ్ గారు గొప్ప మనిషి. ఆయనతో పనిచేసిన రోజుల్ని మర్చిపోలేను. ఈమధ్యే ఆయన్ను కలిశాను. ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి వెళ్లిపోయింది. కానీ దానికి పునాదులు వేసింది మాత్రం కె. విశ్వనాథ్ గారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి - సినీ నటి రాధిక ► ఒక తరం కదిలి వెళ్లిపోయినంత బాధగా ఉంది. అద్భుతమైన కళాఖండాలను చిత్ర పరిశ్రమకు అందించిన గొప్పవాళ్లలో కె. విశ్వనాథ్ది అగ్రతాంబూలం - పరచూరి గోపాలకృష్ణ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ను కంట్రోల్ చేసిన సురేష్ బాబు
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కారుదిగి స్వయంగా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అటువైపు వెళ్తున్న నిర్మాత సురేష్ బాబు స్వయంగా కారులోంచి దిగి ట్రాఫిక్ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ను క్లియర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాధ్యతగల పౌరుడిలా వ్యవహరించారంటూ సురేష్ బాబుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఫామ్ హౌస్ కేసు నిందితుడు నందకుమార్ ప్రాపర్టీ కూల్చివేత
-
Photo Feature: సినిమా చూపిస్త మామా!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఫిల్మ్నగర్ నుంచి దర్గా మార్గంలో ప్రయాణించే వారికి శుక్రవారం నుంచి కొత్తందాలు కనిపిస్తున్నాయి. దాదాపు అరకిలోమీటరు పొడవునా నాలుగు మీటర్ల వెడల్పయిన సెంట్రల్ మీడియన్ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతోపాటు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లేలా వాక్వే సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ మార్గంలోని నాలుగు సర్కిళ్లలో ఏర్పాటు చేసిన శిల్పాలు, వాటి చుట్టూ పెంచిన పూలమొక్కలతో ప్రత్యేకతను సంతరించుకుంది. సినీ ప్రపంచం తలపించేలా.. ఫిల్మ్నగర్ అంటేనే సినీమయం కావడంతో సినీప్రపంచాన్ని తలపించేలా సినీ కెమెరా.. సినిమాలో మాదిరిగా ఇద్దరి నడుమ కత్తియుద్ధం శిల్పాలతోపాటు ‘హ్యుమానిటీ’ ‘యూనిక్ లైట్ పోల్’ థీమ్స్తో కొలువుదీరిన మరో రెండు శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ఏర్పాటు చేసిన ఈ నాలుగు శిల్పాల తెరలను శుక్రవారం తొలగించడంతో ఆ మార్గంలో వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కళాకృతుల కోసం మొత్తం రూ. 30 లక్షలు ఖర్చయింది. పచ్చందాలు.. ఫౌంటెన్లకు మరమ్మతులు మరోవైపు త్వరలో చేపట్టనున్న పట్టణప్రగతిలో భాగంగా ఖాలీగా ఉన్న అన్ని ప్రదేశాల్లోనూ మొక్కలు పెంచి పచ్చదనం పరిచేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లై ఓవర్ల కింద స్తంభాల పైనా, రహదారుల వెంబడి ఉండే గోడలపైనా గ్రీన్ కర్టెన్స్ (వేలాడే తీగలు) తదితరమైన వాటితో పచ్చదనం పరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పాడైపోయిన ఫౌంటెన్లకు సైతం మరమ్మతులు చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దే యోచనలో అధికారులున్నారు. -
జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్ రెడ్డి మృతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ దాడిలో గాయపడ్డ రియల్టర్ రవీందర్రెడ్డి మృతిచెందారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. కాగా రవీందర్ రెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారిపై అతని అల్లుడు మోహన్రెడ్డి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జూబ్లీహిల్స్లో చోటుచేసుకుంది. బాధితుడు రవీందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చి తన కారులో ఉన్న సెల్ఫోన్ తీసుకోవడానికి రాగా అక్కడే కాపుకాసిన అతని బంధువు ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు రవీందర్ రెడ్డిని సమీపంలోని ఆపోలో ఆసుపత్రికి తరలించారు. చదవండి: బెదిరించానని చెబితే ఖతం చేస్తా... ఘటనా స్థలంలో పోలీసులు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. దాడికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ప్రత్యక్షసాక్షి వాచ్మెన్ను పోలీసులు విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా స్థిరాస్తి వ్యాపారంలో మూడున్నర లక్షల కమిషన్ విషయం గొడవకు కారణమని తెలుస్తోంది. చదవండి: ఆంత్రాక్స్ వ్యాధి కలకలం: మటన్ కొంటున్నారా..? జర జాగ్రత్త! -
బంజారాహిల్స్లో దారుణం బాలికను పిన్ని ఇంటికి తీసుకెళ్లి..
సాక్షి, బంజారాహిల్స్: ప్రేమ పేరుతో ఓ బాలికను బలవంతంగా అత్యాచారం చేసిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిలింనగర్లోని వినాయకగనర్ బస్తీలో నివసించే మహేష్ అలియాస్ కృష్ణ చైతన్య(20), డాటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. అదే బస్తీలో నివసించే 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని(16), ను గత నెల నుంచి ప్రేమిస్తున్నానని మాయా మాటలతో నమ్మించాడు. చదవండి: తియ్యటి మాటలు.. అందమైన ప్రొఫైల్ ఫోటోతో కోట్లు కొట్టేసింది ఆ తర్వాత ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు. గత నెల 14వ తేదీన మహేష్ తన ద్విచక్రవాహనంపై బాలికను తన పిన్ని ఇంటికి తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండ్రోజుల క్రితం బాలిక ఏడుస్తుండగా తండ్రి ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని చెప్పింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు మహేష్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: వివాహేతర సంబంధం: చంపేసి.. చెట్ల పొదల్లో పడేసి.. -
అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి
మెడపై రూపాయి కాయిన్ ట్యాటూ, చేతికి కట్టుకున్న తాడులో ఓమ్ లాకెట్, ఇయర్ రింగ్.. ఇలా ‘సర్కారువారి పాట’లో మహేశ్బాబు చాలా స్టయిలిష్గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన బర్త్డే సందర్భంగా విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్, జి. మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఫిల్మ్నగర్లోని తన నివాసంలో మహేశ్బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. అలాVó యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్లకు గ్రీన్ఇండియా చాలెంజ్ను విసిరారు మహేశ్బాబు. -
రఘుపతి వెంకయ్య నాయుడు ఫిల్మ్ నగర్గా మార్చాలి
‘‘తెలుగు సినిమా పరిశ్రమ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన రఘుపతి వెంకయ్య నాయుడు పేరును ఫిల్మ్నగర్కి చేర్చి ‘రఘుపతి వెంకయ్యనాయుడు ఫిల్మ్ నగర్’గా మార్చాలి’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్ ఎదుట ఉన్న రఘుపతి వెంకయ్య నాయుడు విగ్రహం వద్ద ఆయన 79వ వర్ధంతిని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ ఆధ్వర్యంలో నిర్వహించారు. ‘‘ఇక నుంచి ప్రతి సంవత్సరం మార్చి 15న రఘుపతి వెంకయ్యగారి వర్ధంతిని, అక్టోబర్ 15న జయంతిని ఘనంగా జరుపుతాం’’ అని ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ సభ్యులు పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్చాంబర్ వద్ద రఘుపతి వెంకయ్య నాయుడుగారి విగ్రహాన్ని బాగు చేయించి, దాని చుట్టూ ఫెన్సింగ్, గొడుగు, నిచ్చెనలాంటి వాటిని ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందిస్తా’’ అని మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘రఘుపతి వెంకయ్య అకాడమీ’ నూతన అధ్యక్షుడు యన్.గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు పి.విజయ వర్మ, ప్రధాన కార్యదర్శి జె.వి. మోహన్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బాబ్జీ, సహాయ కార్యదర్శి యస్.ఏ.ఖుద్దూస్, కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కమిటీ సభ్యులు గాంధీ, జమా, హనుమంతరావు తదితరులు వెంకయ్యనాయుడి సేవలను కొనియాడారు. -
శంషాబాద్లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నిర్మించండి
సాక్షి, హైదరాబాద్: సినిమా రంగంలోని 24 విభాగాల్లో పనిచేసే వారి నైపుణ్యాన్ని పెంచేందుకు వీలుగా అంతర్జాతీయ ప్రమాణాలతో శంషాబాద్ సమీపంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని ప్రముఖ నటులు చిరంజీవి, నాగార్జున.. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రి మంగళవారం చిరంజీవి ఇంట్లో వారితో భేటీ అయ్యా రు. చలనచిత్ర పరిశ్రమకు సంబంధించి పలు అంశాలను సమావేశంలో చర్చించారు. ఆన్లైన్ టికెటింగ్ విధానం అమలు తీరు తెన్నులపై చర్చించారు. టికెట్ల ధరలను నిర్ణయించే విధానాన్ని సరళీకరించే విధానం ఉండాలని మంత్రిని కోరారు. చిత్రపురి కాలనీ పక్కనే సినీ కార్మికులకు ఇళ్ల నిర్మాణానికి మరో 10 ఎకరాల స్థలం కేటాయించాలని, సినీ కార్మికులు, కళాకారుల కోసం కల్చరల్ కేంద్రం ఏర్పాటుకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు. సినీ, టీవీ కళాకారులకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా గుర్తింపు కార్డులు అందజేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సినీ కార్మికులకు వర్తింపచేయాలని, వారికి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రతిపాదించారు. ఇప్పటికే పలుమార్లు సినీ ప్రముఖులు, చిత్రపురి కాలనీ సభ్యులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నెల రెండో వారంలో మరోసారి సమావేశమై మరిన్ని అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ రామ్మోహన్రావు, నిర్మాత నిరంజన్రెడ్డి, కిషోర్బాబు పాల్గొన్నారు. మంత్రి తలసానికి పుష్పగుచ్ఛం ఇస్తున్న నాగార్జున, చిరంజీవి -
ప్రభుత్వ పాఠశాలలో మందుబాబుల వీరంగం
-
పాఠశాలను బార్గా మార్చేసి..
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో మందు బాబులు వీరంగం సృష్టించారు. దర్జాగా ప్రభుత్వ పాఠశాలనే బార్గా మార్చేసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. సరస్వతి కొలువే ఉండే చోట తరగతి గదుల్లో మద్యం తాగి సీసాలు పగలు గొట్టారు. గురువారం ఉదయం పాఠశాలను రీ ఓపెన్ చేయడంతో తాగుబోతుల బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుమారు 1600 మంది విద్యార్థులు రోడ్డుపైనే ఉండిపోయారు. పాఠశాలలో తాగుబోతుల ఆగడాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
బిచ్చమెత్తుకుంటున్న కథా రచయిత..
ఆశ ఆవిరైంది.. అవకాశం చిక్కనంది.. జీవితం ఒంటరైంది.. ఫుట్పాతే దిక్కయింది.. బిచ్చమే బతుకయింది...అయినా ఆయనలో ఆత్మస్థైర్యం సన్నగిల్లలేదు. సినిమాలపై ఆసక్తి తగ్గలేదు. ఒక్క చాన్స్ దొరక్కపోతుందా? అనే ఆశతో ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు. సినీ అవకాశం కోసం దాదాపు 55 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాడు. ఇప్పటికే 100 కథలు రాశాడు. ఇంకా రాస్తూనే ఉన్నాడు. 72 ఏళ్ల వృద్ధుడి వ్యధ ఇది. ఓ కథా రచయిత జీవిత కథ ఇది. బంజారాహిల్స్: గుంటూరు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి చెందిన కొండా రామారావుకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. తానూ వెండితెర మీద వెలిగిపోవాలని కలలు కనేవాడు. అదే ఆశతో 1964 ప్రాంతంలో మద్రాస్ రైలెక్కాడు. కానీ అవకాశాలు రాలేదు. తెలుగు సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్కు తరలిరావడంతో ఆయనా మకాం మార్చాడు. కనీసం చిన్న పాత్ర అయినా చేయాలని జూనియర్ ఆర్టిస్ట్గా చేరాడు. కానీ విఫలమయ్యాడు. ఇక కథలు రాసుకొని రచయితగానైనా రాణించాలని కలం పట్టాడు. ఒకట్రెండు కాదు.. ఏకంగా 100 కథలు రాశాడు. కానీ ఒక్కరూ ఆ కథలు వినలేదు.. అవకాశం ఇవ్వలేదు. పనిమనిషిగా ప్రస్థానం... ఎన్టీఆర్, ఏఎన్నార్, రావుగోపాల్రావు, కైకాల సత్యనారాయణ, రాజబాబులను తెరపై చూస్తూ తానూ అంతటివాడిని కావాలని రామారావు కలలు కన్నాడు. మద్రాస్ వెళ్లాక నాలుగైదు రోజులు పాండీబజార్ ఫుట్పాత్లపై కాలం వెళ్లదీశాడు. ఎన్టీఆర్ ఇల్లు జాడ తెలుసుకొని అక్కడ పని మనిషిగా చేరాడు. సమయం చూసి తన మనసులోని మాటను ఎన్టీఆర్కు చెప్పాలనుకున్నాడు. ఎన్టీఆర్ భార్య బసవతారకం ఓసారి మాటల సందర్భంలో రామారావు ఎందుకొచ్చాడో తెలుసుకొని... ‘సినిమాల్లో చేరాలంటే ఇళ్లల్లో కాదు పనిచేయాల్సింది. స్టూడియోల్లో అవకాశాలు వెతుక్కోవాల’ని సూచించి పంపించింది. అయితే రామారావుకు స్టూడియోల్లోనూ చుక్కెదురైంది. ఇక లాభం లేదని ఏఎన్నార్ ఇంటికి వెళ్లాడు. అక్కడో మూడు రోజులు పని చేసిన తర్వాత అవకాశాలు ఏమాత్రం దక్కవని అర్థమైంది. అప్పటి నటీనటులు జయలలిత, ఆర్.నాగేశ్వర్రావు, గీతాంజలి తదితరుల ఇళ్లలోనూ పనిచేస్తూ అవకాశాల కోసం ప్రయత్నించినా ఉపయోగం లేకుండా పోయింది. సినిమాల్లో వేషాల కోసం సరిగ్గా దశాబ్ద కాలం తిరిగినా ఎక్కడా అవకాశం రాలేదు. మద్రాస్ టు హైదరాబాద్ చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలిరావడంతో... రామారావు కూడా ఇందిరానగర్కు మకాం మార్చి జూనియర్ ఆర్టిస్ట్గా చేరాడు. చిన్న చిన్న వేషాలు వేస్తే కడుపుకింత తిండి దొరికేది తప్పితే.. సరైన అవకావం రాలేదు. ఈలోపు భార్య అంజమ్మ చనిపోవడం, ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లయి వెళ్లిపోవడంతో రామారావు జీవితం ఒంటరైంది. సినిమా అవకాశాల కోసం తిరగడానికి, కుటుంబ పోషణకు, పిల్లల పెళ్లిళ్లకు ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తులు అయిపోయాయి. ఇక ఫుట్పాతే ఆయనకు పూలపాన్పు అయింది. అదే ఆయన కథలకు వేదికయింది. తరచూ సినిమాలు చూస్తుంటే ఆ కథలపై వైరాగ్యం పుట్టుకొచ్చిందని, ఈ దిక్కుమాలిన కథలేంటంటూ నిర్వేదానికి గురై తానే ఫుట్పాత్పై కథలకు శ్రీకారం చుట్టానన్నాడు. అయితే వర్షం వచ్చినప్పుడల్లా రాసుకున్న కథలన్నీ తడిసిపోవడం జరిగిందన్నారు. 20 ఏళ్ల కాలంలో వందకు పైగా కథలు రాసి ఉంటానని చెప్పారు. సాంఘీకం, పౌరాణికం, చారిత్రాత్మకం, బయోపిక్స్ ఇలా ఏదైనా సరే అవలీలగా రాసే రామారావు... ఇప్పటికీ ఫిలింనగర్ శంకర్విలాస్ చౌరస్తాలోని ఓ బస్టాప్లో ఉంటున్నాడు. రాత్రి సమయాల్లో కథలు రాస్తూ తన కోరిక నెరవేర్చుకుంటున్నాడు. ఆనందం నాకిప్పుడు ఏ బాధా లేదు. రాత్రి 12గంటల వరకు ప్రశాంతంగా కథలు రాసుకుంటాను. కథా రచనలోనే నాకెంతో ఆనందం ఉంటుంది. ఇవి సినిమా రూపంలో రాకపోయినా... నేను నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను. కథలు సినిమాలకు పనికిరాకపోయినా ఇలాగే రాస్తుంటాను. ప్రతిరోజు రెండు పత్రికలుచదువుతాను. ఆదివారమైతే నాలుగు కొంటాను.ఎప్పటికైనా ఎవరైనా దర్శక నిర్మాతలు నన్ను సంప్రదించకపోతారా? అనే ఆశతో ఎదురుచూస్తున్నాను. ఆకలి ఆకలి తీర్చుకునేందుకు ఫిలింనగర్లోని రాజరాజేశ్వరీ దేవాలయం వద్ద ప్రతిరోజు 3గంటల పాటుకూర్చుంటాను. ఆ సమయంలో కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. వాటిని పుస్తకంలో రాసుకుంటాను. రోజూ రూ.50 మాత్రమే చేతిలో పడ్డాక తిరిగి వెళ్తాను. అవి నా తిండికి సరిపోతాయి. అంతకన్నా ఎక్కువఅవసరం లేదు. -
టక్కున చేరుకొని.. అక్కున చేర్చుకొని..
అది ఫిలింనగర్ బస్టాప్. ఓ మహిళను ఆమె భర్త కర్రతో విచక్షణారహితంగా కొడుతున్నాడు. ఆమె రోదిస్తూ కాళ్లావేళ్లాపడుతున్నా కనికరించడంలేదు. చుట్టుపక్కల వారంతా చోద్యం చేస్తున్నారే, కానీ ఏ ఒక్కరూ ఆపేందుకు ప్రయతి్నంచడంలేదు. హైదరాబాద్లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్ సతీమణి వ్యాన్ ఫ్లెమింగ్ అదే సమయంలో ఫిలింనగర్ మీదుగా జూబ్లీహిల్స్కు కారులో వెళుతున్నారు. వెంటనే కారు దిగి వెళ్లి దాడిని వారించారు. అక్కడి నుంచి నిందితుడు పరారయ్యాడు. బాధితురాలిని ఫ్లెమింగ్ అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఏం జరిగిందని ఆరా తీశారు. తన భర్త రోజూ కొడుతున్నాడని, గదిలో బంధిస్తున్నాడని చెబుతూ బాధితురాలు కన్నీరుమున్నీరైంది. స్నేహితులకు సమాచారం ఇచ్చి ఎవరికి ఫిర్యాదు చేయాలంటూ ఫ్లెమింగ్ అడిగారు. దీనిపై ఆండ్రూ ఫ్లెమింగ్ కూడా స్పందించారు. గురువారం జరిగిన ఈ ఘటనపై ఉమెన్ సేఫ్టీ ఐజీకి సమాచారం అందించారు. – బంజారాహిల్స్ -
ఫిలింనగర్లో దారుణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటుచేసకుంది. ఫిలింనగర్లో సోమవారం ప్రేమ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే స్నేహితులే ప్రేమ్ను కొట్టి చంపినట్టుగా తెలుస్తోంది. ప్రేమ్కు, సతీశ్ అనే వ్యక్తికి మధ్య ఉన్న విభేదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయి తాగుదామని సతీశ్ అనే వ్యక్తి ప్రేమ్ను పిలిచారు. గంజాయి తాగిన అనంతరం మత్తులో ప్రేమ్కు, సతీశ్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న మిగతా వ్యక్తులు ప్రేమ్పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ప్రేమ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఫిల్మ్నగర్లో డ్రగ్స్ కలకలం
సాక్షి, హైదరాబాద్ : ఫిల్మ్నగర్లోని దుర్గాభవానీ నగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను ఈస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఫిలింనగర్ బస్తీలలో డ్రగ్స్ విక్రయ కేంద్రాలు కొనసాగుతున్నాయన్న వార్తలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వైజాగ్కు చెందిన కడాలి భాస్కర్ అక్కడ తయారు చేసిన గంజాయి ద్రవ్యం(హ్యాష్ ఆయిల్) విషాల్, అభిలాష్ మత్తునిచ్చే టాబ్లెట్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం ఉదయం దుర్గాభవానీ నగర్లో గాలింపు చేపట్టారు. ఆ సమయంలో గంజాయి మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసేందుకు ముగ్గురు యువకలు రాగా పోలీసులు విక్రయిస్తున్న భాస్కర్ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇటీవల గంజాయిని ద్రవరూపంలోకి మార్చి హ్యాష్ ఆయిల్ పేరుతో విక్రయిస్తున్న విషయం తెలిసిందే. భాస్కర్ గత కొంత కాలంగా వైజాగ్ నుంచి సీసాల రూపంలో తీసుకొచ్చి ఒక్కో సీసాను ’ 2 వేలకు విక్రయిస్తున్నాడు. ద్రవరూపంలో ఉన్న గంజాయిని సిగరెట్లోకి జొప్పించి పీలుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాల్, అభిలాష్అనే మరో ఇద్దరు మత్తు ట్యాబ్లెట్లు విక్రయిస్తూ పట్టుబడ్డారు. భాస్కర్ నుంచి అయిదు హ్యాష్ ఆయిల్ సీసాలను, విశాల్ నుంచి పది వరకు ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహా పడిపూజలో శర్వానంద్
-
మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తను చంపింది
-
ఫిలింనగర్లో దారుణం..
హైదరాబాద్: ఫిలింనగర్లో దారుణం చోటుచేసుకుంది. బానోతు జగన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సైదప్ప బస్తీలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పైఅంతస్తుకు వెళ్లి చూడగా జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని వారు చెబుతున్నారు. జగన్ చాలా మంచి వ్యక్తి అని, మరో వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు. పెళ్లైననాటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా, జగన్ మద్యం మత్తులో ఉండగా, అతని పురుషాంగంపై దాడి చేసి, నోట్లో హిట్ కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య దేవికని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు జగన్ స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల. జగన్ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
పార్కింగ్ నుంచి థియేటర్లను మినహాయించాలి
‘‘గ్రేటర్ హైదరాబాద్లోని రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, కొన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మున్సిపల్ ఆఫీసుల్లో వాహన దారుల నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ, థియేటర్స్లో, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ రుసం వసూలు చేయొద్దని చెప్పడం వల్ల యాజమాన్యానికి నిర్వహణ భారం మరింత పెరిగింది’’ అని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్(టీ.ఎస్.ఎఫ్.సీ.సీ.) అధ్యక్షుడు కె.మురళీ మోహన్ అన్నారు. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్లో గురువారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎగ్జిబిటర్లు, థియేటర్ల యజమానులు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కె.మురళీ మోహన్ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 852 థియేటర్స్ ఉండేవి. ప్రస్తుతం 400 మాత్రమే ఉన్నాయి. మిగిలినవి నిర్వహణ భారం వల్ల మూత పడ్డాయి. జీవీకే, ఇన్ఆర్బిట్ మాల్లో పార్కింగ్ రుసం అధికంగా వసూలు చే శారు. దాన్ని సాకుగా చూపి జీహెచ్ఎంసీ నార్మ్స్ ప్రకారం థియేటర్లు, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ వసూలు చేయకూడదని చెప్పడం యజమానులకు ఇబ్బందిగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పార్కింగ్పై ఆధారపడిన 6000 మంది ఉపాధి కోల్పోయారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్గారికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమస్యను విన్నవించాం. ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. ‘‘థియేటర్స్లో రెండు మూడు గంటలకు నామినల్ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాం. ఈ ఫీజు తీసేయడం వల్ల పార్కింగ్లో పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. పైగా ప్రేక్షకుల వాహనాలకు భద్రత కరువైంది. పార్కింగ్ వసూలు నుంచి థియేటర్లను మినహాయించాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం’’ అని టీ.ఎస్.ఎఫ్.సీ.సీ. జాయింట్ సెక్రటరీ బాలగోవింద్ రాజ్ అన్నారు. ‘‘థియేటర్, వాహనాల భద్రత, పార్కింగ్ పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు. ఉచిత పార్కింగ్ కావడంతో బయటి వారు కూడా పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. వాహనాల పార్కింగ్కి ప్రభుత్వం ఓ ధర నిర్ణయించి, ఎక్కువ వసూలు చేసిన వారికి భారీ జరిమానాలు విధించినా మేం సిద్ధమే. మల్టీప్లెక్స్లలోని క్యాంటీన్లలో అధిక ధరలు వసూలు చేస్తున్నారు కానీ, థియేటర్స్లో ఎక్కడా ఎక్కువ వసూలు చేయడం లేదు’’ అని టీ.ఎస్.ఎఫ్.సీ.సీ. సెక్రటరీ సునీల్ నారంగ్ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షుడు కిరణ్, టీ.ఎస్.ఎఫ్.సీ.సీ. ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ఈసీ మెంబర్ శేఖర్, పలువురు థియేటర్ల యజమానులు, ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. -
ఫిలింనగర్ దైవసన్నిదానంలో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
-
ఎక్కడికి పోయావ్ బుజ్జీ..?, ఆచూకీ తెలిపితే రూ.2 వేలు
సాక్షి, హైదరాబాద్ : పెంపడు జంతువులపై ప్రతి ఒక్కరికీ ఎంతోకొంత ప్రేమ ఉంటుంది. ఇంట్లో ముద్దుగా పెంచుకునే శునకాలు, పిల్లులు, పక్షులకు పుట్టినరోజును వేడుకగా చేసేవారు.. అలాంటివి చనిపోతే.. సొంతవారు పోయినట్టు కర్మకాండలు చేసేవారు.. నగరంలో చాలామందే ఉన్నారు. ఒకవేళ అనుకోకుండా అలాంటివి తప్పిపోతే వాటికి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేవారు ఉన్నారు. ఈ కోవలోనే ఫిలింనగర్కు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి తప్పిపోయిందని, వెతికి తెచ్చినవారికి బహుమతి ఇస్తానంటూ ఇంటింటికీ కరపత్రాలు పంచారు. గోడలపై సదరు పిల్లి ఫొటోతో పాటు దాని వయసు, ఎత్తు, పొడవు కొలతలతో సహా పోస్టర్లు సైతంఅంటించారు. తన పిల్లిన అప్పగించినవారికి రూ.2 వేలు రివార్డు కూడా ప్రకటించారు. ఇంతకూ సదరు మార్జాలం ఏ విదేశాల నుంచో తెచ్చిన అరుదైన జాతి కాదు.. ఇళ్లలో తిరిగే మామూలు పిల్లిని ఆమె ఏడాదిగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఒంటరిగా ఉండే ఆమె పిల్లి తోడుగా జీవిస్తున్నారు. అది కనిపించకుండా పోవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. వారం రోజులుగా ఆమె ఫిలింనగర్, జూబ్లిహిల్స్ ప్రాంతాల్లోని వీధివీధీ జల్లెడ పడుతున్నారు. -
టాలీవుడ్లో మరో వివాదం
సాక్షి, హైదరాబాద్: ‘క్యాస్టింగ్ కౌచ్’ వివాదం చల్లారకముందే తెలుగు సినిమా పరిశ్రమలో మరో గొడవ రేగింది. సినీ, టీవీ అవుట్డోర్ లైట్మెన్ యూనియన్ సభ్యులు ఆందోళనతో సినిమా షూటింగ్లకు అంతరాయం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. నిర్మాత డీవీవీ దానయ్య ఇతర రాష్ట్రాల నుంచి లైట్మెన్లను తీసుకురావడంతో వివాదం మొదలైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని లైట్మెన్ యూనియన్ నాయకులు గురువారం అడ్డుకున్నారు. వీరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మరోవైపు కనీస వేతనాలు ఇవ్వకుండా ఎక్కువసేపు పని చేయించుకుంటున్నారని, ఇతర రాష్ట్రాల వారిని రప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ లైట్మెన్ యూనియన్ సభ్యులు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగారు. మూడేళ్లకు ఒకసారి కనీస వేతనాలు పెంచాలన్న నిబంధనను పట్టించుకోకుండా తమకు అన్యాయం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. తమ డిమాండ్ల సాధనకు షూటింగ్లను బహిష్కరించామని, తమకు సహకరించాలని అందరికీ విజ్ఞప్తి చేశారు. కనీస వేతనంపై రేపటిలోగా ప్రకటన చేయకుంటే నిరవధిక ఆందోళన దిగుతామని వారు హెచ్చరించారు. సినిమా పరిశ్రమ పెద్దలు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. మరోవైపు సినీ, టీవీ అవుట్డోర్ లైట్మెన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఛాంబర్కు భారీగా తరలివస్తున్నారు. -
యాంకర్కు వేధింపులు
సాక్షి, హైదరాబాద్ : తన ప్రేమను అంగీకరించకపోతే యాసిడ్ పోసి చంపేస్తానంటూ బెదిరిస్తున్న యువకుడిపై ఓ న్యూస్ ఛానెల్ యాంకర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఫిలింనగర్లోని ఓ న్యూస్ ఛానెల్లో పని చేస్తున్న యాంకర్(28) మారుతి నగర్ చైతన్యపురి కాలనీలో ఉంటోంది. గత మూడు రోజులుగా రవీందర్ అనే వ్యక్తి ఆమె కార్యాలయానికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. తనను పెళ్ళి చేసుకోవాలని లేదంటే తనతో పాటు తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరిస్తున్నాడంటూ ఆరోపించింది. ప్రతిరోజూ తనను వెంబడిస్తున్నాడని ఈ నెల 24న కార్యాలయంలోకి వచ్చి తనతో రాకపోతే యాసిడ్ పోస్తానంటూ బెదిరించాడని తెలిపింది. మూడేళ్ల క్రితం కూడా సదరు రవీందర్ తనను వేధింపులకు గురిచేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేశారని విడుదలై వచ్చిన తర్వాత మళ్లీ వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. అతడి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించింది. పోలీసులు రవీందర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందరం భగవంతుడి సేవ చేద్దాం – మోహన్బాబు
‘‘నేను ఎప్పుడూ గుడి చైర్మన్ అవ్వాలనుకోలేదు. మా సంస్థలు, చిత్రాలతో బిజీగా ఉన్న నాకు ఈ అదనపు బాధ్యత ఎందుకనుకున్నా. పైగా నిజాన్ని నిర్భయంగా చెప్పడం నాకు అలవాటు. కానీ, ఆ మహాశివుడు టి.సుబ్బరామిరెడ్డి గారి స్వరూపంలో బాధ్యతలు స్వీకరించమన్నాడు’’ అని నటుడు మంచు మోహన్బాబు అన్నారు. హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానం చైర్మన్గా మోహన్బాబు సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. విశాఖ శ్రీ శారదా పీఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి మహాస్వామి ఆధ్వర్యంలో 12 మంది పాలక మండలి కొత్త సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మోహన్బాబు మాట్లాడుతూ–‘‘కమ్మ, కాపు, రెడ్డి కులాల వలే బ్రాహ్మణులలో కూడా శాఖలుంటాయి. అందరూ కలిసి ఆ భగవంతుడి సేవ చేద్దాం. నా అల్లుడు కూడా బ్రాహ్మణుడే. దేవుడి డబ్బు పైసా ముట్టుకోకుండా అవసరమైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి సన్నిధానంలో అభివృద్ధి పనులు చేపట్టాలని సంకల్పిస్తున్నా. సన్నిధానంలోని దేవుళ్ల ఆశీస్సులతో మంచి కార్యక్రమాలు చేపడతామని ఆశిస్తున్నా’’ అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు వీరే.. నటుడు గిరిబాబు, రచయిత పరుచూరి గోపాల కృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామల, చిరంజీవి సతీమణి సురేఖ, చాముండేశ్వరీ నాథ్, వి. రామ్ప్రసాద్ ఉన్నారు. కార్యదర్శిగా ఖాజా సూర్య నారాయణ కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎం.పి, ‘కళాబంధు’ టీయస్సార్, రాజమండ్రి ఎం.పి. మురళీమోహన్, హీరోలు విష్ణు, మనోజ్, నటి–నిర్మాత లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
దైవసన్నిధానం చైర్మన్గా మోహన్బాబు బాధ్యతల స్వీకరణ
సాక్షి, ఫిల్మ్నగర్: హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం చైర్మన్గా నటుడు మోహన్బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మరో నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ దైవసన్నిధానం 18 దేవుళ్ల సముదాయం అని చెప్పారు. ఈ దైవసన్నిధానానికి ఆద్యుడు వి.బి. రాజేంద్రప్రసాద్ అని, అప్పటి మూలధనంతో సన్నిధానాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సన్నిధానానికి రూ.3 కోట్ల 70 లక్షల విరాళాలు వచ్చాయని వివరించారు. ఈ దైవభక్తిలో పాలుపంచుకుంటానని మోహన్బాబు కోరారన్నారు. నూతన పాలకవర్గాన్ని ఎన్నుకుంటామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మోహన్బాబు మాట్లాడుతూ చిరంజీవి, తాను చిలుకా గోరింకల్లా గొడవపడుతుంటామన్నారు. ఇప్పటికి రెండు కమిటీలు సన్నిధానాన్ని దిగ్విజయంగా నిర్వహించాయని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి అన్నారు. మోహన్బాబు చైర్మన్గా రావడం ఆనందంగా ఉందని, ఆయనకు కొత్త జీవితం ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు, స్వరూపానందేంద్రస్వామి, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి, చాముండేశ్వరీనాథ్ తదితరులు హాజరయ్యారు. -
ఎన్నికల్లో ఓడి.. కాశీకెళ్లిన టీఆర్ఎస్ నేత
హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోయినందుకు మనస్తాపం, అప్పుల వాళ్ల వేధింపులతో అదృశ్యమైన తెలుగు సినీ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ యూనియన్ మాజీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత నక్క రాము ఆచూకీ లభ్యమైంది. ఫిలింనగర్ బద్దం బాల్రెడ్డి నగర్ బస్తీకి చెందిన రాము గత నెల 9న జరిగిన యూనియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల్లో భారీగా ఖర్చు పెట్టాడు. అంతకుముందే కొన్ని అప్పులు కూడా ఉన్నాయి. వైన్షాప్ భాగస్వాములు సైతం పార్ట్నర్ షిప్ నుంచి తొలగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో చెప్పకుండా అదృశ్యం కావడంతో భార్య తన భర్త కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం తన దగ్గర పైసా లేదని ఇబ్బందికరంగా ఉందని డబ్బు పంపించాల్సిందిగా బండారు బాల్రెడ్డినగర్ బస్తీకి చెందిన మాగంటి రమణకు ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని రాము భార్యకు చెప్పడంతో వెంటనే రాము భార్య, బావమరిది విజయవాడకు వెళ్లి గుర్తించారు. గత నెల 9న నేరుగా రైలు ఎక్కి కాశీకి వెళ్లానని దర్శనం అనంతరం విజయవాడకు వచ్చినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. రాము ఆచూకీ లభించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. -
జనంలో సానుభూతి కోసమే విక్రమ్ అలా..
-
ఎప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథ్నే
ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ) 24వ వార్షికోత్సవ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దర్శకుడు కె. విశ్వనాథ్ను హీరో చిరంజీవి, గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం (ఎస్పీబీ)ను మరో హీరో వెంకటేశ్ సత్కరించారు. ‘‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా కాకుండా ఓ సామాన్యుడిగా ఇక్కడికి వచ్చా. ఈ అవార్డు రేపు మరొకరికి వస్తుంది. కానీ, నేనెప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథుడిని మాత్రమే’’ అన్నారు కె. విశ్వనాథ్. ‘‘తెలుగు సినిమాతో నాది 51 ఏళ్ల అనుబంధం. ఇన్నేళ్లు నన్ను భరించిన చిత్రసీమ, ప్రేమించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. విశ్వనాథ్గారి పక్కన కూర్చుని సన్మానం అందుకోవడం గర్వంగానూ, ఆనందంగానూ ఉంది’’ అన్నారు ఎస్పీబీ. చిరంజీవి మాట్లాడుతూ – ‘‘అవార్డులు విశ్వనాథ్, ఎస్పీబీ గార్లకు కొత్తేమీ కాదు. కానీ, ఒకే వేదికపై సూర్య చంద్రులు వంటి ఇద్దర్నీ సన్మానించడం... అదీ ఎఫ్ఎన్సీసీ ఆధ్వర్యంలో నా చేతుల మీదుగా జరగడం సంతృప్తిగా ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో నటుడు కైకాల సత్యనారాయణ, నటీమణులు సుహాసిని, భానుప్రియ, తులసి, రోజా రమణి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులతో పాటు ఎఫ్ఎన్సీసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
అందమైన జీవితం.. విషాదాంతం
♦ మేకప్ ఆర్టిస్ట్ శిరీషది ముమ్మాటికీ హత్యేనంటున్న కుటుంబ సభ్యులు ♦ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్న తల్లి, అత్త ♦ హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన నలుగురినీ అందంగా చూపించే అందమైన జీవితం ఈమెది. బ్యూటీషియన్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన విజయలక్ష్మి అలియాస్ శిరీష హైదరాబాద్లో పార్లర్ నడిపింది. సుమారు నాలుగేళ్లుగా ఫిల్మ్నగర్లోని ఆర్జే స్టూడియోలో మేనేజర్ కమ్ మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది. శిరీషకు ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఆరుమిల్లి సతీష్చంద్రతో 13 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వారికి 12 ఏళ్ల కుమార్తె దీప్తి ఉంది. బిడ్డను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని ఆ దంపతులు కలలుగన్నారు. ఏమైందో ఏమో.. ఈ నెల 13న తాను పనిచేస్తున్న స్టూడియోలో శిరీష మృత్యువాతపడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కేసులో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు తీరుపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆచంట : హైదరాబాద్ ఫిల్మ్నగర్లోని ఆర్జే స్టూడియోలో ఈనెల 13న అనుమానాస్పద స్థితిలో మరణించిన ఆరుమిల్లి విజయలక్ష్మి (శిరీష) మృతదేహాన్ని అత్తగారి ఊరైన ఆచంట మండలం వల్లూరు గ్రామం తీసుకొచ్చి ఈనెల 14న అంత్యక్రియలు నిర్వహించారు. శిరీష ఆచంట మండలం వేమవరంలో జన్మించగా.. చిన్నప్పుడే తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం బళ్లారి ప్రాంతానికి వలస వెళ్లారు. వల్లూరు గ్రామానికి చెందిన ఆరుమిల్లి సతీష్చంద్రతో ఆమెకు వివాహం కాగా.. ఆ దంపతులు హైదరాబాద్లో స్థిరపడ్డారు. శిరీష ఆత్మహత్య చేసుకున్నట్టు తేలిందని హైదరాబాద్ పోలీసులు ప్రకటించగా.. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని.. ముమ్మాటికీ హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి అనుమానాలు, అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఈ నేపథ్యంలో కేసు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శిరీష తల్లి ఏమంటున్నారంటే.. శిరీష తల్లి రామలక్ష్మి మాట్లాడుతూ.. నా కుమార్తె హత్య కేసును పోలీసులు నీరు గారుస్తున్నారు. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆమె బతికుంటే అన్ని విషయాలూ బయటపడతాయనే చంపేశారు’ అని వాపోయారు. ‘నా కూతురు కష్టపడి పైకి వచ్చింది. కొన్ని సంవత్సరాలుగా బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఎప్పుడూ నా కూతురిపై ఎటువంటి రిమార్కు లేదు. ఒకరికి భయపడి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు’ అని చెప్పారు. శిరీష పనిచేస్తున్న స్టూడియో యజమాని రాజీవ్ను వివాహం చేసుకునేందుకు సిద్ధమైన తేజస్వినిని ఈ కేసులో ఎందుకు విచారించలేదని రామలక్ష్మి ప్రశ్నించారు. ప్లాస్టిక్ తాడును శిరీష మెడకు బిగించినట్టు ఆమె మృతదేహాన్ని చూస్తే అర్థమవుతోందన్నారు. తన కూతురు జీన్స్, టీషర్టు ధరించి ఉంటే ఉరేసుకున్న గదిలోకి చున్నీ ఎలా వచ్చిందని నిలదీశారు. శిరీష ఆరు అడుగుల ఎత్తు, 80 కేజీల వరకూ బరువు ఉంటుందని తెలిపారు. ఆమె బరువుకు చున్నీ తెగిపోతుందని స్పష్టం చేశారు. శిరీష ఫ్యాన్కు ఉరివేసుకుంటే ఫ్యాన్ ఎందుకు చెక్కు చెదరలేదని, కనీసం రెక్కలు కూడా ఎందుకు వంకర కాలేదని ప్రశ్నించారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి వస్తే ఆమె తమకు ముందే ఆ విషయం ఫోన్చేసి చెప్పి ఉండేదన్నారు. తన ఒక్కగానొక్క కూతురు దీప్తిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికైనా ఫోన్ చేసేదన్నారు. రాజీవ్, శ్రవణ్ పక్కా ప్లాన్ ప్రకారం శిరీషను స్టూడియోకు తీసుకువెళ్లి వైరుతో చంపేసి ఆత్మహత్యగా చిక్రీకరిస్తున్నారని రామలక్ష్మి ఆరోపించారు. పథకం ప్రకారమే.. నా కోడలు శిరీష ఎంతో ధైర్యవంతురాలు. ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఆమెకుంది. ఆమె స్నేహితులైన రాజీవ్, శ్రవణ్ పథకం ప్రకారమే చంపేశారు. శిరీష బ్యూటీషియన్గా పనిచేస్తూ కుటుంబ పోషణలో పాలుపంచుకునేది. కుమార్తె దీప్తిని బాగా చదివించాలని ఎంతో ఆశపడింది. ఆమె మృతిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును మూసివేసే యత్నాలు చేస్తున్నారు. శిరీష మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. – శారద, శిరీష అత్త కొట్టి.. ఉరేసి చంపారని అర్థమవుతోంది నా మనుమరాలు శిరీష ఒంటిపై ఉన్న గాయాల్ని చూస్తే.. ఆమెను కొట్టి, ఉరేసి చంపేశారని ఎవరికైనా అర్థమవుతుంది. ఆమె తలపైన, పెదవుల మీద, చెంపలపైన గాయాలున్నాయి. అన్యాయంగా నా మనుమరాల్ని పొట్టనపెట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న∙పోలీసులు వాస్తవాలు వెల్లడి చేస్తారనుకుంటే చివరకు తారుమారు చేశారు. భూలక్ష్మి, శిరీష అమ్మమ్మ అమ్మను చంపేశారు ‘మా అమ్మను చంపేశారు. అమ్మ కావాలి. తెచ్చివ్వండి’ అంటూ శిరీష కుమార్తె దీప్తి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. తల్లిని కోల్పోయిన దీప్తి తల్లడిల్లుతున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న శిరీష కుమార్తె దీప్తి -
ప్రాసకు నడక నేర్పిన సాహితీ శిఖరం
► సినారెకు సీఎం కేసీఆర్ ఘన నివాళి ►నేడు అంత్యక్రియలు సినారెకు సీఎం కేసీఆర్ ఘన నివాళి ►తెలంగాణ తలెత్తుకుని గర్వపడే మహనీయుడు ►సినారెకు నాలాంటి అభిమానులు కోట్లాది మంది ►సినారె పేరిట స్మారక మ్యూజియం, సమావేశ మందిరం.. ►ట్యాంక్బండ్పై కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తాం ►నేడు ఉదయం హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో సినారె అంత్యక్రియలు ►జిల్లాల నుంచి తరలివచ్చే వారి కోసం ఉచిత బస్సులు ►అంతిమయాత్రలో పాల్గొననున్న సీఎం, పలువురు ప్రముఖులు సాక్షి, హైదరాబాద్ ‘‘కవులు, రచయితలు చాలా మంది ఉంటరు.. కానీ సినారె సభ అంటే, సినారె మాట అంటే ఓ గ్లామర్. కవులకు గ్లామర్ ఉంటుందని నిరూపించిన వ్యక్తి సినారె. ఆయన ఉపన్యాసం వినాలనే ఉత్సాహంతో వందలాదిగా సభలో పాల్గొనేవారు. పుట్టింది తెలంగాణ గడ్డ అయినప్పటికీ, మొత్తం తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోనేటువంటి వ్యక్తి ఆయన. ఆది ప్రాసలకు, అంత్య ప్రాసలకు అద్భుతమైన నడక నేర్పడంలో సినారెకు ఎవరూ పోటీ లేరు..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. మంగళవా రం హైదరాబాద్ లోని సినారె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. సినారె పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి.. తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబా నికి అండగా ఉంటా మని హామీ ఇచ్చారు. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. భావితరాలు సినారెను గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎంత కీర్తించుకున్నా తక్కువే.. తెలంగాణ గర్వంగా తలెత్తుకుని చెప్పుకొనే టంతటి మహనీయుడు సినారె అని, తెలంగా ణ సాహితీ మకుటంలో ఆయనొక కలికితురా యి అని కేసీఆర్ కీర్తించారు. ఆయనను ఎంత కీర్తించుకున్నా, పొగుడుకున్నా, ఎంత స్మరిం చుకున్నా తక్కువేనని.. సాహిత్య రంగానికి సినారె అందించిన విశేష సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ మధ్యే తాను వరంగల్ వెళ్లినప్పుడు సినారె రాసిన మందార మకరం దాలు పుస్తకంలోని పద్యాలను బమ్మెర పోతన సమాధి వద్ద కోట్ చేశానని కేసీఆర్ చెప్పారు. అది సినారె విన్నారని వారి కుటుంబ సభ్యులు చెప్పారని.. తనలాంటి అభిమానులు కోటానుకోట్ల మంది ఉన్నారని పేర్కొన్నారు. నేడు మహాభినిష్క్రమణం తెలుగు సాహితీ జగత్తు రారాజు సినారె అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ మహాప్రస్థానంలో జరుగనున్నా యి. అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియ లు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా ట్లు చేసింది. తొలుత ఉదయం 9 గంటల నుంచి గంటపాటు సినారె పార్థివదేహాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్ భవనంలో ఉంచుతారు. పది గంటలకు సారస్వత పరిషత్ నుంచి ఫిల్మ్నగర్ మహాప్రస్థానానికి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సీఎం కేసీఆర్తో పాటు పలువురు మంత్రులు, ప్రముఖులు ఈ అంతిమయాత్రలో పాల్గొననున్నారు. నివాళి అర్పించిన ప్రముఖులు సినారె పార్థివదేహం వద్ద మంగళవారం పెద్ద సంఖ్యలో పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు, అభిమానులు నివాళు లు అర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, తలసాని, నాయిని, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మర్రి జనార్దన్రెడ్డి, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, జీవన్రెడ్డి, ప్రముఖ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, గాయని జానకి తదితరులు సినారె పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. సినారె స్మారక మ్యూజియం సినారెకు ప్రభుత్వం తరఫున ఘనమైన నివాళులు అర్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. ఆయన పేరిట స్మారక మ్యూజియంతోపాటు సాహితీ సమాలోచనలు జరుపుకొనేలా సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకు హైదరాబాద్ నడిబొడ్డున స్థలం కేటాయిస్తామన్నారు. ఓ ప్రముఖ సంస్థకు సినారె పేరు పెడతామని.. ట్యాంక్ బండ్తో పాటు కరీంనగర్, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లో, సినారె స్వగ్రామం హన్మాజీపేటలో ప్రభుత్వపరంగా సినారె కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సినారె చాలా ప్రేమించిన సారస్వత పరిషత్తుకు ప్రభుత్వం పూర్తి అండదండలు అందిస్తామన్నారు. ప్రత్యేక బస్సులు హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ మహా ప్రస్థానంలో బుధవారం జరిగే అంత్య క్రియలకు అన్ని జిల్లాల నుంచి సినారె అభిమానులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తరఫున ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ బాధ్యతను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, సాంçస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణలకు అప్పగిం చారు. అంత్యక్రియల్లో తాను స్వయంగా పాల్గొంటానని, తెలంగాణ ప్రజల తరఫు న సినారెకు గొప్ప వీడ్కోలు పలకాలని సీఎం పిలుపునిచ్చారు. అంత్యక్రియలకు హాజరయ్యే వారికోసం బుధవారం రాష్ట్రంలోని 31 జిల్లా కేంద్రాల నుండి 2 చొప్పున ఉచిత బస్సులు నడుపుతున్నట్లు రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి ప్రకటించారు. వాటిలో హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ మహాప్రస్థానానికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
దాసరి శిష్యుడి ఉద్వేగభరిత ప్రసంగం
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమ దిక్సూచి, ఆత్మబంధువు దాసరి నారాయణరావు అని నటుడు ఆర్.నారాయణ మూర్తి అన్నారు. తన గురువు గొప్ప మానవతావాది అని పేర్కొన్నారు. ఫిల్మ్నగర్లో నిర్వహించిన దాసరి సంతాప సభలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. దాసరికి దాదా సాహెబ్ ఫాల్క్ అవార్డు వచ్చేలా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు చిత్రపరిశ్రమ పయత్నించాలని నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు. జాతీయ పురస్కారాల్లో దక్షిణాది నటులకు ముందునుంచి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘విద్యాబాలన్కు పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సావిత్రి, ఎస్వీ రంగారావులకు పద్మశ్రీ లేద’ని వాపోయారు. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించిన మహానుభావుడు దాసరి అని, తన గురించి ఏమీ అడగకుండా వేషం ఇచ్చారని వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమను హైదరాబాద్కు తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన అడుగుపెట్టిన అన్ని రంగాల్లోనూ రాణించారని పేర్కొన్నారు. దాసరి ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డబ్బున్నవారి వారసులు నటులు కావాలనుకోవడంలో తప్పులేదని, సామాన్యులకు కూడా వేషాలు ఇస్తూ ప్రోత్సహించాలని దర్శక నిర్మాతలను నారాయణమూర్తి కోరారు. దాసరికి దాదాసాహెబ్ ఫాల్క్ అవార్డు ఇవ్వాలని ఈ సభలో తీర్మానం చేయబోతున్నామని రచయిత పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. -
నిర్మాత కొడుక్కి పోలీసు నోటీసులు
బంజారాహిల్స్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో సభ్యుడి పర్సులో నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు తస్కరించారు. ఆన్లైన్లో తన అకౌంట్లోకి డబ్బును మార్చుకున్న ఘటనలో ప్రముఖ సినీ నిర్మాత సి. కల్యాణ్ తనయుడు వరుణ్కుమార్కు బంజారాహిల్స్ పోలీసులు 41(ఏ) కింద నోటీసులు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే వ్యాపారి బిక్కిన శ్రీనివాస్ ఎఫ్ఎన్సీసీలో స్విమ్మింగ్ చేయడానికి వచ్చి పర్సును పక్కన పెట్టాడు. ఆయన తిరిగి వచ్చి సరికి పర్సు కనిపించలేదు. అందులో ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. గంట వ్యవధిలోనే ఆయన అకౌంట్లో నుంచి రూ.2.12 లక్షలు ఆన్లైన్ ద్వారా బదిలీ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీలు, బ్యాంకు అంకౌట్లు తనిఖీ చేసి ఇందుకు కారకుడిగా సి. కల్యాణ్ కొడుకు వరుణ్కుమార్ను గుర్తించారు. ఆయనపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు. స్టేషన్కు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా డీఐ వెంకటేశ్వర్రెడ్డి ఈ నోటీసు జారీ చేశారు. -
సన్నీ నృత్యం..
-
పీజేఆర్ విగ్రహ తొలగింపులో ఉద్రిక్తత
ఫిల్మ్నగర్ కూడలి వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన దివంగత నేత పి.జనార్దన్రెడ్డి విగ్రహాన్ని తొలగించే క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఆ విగ్రహాన్ని తొలగించేందుకు రాగా, పీజేఆర్ కుమార్తె.. టీఆర్ఎస్ కార్పొరేటర్ అయిన విజయ రోడ్డుపై అడ్డంగా బైఠాయించారు. ఫిల్మ్నగర్ కూడలి వద్ద ఏర్పాటుచేసిన పి.జనార్దన్రెడ్డి విగ్రహం తమ షేక్పేట డివిజన్ పరిధిలోకి వస్తుందని, దాన్ని వెంటనే అక్కడి నుంచి తొలగించాలని షేక్ పేట ఎంఐఎం కార్పొరేటర్ ఫరాజుద్దీన్ జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది.. విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. -
మరో పెళ్లికి సిద్ధమైన భర్తపై భార్య.. !
బంజారాహిల్స్: ఇద్దరు పిల్లల్ని, తనని రోడ్డుపాలు చేస్తూ మరో పెళ్ళికి సిద్ధమైన భర్తకి వ్యతిరేకంగా ఓ మహిళ పోరుబాటపట్టింది. గత మూడు రోజులుగా అత్తింటి ముందు సుజాత అనే మహిళ దీక్ష కొనసాగిస్తోంది. వివరాలివి.. ఫిలింనగర్లోని భగత్సింగ్ కాలనీకి చెందిన బీజేపీ నేత ఎస్పీ శ్రీను కొడుకు అశోక్ ఫిలింనగర్లోని నవనిర్మాణ్ నగర్ బస్తీలో నివసించే సుజాతను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. అయితే, తాను సుజాతను పెళ్ళి చేసుకోలేదని, ఆమెతో సహజీవనం మాత్రమే చేశానని అశోక్ వాదిస్తున్నాడు. ఆమె మొదటి కొడుకు తనకు పుట్టలేదని, చిన్న కొడుకు మాత్రమే తనకు పుట్టాడని పేర్కొనడమే కాకుండా.. మరో పెళ్లికి అతను సిద్ధం కావడంతో పోలీసులు అశోక్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు శుక్రవారం నుంచి అత్తింటి ముందే టెంటు వేసుకొని దీక్షకు దిగింది. అక్కడే అక్కడే వంటావార్పు చేసుకుంటూ ఆందోళన కొనసాగిస్తున్నది. ఆమెకు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, బస్తీ సంక్షేమ సంఘాలు, వివిధ పార్టీల రాజకీయ నేతలు అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకుంది. రోడ్డునపడ్డ మహిళకు న్యాయం చేయాలని, అత్తింట్లోనే ఒక గదిలో ఆమెకు ఆశ్రయం కల్పించాలని హోం మంత్రి బంజారాహిల్స్ ఏసీపీ ఉదయ్కుమార్రెడ్డిని ఆదేశించారు. అయితే అది కుదరకపోవడంతో సుజాత అత్తింటిముందే యథాప్రకారంగా ఆదివారం కూడా దీక్ష కొనసాగించింది. -
మంత్రి గంటాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు
విశాఖ : మంత్రి గంటా శ్రీనివాసరావుపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మంగళవారం సర్క్యూట్ హౌస్లో మంగళవారం ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఫిలింనగర్ సొసైటీకి భూకేటాయింపులపై ఎమ్మెల్యేలు గరం గరంగా ఉన్నారు. తొట్లకొండ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి విఘాతం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఉన్న ఈ సొసైటీ కార్యకలాపాలను విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై తన బంధువైన ఓ సీనియర్ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా శ్రీనివాసరావు తెర వెనుక మంత్రాంగం నడిపినట్లు సమాచారం. ఫిల్మ్ నగర్ సొసైటీకి భూముల కేటాయింపుపై అంతాతానై చక్రం తిప్పారు. వారంలోనే దస్త్రాలు సిద్ధమయ్యాయి. దీంతో కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని 395,413 సర్వే నెంబర్లలో ఉన్న 17 ఎకరాలను ఫిల్మ్ నగర్ సొసైటీ పేరిట ధారాదత్తం చేశారు. ఇక్కడ గజం రూ.10వేల నుంచి 15 వేలవరకు ఉంది. 17 ఎకరాల మార్కెట్ విలువ అక్షరాలరూ.100కోట్లకు పైమాటే. ఈ భూముల ప్రభుత్వ విలువే గజం రూ.4,638గా నిర్ణయించారు. అంటే ఇక్కడ ఎకరా 2కోట్ల 22లక్షల 64వేలుగా జిల్లా కలెక్టర్ యువరాజ్ నిర్ణయించారు. ఈ లెక్కన చూసుకున్నా 17 ఎకరాల విలువ రూ.37.85 కోట్లకు పైమాటే. ఇంత విలువైన భూమిని ఎలాంటి సంప్రదింపులూ జరపకుండానే మంత్రి గంటా ఒత్తిడితో జిల్లాయంత్రాంగం సొసైటీపరం చేసింది. ఎన్నేళ్లకు ఇస్తున్నాం..ఎకరా ధర ఎంతకు ఇస్తున్నాం? అనేది కూడా నిర్ణయించలేదు. పైసా కూడా లీజు మొత్తం చెల్లించలేదు. కనీసం భూములను అప్పగించే ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు. అంతా గోప్యంగానే. కొద్ది క్రితం ఏర్పాటు మీడియా సమావేశంలో ఫిల్మ్నగర్ సొసైటీకి 17 ఎకరాల కేటాయింపు విషయమై ప్రతిపాదన అందిందని.. లీజు నిర్ణయించలేదని అధికారికంగానే ప్రకటించారు. ఇంతలోనే భూమిని స్వాధీనం చేసుకుని ఫిల్మ్ నగర్ పెద్దలు భూమిపూజ కూడా చేసేశారు. గత సోమవారం సీఎం చంద్రబాబు ఎయిర్పోర్టులో శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేశారు. ఓ వైపు జిల్లా ఎమ్మెల్యేలు, మరోవైపు విశాఖ ఎంపీ హరిబాబు కూడా భూముల కేటాయింపుపై గుర్రుగా ఉన్నారు. పరిశ్రమలకు, వాటర్ క్లబ్కు భూములివ్వమని కోరితే లేవని చెబుతున్న జిల్లామంత్రులు ఏవిధంగా 17 ఎకరాలు కేటాయించారంటూ హరిబాబు మండిపడినట్లు సమాచారం. -
తండ్రి అసభ్య ప్రవర్తనపై కూతురు ఫిర్యాదు
బంజారాహిల్స్: తండ్రి వేధిస్తున్నాడంటూ ఓ బాలిక బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు... ఈనెల 8న ఇంటికి వచ్చిన తన తండ్రి తనను అసభ్యపదజాలంతో దూషించి, అసభ్యంగా ప్రవర్తించాడని ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీలో నివసించే విద్యార్థిని (17) పోలీసులకు ఫిర్యాదు చేసింది. అడ్డువచ్చిన తన తల్లీచెల్లెల్ని కొట్టాడని ఫిర్యాదులో పేర్కొంది. తనను రోజూ కొడుతూ, వేధిస్తున్నాడని ఈ మేరకు పోలీసులు శంకర్పై ఐపీసీ సెక్షన్ 354(ఏ), 509 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫిలింనగర్లో బీభత్సం సృష్టించిన కారు
-
పాతాళగంగ పైకొచ్చె..
సాక్షి,హైదరాబాద్: మహానగరంలో నీటికి పడే ఇక్కట్లు అందరికీ తెలిసింది. బిందె నిండాలంటే కుళాయి వద్ద ఒక పూటంతా ఎదురు చూడాలి. అలాంటిది ఫిలింనగర్లోని బీజేఆర్ నగర్ బస్తీలోని కొన్ని బోర్లలో నీరు వాటంతట అవే పైకి ఉబికి వస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు బాగా పెరిగాయి. దీనిమూలంగా నీరు బోర్ల నుంచి తన్నుకు వస్తుండడంతో బస్తీవాసులు ఆనందాశ్చర్యాలకు లోనవుతున్నారు. -
ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్కు చుక్కెదురు
హైదరాబాద్: ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్కు హైకోర్టులో చుక్కెదురైంది. కల్చరల్ సెంటర్ను తెరిచేందుకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. జేఎన్టీయూ కమిటి ఎత్తిచూపే లోపాలను మూడు నెలలలోపు సరిచేసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మూడు నెలల అనంతరం జేఎన్టీయూ కమిటీ మరోసారి ఎఫ్ఎన్సీసీని పరిశీలించాలని తెలిపింది. అప్పటివరకు కేవలం మరమ్మతులు చేసుకునేందుకు మాత్రమే ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్కు అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ వద్ద నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలడంతో ఇద్దరు కూలీలు మృతి చెందగా.. పది మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్పై కేసునమోదైంది. -
రోడ్డెక్కిన కళ..
సాక్షి,వీకెండ్: ఇన్నేళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఆహారం, ఆరోగ్య భద్రత, న్యాయం, చదువు... ప్రతి వారికి ఇవి అందుతున్నాయా.? అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు సంతృప్తితో కూడిన సమాధానం రావడం కష్టమే. ఆరోగ్యం అనేది ఇప్పటికీ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. ప్రజలకు ఏ రోగం వచ్చినా ఫర్వాలేకుండా పోయింది. మనకు భద్రత ఉందనే భరోసా ఎంత మాత్రం లేదు. అలాగే ఇంకా ఆహారం కోసం అల్లాడుతున్న వాళ్లు దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఇక విద్య సైతం ఎంతో మందికి అందని ద్రాక్షే. కావాల్సింది దొరకనప్పుడు దొరికిన దానితో సంతృప్తి పడడానికి అలవాటు పడిపోతాం. కానీ మనం నిజంగా తృప్తిగా ఉన్నామా? అని మనల్ని మనం ప్రశ్నించుకొని, ప్రశ్నించడం మొదలుపెడితే పరిస్థితులు మారుతాయి అంటారు యంగ్ ఆర్టిస్ట్లు స్వాతి, విజయ్. మనలో ఆత్మ పరిశీలనకు ఇలాంటి ప్రశ్నలు రాజేయడానికి, తమ ఆలోచనను అందరిలో కలిగించడానికి వీరి చిరు ప్రయత్నం ఈ పెయింట్ వర్క్. తెల్లవారుజామున దాదాపు 5 గంటలు శ్రమపడి తమ ఆలోచనలు నలుగురికి తెలిసేలా ఇలా రోడ్డుపై చిత్రించారు. ఫిలింనగర్ నుంచి గచ్చిబౌలి మధ్యలో 80 అడుగుల రోడ్డుపై ఉన్న ఈ రైటింగ్స్ సిటీలోనే అతిపెద్ద స్ట్రీట్ ఆర్ట్ రైటింగ్. – ఓ మధు -
సరదాగా..‘చిరు’
సాక్షి,సిటీబ్యూరో: ఫిలింనగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం రాత్రి శ్రీరస్తు శుభమస్తు సినిమా ఆడియో సక్సెస్ మీట్లో చిరంజీవి సందడి చేశారు. కార్యక్రమంలో అల్లు శిరీష్, లావణ్యత్రిపాఠి తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగవైభవంగా బోనాల వేడుకలు
బోనాల వేడుకలు వాడవాడలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయాల్లో బోనాలు ఎత్తుకొని మహిళలు ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. వైభవోపేతంగాజరిగిన బోనాల వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు.. ఫిలింనగర్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఖైరతాబాద్లోని అమ్మవారి ఆలయంలో ఖైరతాబాద్ కార్పొరేటర్ పి. విజయారెడ్డి, ఎన్బీటీ నగర్లోని ఎల్లమ్మ దేవాలయంలో బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల్ విజయలక్ష్మి, పంజగుట్ట ప్రతాప్నగర్లో వెంకటేశ్వరకాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని వెంకటేశ్వరనగర్ బస్తీలోని శ్రీ పోచమ్మ దేవాలయంలో మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ బి. భారతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఊరేగింపుల్లో పోతరాజులు సందడి చేశారు. నృత్యాలతో యువకులు ఆకట్టుకుంటున్నారు. ఎటు చూసినా బోనాల సందడి కనువిందు చేసింది. -
ఫిల్మింనగర్ ప్రమాదంలో ముగ్గురి అరెస్టు
బంజారాహిల్స్: ఫిలింనగర్లోని ఎఫ్ఎన్సీసీలో ఈనెల 24న నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు కూలీలు మృతి, 8 మందికి తీవ్రగాయాలైన ఘటనలో బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. సైట్ ఇంజినీర్ ఎం.సుధాకర్రావు, లేబర్ కాంట్రాక్టర్ ఈ.కొండల్రావు, సెంట్రింగ్ కాంట్రాక్టర్ ఎ.బాలరాజులపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 304(ఏ), 337, 338, 288, 461 క్లాజ్ –4 ఆఫ్ జీహెచ్ఎంసీ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోర్టిగో నిర్మాణం జరుగుతుండగా వీరంతా తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా సెంట్రింగ్ పిల్లర్లు సరిగా వేయకపోవడంతో అవి కదిలి కుప్పకూలినట్లు కూడా వెల్లడైంది. -
భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం
-
ఫిల్మ్నగర్ ఘటనపై కేటీఆర్ గరంగరం
హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ ఫిల్మ్నగర్లో ఓ అక్రమ నిర్మాణం కుప్పకూలిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్, ఇంజినీర్, కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్(ఎఫ్ఎన్సీసీ)లో అనుమతి లేకుండా నిర్మిస్తున్న పోర్టికో పిల్లర్లతోపాటు ఆదివారం ఒక్కసారిగా పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు మృత్యువాతపడగా.. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. స్వల్ప వ్యవధిలో బీమ్స్, శ్లాబ్ వేయడం, పిల్లర్లు నాసిరకంగా ఉండటమే ఈ దుర్ఘటనకు కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించిన విషయం తెలిసిందే. -
ఫిల్మ్ నగర్ క్లబ్ పై కేసు నమోదు
-
ఫిల్మ్నగర్లో కుప్పకూలి భవనం
-
భవంతి కూలిపోయి ఘోర ప్రమాదం
∙ఫిలింనగర్క్లబ్ ఘటనలో ఇద్దరు మృతి ∙మరో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ కాంట్రాక్టర్ వద్ద పనిలో చేరిన 18 మంది కూలీలు అంతా పొరుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లే. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ రాష్ట్రాల నుంచి నగరానికి వలస వచ్చారు. మియాపూర్, ఖైరతాబాద్ చింతల్బస్తీల్లో అద్దెకుంటున్నారు. ఎప్పటిలాగే శనివారం ఉదయం 8.30 గంటలకు ఫిలింనగర్ క్లబ్ పోర్టికో నిర్మాణ పనుల్లో చేరారు. శనివారం రాత్రి ఇంటికి చేరకుండా పనుల్లో మునిగిపోయారు.పోర్టికో పని పూర్తయితే ఇంటికి వెళ్లిపోవచ్చుననుకున్నారు. కొందరు కర్ణాటక, పశ్చిమ బెంగాల్లోని సొంత ఊళ్లకు వెళ్లాలనుకున్నారు. కానీ క్షణాల్లో ప్రమాదం జరిగింది. అంతా పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా పోర్టికో పిల్లర్లు కూలిపోయాయి. దాంతో శ్లాబ్ నేలమట్టమైంది. శ్లాబ్పైనే పని చేస్తున్న 10 మంది కూలీల్లో రాయచూరుకు చెందిన మాన్శేష్ అలియాస్ ఆనంద్(38), కోల్కతాకు చెందిన అనిసూర్ షేక్(40) అక్కడిక్కడే మృతి చెందారు. పశ్చిమబెంగాల్కు చెందిన శ్రీనివాస్(29), కర్ణాటకకు చెందిన శివ(31) తీవ్రం గా గాయపడ్డారు. శ్రీనివాస్కు దవడ ఎముకలు విరిగాయి. శివకు తలకు బలమైన గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ కర్ణాటకకు చెందిన మల్లేశం,సీతారాం, బీరప్ప,పశ్చిమబెంగాల్కు చెందిన అజిత్ బిశ్వాస్,సాహెబ్మండల్, ప్రకా శం జిల్లాకు చెందిన కోటేశ్వర్రావుకు చికిత్స చేసి ఇంటికి పంపించారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్, శివలను అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. శివకు తల పగలడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.