కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద బుధవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడటంతో కలకలం రేగింది. కార్యాలయంలోని వెనుక గేటు సమీపంలో వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. అప్రమత్తమైన సిబ్బంది ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన ఆమె చికిత్ప పొందుతూ మృతి చెందింది. సదరు మహిళ, సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ కలెక్టరేట్ వద్ద ఘోరం
Published Wed, Oct 4 2017 2:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement