అడవి ఏనుగులు రెండు నగరంలో ప్రవేశించాయి. తెల్లవారు జామును రోడ్ల మీద సంచరిస్తూ బీభత్సం సృష్టించాయి. వివరాలు.. కోయంబత్తూరు సమీపంలోని పూచ్చియూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. సోమవారం తెల్లవారు జామున రెండు అడవి ఏనుగులు జనావాసంలోకి ప్రవేశించాయి. రోడ్ల మీద తిరుగుతూ.. ప్రజలను ఇబ్బందులు గురిచేశాయి. అంతటితో ఆగక జనవాసాల మీద దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి.